NLG: ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై కళాశాలకు మంచి పేరు తేవాలి: ఎస్సై నాగరాజు

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం, బీకాం ప్రథమ సంవత్సర విద్యార్థులకు స్వాగతం మరియు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న టూ టౌన్ ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ.. విద్యార్థినిలు, కళాశాలలో అన్ని వసతులు వినియోగించుకొని ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులై, కళాశాలకు మంచి పేరు తేవాలని, అలాగే బీకాం ప్రథమ సంవత్సర విద్యార్థినులు.. రెండవ, మూడవ సంవత్సర విద్యార్థుల నుంచి అన్ని విషయాలపై అవగాహన చేసుకుని మంచి మార్కులతో పాస్ కావాలని సూచించారు.

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గన్ శ్యామ్ మాట్లాడుతూ.. విద్యార్థులందరికీ కళాశాలలో అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నాయని, ఉత్తమ విద్యను బోధించేందుకు మంచి నిపుణులైన అధ్యాపకులు ఉన్నారని, కళాశాలలో మంచి ఆటస్థలం, గ్రంథాలయం మరియు ఇతరత్రా అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయని, విద్యార్థులు వాటిని వినియోగించుకొని కళాశాలకు, తద్వారా తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీకాం డిపార్ట్మెంట్ హెడ్ జబీన్, అధ్యాపకులు ఎస్. రాజు, శైలజ, సుధాకర్, రేణుక, రమేష్, మరియు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ దేవవాని, భాస్కర్ రెడ్డి, అపర్ణ, చతుర్వేది, రాజశేఖర్, మల్లికార్జున్, శంకర్, హసేన, గ్రంథాల శాఖ అధ్యాపకులు డాక్టర్ సుంకర రాజారామ్, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.
Mar 02 2024, 07:56