/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: నాంపల్లి మండల బిజెపి అధ్యక్షులుగా దాచేపల్లి నర్సింహ Mane Praveen
NLG: నాంపల్లి మండల బిజెపి అధ్యక్షులుగా దాచేపల్లి నర్సింహ

నల్లగొండ జిల్లా:

నాంపల్లి: మండల భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా మండలంలోని గట్లమల్లేపల్లి గ్రామానికి చెందిన, దాచేపల్లి నర్సింహా ని నియమిస్తూ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా నర్సింహా మాట్లాడుతూ.. తన నియమానికి సహకరించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, ఏరెడ్ల శ్రీనివాస రెడ్డి, మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ దూడల బిక్షంకి ధన్యవాదములు తెలిపారు. బిజెపి అధికార దిశగా కష్టపడి పని చేస్తానని అన్నారు. 

NLG: బిజెపిలో చేరిన హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

పార్లమెంట్ ఎన్నికల వేళ బిఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. హుజూర్ నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, బిజెపి పార్టీలో చేరారు. ఢిల్లీలో బిజెపి కేంద్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, లక్ష్మణ్ లు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా హుజూర్నగర్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ నుండి గెలిచిన సైదిరెడ్డి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

NLG: తక్షణమే రూ. 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా, చండూరు:

రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ. 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వరి ధాన్యం కింటాకు రూ.500 బోనస్ ప్రకటించాలని, రైతులకుతక్షణమే రుణమాఫీని అమలు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గం లోని వివిధ మండలాలలో రైతులు ఆరుగాలం శ్రమించి, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసిన పంట పొలాలు తమ కళ్ళముందే చేతికొచ్చే సమయంలో, ఎండిపోయిన పొలాలను చూసి రైతులు ఆందోళనకు గురవుతున్నారని, తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

భూగర్భ జలాల నీటిమట్టాలు రోజురోజుకు పడిపోతుండడంతో వాటి ఆధారంగా సాగు చేసిన పంట పొలాలకు తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని, ఈ పరిస్థితులలో ఏఎమ్మార్పీ వరద కాలువల ద్వారా వీలైనన్ని చెరువులను నీటితో నింపితే భూగర్భ జలాలు అందుబాటులోకి వస్తాయని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోసిపిఎం మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, సిపిఎం మండల కమిటీ సభ్యులు చిట్టిమల్ల లింగయ్య,కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, కంచర్ల రవి తదితరులు పాల్గొన్నారు.

NLG: లీగ్ పోటీలను క్రీడాకారులందరూ వినియోగించుకోవాలి: Sk రహీం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ క్రీడాకారుల అభివృద్ధి కొరకు క్రీడాకారులను వెలికి తీసే పనిలో భాగంగా, మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం CSL ఫుట్బాల్ లీగ్స్ నిర్వహిస్తున్నామని తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ పాల గిరిబాబు తెలిపారు.

ఈ లీగ్స్ పోటీలలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి 70 మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇది క్లబ్ హెడ్ కోచ్ మద్ది కరుణాకర్ సారధ్యంలో ప్రతి ఆదివారం కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్ దగ్గుపాటి విమల క్రీడాకారులకు అరటి పండ్లను స్పాన్సర్ చేశారు. ఈ లీగ్స్ పోటీల కార్యక్రమానికి ఫ్రీడమ్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు SK రహీం ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రీడాకారులకు అరటి పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రహీం మాట్లాడుతూ.. ఫుట్బాల్ క్రీడాకారులని ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెలికి తీసే కార్యక్రమంలో భాగంగా ఫుట్బాల్ లీగ్ పోటీలను నిర్వహించడం ఎంతో గర్వకారణం అని దీనిని క్రీడాకారులందరూ ఉపయోగించుకొని, వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని తెలిపారు.

క్లబ్ హెడ్ కోచ్ మద్ది కరుణాకర్ మాట్లాడుతూ.. ఈ లీగ్స్ కాంపిటీషన్స్ ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహిస్తున్నామని, ఈ లీగ్స్ లో పాల్గొన్న క్రీడాకారులు ఎంతో నైపుణ్యంతో, మెలకువలు నేర్చుకొని ఫుట్బాల్ క్రీడలో రాటుదేరుతున్నారని, ఇది రాబోయే రోజులలో జాతీయస్థాయిలో రాణించడానికి ఎంతో ఉపయోగపడుతుందని, మారుమూల గ్రామ ఫుట్బాల్ క్రీడాకారులు కూడా ఈ పోటీల్లో పాల్గొనటానికి ముందుకు రావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యావర్, గణేష్, శ్రవణ్, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

NLG: మోడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు కి ఘన స్వాగతం

మోడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కుంభం రామ్ రెడ్డి, ఈ రోజు నల్గొండ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా, చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన క్లబ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు పుష్పగుచ్చం అందజేసి ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కుంభం రామ్ రెడ్డి మాట్లాడుతూ.. మోడరన్ కబడ్డీ అసోసియేషన్ ను భారతదేశ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించే విధంగా మా యొక్క కార్యచరణ ఉంటుందని అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క అసోసియేషన్ నిర్మాణం చేసే ప్రక్రియను మొదలు పెట్టామని తెలియజేశారు.

ప్రపంచ సుందరిగా క్రిష్టినా పిస్కోవా

ముంబాయి :

చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా 71వ ప్రపంచ సుందరి టైటిల్‌ను గెలుచుకుంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం రాత్రి జరిగిన మిస్ వరల్డ్ 2024 ఫైనల్‌ పోటీల్లో కిరీటం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాలకుపైగా చెందిన ముద్దుగుమ్మలు ఈ పోటీలో పాల్గొనగా, చివరగా చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.

గతేడాది విజేత పోలాండ్‌కు చెందిన కరోలినా బియా లావ్‌స్కా తన వారసురాలికి కిరీటాన్ని అందజేశారు. లెబనాన్‌కు చెందిన యాస్మినా జైటౌన్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.

TS: మహిళలకు రూ.2,500 అమలు ముహూర్తం ఖరారు: సీఎం రేవంత్ రెడ్డి

మహిళలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. మరో రెండు గ్యారంటీల అమలుకు నిర్ణయించారు. ఈ నెల 12న జరిగే కేబినెట్ సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో.. ఈ లోగానే పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థికసాయం పథకం అమలుకు రేవంత్ డిసైడ్ అయ్యారు. రేపు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించనున్నారు.

మరో రెండు గ్యారంటీల అమలు

తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను హామీగా ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగింటిని ప్రారంభించింది. మిగిలిన రెండు గ్యారెంటీలను అమలు చేయటానికి రంగం సిద్ధం చేసింది. రేపు (సోమవారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 'ఇందిరమ్మ ఇల్లు' పథకాన్ని ప్రారంభించనున్నారు. మంగళవారం సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో దాదాపు లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలతో నిర్వహించనున్న భారీ సదస్సులో.. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థికసాయం పథకంపై సీఎం కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఎంత మంది లబ్దిదారులు ఉన్నారు..ఎంత మేర ఆర్దిక భారం పడుతుందనే అంశం పైన అంచనాకు వచ్చారు.

మంత్రివర్గ భేటీలో నిర్ణయం

ఈ నెల 14 లేదా 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో, ఈ నెల 12న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మహాలక్ష్మి పథకం కింద రూ 2500 చొప్పున అందించే భృతి అమలు పై నిర్ణయం ప్రకటించనున్నారు. అదే రోజు పరేడ్‌ గ్రౌండ్స్‌ సభలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించనున్నారు. లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలతో ప్రభుత్వం నిర్వహించనున్న ఈ సదస్సులోనే.. మహిళలకు వడ్డీ లేని రుణాలిచ్చే అంశంపైనా సీఎం ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. దీనిపైనా క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు చికిత్స, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను ప్రారంభించింది.

కీలక నిర్ణయాల దిశగా

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున అందించే పథకం అమలుపై సంబంధిత అధికారులు కసరత్తు వేగవంతం చేసారు. ఈ సారి మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్సీల నియామకం పైన నిర్ణయం తీసుకోనున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసాను తీసుకురానుంది. ఈ మేరకు పథకం అమలులో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. ధరణి పోర్టల్‌లో సమస్యలు, లే-అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎస్‌) తదితర అంశాలూ క్యాబినెట్‌ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే, లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకోవటం పైనే రేవంత్ గురి పెట్టారు. దీంతో, ఎన్నికల ముందు జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకొనే నిర్ణయాల పైన ఉత్కంఠ నెలకొంది.

NLG: రేపు దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ జిల్లా:

రేపు దేవరకొండ నియోజకవర్గంలో రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వివిధ అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేస్తారు.

మంత్రి పర్యటన వివరాలు:

ఉదయం 10.30 గంటలకు చింతపల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ మరియు సెంట్రల్ లైటింగ్ పనులకు శంఖుస్థాపన.

ఉదయం 11 గంటలకు చింతపల్లి సాయిబాబా గుడిలో పూజా కార్యక్రమం.

మధ్యాహ్నం 12 గంటలకు దేవరకొండ పట్టణంలో డిండి X రోడ్డు నుండి మైనంపల్లి బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ మరియు సెంట్రల్ లైటింగ్ పనులకు శంఖుస్థాపన.

TS: ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున మండలంలోని లోక్యతండా జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగా త్రులను ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

SB NEWS TELANGANA, INDIAN NATIONAL MEDIA

TS: కొండగట్టు ఘాట్ రోడ్ లో ఆటో బోల్తా పడి 11 మందికి తీవ్ర గాయాలు

జగిత్యాల జిల్లా: కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా పడిన ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఘాట్ రోడ్లో కిందకు దిగుతున్న సమయంలో ఆటో అదుపు తప్పి, బోల్తా పడడంతో 11 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

స్థానికులు స్పందించి అంబులెన్స్ ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఆటో లోని ప్రయాణికులు మంచిర్యాల జిల్లా మ్యాదరిపేట, లక్షేట్ పేట వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.