/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz గోదావరిఖని బస్టాండ్ లో ఎన్ఎస్ఎస్ వాలంటరీస్ సేవలు Raghu ram reddy
గోదావరిఖని బస్టాండ్ లో ఎన్ఎస్ఎస్ వాలంటరీస్ సేవలు

గోదావరిఖని బస్టాండ్ లో ఎన్ఎస్ఎస్ వాలంటరీస్ సేవలు భేష్ అనిపించేలా ఉన్నాయి.

ప్రభుత్వ పీజి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ జహీర్ ఆధ్వ ర్యంలో లెక్చరర్ సంగీత ఆధ్వర్యం లో , ఎన్ఎస్ఎస్ కాలేజీ పిల్లలు గోదారిఖని మేడారం జాతర క్యాంప్ లో ప్రయాణికులకు ఇబ్బందు లు కలుగ కుండా వాలం టైర్లుగా సేవలు అందిస్తు న్నారు.

అంతకు ముందు డిపో మేనేజర్ నాగభూషణం, అసిస్టెంట్ మేనేజర్ గీత కృష్ణ, సంధ్యారాణి పలు విభాగాలలో సేవలు అందించాలని సూచిం చారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసి సిబ్బంది కేఆర్ రెడ్డి, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

YCP Rebel MLAs: మారని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల నిర్ణయం... ఈసారి కూడా

అమరావతి : అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ కార్యాలయం ఇచ్చిన నోటీసులపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు (YCP Rebel MLAs) స్పందించలేదు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే..అయితే విచారణకు హాజరుకాకూడదని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే లు నిర్ణయించారు. తుది విచారణకు హాజరుకాకపోతే స్పీకర్ తీసుకునే నిర్ణయానికి బాధ్యులు అవుతారని నోటీసుల్లో పేర్కొన్నారు. పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లు, చానల్స్‌లో వచ్చిన విజువల్స్‌ను ఆయా సంస్థల యాజమాన్యాలు సర్టిఫై చేయాల్సి ఉందని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గత విచారణ సందర్భంగా ఆనం తన వాదనలు వినిపించారు. ఆయా సంస్థలు సర్టిఫై చేయకుండా వారిని ఎలా పరిగణలోకి తీసుకుంటారని రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. ఈరోజు తాము హాజరుకావడం లేదని స్పీకర్ కార్యాలయానికి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు సమాచారం పంపించారు.

టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు సైతం..

మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో విచారణకు రాకపోవడంతో వారిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్ డోలా బాలవీరంజనేయ స్వామి కోరారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయానికి వెళ్లి స్వామి విజ్ఞప్తి చేశారు.

Pawan Kalyan: పార్టీ నిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటన.. జనసేనాని కీలక వ్యాఖ్యలు

జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్‌..

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు పవన్‌.. మన కూటమి అధికారంలోకి వస్తోందని స్పష్టం చేసిన ఆయన.. క్షేత్రస్థాయి నుంచి మన బలాన్ని సద్వినియోగపరుకొంటూ కూటమిని గెలుపు దిశగా తీసుకెళ్లేందుకు ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగతంగా నా గెలుపు గురించి కాదు.. సమిష్టిగా గెలుపు కోసమే తొలి నుంచి నా వ్యూహం, అడుగులు ఉంటున్నాయని తెలిపారు.. 

జనసేన కోసం తపించి పని చేసిన ప్రతీ ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు పవన్‌ కల్యాణ్‌.. 2019 తర్వాత పార్టీ బలంగా నిలిచేందుకు దోహదపడ్డ నాయకులకు అండగా ఉంటామని చెప్పారు. ప్రజారాజ్యం సమయంలో ఉన్న ఒక చిన్న పరిచయంతో ఒక నాయకుడికి 2014 తర్వాత టీటీడీ సభ్యుడిగా రెండు పర్యాయాలు పదవి ఇప్పించగలిగాను.. అప్పటికీ ఆయన మన పార్టీలోకి రాలేదని ఉదహరిస్తూ.. జనసేన కోసం నిలిచిన ఎవ్వరినీ విస్మరించేది లేదు అన్నారు. ఇప్పటి ఎన్నికల్లో స్థానాలు మాత్రమే కాకుండా కూటిమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చే అవకాశాలూ దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో కావచ్చు.. పీఏసీఎస్‌ల్లో, ఇతర కీలక నామినేటెడ్‌ పదవుల్లో సముచిత స్థానాలు మనకు దక్కుతాయి.. తద్వారా అందరినీ బలోపేతం చేసి ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. మూడింట ఒక వంతు పదువులు దక్కించుకుందాం అన్నారు. ఏపీకి సుస్థిర పాలన అవసరమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని, అలాంటి సుస్థిర పాలన మన కూటిమి అందించగలదని ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు స్పష్టంగా చెబుతున్నారని తెలిపారు.. ఇక, పార్టీ పక్షాన ఎన్నికల నిర్వహణ కోసం రూ.10 కోట్లు తన స్వార్థితాన్ని నిధిగా ఇవ్వనున్నట్టు ఈ సమావేశంలో ప్రకటించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన: హీరో సోనూ సూద్

తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆర్థిక సాయం చేయడా నికైనా రెడీగా ఉంటాన న్నారు.

బాలీవుడ్ నటుడు సోనూ సూద్. శంషాబాద్ మున్సి పాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ప్రభుత్వ పాఠ శాల భవనాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి సోనూసూద్ సోమ‌వారం నాడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు ఏదైనా సహాయం కోరితే తాను తప్పకుండా చేస్తానన్నారు.

పంజాబ్ కు చెందిన వ్యక్తినయినా బాలీవుడ్ సినిమాలు చేయకున్నా.. తెలుగులో సినిమాలు చేశానని చెప్పారు సోనూ సూద్. తన భార్య తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్త న్నారు.

తనకు తెలుగు రాష్ట్రాలతో ప్రత్యేక అనుభందం ఉంద న్నారు .ఈ రోజు శంషాబాద్ పరిధిలోని సిద్ధాంతి గ్రామంలో ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంద న్నారు.

ఇంత సంతోషం టాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో నటించినప్పుడు కూడా లేదన్నారు. సామాజిక సేవకు ఉన్న ప్రత్యేకత వేరన్నారు.

నేడు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి పొంగులేటి

రెండు సంవత్సరాల కొకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతంగా జరుగు తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. 70 రోజుల క్రితం మార్పు కోసం ప్రజల దీవెనతో సమ్మక్క, సారక్క తల్లుల దీవెనలతో తెలం గాణాలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో స్థానిక మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కనీ వినీ ఎరుగని రీతిలో జాతర జరుగుతుందని కొనియా డారు.

ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకోవడం జరిగిందని, ఒక పక్క అసెంబ్లీ నడు స్తున్న భక్తుల సౌకర్యం కోసం మంత్రి సీతక్క నిత్యం జాతర పనులను పర్యవేక్షి స్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు.

అంటే ప్రభుత్వానికి, ప్రజలు, భక్తుల పట్ల ఎంతో చిత్త శుద్ది ఉందో తెలుస్తుందని మెచ్చుకున్నారు.గత ప్రభుత్వం మేడారం జాతరకు 75 కోట్లు ఖర్చుపెడితే ఈ ప్రభుత్వం నష్టాలలో ఉన్నా రూ.110 కోట్లు మంజూరు చేసిందని, ఈ నెల 21 నుంచి 26 వరకు ఘనంగా జాతర నిర్వహిస్తున్నామని, ఇంకా 2 కోట్ల మంది భక్తులు జాతరకు తరలి రానున్నా రని, భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

గత ప్రభుత్వంలో 3వేల బస్సులు నడిపితే, ఈ ప్రభుత్వంలో 6వేల ఆర్టిసి బస్సులు జాతరకు నడుపు తున్నామని, ఎన్నికల హామీలలో చెప్పిన విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, జీరో టిక్కెట్టుపై ఇప్పటి వరకు 17 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని స్పషటం చేశారు.

జాతర నిర్వహణకు 16 వేల మంది అధికారులు పనిచే స్తున్నారని, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపి 4 వేల మంది పారిశుద్ధ్య కార్మికు లను నియమించామని, గతం మేడారం జాతరపై అను భవం ఉన్న ఐదుగురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారు లను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని పొంగులేటి పేర్కొన్నారు...

ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచిత విద్య

ఆంధ్రప్రదేశ్‌లో 2024-2025 విద్యా సంవత్సరానికి గానూ ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు సంబం ధించి పాఠశాల విద్య శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

అనాథ, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్‌ కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొంది.

అర్హులైన విద్యార్థులు పాఠశాల విద్య శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ వరకూ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవకాశం కల్పించింది.

ఏప్రిల్‌ 1వ తేదీన మొదటి విడత, ఏప్రిల్‌ 15న రెండో విడత ఫలితాలు ప్రకటిస్తారు.

CPI Narayana: అహంభావం వల్లే కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు: సీపీఐ నారాయణ

హైదరాబాద్: భారాస అధినేత కేసీఆర్ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు..

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోయినట్లు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అనడం వివేకవంతుడి లక్షణం కాదన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం పద్ధతి కాదని చెప్పారు.

''కేసీఆర్ ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేశారు? అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదు? కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ కోరాలని తెలంగాణ భాజపా తెలివిగా వ్యవహరిస్తోంది. కేసు అప్పగిస్తే మేనేజ్‌ చేయాలనుకుంటున్నారు. కేసీఆర్‌ను ఆ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తోంది. వేల కోట్ల రూపాయల అవినీతికి ఆయన బాధ్యుడు. జరిగిన అవినీతిపై విచారణ చేయించాలి. భారాస నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు గడవకముందే విమర్శలు చేయడం ఆ పార్టీ పతనానికి నాంది'' అని వ్యాఖ్యానించారు.

Rajadhani Files: అర్థంతరంగా 'రాజధాని ఫైల్స్‌' నిలిపివేత..

అమరావతి: 'రాజధాని ఫైల్స్‌' (Rajadhani Files) సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. విజయవాడలోని ట్రెండ్‌సెట్‌ మాల్‌లో అర్థంతరంగా నిలిపివేశారు..

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చిత్రాన్ని ప్రదర్శించవద్దని నోటీసులు ఇచ్చారు. సినిమాను మధ్యలో ఆపివేయడంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు కొని చూస్తుంటే మధ్యలో ఎలా నిలిపివేస్తారని నిలదీశారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతోనే ఆపేశామని అధికారులు పేర్కొనగా.. ఆర్డర్‌ కాపీని చూపించాలని పట్టుబట్టారు..

మరోవైపు గుంటూరు జిల్లా ఉండవల్లిలో సినిమా ప్రదర్శన నిలిపివేతపై రైతులు ధర్నాకు దిగారు. రామకృష్ణ థియేటర్‌ వద్ద తెదేపా నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సినిమాను నిలిపివేసినట్లు యాజమాన్యం తెలిపింది..

TS Council: తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో చర్చ

హైదరాబాద్ : శాసనమండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు..

భూమి, నీటిని తల్లితో పోలుస్తాం, అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఓ ప్రొఫెసర్ తెలంగాణ తల్లి ప్రతిమను రూపొందించారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఓ సామాజికవర్గ దొరసాని గుర్తుకు వస్తుందని ప్రభుత్వ పెద్దలు చెప్పడం సమంజసం కాదని దేశపతి శ్రీనివాస్ తెలిపారు.

మంత్రి శ్రీధర్ సమాధానమిస్తూ... కాకతీయ తోరణం, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తామన్నారు. కాకతీయులు, మొగల్ సామ్రాజ్యంలో మంచి, చెడు రెండు జరిగాయని... చెడు మరోసారి జరుగకుండా చూస్తామన్నారు.

ప్రభుత్వమే విగ్రహం తయారుచేయదని... అన్ని వర్గాల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సింగిల్‌గా నిర్ణయం తీసుకోమన్నారు. విగ్రహం, చిహ్నం తయారీలో బీఆర్ఎస్ నేతల సలహాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. 

కాకతీయ రాజులు తెలంగాణ సమాజానికి ఎంతో మంచి పనులు చేశారు. నిజాం రాజులు హైదరాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని దేశపతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

మూడవ రోజుకు చేరిన రైతుల ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమం

రైతులతో చర్చలు జరిపేందుకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం..

చండీగఢ్లో సాయంత్రం ఐదు గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు..

చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులపై పంజాబ్ లో ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, ప్లాస్టిక్ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం కరెక్టు కాదన్న సర్వన్ సింగ్ పంధర్

పంజాబ్ లో రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్లను దిగ్బంధించనున్న బికేయూ నేతలు రాకేష్ టికాయత్, నరేష్ టికాయత్, రైతులు.. 

మధ్యాహ్నం 12 గంటల నుంచి నాలుగు గంటల వరకు రైల్వే ట్రాక్లపై నిరసన తెలుపనున్న భారత్ కిసాన్ యూనియన్ (బికేయు) నాయకులు.