/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: దేవరకొండలో ఘనంగా ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ 97 వ ఆవిర్భావ దినోత్సవం Mane Praveen
NLG: దేవరకొండలో ఘనంగా ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ 97 వ ఆవిర్భావ దినోత్సవం

భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను ప్రతి పౌరుడు కి అందేవిధంగా సామాజిక పోరాటానికి, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సారధులు సంసిద్ధులు కావాలని సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చిన దళిత రత్న బురి వెంకన్న, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ.

నల్లగొండ జిల్లా, దేవరకొండ:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ 97వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు, నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ప్రపంచ మేధావి ,రాజ్యాంగ నిర్మాత, న్యాయకోవిదుడు, ప్రజాస్వామ్యవాది, స్త్రీల హక్కుల పరిరక్షకుడు, సామాజికవేత, తత్వవేత్త, ఆర్థికవేత్త , సామాజిక పోరాట విప్లవ జ్యోతి అంబేద్కర్ ను స్మరిస్తూ ఆయన విగ్రహానికి పూలమాల వేసి, సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి దళితరత్న బుర్రి వెంకన్న, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి 

ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మార్చి 13, 1927 న ఈ యొక్క సంస్థను స్థాపించినారని తెలిపారు. నేటితో 97 వసంతాలు పూర్తి చేసుకున్నాయని అన్నారు.

ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ స్థాపించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహద్ చెరువు పోరాటం మరియు దేవాలయంలోకి ప్రవేశించుట, మానవులంతా సమానమే, అందరికీ స్వేచ్ఛ సమానత్వం కోసం ఈ సంస్థ ద్వారా మహోన్నతమైన ఉద్యమాలు కు శ్రీకారం చుట్టారని, వారి యొక్క సేవలు మరువలేనివని ఆయన గుర్తు చేశారు. 

జిల్లా ఉపాధ్యక్షులు బరపటి వెంకటయ్య మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుండి మండల, జిల్లా స్థాయిలో సంస్థ పూర్తి బలోపేతం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సలహాదారుడు అడ్వకేట్ నక్క వెంకటేష్, ఏకుల అంబేడ్కర్ పానుగంటి శ్రీకాంత్, భూతం రవి, పీఏ పల్లి మండల కన్వీనర్ జిల్లా రాములు, డివిజన్ కార్యదర్శి ఇరిగి లింగయ్య, బుడిగ గిరి తదితరులు పాల్గొన్నారు.

NLG: YRP ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ

నల్లగొండ: ఎలిషాల రవి ప్రసాద్ గారి YRP ఫౌండేషన్ ఆధ్వర్యంలో  2024 SSC విద్యార్థులకు ఎగ్జామ్స్ పాడ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం లో భాగంగా నల్గొండ జిల్లా కన్వీనర్ యామ దయాకర్ మరియు బొమ్మపాల గిరిబాబు గార్లు మరియు వై.ఆర్.పి టీం సభ్యులు కలిసి బుధవారం నల్గొండ పట్టణంలోని 11 హైస్కూల్స్

రామగిరి బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్స్, బొట్టుగూడ హైస్కూల్, డైట్ హైస్కూల్ డీవీకే రోడ్ హైస్కూల్, జేబీఎస్ హైస్కూల్, ఆర్.పి రోడ్ గర్ల్స్ హైస్కూల్, పద్మా నగర్ హైస్కూల్, పానగల్ హైస్కూల్, మర్రిగూడ జెడ్. పి.హెచ్.ఎస్, చర్లపల్లి జెడ్. పి.హెచ్.ఎస్ కు చెందిన 900 మంది విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేశారు.

NLG: నల్లగొండ మున్సిపాలిటీ ని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: తాగునీరు, శానిటేషన్, గ్రీనరీపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 55 కోట్ల టిఎఫ్ ఐడిసి నిధులతో నిర్మించనున్న డ్రైన్లు, సిసి రోడ్ల పనులకు పట్టణంలోని బైపాస్ రోడ్డులో శంకుస్థాపన చేసి మాట్లాడుతూ.. నల్గొండ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, రూ. 600 కోట్లలతో చేపట్టనున్న అవుటర్ రింగ్ రోడ్డు పనులకు వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నామని అన్నారు.

6 లైన్ల రహదారి పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని పట్టణ ప్రజలకు తాగునీరు వినియోగించుకునే నీటికి ఇబ్బంది లేకుండా 10లక్షల లీటర్లు, 15 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 2 వాటర్ ట్యాంక్ లను చేపట్టామని, రూ. 20 కోట్లలతో నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నామని తెలిపారు.

రోడ్లు, డ్రైన్ల పనుల నాణ్యత విషయంలో ఇంజనీరింగ్ అధికారులు రాజీ పడొద్దని మంత్రి ఆదేశించారు.

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాకు 12,000 మంది హాజరు కాగా, 6000 మందికి ఉద్యోగాలు ఇచ్చాము. మే, జాన్ నెలలో మరో జాబ్ మేళ ను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కౌన్సిలర్ లక్ష్మీ శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

NLG: మహిళా సమాఖ్య కార్యాలయాలలో పనిచేస్తున్న అటెండర్లకు కనీస వేతనాలు అమలు చేయాలి: సిఐటియు

నల్లగొండ: ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా ఏర్పడిన మండల మహిళ సమాఖ్య కార్యాలయాలలో, గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న అటెండర్ లకు 18000/- కనీస వేతనాలు అమలు చేయాలని, సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిఆర్డిఓ నాగిరెడ్డికి వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పులకరం నారాయణ, కూరెళ్ల యాదగిరి, జిల్లా నాయకులు ఏకూరి లింగమ్మ, మణమ్మ, దాసరి సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

NLG: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్

రానున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు జిల్లా కలెక్టర్లు అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల నిర్వహణ విషయమై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితాపై వచ్చిన అన్ని ఫిర్యాదులపై విచారణ జరిపి ఎలాంటి తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించాలన్నారు. నల్లగొండ నుండి కలెక్టర్ హరిచందన కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

NLG: కాంగ్రెస్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి చేరే అవకాశం?

కాంగ్రెస్ లోకి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి చేరే అవకాశం ఉంది. హైదరాబాదు లో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయిన అమిత్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ నుండి బిఆర్ఎస్ టికెట్ ఆశించినారు. కానీ బీఆర్ఎస్ నిరాకరించింది. అయితే కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్న అమిత్ రెడ్డి, సీఎంను కలిసిన తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.

TS: తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు

4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లు.

ప్రతీ నియోజక వర్గానికి 3500 ఇల్లు. లబ్ది దారులను గ్రామ సభల్లో ఎంపిక.

కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు కేబినెట్ ఆమోదం.

16 బీసీ , ఎస్సీ , ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటు.

1. ముదిరాజ్ కార్పొరేషన్

2. యాదవ కురుమ కార్పొరేషన్

3. మున్నూరుకాపు కార్పొరేషన్

4. పద్మశాలి కార్పొరేషన్

5. పెరిక (పురగిరి క్షత్రియ) కార్పొరేషన్

6. లింగాయత్ కార్పొరేషన్

7. మేరా కార్పొరేషన్

8. గంగపుత్ర కార్పొరేషన్ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (EBC)

9. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు

10. ఆర్య వైశ్య కార్పొరేషన్

11. రెడ్డి కార్పొరేషన్

12. మాదిగ, మాదిగ ఉప కులాల కార్పొరేషన్

13. మాల, మాల ఉప కులాల కార్పొరేషన్ 

మూడు ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు

• కొమురం భీమ్ ఆదివాసి కార్పోరేషన్

• సంత్ సేవాలాల్ లంబాడి కార్పోరేషన్

• ఏకలవ్య కార్పోరేషన

• మహిళా సాధికారితలో భాగంగా మహిళల కోసం ఔటర్ రింగురోడ్డు చుట్టు మహిళా రైతు బజార్లు ఏర్పాటు (మహిళలే రైతు బజార్లు నిర్వహిస్తారు)

• అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు

• ఆరోగ్య శ్రీరేషన్ కార్డుకు ఎలాంటి సంబంధం లేదు

• ఇకనుంచి రేషన్ కార్డు పూర్తిగా నిత్యావసర సరుకులకు మాత్రమే ఉపయోగపడుతుంది

• 92 శాతం రైతులకు వచ్చే మూడు రోజుల్లో రైతుభరోస పూర్తవుతుంది.

16 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం

ముదిరాజ్, యాదవ కుర్మ, లింగాయత్, పద్మశాలి, పెరక, బలిజ కార్పొరేషన్ల ఏర్పాటు

రెడ్డి, వైశ్య, మాదిగ, మాదిగ ఉపకులాల, మాల, మల ఉపకులాల కార్పొరేషన్ల ఏర్పాటు

8ఏకలవ్య, బంజారా, ఆదివాసీ ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు

గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు

స్వయం సహాయక సబుగాల ఉత్పత్తుల మార్కెటింగ్ కు ఓ.ఆర్.ఆర్ పరిధిలో 25 ఎకరాల స్థలంలో వసతి (కాంప్లెక్స్ ) ఏర్పాటు.

వచ్చే ఐదేళ్ళలో స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు 15 అంశాలతో కూడిన మహిళా శక్తి ప్రత్యేక పధకం ఏరాటు.

82008 డీఏస్సీ అభ్యర్థులకు మినిమం పే స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం

వేసవిలో తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను ఆదేశించిన క్యాబినెట్

*గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్ తో కమిటీ.

NLG: పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత

నల్లగొండ జిల్లా:

నాగార్జున సాగర్: హిల్ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు పైలాన్ కాలనీ మోడల్ ప్రభుత్వ పాఠశాల లలో పదవ తరగతి చదువుతున్న 55 మంది విద్యార్థులకు, స్వచ్ఛంద సేవకులు నాగుల గోపాలకృష్ణ సోమవారం పరీక్ష సామాగ్రి అందించారు.

అనంతరం బత్తుల ప్రసాద్ స్వేరో ఆధ్వర్యంలో భీం దీక్షా వాల్ పోస్టర్స్ ఆవిష్కరించారు. కళాశాల, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం స్వచ్ఛంద సేవకులు నాగుల గోపాలకృష్ణ, మరియు సామాజిక కార్యకర్త గోరింట్ల శివరామ ప్రసాద్, సేవా సంస్థ సభ్యులు బద్రి, శ్రీను, వీరబాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

TS: ధరణి డ్రైవ్ కంటిన్యూ.. లక్షా 10 వేల పెండింగ్ సమస్యలకు పరిష్కారం

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి డ్రైవ్ కంటిన్యూ కానున్నది. భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఒకటో తేదీ నుంచి చేపట్టిన ధరణి స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ ప్రకారం శనివారంతో ముగియాలి. అయితే ఇంకా సమస్యలు అలాగే ఉండటం, వరుస సెలవులు రావడంతో పెండింగ్ అప్లికేషన్లన్ని క్లియర్ చేసేంత వరకు డ్రైవ్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధరణిలో మొత్తం 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. అందులో లక్షా 10 వేల అప్లికేషన్లకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చారు. మరో లక్షా 35 వేల అప్లికేషన్లు ప్రాసెస్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రివ్యూలో ధరణిపై ఏర్పాటైన కమిటీ పలు కీలక సూచనలు చేసింది. దాంట్లో భాగంగానే ధరణి స్పెషల్ డ్రైవ్ తోపాటు వివిధ స్థాయిల్లో అధికారాల వికేంద్రీకరణ చేపట్టాలని సూచన చేసింది. దీంతో ఇప్పుడు ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్లో పలు మార్పులు చేస్తున్నారు. ఎమ్మార్వో, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), కలెక్టర్, సీసీఎల్ఏ లాగిన్లను మారుస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం కలెక్టర్కు, సీసీఎల్ఏకు మాత్రమే ధరణిలో ఏదైనా భూమిలో మార్పులు చేసేందుకు అవకాశం ఉన్నది. ఇప్పుడు లాగిన్లు కింది స్థాయిలోనే ఇవ్వడంతో ఇక మీదట ఎమ్మార్వో లు, ఆర్డీవోలు, కలెక్టర్లు రిపోర్టులు రెడీ చేసి సీసీఎల్ఏ వరకు పంపాల్సిన అవసరం లేకుండా క్షేత్రస్థాయి లోనే సమస్యలు పరిష్కరించే వీలు కలుగనున్నది. 

ఎమ్మార్వో లెవెల్లో లాగిన్ ఇవ్వడం ద్వారా టీఎం4- విరాసత్ (అసైన్డ్ భూములతో సహా), టీఎం10- జీపీఏ, ఎస్పీఏ, టీఎం14- స్పెషల్ ల్యాండ్ మ్యాటర్స్, టీఎం 32-ఖాతా మెర్జింగ్ వంటివి ఎమ్మార్వో స్థాయిలోనే అయిపోనున్నాయి. వీటిని ఏడు రోజుల్లోగా పరిష్కరించనున్నారు. ఆర్డీవో లెవెల్ లో టీఎం 7-పాసు పుస్తకం లేకుండా నాలా కన్వర్షన్, టీఎం 16-ప్రభుత్వం సేకరించిన భూముల్లో సమస్యలు, టీఎం 20-ఎన్ఆర్ఐ లకు సంబంధించిన సమస్యలు, టీఎం 22-సంస్థలకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలు, టీఎం 26-కోర్టు కేసులు, సమాచారం, టీఎం 33- డేటా కరెక్షన్స్, మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణం, సర్వే నంబర్ మిస్సింగ్స్ (ఎకరం రూ.5 లక్షల లోపు ఉన్న ఏరియాల్లో మాత్రమే) లాంటివి పరిష్కారం కానున్నాయి. 

కాగా, ఆర్డీవో తనకు అప్పగించిన మాడ్యూళ్ల దరఖాస్తులను మూడ్రోజుల్లోగా పరిష్కరిస్తారు. ఇక సీసీఎల్ఏకు వెళ్లే అప్లికేషన్లలో టీఎం 33 కింద డేటా కరెక్షన్, నోషనల్ ఖాతా ట్రాన్స్ఫర్, క్లాసిఫికేషన్ మార్పు, రూ.50 లక్షలకు పైగా విలువచేసే భూముల్లో డేటా కరెక్షన్ వంటివి ఉండనున్నాయి.

NLG: నాంపల్లి మండల బిజెపి అధ్యక్షులుగా దాచేపల్లి నర్సింహ

నల్లగొండ జిల్లా:

నాంపల్లి: మండల భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా మండలంలోని గట్లమల్లేపల్లి గ్రామానికి చెందిన, దాచేపల్లి నర్సింహా ని నియమిస్తూ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా నర్సింహా మాట్లాడుతూ.. తన నియమానికి సహకరించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, ఏరెడ్ల శ్రీనివాస రెడ్డి, మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ దూడల బిక్షంకి ధన్యవాదములు తెలిపారు. బిజెపి అధికార దిశగా కష్టపడి పని చేస్తానని అన్నారు.