/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: మహిళలకు రూ.2,500 అమలు ముహూర్తం ఖరారు: సీఎం రేవంత్ రెడ్డి Mane Praveen
TS: మహిళలకు రూ.2,500 అమలు ముహూర్తం ఖరారు: సీఎం రేవంత్ రెడ్డి

మహిళలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. మరో రెండు గ్యారంటీల అమలుకు నిర్ణయించారు. ఈ నెల 12న జరిగే కేబినెట్ సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో.. ఈ లోగానే పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థికసాయం పథకం అమలుకు రేవంత్ డిసైడ్ అయ్యారు. రేపు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించనున్నారు.

మరో రెండు గ్యారంటీల అమలు

తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను హామీగా ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగింటిని ప్రారంభించింది. మిగిలిన రెండు గ్యారెంటీలను అమలు చేయటానికి రంగం సిద్ధం చేసింది. రేపు (సోమవారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 'ఇందిరమ్మ ఇల్లు' పథకాన్ని ప్రారంభించనున్నారు. మంగళవారం సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో దాదాపు లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలతో నిర్వహించనున్న భారీ సదస్సులో.. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థికసాయం పథకంపై సీఎం కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఎంత మంది లబ్దిదారులు ఉన్నారు..ఎంత మేర ఆర్దిక భారం పడుతుందనే అంశం పైన అంచనాకు వచ్చారు.

మంత్రివర్గ భేటీలో నిర్ణయం

ఈ నెల 14 లేదా 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో, ఈ నెల 12న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మహాలక్ష్మి పథకం కింద రూ 2500 చొప్పున అందించే భృతి అమలు పై నిర్ణయం ప్రకటించనున్నారు. అదే రోజు పరేడ్‌ గ్రౌండ్స్‌ సభలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించనున్నారు. లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలతో ప్రభుత్వం నిర్వహించనున్న ఈ సదస్సులోనే.. మహిళలకు వడ్డీ లేని రుణాలిచ్చే అంశంపైనా సీఎం ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. దీనిపైనా క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు చికిత్స, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను ప్రారంభించింది.

కీలక నిర్ణయాల దిశగా

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున అందించే పథకం అమలుపై సంబంధిత అధికారులు కసరత్తు వేగవంతం చేసారు. ఈ సారి మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్సీల నియామకం పైన నిర్ణయం తీసుకోనున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసాను తీసుకురానుంది. ఈ మేరకు పథకం అమలులో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. ధరణి పోర్టల్‌లో సమస్యలు, లే-అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎస్‌) తదితర అంశాలూ క్యాబినెట్‌ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే, లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకోవటం పైనే రేవంత్ గురి పెట్టారు. దీంతో, ఎన్నికల ముందు జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకొనే నిర్ణయాల పైన ఉత్కంఠ నెలకొంది.

NLG: రేపు దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ జిల్లా:

రేపు దేవరకొండ నియోజకవర్గంలో రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వివిధ అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేస్తారు.

మంత్రి పర్యటన వివరాలు:

ఉదయం 10.30 గంటలకు చింతపల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ మరియు సెంట్రల్ లైటింగ్ పనులకు శంఖుస్థాపన.

ఉదయం 11 గంటలకు చింతపల్లి సాయిబాబా గుడిలో పూజా కార్యక్రమం.

మధ్యాహ్నం 12 గంటలకు దేవరకొండ పట్టణంలో డిండి X రోడ్డు నుండి మైనంపల్లి బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ మరియు సెంట్రల్ లైటింగ్ పనులకు శంఖుస్థాపన.

TS: ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున మండలంలోని లోక్యతండా జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగా త్రులను ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

SB NEWS TELANGANA, INDIAN NATIONAL MEDIA

TS: కొండగట్టు ఘాట్ రోడ్ లో ఆటో బోల్తా పడి 11 మందికి తీవ్ర గాయాలు

జగిత్యాల జిల్లా: కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా పడిన ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఘాట్ రోడ్లో కిందకు దిగుతున్న సమయంలో ఆటో అదుపు తప్పి, బోల్తా పడడంతో 11 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

స్థానికులు స్పందించి అంబులెన్స్ ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఆటో లోని ప్రయాణికులు మంచిర్యాల జిల్లా మ్యాదరిపేట, లక్షేట్ పేట వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

NLG: నల్లగొండ ఎం.పీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి ని ప్రకటించిన కాంగ్రెస్

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ 36 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం నుండి నలుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది.

నల్లగొండ పార్లమెంటు అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సురేష్ కుమార్ షట్కర్, చేవెళ్ల సునీత మహేందర్ రెడ్డి, మహబూబాబాద్ బలరాం నాయక్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుందూరు రఘు రఘువీర్ రెడ్డి ని నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ జాబితా విడుదల చేసింది.

NLG: రూ.326 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ పట్టణంలో రూ. 326 కోట్ల వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పానగల్ ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. నల్గొండ చుట్టూ రూ. 700 కోట్ల వ్యయంతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి వచ్చే నెలలోనే టెండర్లు పిలువనున్నట్లు వెల్లడించారు. 

ముషంపల్లి డబల్ రోడ్డు కు రూ. 100 కోట్ల ఇప్పటికే కేటాయించామని, యువతకు ఉపాధి కల్పనలో భాగంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 6000 మంది విద్యార్థులతో జాబ్ మేళ నిర్వహించామన్నారు. రాబోయే రెండు నెలల్లో మరొక జాబ్ మేళా నిర్వహిస్తామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.

ఎస్ ఎల్ బి సి కాల్వ లైనింగ్ పనులను చేస్తున్నామని, సొరంగ మార్గం పనులు పూర్తి చేయడాని నిధులను మంజూరు చేయించామని, త్వరలోనే ఆ పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి తెలపారు. ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిరుపేదలకు సబ్సిడీ భోజన పథకం అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రారంభించారు. హరే కృష్ణ మూమెంట్ ఫౌండేషన్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిరుపేదల కు సబ్సిడీ భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

NLG: నల్లగొండ పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నల్లగొండ: పట్టణంలోని సూర్య నగర్ కాలనీలో మహిళలు శుక్రవారం 'అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని' ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆటల పోటీలు నిర్వహించుకుని ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాండ్రల స్వాతి, సుంకరబోయిన యశోద, యమున, మహేశ్వరి, పద్మ, పారిజాత, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

NLG: శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి ఆలయంలో మహా యజ్ఞం

నల్లగొండ జిల్లా:

నాంపల్లి: మండల కేంద్రంలోని శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి వారి ఆలయంలో, శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, శివాలయం లో స్వామివారి మహా యజ్ఞాన్ని వేదమంత్రాలతో.. పండితులు రామకోటి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ దయానంద గిరి స్వామి, నారాయణపురం ఆశ్రమం శంకరానంద గిరిస్వామి, గుంటూరు ఆశ్రమం పూర్ణానంద స్వామి, ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిపించారు. శివలింగాలకు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారి యాజ్ఞాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి అనంతరెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, వీరమల్ల శ్వేతా నాగరాజు, దోటి పరమేష్, పెద్దిరెడ్డి రాజు, అల్లంపల్లి ఆనంద్ కుమార్, కోట రఘు నందన్, ఉప్పల సత్యనారాయణ, నేర్లకంటి కేశవులు, కానబోయిన ఈశ్వరయ్య, గుర్రం కైలాసమ్మ, సంగెం పరంధాములు, పూల యాదగిరి, ఈదశేఖర్, పానుగంటి పెద్ద వెంకటయ్య, తిరుమణి శేఖర్, పెద్దిరెడ్డి జంగారెడ్డి, నాంపల్లి చంద్రమౌళి, పూల చిన్న వెంకటయ్య, కంశెట్టి చత్రపతి, సుదర్శన చారి, కర్నాటి నాగరాజు, రాందాస్ తండా రాజ్య గురుస్వామి, ఎస్కే కాజాబి,గాలేంక సంతోష వినోద్ కుమార్, కాంశెట్టి అంజూర శ్రీనివాస్, నక్క భువనేశ్వర్, పానుగంటి మహేష్, కంశెట్టి శ్రీకాంత్, గౌరు కిరణ్, కోరే శివ, సింగారపు గిరి, పూల శ్రీను మారయ్య గుర్రం శ్రీరాములు, పానుగంటి లక్ష్మీపతి, తదితరులు పాల్గొన్నారు.

NLG: వ్యాయామ ఉపాధ్యాయనీయులకు, జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణులకు సన్మానం

నల్లగొండ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో, పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయునీలు దగ్గుపాటి విమల, నారాయణ కవిత, కందుకూరి శైలజ లను మరియు జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొన్న మద్ది కీర్తన, అప్పల సోని, మద్ది అమూల్య లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యులు బొమ్మపాల గిరిబాబు, ఫుట్బాల్ కోచ్ కరుణాకర్, ఖో ఖో కోచ్ మధు, సైదులు, గణేష్, తదితరులు  పాల్గొన్నారు.
YDD: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా బెల్టు షాపులను నివారించేందుకు ప్రతిజ్ఞ చేసిన వెన్ రెడ్డి రాజు

యాదాద్రి జిల్లా, చౌటుప్పల్:

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా బెల్టు షాపులను నివారించేవరకు విశ్రమించ వద్దని తెలంగాణ మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు కోరారు.

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్ల కార్డులు పట్టుకొని బెల్టు షాపులను నివారిస్తామని నినదించి, ప్రతిజ్ఞ చేశారు.

దిక్కులు పిక్కటిల్లేలా బెల్టు షాపులను నివారిద్దాం- కుటుంబాలను కాపాడుకుందాం అని పెద్ద ఎత్తున నినాదం చేశారు. బెల్టు షాపుల దిష్టిబొమ్మను దగ్దం చేశారు.

ఈ సందర్బంగా వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో, మునుగోడు గడ్డ బెల్టు షాపులు నివారిస్తూ పునీతం అవుతుందన్నారు. ఒక్క రాజగోపాల్ రెడ్డి పిలుపుతో బెల్టు షాపు నిర్వాహకులు తట్ట బుట్ట సదురుకొని చిత్తగించారని, ఇది మహిళాల విజయమని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక స్వావలంబనతో మహిళలు అన్నీ రంగాలలో ముందుకు వెళ్లాలని, మహిళలు తలుచుకుంటే సాదించలేనిది ఏది లేదన్నారు. అన్నీ రంగాలకు సంబందించిన మహిళలను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమములో ఉప వైద్య అధికారి డా. యశోదా, మూన్సిపల్ కమీషనర్ యన్. వేంకటేశ్వర నాయక్, తహశీల్దార్ యస్. హరి కృష్ణ, కౌన్సిలర్లు కసర్ల మంజుల,

శ్రీనివాస్ రెడ్డి, కామిశెట్టి శైలజ భాస్కర్, సందగల్ల విజయ సతీష్, బాత్తుల రాజ్యలక్ష్మి స్వామి, కొయ్యడ సైదులు, పోలోజు శ్రీదర్ బాబు, విద్యా సంస్థల చైర్మెన్ ఉజ్జిని మంజుల, తంగడపల్లి ప్రదానోపాద్యాయులు భార్గవి, వివిద రంగాల అధికారులు కవిత, శోభారాణి, ఆర్పీలు, అంగన్వాడీ సిబ్బంది మరియు ఆశ వర్కర్ల తో పాటు భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు.