/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచిత విద్య Raghu ram reddy
ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచిత విద్య

ఆంధ్రప్రదేశ్‌లో 2024-2025 విద్యా సంవత్సరానికి గానూ ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు సంబం ధించి పాఠశాల విద్య శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

అనాథ, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్‌ కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొంది.

అర్హులైన విద్యార్థులు పాఠశాల విద్య శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ వరకూ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవకాశం కల్పించింది.

ఏప్రిల్‌ 1వ తేదీన మొదటి విడత, ఏప్రిల్‌ 15న రెండో విడత ఫలితాలు ప్రకటిస్తారు.

CPI Narayana: అహంభావం వల్లే కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు: సీపీఐ నారాయణ

హైదరాబాద్: భారాస అధినేత కేసీఆర్ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు..

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోయినట్లు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అనడం వివేకవంతుడి లక్షణం కాదన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం పద్ధతి కాదని చెప్పారు.

''కేసీఆర్ ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేశారు? అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదు? కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ కోరాలని తెలంగాణ భాజపా తెలివిగా వ్యవహరిస్తోంది. కేసు అప్పగిస్తే మేనేజ్‌ చేయాలనుకుంటున్నారు. కేసీఆర్‌ను ఆ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తోంది. వేల కోట్ల రూపాయల అవినీతికి ఆయన బాధ్యుడు. జరిగిన అవినీతిపై విచారణ చేయించాలి. భారాస నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు గడవకముందే విమర్శలు చేయడం ఆ పార్టీ పతనానికి నాంది'' అని వ్యాఖ్యానించారు.

Rajadhani Files: అర్థంతరంగా 'రాజధాని ఫైల్స్‌' నిలిపివేత..

అమరావతి: 'రాజధాని ఫైల్స్‌' (Rajadhani Files) సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. విజయవాడలోని ట్రెండ్‌సెట్‌ మాల్‌లో అర్థంతరంగా నిలిపివేశారు..

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చిత్రాన్ని ప్రదర్శించవద్దని నోటీసులు ఇచ్చారు. సినిమాను మధ్యలో ఆపివేయడంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు కొని చూస్తుంటే మధ్యలో ఎలా నిలిపివేస్తారని నిలదీశారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతోనే ఆపేశామని అధికారులు పేర్కొనగా.. ఆర్డర్‌ కాపీని చూపించాలని పట్టుబట్టారు..

మరోవైపు గుంటూరు జిల్లా ఉండవల్లిలో సినిమా ప్రదర్శన నిలిపివేతపై రైతులు ధర్నాకు దిగారు. రామకృష్ణ థియేటర్‌ వద్ద తెదేపా నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సినిమాను నిలిపివేసినట్లు యాజమాన్యం తెలిపింది..

TS Council: తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో చర్చ

హైదరాబాద్ : శాసనమండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు..

భూమి, నీటిని తల్లితో పోలుస్తాం, అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఓ ప్రొఫెసర్ తెలంగాణ తల్లి ప్రతిమను రూపొందించారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఓ సామాజికవర్గ దొరసాని గుర్తుకు వస్తుందని ప్రభుత్వ పెద్దలు చెప్పడం సమంజసం కాదని దేశపతి శ్రీనివాస్ తెలిపారు.

మంత్రి శ్రీధర్ సమాధానమిస్తూ... కాకతీయ తోరణం, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తామన్నారు. కాకతీయులు, మొగల్ సామ్రాజ్యంలో మంచి, చెడు రెండు జరిగాయని... చెడు మరోసారి జరుగకుండా చూస్తామన్నారు.

ప్రభుత్వమే విగ్రహం తయారుచేయదని... అన్ని వర్గాల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సింగిల్‌గా నిర్ణయం తీసుకోమన్నారు. విగ్రహం, చిహ్నం తయారీలో బీఆర్ఎస్ నేతల సలహాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. 

కాకతీయ రాజులు తెలంగాణ సమాజానికి ఎంతో మంచి పనులు చేశారు. నిజాం రాజులు హైదరాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని దేశపతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

మూడవ రోజుకు చేరిన రైతుల ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమం

రైతులతో చర్చలు జరిపేందుకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం..

చండీగఢ్లో సాయంత్రం ఐదు గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు..

చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులపై పంజాబ్ లో ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, ప్లాస్టిక్ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం కరెక్టు కాదన్న సర్వన్ సింగ్ పంధర్

పంజాబ్ లో రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్లను దిగ్బంధించనున్న బికేయూ నేతలు రాకేష్ టికాయత్, నరేష్ టికాయత్, రైతులు.. 

మధ్యాహ్నం 12 గంటల నుంచి నాలుగు గంటల వరకు రైల్వే ట్రాక్లపై నిరసన తెలుపనున్న భారత్ కిసాన్ యూనియన్ (బికేయు) నాయకులు.

Supreme Court: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

దిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది..

జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈనెల 26కు వాయిదా వేసింది. సీనియర్‌ న్యాయవాది హరీశ్‌సాల్వే అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేయాలని చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. మూడు వారాల తర్వాత విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు..

సీఐడీ తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్‌ స్పందిస్తూ కౌంటర్‌ దాఖలుకు గతంలో సమయం తీసుకుని ఇప్పుడు మళ్లీ వాయిదా కోరుతున్నారని కోర్టుకు తెలిపారు. చంద్రబాబు తరఫున కౌంటర్‌ దాఖలు చేశారని చెప్పారు. విచారణకు తేదీని నిర్ణయించాలని కోరారు.

తొలుత రెండు వారాల తర్వాత లిస్ట్‌ చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. రంజిత్‌కుమార్‌ విజ్ఞప్తితో ఈనెల 26కి వాయిదా వేసింది..

చావులోనూ వీడని స్నేహం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో బావిలో ఇద్దరు స్నేహితులు పడి మృత్యు వాత పడ్డారు.

తుమిడే హరీశ్(22), కంబాల మహేష్(22) ఇద్దరు స్నేహితులు. ఆదివారం సాయంత్రం ఒక పెండ్లికి వెళ్లిన వారిద్దరూ చేను వద్దకు వెళ్లారు.

  

బైక్ కొద్ది దూరంలో పార్క్ చేసి బావి వద్దకు వెళ్లారు. అక్కడ చీకటిగా ఉండటం తో ప్రమాదవ శాత్తూ జారి పడ్డారా…? లేక ఈతకు వెళ్లి చనిపోయారా..? అనేది తెలియాల్సి ఉంది.

బావి సమీపంలో మద్యం బాటిళ్లు ఉన్నాయి. సోమవారం ఉద‌యం బావిలో రెండు శ‌వాలు తేల‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

అసెంబ్లీలో ప్రాజెక్టులపై ప్రారంభమైన వాడీ వేడి చర్చ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ మయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేవాల్లో ఇవాళ ప్రాజెక్టులపై నోట్ ప్రవేశపెడుతోంది.

రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ పై మాట్లాడుతున్నారు.కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడాన్ని వ్యతిరే కిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు.

ఇరిగేషన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు.

ఎస్బీ న్యూస్

నేడు జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు

ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి.

ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ,ఎన్టీఏ ప్రకటించనున్నది. ఇప్పటికే జేఈఈ సెషన్‌ -1 ప్రాథమిక కీని విడుదల చేసి విద్యార్థు ల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. సోమవారం ఫలితాలతోపాటు తుది కీ"ని సైతం ఎన్టీఏ విడుదల చేయనున్నది.

దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్‌ -1 పరీక్షలు జరిగాయి.పేపర్‌ -1కు 12, 21,615 మంది దరఖాస్తు చేసుకోగా, 11,70,036 (95.8 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు.

ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆరిటెక్చర్‌ (బీఆర్క్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (బీ ప్లానింగ్‌, వంటి సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్‌-2 పరీక్షకు 74,002 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 55,493,75శాతం, మంది పరీక్షకు హాజరయ్యారు.

ఈ ఫలితాల కోసం https://jeemain.nta.ac.inను సంప్రదించండి

వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన కరెంట్ కంచేకు కానిస్టేబుల్ మృతి

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో ఆదివారం సాయంత్రం ఓ కానిస్టే బుల్ మృతి చెందాడు.

వన్యప్రాణాల కోసం ఏర్పాటుచేసిన కరెంటు వైర్లు తగిలి విధి నిర్వహ ణలో ఉండగానే ప్రాణాలు కోల్పోయాడు. కాటారం మండల పరిధిలోని నస్తూర్ పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్ పల్లి గ్రామ అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్ కు అందింది. 

దీంతో కానిస్టేబుల్ ప్రవీణ్ అడవిలో మరికొందరు సిబ్బందితో కలిసి కూబింగ్ కు వెళ్ళాడు. ఈ క్రమంలో వణ్యప్రాణులు వేట కోసం ఏర్పాటు చేసిన కరెంటు వైర్లు తగిలి ప్రవీణ్ స్పాట్ లోనే ప్రాణాలు వదిలారు.

ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని కరెంట్ షాక్ ట్రాప్ ను పెట్టిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.