/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: లీగ్ పోటీలను క్రీడాకారులందరూ వినియోగించుకోవాలి: Sk రహీం Mane Praveen
NLG: లీగ్ పోటీలను క్రీడాకారులందరూ వినియోగించుకోవాలి: Sk రహీం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ క్రీడాకారుల అభివృద్ధి కొరకు క్రీడాకారులను వెలికి తీసే పనిలో భాగంగా, మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం CSL ఫుట్బాల్ లీగ్స్ నిర్వహిస్తున్నామని తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ పాల గిరిబాబు తెలిపారు.

ఈ లీగ్స్ పోటీలలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి 70 మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇది క్లబ్ హెడ్ కోచ్ మద్ది కరుణాకర్ సారధ్యంలో ప్రతి ఆదివారం కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్ దగ్గుపాటి విమల క్రీడాకారులకు అరటి పండ్లను స్పాన్సర్ చేశారు. ఈ లీగ్స్ పోటీల కార్యక్రమానికి ఫ్రీడమ్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు SK రహీం ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రీడాకారులకు అరటి పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రహీం మాట్లాడుతూ.. ఫుట్బాల్ క్రీడాకారులని ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెలికి తీసే కార్యక్రమంలో భాగంగా ఫుట్బాల్ లీగ్ పోటీలను నిర్వహించడం ఎంతో గర్వకారణం అని దీనిని క్రీడాకారులందరూ ఉపయోగించుకొని, వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని తెలిపారు.

క్లబ్ హెడ్ కోచ్ మద్ది కరుణాకర్ మాట్లాడుతూ.. ఈ లీగ్స్ కాంపిటీషన్స్ ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహిస్తున్నామని, ఈ లీగ్స్ లో పాల్గొన్న క్రీడాకారులు ఎంతో నైపుణ్యంతో, మెలకువలు నేర్చుకొని ఫుట్బాల్ క్రీడలో రాటుదేరుతున్నారని, ఇది రాబోయే రోజులలో జాతీయస్థాయిలో రాణించడానికి ఎంతో ఉపయోగపడుతుందని, మారుమూల గ్రామ ఫుట్బాల్ క్రీడాకారులు కూడా ఈ పోటీల్లో పాల్గొనటానికి ముందుకు రావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యావర్, గణేష్, శ్రవణ్, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

NLG: మోడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు కి ఘన స్వాగతం

మోడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కుంభం రామ్ రెడ్డి, ఈ రోజు నల్గొండ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా, చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన క్లబ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు పుష్పగుచ్చం అందజేసి ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కుంభం రామ్ రెడ్డి మాట్లాడుతూ.. మోడరన్ కబడ్డీ అసోసియేషన్ ను భారతదేశ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించే విధంగా మా యొక్క కార్యచరణ ఉంటుందని అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క అసోసియేషన్ నిర్మాణం చేసే ప్రక్రియను మొదలు పెట్టామని తెలియజేశారు.

ప్రపంచ సుందరిగా క్రిష్టినా పిస్కోవా

ముంబాయి :

చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా 71వ ప్రపంచ సుందరి టైటిల్‌ను గెలుచుకుంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం రాత్రి జరిగిన మిస్ వరల్డ్ 2024 ఫైనల్‌ పోటీల్లో కిరీటం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాలకుపైగా చెందిన ముద్దుగుమ్మలు ఈ పోటీలో పాల్గొనగా, చివరగా చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.

గతేడాది విజేత పోలాండ్‌కు చెందిన కరోలినా బియా లావ్‌స్కా తన వారసురాలికి కిరీటాన్ని అందజేశారు. లెబనాన్‌కు చెందిన యాస్మినా జైటౌన్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.

TS: మహిళలకు రూ.2,500 అమలు ముహూర్తం ఖరారు: సీఎం రేవంత్ రెడ్డి

మహిళలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. మరో రెండు గ్యారంటీల అమలుకు నిర్ణయించారు. ఈ నెల 12న జరిగే కేబినెట్ సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో.. ఈ లోగానే పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థికసాయం పథకం అమలుకు రేవంత్ డిసైడ్ అయ్యారు. రేపు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించనున్నారు.

మరో రెండు గ్యారంటీల అమలు

తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను హామీగా ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగింటిని ప్రారంభించింది. మిగిలిన రెండు గ్యారెంటీలను అమలు చేయటానికి రంగం సిద్ధం చేసింది. రేపు (సోమవారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 'ఇందిరమ్మ ఇల్లు' పథకాన్ని ప్రారంభించనున్నారు. మంగళవారం సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో దాదాపు లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలతో నిర్వహించనున్న భారీ సదస్సులో.. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థికసాయం పథకంపై సీఎం కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఎంత మంది లబ్దిదారులు ఉన్నారు..ఎంత మేర ఆర్దిక భారం పడుతుందనే అంశం పైన అంచనాకు వచ్చారు.

మంత్రివర్గ భేటీలో నిర్ణయం

ఈ నెల 14 లేదా 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో, ఈ నెల 12న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మహాలక్ష్మి పథకం కింద రూ 2500 చొప్పున అందించే భృతి అమలు పై నిర్ణయం ప్రకటించనున్నారు. అదే రోజు పరేడ్‌ గ్రౌండ్స్‌ సభలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించనున్నారు. లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలతో ప్రభుత్వం నిర్వహించనున్న ఈ సదస్సులోనే.. మహిళలకు వడ్డీ లేని రుణాలిచ్చే అంశంపైనా సీఎం ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. దీనిపైనా క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు చికిత్స, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను ప్రారంభించింది.

కీలక నిర్ణయాల దిశగా

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున అందించే పథకం అమలుపై సంబంధిత అధికారులు కసరత్తు వేగవంతం చేసారు. ఈ సారి మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్సీల నియామకం పైన నిర్ణయం తీసుకోనున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసాను తీసుకురానుంది. ఈ మేరకు పథకం అమలులో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. ధరణి పోర్టల్‌లో సమస్యలు, లే-అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎస్‌) తదితర అంశాలూ క్యాబినెట్‌ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే, లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకోవటం పైనే రేవంత్ గురి పెట్టారు. దీంతో, ఎన్నికల ముందు జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకొనే నిర్ణయాల పైన ఉత్కంఠ నెలకొంది.

NLG: రేపు దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ జిల్లా:

రేపు దేవరకొండ నియోజకవర్గంలో రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వివిధ అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేస్తారు.

మంత్రి పర్యటన వివరాలు:

ఉదయం 10.30 గంటలకు చింతపల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ మరియు సెంట్రల్ లైటింగ్ పనులకు శంఖుస్థాపన.

ఉదయం 11 గంటలకు చింతపల్లి సాయిబాబా గుడిలో పూజా కార్యక్రమం.

మధ్యాహ్నం 12 గంటలకు దేవరకొండ పట్టణంలో డిండి X రోడ్డు నుండి మైనంపల్లి బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ మరియు సెంట్రల్ లైటింగ్ పనులకు శంఖుస్థాపన.

TS: ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున మండలంలోని లోక్యతండా జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగా త్రులను ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

SB NEWS TELANGANA, INDIAN NATIONAL MEDIA

TS: కొండగట్టు ఘాట్ రోడ్ లో ఆటో బోల్తా పడి 11 మందికి తీవ్ర గాయాలు

జగిత్యాల జిల్లా: కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా పడిన ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఘాట్ రోడ్లో కిందకు దిగుతున్న సమయంలో ఆటో అదుపు తప్పి, బోల్తా పడడంతో 11 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

స్థానికులు స్పందించి అంబులెన్స్ ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఆటో లోని ప్రయాణికులు మంచిర్యాల జిల్లా మ్యాదరిపేట, లక్షేట్ పేట వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

NLG: నల్లగొండ ఎం.పీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి ని ప్రకటించిన కాంగ్రెస్

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ 36 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం నుండి నలుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది.

నల్లగొండ పార్లమెంటు అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సురేష్ కుమార్ షట్కర్, చేవెళ్ల సునీత మహేందర్ రెడ్డి, మహబూబాబాద్ బలరాం నాయక్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుందూరు రఘు రఘువీర్ రెడ్డి ని నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ జాబితా విడుదల చేసింది.

NLG: రూ.326 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ పట్టణంలో రూ. 326 కోట్ల వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పానగల్ ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. నల్గొండ చుట్టూ రూ. 700 కోట్ల వ్యయంతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి వచ్చే నెలలోనే టెండర్లు పిలువనున్నట్లు వెల్లడించారు. 

ముషంపల్లి డబల్ రోడ్డు కు రూ. 100 కోట్ల ఇప్పటికే కేటాయించామని, యువతకు ఉపాధి కల్పనలో భాగంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 6000 మంది విద్యార్థులతో జాబ్ మేళ నిర్వహించామన్నారు. రాబోయే రెండు నెలల్లో మరొక జాబ్ మేళా నిర్వహిస్తామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.

ఎస్ ఎల్ బి సి కాల్వ లైనింగ్ పనులను చేస్తున్నామని, సొరంగ మార్గం పనులు పూర్తి చేయడాని నిధులను మంజూరు చేయించామని, త్వరలోనే ఆ పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి తెలపారు. ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిరుపేదలకు సబ్సిడీ భోజన పథకం అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రారంభించారు. హరే కృష్ణ మూమెంట్ ఫౌండేషన్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిరుపేదల కు సబ్సిడీ భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

NLG: నల్లగొండ పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నల్లగొండ: పట్టణంలోని సూర్య నగర్ కాలనీలో మహిళలు శుక్రవారం 'అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని' ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆటల పోటీలు నిర్వహించుకుని ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాండ్రల స్వాతి, సుంకరబోయిన యశోద, యమున, మహేశ్వరి, పద్మ, పారిజాత, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.