/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz క్షేత్రస్థాయి పర్యటనకు బయల్దేరిన భారాస అధినేత కేసీఆర్‌ Yadagiri Goud
క్షేత్రస్థాయి పర్యటనకు బయల్దేరిన భారాస అధినేత కేసీఆర్‌

హైదరాబాద్‌: భారాస (BRS) అధినేత కేసీఆర్‌ (KCR) క్షేత్రస్థాయి పర్యటనకు బయల్దేరారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సాగునీరందక ఎండిపోయిన పంటలను పరిశీలించి, రైతులను పరామర్శించనున్నారు.

సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి నుంచి రోడ్డు మార్గంలో ఆయన వెళ్లారు. తొలుత జనగామ జిల్లా ధరావత్‌ తండాకు చేరుకుని పంటలను పరిశీలించనున్నారు.

ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్‌ మండలాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

అక్కడ మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం 3 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. 3:30కు తిరిగి బయల్దేరి.. సాయంత్రం 4:30కు నల్గొండ జిల్లా నిడమనూరు మండలానికి చేరుకుని రైతులతో మాట్లాడతారు. సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గంలో ఎర్రవెల్లికి తిరుగు ప్రయాణమవుతారు.

ఖమ్మం చంద్రాయపాలెంలో ఉద్రిక్తత.. పోలీసులపై గిరిజనుల దాడి

ఖమ్మం: ఖమ్మం జిల్లా చంద్రాయపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుంది. పోడుభూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గిరిజనుల దాడిని పోలీసులు అడ్డుకున్నారు..

అయితే అడ్డుకున్న పోలీసులపైనే గిరిజనలు దాడికి దిగారు.

పోలీసులపై పెద్దసంఖ్యలో గిరిజనులు దాడికి పాల్పపడ్డారు. ఈ క్రమంలో సతత్తుపల్లి సీఐ కిరణ్‌, నలుగురు సిబ్బదికి గాయాలు అయ్యాయి. బుగ్గపాడు, చంద్రాయపాలెం గిరిజనుల మధ్య పోడు భుమూల విషయంతో ఘర్షణ చోటు చేసుంది.

ఈ ఘర్షణను అడ్డగించిన పోలిసులను వెంటపడి మరీ గిరిజనలు కర్రలతో కొట్టారు. ఒక్కసారిగా అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారింది.

సీఐ కిరణ్‌, నలుగురు సిబ్బదికి గాయాలు అయ్యాయి. బుగ్గపాడు, చంద్రాయపాలెం గిరిజనుల మధ్య పోడు భుమూల విషయంతో ఘర్షణ చోటు చేసుంది. ఈ ఘర్షణను అడ్డగించిన పోలిసులను వెంటపడి మరీ గిరిజనలు కర్రలతో కొట్టారు. ఒక్కసారిగా అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారింది..

అద్వానీకి భారతరత్న అందజేసిన రాష్ట్రపతి

మాజీ ఉపప్రధాని, బీజేపీ ప్రముఖ నేత ఎల్‌కే అద్వానీ కి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం భారత రత్నను ప్రదానం చేశారు.

ఢిల్లీలోని ఆయన నివాసా నికి వెళ్లి భారత అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు.

అనారోగ్యం రీత్యా అద్వానీ బయటకు రాలేని పరిస్థితి ఉండడంతో ఆయన ఇంటికే వెళ్లి పురస్కారాన్ని అందిం చారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్ర పతి జగదీప్ ధంఖర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఇవాళ ఆదివారం కావడంతో.. రాష్ట వ్యాప్తంగా నలుమూలల నుంచి భారీగా తరలివ చ్చారు.

ఈ క్రమంలో ఇవాళ తెల్ల వారుజాము నుంచే స్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు నిలబడి ఉన్నారు.

ఉచిత దర్శనానికి 3గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు...

ఆదివారం బ్యాంకులకు సెలవు లేదు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగియనున్న వేళ … దేశంలోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) కీలక ఆదేశాలు జారీచేసింది..

ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్‌ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ … 33 బ్యాంకులకు ఆర్‌బిఐ ఆదేశాలు జారీచేసింది.

ఈ ఆదేశాలతో భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బిఐ) సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ సహా 20 ప్రైవేటు రంగ బ్యాంకులు,

విదేశీ బ్యాంకు డిబిఎస్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లు ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ సాధారణంగానే పనిచేస్తాయి. నెఫ్ట్‌, ఆర్‌టిజిఎస్‌తోపాటు చెక్‌ క్లియరెన్స్‌ వంటి సేవలు యథాతథంగా కొనసాగుతాయి..

నిజామాబాద్ ముఖ్యనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతలతో పీసీసీ అధ్యక్షులు,ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,శుక్రవారం సమావేశం అయ్యారు.

నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తో పాటు....

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొ న్నారు.జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

Streetbuzz News

కేజ్రీవాల్‌ కోసం మెసేజ్‌లు పంపండి.. వాట్సప్‌ నంబరు షేర్‌ చేసిన సతీమణి

దిల్లీ: దేశంలో అత్యంత అవినీతి, నియంత శక్తులకు వ్యతిరేకంగా తన భర్త పోరాడుతున్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) సతీమణి సునీత అన్నారు..

ఆయనకు అండగా ఉండేందుకు ప్రజలందరి ఆశీర్వాదం కావాలని కోరారు. ఈ మేరకు మరో వీడియో సందేశం విడుదల చేసిన ఆమె.. వాట్సప్‌ ప్రచారాన్ని ప్రారంభించారు.

''నా భర్త నిజమైన దేశభక్తుడు. కోర్టులో నిల్చుని నిజానిజాలన్నీ బయటపెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. ప్రస్తుతం ఆయన నియంత శక్తులను సవాల్‌ చేస్తున్నారు. ఇప్పుడు మనమంతా ఆయనకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు నుంచి మేం ప్రత్యేక డ్రైవ్‌ మొదలుపెడుతున్నాం. కేజ్రీవాల్‌ కోసం 8297324624 వాట్సప్‌ నంబరుకు మీ సందేశాలు పంపండి. అవన్నీ నేను ఆయనకు చేరవేస్తాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలతో ఆయన ధైర్యంగా ఉంటారు'' అని సునీత (Sunita Kejriwal) తన సందేశంలో వెల్లడించారు..

మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ను గురువారం ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జడ్జి అనుమతితో సీఎం స్వయంగా తన వాదనలు వినిపించారు. కేవలం నాలుగు వాంగ్మూలాలతోనే తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. అటు సునీత కూడా నిన్న కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త ఆరోగ్యం బాలేదని, ఆయనను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు..

బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న హిజ్రాలు

నగరంలో రోజురోజుకు హిజ్రాల ఆగడాలు మితి మిరిపోతున్నాయి. పెళ్లి వేడుకల్లో అమ్మాయి తరఫు వాళ్లను,అబ్బాయి తరుపు వాళ్లను బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు..

వీరికి అడ్డాలుగా మెయిన్ చౌరస్తా,సిగ్నల్ పాయింట్ల వద్ద వీరు బలవంతపు వసూళ్లకు పాల్పడుతు న్నట్లు తెలుస్తుంది..

కొండాపూర్‌ లో గురువారం అర్ధరాత్రి ఒంటిగంట కు సుమారు 30మంది హిజ్రాలు ఓ వ్యక్తిపై దాడి చేసి బలవంతంగా అతని అకౌంట్‌ నుంచి రూ.30 వేలు పోన్‌పే చేయించుకున్నట్లు తెలిసింది.

సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, దీనిపై పోలీసులు ఎటు వంటి కేసు నమోదు చేయలేదు. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. హెల్ప్‌చేయండి అంటూ పోలీసులకు, మీడియా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకు ఫొటోలు, వీడియోలు షేర్‌ చేశాడు.

దీనిపై గచ్చిబౌలి పోలీసు లను వివరణ కోరగా తమ కు ఎలాంటి ఫిర్యాదూ రాలేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలో స్క్రాప్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం

ఇండ్ల మధ్య ఉన్న స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమా దం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మున్సిపాలిటీ పరిధిలోని రహదారిలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ శంషాబాద్ షాబాద్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రియాంక గ్యాస్ గోడౌన్ పక్కన ఉన్న ఓ భారీ స్క్రాప్ గోడౌన్‌లో శుక్రవారం ఉదయం ఒక్క సారిగా మంటలు చెలరే గాయి.

దీంతో దట్టమైన పొగ పక్కనే ఉన్న ఇండ్లకు వ్యాపించడం తో ఇండ్ల నుంచి పరుగులు తీశారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు లు ఇండ్లు ఖాళీ చేస్తున్నారు ఫైరింజన్ల సాయంతో మంట లను ఆర్పే ప్రయత్నం చేస్తు న్నారు..

సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు భేటీ

సీఎం రేవంత్ రెడ్డి తో కేశవ రావు భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే..రేవంత్‌ నివాసంలో కేశవరావు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు చర్చించను న్నారు. ఇది ఇలా ఉండగా, ఇక అంతకు ముందు…పార్టీ మార్పు, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో భేటీపై సీనియర్ నేత కె.కేశవరావు స్పందిం చారు.

కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా కేసీఆర్ పై గౌరవం ఉంది అని అయినా కాంగ్రెస్ లోకి వెళ్లాలనే నిర్ణయించుకున్నా అని వెల్లడించారు. అదే విషయం కేసీఆర్ కు చెప్పా అని అన్నారు.

కవిత అరెస్టుపై కూడా చర్చించాం’ అని ఆయన వివరించారు. కేకే రేపు కాంగ్రెస్ పార్టీలో చేరను న్నారు...