/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: రామన్నపేట బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా కాన్షీరాం 90వ జయంతి Mane Praveen
NLG: రామన్నపేట బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా కాన్షీరాం 90వ జయంతి

రామన్నపేట: ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరాం 90వ జయంతి సందర్భంగా, బీఎస్పీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

ఈ కార్యక్రమంలో బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావురాల నరసింహ యాదవ్ మాట్లాడుతూ.. భారతదేశ సామాజిక వ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీ వర్గాలు అక్షరానికి, సంపదకు, అధికారానికి దూరంగానెట్టివేయబడ్డాయి.ఈ వర్గాలను బహుజన మహనీయుల సిద్ధాంతంతో రాజకీయంగా ఏకం చేసి అణగారిన వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన యోధుడు కాన్షీరాం అని అన్నారు.

బహుజన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి ఉద్యోగులను, మేధావులను, విద్యార్థులను, ప్రజలందరిని ఏకం చేసి బహుజనులకు అధికారాన్ని అందించి దేశ రాజకీయాల్లో కొత్త చరిత్ర లిఖించిన మహోన్నత రాజకీయ శిఖరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేడి సంతోష్ మండల మహిళా కన్వీనర్ బందెల అనిత, మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నరసింహ పాల్గొన్నారు.

NLG: విద్యార్థి దశ నుండే మంచి విలువలను పెంపొందించుకోవాలి: డీఎంహెచ్ఓ కొండల్ రావు

నల్గొండ పాతబస్తీ మాధవ్ నగర్ జేబీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో, ఈరోజు 10 వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఫేర్వెల్ ప్రోగ్రాం కు ప్రధానోపాధ్యాయులు నిమ్మల నిర్మల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. జీవిత విలువలను పాఠశాల దశ నుండి పెంపొందించుకోవాలని తెలియజేస్తూ మంచి విలువలను, దేశంపై భక్తి భావనను, తల్లిదండ్రుల పట్ల వినయ విధేయత లను, కుటుంబ విలువలను, గురువుల పట్ల భక్తి భావనను, సమాజం పట్ల అవగాహనను, ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు చే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

NLG: సరంపేట గ్రామంలో పోషణ అభియాన్ కార్యక్రమం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, సరంపేట గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించి, సిరి ధాన్యాలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి వివరించారు. పూర్వ ప్రాథమిక విద్య అంగన్వాడీ లలో అందించడం వల్ల పిల్లలు మానసిక, శారీరక అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. పిల్లలకు 6నెలల వరకు కేవలం తల్లి పాలు తాపించాలన్నారు. సూపర్వైజర్ పద్మ, పంచాయతీ సెక్రెటరీ రాకేష్, ఏఎన్ఎం జ్యోతి, అంగన్వాడీ టీచర్లు కలమ్మ, రంగమ్మ, ఆశ యాదమ్మ పాల్గొన్నారు.

NLG: అటవీ శాఖ అధికారి ఎన్ వి రఘువీర్ ప్రతాప్ కు.. తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం

నల్లగొండ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ పర్యవేక్షణ అధికారి ఎన్ వి రఘువీర్ ప్రతాప్ కు, ప్రతిష్టాత్మక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాన్ని గజల్ ప్రక్రియలో ప్రకటించింది.

ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు పెరిక మధు ఆయనకు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పెరిక మధు మాట్లాడుతూ.. తెలుగు యూనివర్సిటీ రిజిస్టర్ బట్టు రామ్మూర్తి ఈ విషయాన్ని ప్రకటించారని, తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో వైస్ ఛాన్స్లర్ చేతుల మీదుగా ఈనెల 20న పురస్కారాన్ని అందుకోనున్నారని తెలిపారు.SB NEWS TELANGANA

SB NEWS NATIONAL MEDIA

NLG: దేవరకొండలో ఘనంగా ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ 97 వ ఆవిర్భావ దినోత్సవం

భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను ప్రతి పౌరుడు కి అందేవిధంగా సామాజిక పోరాటానికి, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సారధులు సంసిద్ధులు కావాలని సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చిన దళిత రత్న బురి వెంకన్న, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ.

నల్లగొండ జిల్లా, దేవరకొండ:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ 97వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు, నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ప్రపంచ మేధావి ,రాజ్యాంగ నిర్మాత, న్యాయకోవిదుడు, ప్రజాస్వామ్యవాది, స్త్రీల హక్కుల పరిరక్షకుడు, సామాజికవేత, తత్వవేత్త, ఆర్థికవేత్త , సామాజిక పోరాట విప్లవ జ్యోతి అంబేద్కర్ ను స్మరిస్తూ ఆయన విగ్రహానికి పూలమాల వేసి, సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి దళితరత్న బుర్రి వెంకన్న, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి 

ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మార్చి 13, 1927 న ఈ యొక్క సంస్థను స్థాపించినారని తెలిపారు. నేటితో 97 వసంతాలు పూర్తి చేసుకున్నాయని అన్నారు.

ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ స్థాపించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహద్ చెరువు పోరాటం మరియు దేవాలయంలోకి ప్రవేశించుట, మానవులంతా సమానమే, అందరికీ స్వేచ్ఛ సమానత్వం కోసం ఈ సంస్థ ద్వారా మహోన్నతమైన ఉద్యమాలు కు శ్రీకారం చుట్టారని, వారి యొక్క సేవలు మరువలేనివని ఆయన గుర్తు చేశారు. 

జిల్లా ఉపాధ్యక్షులు బరపటి వెంకటయ్య మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుండి మండల, జిల్లా స్థాయిలో సంస్థ పూర్తి బలోపేతం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సలహాదారుడు అడ్వకేట్ నక్క వెంకటేష్, ఏకుల అంబేడ్కర్ పానుగంటి శ్రీకాంత్, భూతం రవి, పీఏ పల్లి మండల కన్వీనర్ జిల్లా రాములు, డివిజన్ కార్యదర్శి ఇరిగి లింగయ్య, బుడిగ గిరి తదితరులు పాల్గొన్నారు.

NLG: YRP ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ

నల్లగొండ: ఎలిషాల రవి ప్రసాద్ గారి YRP ఫౌండేషన్ ఆధ్వర్యంలో  2024 SSC విద్యార్థులకు ఎగ్జామ్స్ పాడ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం లో భాగంగా నల్గొండ జిల్లా కన్వీనర్ యామ దయాకర్ మరియు బొమ్మపాల గిరిబాబు గార్లు మరియు వై.ఆర్.పి టీం సభ్యులు కలిసి బుధవారం నల్గొండ పట్టణంలోని 11 హైస్కూల్స్

రామగిరి బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్స్, బొట్టుగూడ హైస్కూల్, డైట్ హైస్కూల్ డీవీకే రోడ్ హైస్కూల్, జేబీఎస్ హైస్కూల్, ఆర్.పి రోడ్ గర్ల్స్ హైస్కూల్, పద్మా నగర్ హైస్కూల్, పానగల్ హైస్కూల్, మర్రిగూడ జెడ్. పి.హెచ్.ఎస్, చర్లపల్లి జెడ్. పి.హెచ్.ఎస్ కు చెందిన 900 మంది విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేశారు.

NLG: నల్లగొండ మున్సిపాలిటీ ని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: తాగునీరు, శానిటేషన్, గ్రీనరీపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 55 కోట్ల టిఎఫ్ ఐడిసి నిధులతో నిర్మించనున్న డ్రైన్లు, సిసి రోడ్ల పనులకు పట్టణంలోని బైపాస్ రోడ్డులో శంకుస్థాపన చేసి మాట్లాడుతూ.. నల్గొండ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, రూ. 600 కోట్లలతో చేపట్టనున్న అవుటర్ రింగ్ రోడ్డు పనులకు వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నామని అన్నారు.

6 లైన్ల రహదారి పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని పట్టణ ప్రజలకు తాగునీరు వినియోగించుకునే నీటికి ఇబ్బంది లేకుండా 10లక్షల లీటర్లు, 15 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 2 వాటర్ ట్యాంక్ లను చేపట్టామని, రూ. 20 కోట్లలతో నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నామని తెలిపారు.

రోడ్లు, డ్రైన్ల పనుల నాణ్యత విషయంలో ఇంజనీరింగ్ అధికారులు రాజీ పడొద్దని మంత్రి ఆదేశించారు.

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాకు 12,000 మంది హాజరు కాగా, 6000 మందికి ఉద్యోగాలు ఇచ్చాము. మే, జాన్ నెలలో మరో జాబ్ మేళ ను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కౌన్సిలర్ లక్ష్మీ శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

NLG: మహిళా సమాఖ్య కార్యాలయాలలో పనిచేస్తున్న అటెండర్లకు కనీస వేతనాలు అమలు చేయాలి: సిఐటియు

నల్లగొండ: ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా ఏర్పడిన మండల మహిళ సమాఖ్య కార్యాలయాలలో, గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న అటెండర్ లకు 18000/- కనీస వేతనాలు అమలు చేయాలని, సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిఆర్డిఓ నాగిరెడ్డికి వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పులకరం నారాయణ, కూరెళ్ల యాదగిరి, జిల్లా నాయకులు ఏకూరి లింగమ్మ, మణమ్మ, దాసరి సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

NLG: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్

రానున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు జిల్లా కలెక్టర్లు అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల నిర్వహణ విషయమై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితాపై వచ్చిన అన్ని ఫిర్యాదులపై విచారణ జరిపి ఎలాంటి తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించాలన్నారు. నల్లగొండ నుండి కలెక్టర్ హరిచందన కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

NLG: కాంగ్రెస్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి చేరే అవకాశం?

కాంగ్రెస్ లోకి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి చేరే అవకాశం ఉంది. హైదరాబాదు లో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయిన అమిత్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ నుండి బిఆర్ఎస్ టికెట్ ఆశించినారు. కానీ బీఆర్ఎస్ నిరాకరించింది. అయితే కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్న అమిత్ రెడ్డి, సీఎంను కలిసిన తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.