/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: నల్లగొండ అభివృద్ధికి కేసిఆర్ చేసింది శూన్యం: మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య Mane Praveen
NLG: నల్లగొండ అభివృద్ధికి కేసిఆర్ చేసింది శూన్యం: మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య

నల్లగొండ జిల్లా:

గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసిఆర్ నల్గొండకు చేసింది శూన్యం అని మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య విమర్శించారు. మర్రిగూడ మండల కేంద్రంలో మంగళవారం విలేకరులతో బాలయ్య మాట్లాడుతూ.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కృష్ణా జలాల పరిరక్షణ అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కేవలం ఆయన కేడర్ ను కాపాడుకోవడం కోసమే ఈ నల్లగొండ సభ అని, వేరే ఉద్దేశం ఏమీ లేదని అన్నారు. 

ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ దక్షిణ తెలంగాణలో బిఆర్ఎస్ నాయకులను చిత్తుచిత్తుగా ప్రజలు ఓడించారని, వారి ఉనికి కోసమే ఈ బహిరంగ సభ నిర్వహించుకున్నారని, దీంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలిమినేటి సత్తిరెడ్డి, మారగొని మల్లేష్, సిరిపంగి శ్రీనివాస్, లపంగి కృష్ణ, దామెర సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

NLG: నల్గొండ చర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. హోంగార్డు మృతి

నల్గొండ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నేపథ్యంలో చర్లపల్లి వద్ద ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న హోంగార్డులను ఢీ కొట్టిన కారు ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నార్కట్ పల్లి పీఎస్ లో పనిచేస్తున్న హోంగార్డు కిషోర్ మృతి చెందాడు. మరో హోంగార్డు కు గాయాలు అయ్యాయి, ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

NLG: పగడాల ముత్తు సేవలు అభినందనీయం

నల్లగొండ జిల్లా, గుర్రంపోడు మండలం, ఆమలూరు గ్రామానికి చెందిన రాచమల్ల వెంకన్న ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త మరణంతో భార్య రేణుక, ముగ్గురు పిల్లలు అనాదలయ్యారు. విషయం తెలుసుకున్న పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు వారి కుటుంబానికి ఈ రోజు రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు.

కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ మాడ్గుల శిరీష, ట్రెజరరీ పగడాల కళ్యాణ్, మొగిలి కిషన్, పందుల శ్రీను, పుప్పాల పాపయ్య పాల్గొన్నారు.

NLG: ఫిబ్రవరి 14 బ్లాక్ డే గా జరుపుకుందాం: మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు

నల్లగొండ: సహజంగా ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు అని వాలెంటైన్స్ డే అని తెలుసు. కానీ ఇదే రోజు 2019లో పుల్వామా దాడిలో భారత్ 40 మంది వీర జవాన్లను కోల్పోయింది. ఈ రోజును బ్లాక్ డే గా జరుపుకుందామని పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ విద్యార్థులు అన్నారు. 

మంగళవారం ఎస్బి న్యూస్ తో పట్టణంలోని పలువురు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు మాట్లాడుతూ.. ప్రపంచం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది, అయితే క్రూరమైన పుల్వామా దాడుల కారణంగా ఈ రోజును భారతదేశానికి 'బ్లాక్ డే' అని పిలుస్తారని అన్నారు.

Ads

బిఏ మూడో సంవత్సరం చదువుతున్న గడగోజు శ్రీజ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14 ను ప్రపంచం ప్రేమికుల రోజు అంటుంది. కానీ భారత్ లో ఈ రోజుకి సరైన ఆదరణ లేదని, తాను ఫిబ్రవరి 14 ను బ్లాక్ డే గా చూస్తానని అన్నారు. ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన వివాహాల పైన ఆమె మాట్లాడుతూ.. పెద్దలు కుదిర్చిన వివాహాలు మేలని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. 

Ads

అదేవిధంగా బిఏ మూడో సంవత్సరం చదువుతున్న మరో విద్యార్థిని వల్కి మనీషా మాట్లాడుతూ.. పెద్దలు కుదిర్చిన వివాహాలు మేలని, సమస్యలొస్తే పెద్దలు మాట్లాడి పరిష్కరిస్తారని అన్నారు. అంతే కాదు ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం అనే భావన మన భారతీయులు మరిచిపోయి ఫిబ్రవరి 14 బ్లాక్ డే అని గుర్తుంచుకోవాలి అని అన్నారు.

మరో విద్యార్థిని మైత్రి మాట్లాడుతూ.. ప్రేమ వివాహాలకు కన్నా, పెద్దలు కుదిర్చిన వివాహాలు బెటర్ అని అన్నారు.

మరో విద్యార్థిని నసెరా మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14 బ్లాక్ డే గా నిర్వహించాలని, ప్రేమ వివాహాలలో ఒక జంట మధ్య అనుబంధం ఉంటుందని, పెద్దలు కుదిర్చిన వివాహంలో ఒక కుటుంబం మధ్య అనుబంధం ఉంటుందని తన అభిప్రాయాన్ని తెలిపారు. అదేవిధంగా తెలియని వ్యక్తులతో ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో స్నేహం చేయరాదని సూచించారు.

కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ రాజారాం మాట్లాడుతూ.. సెల్ఫ్ డిఫెన్స్ లో కళాశాల విద్యార్థిని లకు శిక్షణ ఇవ్వడానికి సర్టిఫికెట్ కోర్సు ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు.

NLG: ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు, వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి, జిల్లా కార్యదర్శి, లింగయ్య యాదవ్, వివిధ ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 

కాగా ప్రజలు ఇచ్చిన దరఖాస్తులకు సంబంధించి సమస్యలు పరిష్కరించారా ?పరిష్కరించలేదా? దరఖాస్తుదారానికి నెల రోజుల లోపు అధికారులు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని, రాతపూర్వకంగా ఇచ్చిన దరఖాస్తులకు రాతపూర్వకమైన సమాధానం ఇవ్వాలని పలువురు ప్రజావాణి కి వచ్చిన దరఖాస్తుదారులు అంటున్నారు.

NLG: వసతి గృహం అధికారిణిని సస్పెండ్

నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ లోని ప్రీ మెట్రిక్ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం అధికారిణి ఎం. అహల్యను జిల్లా కలెక్టర్ హరిచందన సోమవారం సస్పెండ్ చేశారు. సోమవారం సంక్షేమ శాఖల అధికారులతో వసతి గృహాల నిర్వహణ, సంక్షేమ శాఖల పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.. సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ దాసరి అధికారులను ఆదేశించారు. 

మిర్యాలగూడ ప్రీ మెట్రిక్ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం అధికారిణి ఎం.అహల్య హాస్టల్లో ఉండకపోవడమే కాకుండా, విద్యార్థినులకు భోజనం సరిగా పెట్టకపోవడంతో ఆమెను సస్పెండ్ చేసినట్టు వివరించారు. హాస్టల్ ను తనిఖీ చేసిన అనంతరం ఈ చర్య తీసుకున్నట్లు ఆమె తెలిపారు. హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు.

NLG: అనుమానాస్పదంగా ఉన్న విద్యార్థుల మరణాలను హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ ద్వారా న్యాయ విచారణ జరిపించాలి: ఏఐఎస్ఎస్డి

దేవరకొండ: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ నియోజకవర్గ కన్వీనర్ వస్కుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థుల అనుమానస్పద మృతులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆర్డీవోకు మెమోరండం అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. గురుకులాల విద్యార్థుల సూసైడ్ మరణాలు రోజురోజుకు పెరుగుతున్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా సమగ్ర విచారణ జరిపించి, మరణాలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ప్రతి గురుకులాల హాస్టల్ కు ఒక సైకాలజిస్ట్ను నియమించాలని,

ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.

మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ప్రభుత్వం చాలా పకడ్బందీగా గురుకులాల హాస్టల్స్ విద్యార్థులు భయభ్రాంతులకు గురికాకుండా, వారు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా, భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా, గురుకులాల హాస్టల్లో మనో ధైర్యంతో చదివే విధంగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉండాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కంబాలపల్లి వెంకటయ్య, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు అందుగుల గిరి, చేపూరి రాజేష్, యాదగిరి, నాగరాజు, తదితర సభ్యులు పాల్గొన్నారు.

NLG: ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినీలకు మీడియా, సినిమాటోగ్రఫీ పై ప్రత్యేక శిక్షణ

నల్లగొండ: ఆర్ అండ్ బి మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచనల మేరకు, ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల నందు నీలగిరి నిపుణ సౌజన్యంతో.. మీడియా, సినిమాటోగ్రఫీ సంబంధిత 30 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఎర్పాటు చేశారు. అందుకు సంబందించిన పోస్టర్ ను ఈ రోజు ఆవిష్కరణ చేశారు. ప్రభుత్వ మహిళ కళాశాల విద్యార్థులకు 30 రోజులపాటు డిజిటల్ సినిమాటోగ్రఫీ, డబ్బింగ్ మరియు వాయిస్ ఓవర్ స్కిల్స్, ఆడియో ప్రొడక్షన్, నాన్ లీనియర్ ఎడిటింగ్, ప్లే బ్యాక్ లైవ్ సింగింగ్ స్కిల్స్, డిజిటల్ డిజైనింగ్ మరియు సోషల్ మీడియా మేనేజ్మెంట్ డిస్క్ జాకీ మరియు లైవ్ సౌండ్ తదితర అంశాలపై శిక్షణ కల్పిస్తామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో స్పేస్ సీఈఓ శశి ప్రీతం , టీవీ సీరియల్ మరియు సినిమా నటుడు లోహిత్ కుమార్, మాట్లాడుతూ.. ఈ రంగాలలో విద్యార్థులకు ఉచితంగా నైపుణ్యం కల్పించడం జరుగుతుందని కళాశాల విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమం లో పాల్గొని, ఈ రంగాలలో తమ యొక్క నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. 

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గన్ శ్యామ్ మాట్లాడుతూ.. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేరు కాబట్టి, ఇటువంటి రంగాలలో నైపుణ్యత సాధించి జీవితంలో స్థిరపడాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్, హౌసింగ్ బోర్డ్ పిడి రాజకుమార్ కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ నరసింహారాజు, మెంబర్స్ డాక్టర్ సుంకరి రాజారామ్, జి. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

NLG: ఫిబ్రవరి 16 న జరిగే దేశ వ్యాప్త కార్మికుల సమ్మె ను జయప్రదం చేయండి: చాపల శ్రీను

మునుగోడు: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 16న దేశ వ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి నల్లగొండ జిల్లా గౌరవ అధ్యక్షులు చాపల శ్రీను పిలుపునిచ్చారు. సీపీఐ కార్యాలయం లో ఏఐటీయూసీ నాయకులతో కలిసి సమ్మె వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. కేంద్రం గత 10 సం.ల పాలనలో దేశంలో కార్మిక, రైతు సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. 

బిజెపి అధికారంలోకి వస్తే 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని అమలు చేయలేదని అన్నారు. కార్పోరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ, పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. మోడీ పాలనలో జరిగిన రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల వలన జరుగుతున్న నష్టంపై ఫిబ్రవరి 16న దేశ వ్యాప్తంగా సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు, రైతులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షకార్యదర్షులు బెల్లం శివయ్య, దుబ్బ వెంకన్న , భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు ఈద యాదయ్య ఇతర రంగాల కార్మిక నాయకులు దొమ్మటి గిరి, బోల్లు సైదులు, మద్ది అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

NLG: కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి: గుత్త అమిత్ రెడ్డి

ఈ నెల 13 న నల్గొండ లో కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభను విజయవంతం చేయాలని గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి అన్నారు. నల్లగొండలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కె ఆర్ ఎం బి లో జరిగిన మీటింగ్స్ లలో కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అప్పనంగా కేంద్రానికి అప్పజెప్పారని,కృష్ణా నది మన జిల్లాకు వరప్రదాయిని 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని అలాంటి కృష్ణా జలాలను కేంద్రానికి అప్పజెప్పారు అని విమర్శించారు.


  

కె ఆర్ ఎం బి కి కృష్ణా ప్రాజెక్టులు పోతే తాగు నీటికి కూడా కటకట ఏర్పడుతుందని, మన అధీనంలో ఉంటే ఎప్పుడంటే అప్పుడు నీటిని విడుదల చేసుకున్నాం అని,ఇక నుంచి ఈ వెసులుబాటు ఉండదు అన్నారు. విద్యుత్ ఉత్పత్తి కి కూడా ఆటంకం ఏర్పడుతుంది. రాష్ట్ర హక్కులను కేంద్రానికి అప్పజెప్పడం దుర్మార్గపు చర్య, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే అవాస్తవాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్లు టిఆర్ఎస్ పై పై బురద జల్లుతున్నారు అని, పదేళ్లు ఎంత ఒత్తిడి చేసిన కేసీఆర్ కేంద్రానికి తలొగ్గలేదన్నారు.

పార్టీ ఆదేశిస్తే నల్గొండ, భువనగిరి నియోజకవర్గ లాలల్లో ఎక్కడినుంచైన పోటీ చేస్తాను, పార్టీ నిర్ణయమె ఫైనల్..

 ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. ప్రజల్లో ఉండటమే నాకు ఇష్టం అన్నారు. ఈ కార్యక్రమములో జడ్పీటీసీ కనగల్ చిట్ల వెంకటేశం, అయితగాని స్వామి గౌడ్,శ్రీరామదాసు హరి కృష్ణ,నాగులవంచ వెంకటేశ్వర రావు,కంచరకుంట్ల గోపాల్ రెడ్డి ,పజ్జుర్ సర్పంచ్ మోయిజ్, మాజి జడ్పీటీసీ సంజీవ, చిలకరాజు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.