/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ Mane Praveen
NLG: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్

రానున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు జిల్లా కలెక్టర్లు అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల నిర్వహణ విషయమై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితాపై వచ్చిన అన్ని ఫిర్యాదులపై విచారణ జరిపి ఎలాంటి తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించాలన్నారు. నల్లగొండ నుండి కలెక్టర్ హరిచందన కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

NLG: కాంగ్రెస్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి చేరే అవకాశం?

కాంగ్రెస్ లోకి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి చేరే అవకాశం ఉంది. హైదరాబాదు లో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయిన అమిత్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ నుండి బిఆర్ఎస్ టికెట్ ఆశించినారు. కానీ బీఆర్ఎస్ నిరాకరించింది. అయితే కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్న అమిత్ రెడ్డి, సీఎంను కలిసిన తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.

TS: తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు

4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లు.

ప్రతీ నియోజక వర్గానికి 3500 ఇల్లు. లబ్ది దారులను గ్రామ సభల్లో ఎంపిక.

కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు కేబినెట్ ఆమోదం.

16 బీసీ , ఎస్సీ , ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటు.

1. ముదిరాజ్ కార్పొరేషన్

2. యాదవ కురుమ కార్పొరేషన్

3. మున్నూరుకాపు కార్పొరేషన్

4. పద్మశాలి కార్పొరేషన్

5. పెరిక (పురగిరి క్షత్రియ) కార్పొరేషన్

6. లింగాయత్ కార్పొరేషన్

7. మేరా కార్పొరేషన్

8. గంగపుత్ర కార్పొరేషన్ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (EBC)

9. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు

10. ఆర్య వైశ్య కార్పొరేషన్

11. రెడ్డి కార్పొరేషన్

12. మాదిగ, మాదిగ ఉప కులాల కార్పొరేషన్

13. మాల, మాల ఉప కులాల కార్పొరేషన్ 

మూడు ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు

• కొమురం భీమ్ ఆదివాసి కార్పోరేషన్

• సంత్ సేవాలాల్ లంబాడి కార్పోరేషన్

• ఏకలవ్య కార్పోరేషన

• మహిళా సాధికారితలో భాగంగా మహిళల కోసం ఔటర్ రింగురోడ్డు చుట్టు మహిళా రైతు బజార్లు ఏర్పాటు (మహిళలే రైతు బజార్లు నిర్వహిస్తారు)

• అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు

• ఆరోగ్య శ్రీరేషన్ కార్డుకు ఎలాంటి సంబంధం లేదు

• ఇకనుంచి రేషన్ కార్డు పూర్తిగా నిత్యావసర సరుకులకు మాత్రమే ఉపయోగపడుతుంది

• 92 శాతం రైతులకు వచ్చే మూడు రోజుల్లో రైతుభరోస పూర్తవుతుంది.

16 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం

ముదిరాజ్, యాదవ కుర్మ, లింగాయత్, పద్మశాలి, పెరక, బలిజ కార్పొరేషన్ల ఏర్పాటు

రెడ్డి, వైశ్య, మాదిగ, మాదిగ ఉపకులాల, మాల, మల ఉపకులాల కార్పొరేషన్ల ఏర్పాటు

8ఏకలవ్య, బంజారా, ఆదివాసీ ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు

గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు

స్వయం సహాయక సబుగాల ఉత్పత్తుల మార్కెటింగ్ కు ఓ.ఆర్.ఆర్ పరిధిలో 25 ఎకరాల స్థలంలో వసతి (కాంప్లెక్స్ ) ఏర్పాటు.

వచ్చే ఐదేళ్ళలో స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు 15 అంశాలతో కూడిన మహిళా శక్తి ప్రత్యేక పధకం ఏరాటు.

82008 డీఏస్సీ అభ్యర్థులకు మినిమం పే స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం

వేసవిలో తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను ఆదేశించిన క్యాబినెట్

*గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్ తో కమిటీ.

NLG: పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత

నల్లగొండ జిల్లా:

నాగార్జున సాగర్: హిల్ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు పైలాన్ కాలనీ మోడల్ ప్రభుత్వ పాఠశాల లలో పదవ తరగతి చదువుతున్న 55 మంది విద్యార్థులకు, స్వచ్ఛంద సేవకులు నాగుల గోపాలకృష్ణ సోమవారం పరీక్ష సామాగ్రి అందించారు.

అనంతరం బత్తుల ప్రసాద్ స్వేరో ఆధ్వర్యంలో భీం దీక్షా వాల్ పోస్టర్స్ ఆవిష్కరించారు. కళాశాల, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం స్వచ్ఛంద సేవకులు నాగుల గోపాలకృష్ణ, మరియు సామాజిక కార్యకర్త గోరింట్ల శివరామ ప్రసాద్, సేవా సంస్థ సభ్యులు బద్రి, శ్రీను, వీరబాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

TS: ధరణి డ్రైవ్ కంటిన్యూ.. లక్షా 10 వేల పెండింగ్ సమస్యలకు పరిష్కారం

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి డ్రైవ్ కంటిన్యూ కానున్నది. భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఒకటో తేదీ నుంచి చేపట్టిన ధరణి స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ ప్రకారం శనివారంతో ముగియాలి. అయితే ఇంకా సమస్యలు అలాగే ఉండటం, వరుస సెలవులు రావడంతో పెండింగ్ అప్లికేషన్లన్ని క్లియర్ చేసేంత వరకు డ్రైవ్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధరణిలో మొత్తం 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. అందులో లక్షా 10 వేల అప్లికేషన్లకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చారు. మరో లక్షా 35 వేల అప్లికేషన్లు ప్రాసెస్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రివ్యూలో ధరణిపై ఏర్పాటైన కమిటీ పలు కీలక సూచనలు చేసింది. దాంట్లో భాగంగానే ధరణి స్పెషల్ డ్రైవ్ తోపాటు వివిధ స్థాయిల్లో అధికారాల వికేంద్రీకరణ చేపట్టాలని సూచన చేసింది. దీంతో ఇప్పుడు ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్లో పలు మార్పులు చేస్తున్నారు. ఎమ్మార్వో, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), కలెక్టర్, సీసీఎల్ఏ లాగిన్లను మారుస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం కలెక్టర్కు, సీసీఎల్ఏకు మాత్రమే ధరణిలో ఏదైనా భూమిలో మార్పులు చేసేందుకు అవకాశం ఉన్నది. ఇప్పుడు లాగిన్లు కింది స్థాయిలోనే ఇవ్వడంతో ఇక మీదట ఎమ్మార్వో లు, ఆర్డీవోలు, కలెక్టర్లు రిపోర్టులు రెడీ చేసి సీసీఎల్ఏ వరకు పంపాల్సిన అవసరం లేకుండా క్షేత్రస్థాయి లోనే సమస్యలు పరిష్కరించే వీలు కలుగనున్నది. 

ఎమ్మార్వో లెవెల్లో లాగిన్ ఇవ్వడం ద్వారా టీఎం4- విరాసత్ (అసైన్డ్ భూములతో సహా), టీఎం10- జీపీఏ, ఎస్పీఏ, టీఎం14- స్పెషల్ ల్యాండ్ మ్యాటర్స్, టీఎం 32-ఖాతా మెర్జింగ్ వంటివి ఎమ్మార్వో స్థాయిలోనే అయిపోనున్నాయి. వీటిని ఏడు రోజుల్లోగా పరిష్కరించనున్నారు. ఆర్డీవో లెవెల్ లో టీఎం 7-పాసు పుస్తకం లేకుండా నాలా కన్వర్షన్, టీఎం 16-ప్రభుత్వం సేకరించిన భూముల్లో సమస్యలు, టీఎం 20-ఎన్ఆర్ఐ లకు సంబంధించిన సమస్యలు, టీఎం 22-సంస్థలకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలు, టీఎం 26-కోర్టు కేసులు, సమాచారం, టీఎం 33- డేటా కరెక్షన్స్, మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణం, సర్వే నంబర్ మిస్సింగ్స్ (ఎకరం రూ.5 లక్షల లోపు ఉన్న ఏరియాల్లో మాత్రమే) లాంటివి పరిష్కారం కానున్నాయి. 

కాగా, ఆర్డీవో తనకు అప్పగించిన మాడ్యూళ్ల దరఖాస్తులను మూడ్రోజుల్లోగా పరిష్కరిస్తారు. ఇక సీసీఎల్ఏకు వెళ్లే అప్లికేషన్లలో టీఎం 33 కింద డేటా కరెక్షన్, నోషనల్ ఖాతా ట్రాన్స్ఫర్, క్లాసిఫికేషన్ మార్పు, రూ.50 లక్షలకు పైగా విలువచేసే భూముల్లో డేటా కరెక్షన్ వంటివి ఉండనున్నాయి.

NLG: నాంపల్లి మండల బిజెపి అధ్యక్షులుగా దాచేపల్లి నర్సింహ

నల్లగొండ జిల్లా:

నాంపల్లి: మండల భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా మండలంలోని గట్లమల్లేపల్లి గ్రామానికి చెందిన, దాచేపల్లి నర్సింహా ని నియమిస్తూ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా నర్సింహా మాట్లాడుతూ.. తన నియమానికి సహకరించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, ఏరెడ్ల శ్రీనివాస రెడ్డి, మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ దూడల బిక్షంకి ధన్యవాదములు తెలిపారు. బిజెపి అధికార దిశగా కష్టపడి పని చేస్తానని అన్నారు. 

NLG: బిజెపిలో చేరిన హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

పార్లమెంట్ ఎన్నికల వేళ బిఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. హుజూర్ నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, బిజెపి పార్టీలో చేరారు. ఢిల్లీలో బిజెపి కేంద్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, లక్ష్మణ్ లు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా హుజూర్నగర్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ నుండి గెలిచిన సైదిరెడ్డి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

NLG: తక్షణమే రూ. 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా, చండూరు:

రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ. 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వరి ధాన్యం కింటాకు రూ.500 బోనస్ ప్రకటించాలని, రైతులకుతక్షణమే రుణమాఫీని అమలు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గం లోని వివిధ మండలాలలో రైతులు ఆరుగాలం శ్రమించి, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసిన పంట పొలాలు తమ కళ్ళముందే చేతికొచ్చే సమయంలో, ఎండిపోయిన పొలాలను చూసి రైతులు ఆందోళనకు గురవుతున్నారని, తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

భూగర్భ జలాల నీటిమట్టాలు రోజురోజుకు పడిపోతుండడంతో వాటి ఆధారంగా సాగు చేసిన పంట పొలాలకు తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని, ఈ పరిస్థితులలో ఏఎమ్మార్పీ వరద కాలువల ద్వారా వీలైనన్ని చెరువులను నీటితో నింపితే భూగర్భ జలాలు అందుబాటులోకి వస్తాయని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోసిపిఎం మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, సిపిఎం మండల కమిటీ సభ్యులు చిట్టిమల్ల లింగయ్య,కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, కంచర్ల రవి తదితరులు పాల్గొన్నారు.

NLG: లీగ్ పోటీలను క్రీడాకారులందరూ వినియోగించుకోవాలి: Sk రహీం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ క్రీడాకారుల అభివృద్ధి కొరకు క్రీడాకారులను వెలికి తీసే పనిలో భాగంగా, మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం CSL ఫుట్బాల్ లీగ్స్ నిర్వహిస్తున్నామని తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ పాల గిరిబాబు తెలిపారు.

ఈ లీగ్స్ పోటీలలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి 70 మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇది క్లబ్ హెడ్ కోచ్ మద్ది కరుణాకర్ సారధ్యంలో ప్రతి ఆదివారం కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్ దగ్గుపాటి విమల క్రీడాకారులకు అరటి పండ్లను స్పాన్సర్ చేశారు. ఈ లీగ్స్ పోటీల కార్యక్రమానికి ఫ్రీడమ్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు SK రహీం ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రీడాకారులకు అరటి పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రహీం మాట్లాడుతూ.. ఫుట్బాల్ క్రీడాకారులని ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెలికి తీసే కార్యక్రమంలో భాగంగా ఫుట్బాల్ లీగ్ పోటీలను నిర్వహించడం ఎంతో గర్వకారణం అని దీనిని క్రీడాకారులందరూ ఉపయోగించుకొని, వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని తెలిపారు.

క్లబ్ హెడ్ కోచ్ మద్ది కరుణాకర్ మాట్లాడుతూ.. ఈ లీగ్స్ కాంపిటీషన్స్ ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహిస్తున్నామని, ఈ లీగ్స్ లో పాల్గొన్న క్రీడాకారులు ఎంతో నైపుణ్యంతో, మెలకువలు నేర్చుకొని ఫుట్బాల్ క్రీడలో రాటుదేరుతున్నారని, ఇది రాబోయే రోజులలో జాతీయస్థాయిలో రాణించడానికి ఎంతో ఉపయోగపడుతుందని, మారుమూల గ్రామ ఫుట్బాల్ క్రీడాకారులు కూడా ఈ పోటీల్లో పాల్గొనటానికి ముందుకు రావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యావర్, గణేష్, శ్రవణ్, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

NLG: మోడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు కి ఘన స్వాగతం

మోడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కుంభం రామ్ రెడ్డి, ఈ రోజు నల్గొండ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా, చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన క్లబ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు పుష్పగుచ్చం అందజేసి ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కుంభం రామ్ రెడ్డి మాట్లాడుతూ.. మోడరన్ కబడ్డీ అసోసియేషన్ ను భారతదేశ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించే విధంగా మా యొక్క కార్యచరణ ఉంటుందని అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క అసోసియేషన్ నిర్మాణం చేసే ప్రక్రియను మొదలు పెట్టామని తెలియజేశారు.