/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TG: భువనగిరి పార్లమెంటు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిగా నూనె వెంకట్ స్వామిని ప్రకటించిన బి.ఎల్.ఎఫ్ రాష్ట్ర కమిటీ Mane Praveen
TG: భువనగిరి పార్లమెంటు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిగా నూనె వెంకట్ స్వామిని ప్రకటించిన బి.ఎల్.ఎఫ్ రాష్ట్ర కమిటీ

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బి.ఎల్.ఎఫ్.) తరఫున ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామిని, శుక్రవారం భువనగిరి పార్లమెంటు బిఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీలో ఉండనున్నారని బి.ఎల్.ఎఫ్. రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్య ప్రకాష్ ప్రకటించారు

ఈరోజు హైదరాబాదులోని ఓంకార్ భవన్లో జరిగిన బిఎల్ఎఫ్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణ, ఆధిపత్య పార్టీ లను ఓడించి, కార్మిక వర్గ ప్రయోజనం కోసం, అట్టడుగు వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా ముందుండి పోరాడుతున్న బిఎల్ఎఫ్.. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు పోటీ చేయనున్నదని తెలిపారు. ప్రస్తుతం ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నామని,

భువనగిరి పార్లమెంట్ కు ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి,

నల్లగొండ పార్లమెంటుకు ఎంసిపిఐ కేంద్ర కమిటీ సభ్యుడు వస్కుల మట్టయ్య,

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి ఎం సి పి ఐ రాష్ట్ర నాయకుడు వనం సుధాకర్,

జహీరాబాద్ నియోజకవర్గానికి బి ఎల్ పి రాష్ట్ర నాయకుడు వడ్ల సాయి కృష్ణ చారి,

నిజామాబాద్ నియోజకవర్గానికి బిఎల్పి రాష్ట్ర నాయకుడు అబ్బగాని అశోక్ గౌడ్

పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో తమ యొక్క అభ్యర్థులుగా పోటీలో ఉంటారని బహిరంగంగా ప్రకటిస్తున్నామని, త్వరలో మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా తమ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో ఎం సిపిఐ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, ఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, బి ఎల్ పి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు దండి వెంకట్, బిసిపి రాష్ట్ర కార్యదర్శి కే పర్వతాలు, వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాయబడి పాండురంగ చారి, ప్రజా పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఉయ్యాల లింగ స్వామి గౌడ్, అరూరి సత్తయ్య ప్రజాపతి, మోతె చంద్రమౌళి కురుమ, గార లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

NLG: నాంపల్లి మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కత్తి రవీందర్ రెడ్డి

నాంపల్లి: మండల కేంద్రానికి చెందిన కత్తి రవీందర్ రెడ్డి ని, మండలం కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ, శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి నియామక పత్రం అందజేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. నాంపల్లి మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంటు నుండి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని అన్నారు.

మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తాం, పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేస్తాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, ఎరెడ్ల రఘుపతి రెడ్డి, కొమ్ము బిక్షం, గజ్జల శివారెడ్డి, పెద్దిరెడ్డి రాజు, ఈద శేఖర్, పానుగంటి వెంకటయ్య, ఎస్.కె చాంద్ పాష, పానుగంటి వెంకన్న, దోటి శంకర్ యాదవ్, చిలుకూరి బిక్షం, సింగిల్ విండో చైర్మన్ నర్సిరెడ్డి, గుండాల అంజయ్య, సుధాకర్ రెడ్డి, ముష్టిపల్లి ఎంపిటిసి బుజ్జి చందు, భతూల వంశీ, అంగిరేకుల పాండు, కోరే యాదయ్య, వీరమల్ల శ్వేతా నాగరాజు, దండిగ నరసింహ, దోటి పరమేష్ యాదవ్, పులికుంట్ల విజయ్, బుషిపాక సంజీవ, ఎరెడ్ల సంజీవరెడ్డి, కోరే శివ, దండిగ వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

NLG: రూ. 67 కోట్ల ఆర్ అండ్ బి రహదారి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి


నల్లగొండ జిల్లా:

నార్కట్ పల్లి మండలం, బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో సుమారు రూ. 67 కోట్ల విలువచేసే ఆర్ అండ్ బి రహదారుల పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. గ్రామానికి చెందిన చంద్రమ్మ అనే పేద మహిళకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రాబోయే వానకాలం నాటికి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కింద అన్ని కాలువలకు నీరు అందిస్తామని తెలిపారు.

తెలంగాణలో పేదలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, సబ్సిడీ ఎల్పిజి కనెక్షన్, సొంత స్థలం ఉన్చ వారికి 5 లక్షల రూపాయ లతో ఇందిర ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని, మహాలక్ష్మి పథకం కింద పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, చిట్యాల మున్సిపల్ చైర్మన్ వెంకట్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డిఓ రవి, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

NLG: రామన్నపేట బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా కాన్షీరాం 90వ జయంతి

రామన్నపేట: ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరాం 90వ జయంతి సందర్భంగా, బీఎస్పీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

ఈ కార్యక్రమంలో బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావురాల నరసింహ యాదవ్ మాట్లాడుతూ.. భారతదేశ సామాజిక వ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీ వర్గాలు అక్షరానికి, సంపదకు, అధికారానికి దూరంగానెట్టివేయబడ్డాయి.ఈ వర్గాలను బహుజన మహనీయుల సిద్ధాంతంతో రాజకీయంగా ఏకం చేసి అణగారిన వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన యోధుడు కాన్షీరాం అని అన్నారు.

బహుజన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి ఉద్యోగులను, మేధావులను, విద్యార్థులను, ప్రజలందరిని ఏకం చేసి బహుజనులకు అధికారాన్ని అందించి దేశ రాజకీయాల్లో కొత్త చరిత్ర లిఖించిన మహోన్నత రాజకీయ శిఖరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేడి సంతోష్ మండల మహిళా కన్వీనర్ బందెల అనిత, మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నరసింహ పాల్గొన్నారు.

NLG: విద్యార్థి దశ నుండే మంచి విలువలను పెంపొందించుకోవాలి: డీఎంహెచ్ఓ కొండల్ రావు

నల్గొండ పాతబస్తీ మాధవ్ నగర్ జేబీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో, ఈరోజు 10 వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఫేర్వెల్ ప్రోగ్రాం కు ప్రధానోపాధ్యాయులు నిమ్మల నిర్మల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. జీవిత విలువలను పాఠశాల దశ నుండి పెంపొందించుకోవాలని తెలియజేస్తూ మంచి విలువలను, దేశంపై భక్తి భావనను, తల్లిదండ్రుల పట్ల వినయ విధేయత లను, కుటుంబ విలువలను, గురువుల పట్ల భక్తి భావనను, సమాజం పట్ల అవగాహనను, ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు చే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

NLG: సరంపేట గ్రామంలో పోషణ అభియాన్ కార్యక్రమం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, సరంపేట గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించి, సిరి ధాన్యాలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి వివరించారు. పూర్వ ప్రాథమిక విద్య అంగన్వాడీ లలో అందించడం వల్ల పిల్లలు మానసిక, శారీరక అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. పిల్లలకు 6నెలల వరకు కేవలం తల్లి పాలు తాపించాలన్నారు. సూపర్వైజర్ పద్మ, పంచాయతీ సెక్రెటరీ రాకేష్, ఏఎన్ఎం జ్యోతి, అంగన్వాడీ టీచర్లు కలమ్మ, రంగమ్మ, ఆశ యాదమ్మ పాల్గొన్నారు.

NLG: అటవీ శాఖ అధికారి ఎన్ వి రఘువీర్ ప్రతాప్ కు.. తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం

నల్లగొండ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ పర్యవేక్షణ అధికారి ఎన్ వి రఘువీర్ ప్రతాప్ కు, ప్రతిష్టాత్మక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాన్ని గజల్ ప్రక్రియలో ప్రకటించింది.

ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు పెరిక మధు ఆయనకు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పెరిక మధు మాట్లాడుతూ.. తెలుగు యూనివర్సిటీ రిజిస్టర్ బట్టు రామ్మూర్తి ఈ విషయాన్ని ప్రకటించారని, తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో వైస్ ఛాన్స్లర్ చేతుల మీదుగా ఈనెల 20న పురస్కారాన్ని అందుకోనున్నారని తెలిపారు.SB NEWS TELANGANA

SB NEWS NATIONAL MEDIA

NLG: దేవరకొండలో ఘనంగా ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ 97 వ ఆవిర్భావ దినోత్సవం

భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను ప్రతి పౌరుడు కి అందేవిధంగా సామాజిక పోరాటానికి, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సారధులు సంసిద్ధులు కావాలని సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చిన దళిత రత్న బురి వెంకన్న, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ.

నల్లగొండ జిల్లా, దేవరకొండ:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ 97వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు, నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ప్రపంచ మేధావి ,రాజ్యాంగ నిర్మాత, న్యాయకోవిదుడు, ప్రజాస్వామ్యవాది, స్త్రీల హక్కుల పరిరక్షకుడు, సామాజికవేత, తత్వవేత్త, ఆర్థికవేత్త , సామాజిక పోరాట విప్లవ జ్యోతి అంబేద్కర్ ను స్మరిస్తూ ఆయన విగ్రహానికి పూలమాల వేసి, సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి దళితరత్న బుర్రి వెంకన్న, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి 

ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మార్చి 13, 1927 న ఈ యొక్క సంస్థను స్థాపించినారని తెలిపారు. నేటితో 97 వసంతాలు పూర్తి చేసుకున్నాయని అన్నారు.

ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ స్థాపించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహద్ చెరువు పోరాటం మరియు దేవాలయంలోకి ప్రవేశించుట, మానవులంతా సమానమే, అందరికీ స్వేచ్ఛ సమానత్వం కోసం ఈ సంస్థ ద్వారా మహోన్నతమైన ఉద్యమాలు కు శ్రీకారం చుట్టారని, వారి యొక్క సేవలు మరువలేనివని ఆయన గుర్తు చేశారు. 

జిల్లా ఉపాధ్యక్షులు బరపటి వెంకటయ్య మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుండి మండల, జిల్లా స్థాయిలో సంస్థ పూర్తి బలోపేతం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సలహాదారుడు అడ్వకేట్ నక్క వెంకటేష్, ఏకుల అంబేడ్కర్ పానుగంటి శ్రీకాంత్, భూతం రవి, పీఏ పల్లి మండల కన్వీనర్ జిల్లా రాములు, డివిజన్ కార్యదర్శి ఇరిగి లింగయ్య, బుడిగ గిరి తదితరులు పాల్గొన్నారు.

NLG: YRP ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ

నల్లగొండ: ఎలిషాల రవి ప్రసాద్ గారి YRP ఫౌండేషన్ ఆధ్వర్యంలో  2024 SSC విద్యార్థులకు ఎగ్జామ్స్ పాడ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం లో భాగంగా నల్గొండ జిల్లా కన్వీనర్ యామ దయాకర్ మరియు బొమ్మపాల గిరిబాబు గార్లు మరియు వై.ఆర్.పి టీం సభ్యులు కలిసి బుధవారం నల్గొండ పట్టణంలోని 11 హైస్కూల్స్

రామగిరి బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్స్, బొట్టుగూడ హైస్కూల్, డైట్ హైస్కూల్ డీవీకే రోడ్ హైస్కూల్, జేబీఎస్ హైస్కూల్, ఆర్.పి రోడ్ గర్ల్స్ హైస్కూల్, పద్మా నగర్ హైస్కూల్, పానగల్ హైస్కూల్, మర్రిగూడ జెడ్. పి.హెచ్.ఎస్, చర్లపల్లి జెడ్. పి.హెచ్.ఎస్ కు చెందిన 900 మంది విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేశారు.

NLG: నల్లగొండ మున్సిపాలిటీ ని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: తాగునీరు, శానిటేషన్, గ్రీనరీపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 55 కోట్ల టిఎఫ్ ఐడిసి నిధులతో నిర్మించనున్న డ్రైన్లు, సిసి రోడ్ల పనులకు పట్టణంలోని బైపాస్ రోడ్డులో శంకుస్థాపన చేసి మాట్లాడుతూ.. నల్గొండ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, రూ. 600 కోట్లలతో చేపట్టనున్న అవుటర్ రింగ్ రోడ్డు పనులకు వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నామని అన్నారు.

6 లైన్ల రహదారి పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని పట్టణ ప్రజలకు తాగునీరు వినియోగించుకునే నీటికి ఇబ్బంది లేకుండా 10లక్షల లీటర్లు, 15 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 2 వాటర్ ట్యాంక్ లను చేపట్టామని, రూ. 20 కోట్లలతో నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నామని తెలిపారు.

రోడ్లు, డ్రైన్ల పనుల నాణ్యత విషయంలో ఇంజనీరింగ్ అధికారులు రాజీ పడొద్దని మంత్రి ఆదేశించారు.

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాకు 12,000 మంది హాజరు కాగా, 6000 మందికి ఉద్యోగాలు ఇచ్చాము. మే, జాన్ నెలలో మరో జాబ్ మేళ ను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కౌన్సిలర్ లక్ష్మీ శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.