/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ఏసీబీ ఉచ్చులో చిక్కుకున్న మునిసిపల్ టౌన్ ఏ ఈ Raghu ram reddy
ఏసీబీ ఉచ్చులో చిక్కుకున్న మునిసిపల్ టౌన్ ఏ ఈ

మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న టౌన్ ఏఈ పృథ్వి శనివారం ఏసిబి అధికారులకు పట్టుబడ్డాడు

ఏసీబి డిఎస్పి కృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ కాంట్రాక్టర్ పి. యాదయ్య నుంచి 50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టణంలోని మెట్టుగడ్డ సమీపంలో ప్రత్యక్షంగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు.

కాంట్రాక్టర్ గత సంవత్సరం మున్సిపాలిటీకి సంబం ధించి రెండు పనులకు ఆన్లైన్లో టెండర్ వేసి 11 లక్షలకు దక్కించుకున్నాడని తెలిపారు

ఈ పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ యాదయ్య ఆ పనులకు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో ఎంవి రికార్డు చేయాలని ఏఈ పృద్విని కోరగా లంచం డిమాండ్ చేశాడని తెలిపారు

ఈ విషయాన్ని కాంట్రాక్టర్ యాదయ్య ఈనెల 7వ తేదీన ఎసిబికి ఫిర్యాదు చేశాడని చెప్పారు.. పథకం ప్రకారం ఏఈ పృద్వికి ఒప్పుకున్న 50 వేల రూపాయలు పట్టణంలోని మెట్టుగడ్డ సమీపంలో యాదయ్య ఇస్తుండగా ప్రత్యక్షంగా పట్టుకొని అతనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

అనంతరం విచారణ నిమి త్తం నిందితుడిని మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చి అందుకు సంబంధించిన ఫైల్స్ పరిశీలించామని, రేపు ఏసిబి స్పెషల్ కోర్టు నాం పల్లిలో అప్పగిస్తా మని పేర్కొన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని లేదా నేరుగా మహబూబ్నగర్ కార్యాలయంలో స‌మాచా రం ఇవ్వ‌వ‌చ్చ‌ని వెల్లడిం చారు

Vijayawada: ధర్నాచౌక్‌లో PET అభ్యర్థుల ధర్నా

Vijayawada: విజయవాడ ధర్నాచౌక్‌లో PET అభ్యర్థుల ధర్నాకు దిగారు. మెగా డీఎస్సీలో ఒక్క PET పోస్ట్ లేకపోవడంపై అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే

కేవలం 6వేల100 పోస్టులు విడుదల చేయడం అన్యాయమన్నారు. మూడేళ్లుగా లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నామని.. డీఎస్సీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూశామన్నారు అభ్యర్థులు. జగనన్న మా ఆశలు ఆడియాసలు చేశాడని.. 6వేల100 పోస్టుల్లో PET పోస్టులు ప్రకటించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు అభ్యర్థులు

చేతి’కి చిక్కిన మహేందర్‌రెడ్డి చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా సునీతారెడ్డి

హైదరాబాద్: పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‏కు భారీ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు ఆయన భార్య వికారాబాద్‌ జడ్పీచైర్‌పర్సన్‌ సునీతారెడ్డి గురువారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో మంచిపట్టున్న మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరడం బీఆర్‌ఎస్‏కు పెద్ద దెబ్బేనని చెప్పాలి. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు బీఆర్‌ఎస్‌ తాండూరు టిక్కెట్‌ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్‌ వైపు చూశారు. పలు దఫాలు ఆయన పార్టీ ముఖ్యనేతలతో చర్చలు కూడా జరిపారు. అయితే ఇది గమనించిన బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఎన్నికలకు ముందు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి బుజ్జగించింది. దీంతో ఆయన పార్టీ మారే యోచన విరమించుకున్నారు. మహేందర్‌రెడ్డిని ఎలాగైనా కాంగ్రెస్ కు రప్పించాలని రేవంత్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఎన్నికల తేదీకి వారం రోజుల ముందుకూడా ఆయనకు భారీ ఆఫర్‌ ఇచ్చారు. కానీ, అప్పటి పరిస్థితుల్లో ఆయన బీఆర్‌ఎస్‏లోనే కొనసాగాలని నిర్ణయించారు. ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్‌ నేతలు పలుమార్లు జరిపిన చర్చలు సఫలం కావడంతో చివరకు మహేందర్‌రెడ్డి ఆయన భార్య సునీతారెడ్డి కాంగ్రెస్‏లో చేరాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే మహేందర్‌రెడ్డి కుటుంబం చేరిక వెనుక బలమైన కారణమే ఉంది. మహేందర్‌రెడ్డి భార్య వికారాబాద్‌ జడ్పీచైర్‌పర్సన్‌ సునీతారెడ్డికి చేవెళ్ల పార్లమెంట్‌ సీటు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ మేరకు వారి కుటుంబానికి స్పష్టమైన హామీ కూడా లభించడంతో కాంగ్రెస్‏లో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్‌ స్థానంలో బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలోకి దిగుతుండడంతో అధికార కాంగ్రెస్‌ కూడా ఆర్థిక, అంగబలం ఉన్న వారిని పోటీలో దింపేయత్నం చేస్తోంది. మహేందర్‌రెడ్డి కుటుంబంతో పాటు ఆయన అనుచరులు ఈనెల 11వ తేదీలోగా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు.

 మల్కాజిగిరిపై తర్జనభర్జనలు

మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానానికి కూడా కాంగ్రెస్‏లో పోటీ ఉన్నప్పటికీ ఆర్థికంగా బలంగా ఉన్న వారి కోసం కాంగ్రెస్‌ ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. మల్కాజిగిరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన మైనంపల్లి హన్మంతరావు కూడా పోటీకి సై అంటున్నట్లు సమాచారం. అలాగే సీనియర్‌ నేత కుసుమకుమార్‌తోపాటు హరివర్ధన్‌రెడ్డి తదితరులు ఆసక్తిగా ఉన్నారు. ప్రధానంగా బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పేరు కూడా కొద్ది రోజులుగా వినిపిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ హామీ ఇవ్వలేదు.

 ఎమ్మెల్యేలపై గురి

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు వలసలకు గేట్లు తెరవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ముఖ్యంగా నగర శివార్లలోని ఎమ్మెల్యేలను పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకు ఇప్పటికే యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఇక మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి త్వరలో తాను కూడా సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తానని, కీసర ఆలయానికి రావాలని ఆహ్వానిస్తానని చెప్పారు. తాజాగా మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నగర శివార్లలోని మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌ గూటికి చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈనెల 11వ తేదీలోగా బీఆర్‌ఎ్‌సలో భారీ కుదుపులు ఉంటాయనే ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పట్టం మహేందర్ రెడ్డి దంపతులు, మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, షాద్ నగర్ సీనియర్ నేత తాండ్ర కాశీనాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

రాష్ట్ర పోటీలకు పెద్దపల్లి జిల్లా విద్యార్థులు ఎంపిక

ఈనెల 10న భద్రాద్రి కొత్త గూడెంలో జరిగే రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీ లకు పెద్దపల్లి పట్టణానికి చెందిన ప్రభుత్వ బాలుర పాఠశాల, ఎంపీ యుపిఎస్ విద్యార్థులు వర్షిణి, కావేరీ ఎంపిక య్యారు.

జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో షాట్ పుట్, 600 మీటర్ల పరుగు పోటీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచి రాష్ట్ర పోటీలకు అర్హత సాధించగా, శుక్రవారం ఎంఈఓ, హెచ్ఎం సురేంద్ర కుమార్, ప్రైమరీ హెచ్ఎం మంజులత అభినందిం చారు

Vijayawada: గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు

శతాబ్ధి ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను వికర్‌ జనరల్‌ మోన్సిన్యోర్‌ మువ్వల ప్రసాద్‌ ఆవిష్కరించారు. గుణదల ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర గురువులు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు, దివ్య బలిపూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తుతో పాటు, ట్రాఫిక్ మళ్ళిస్తూ సీపీ ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు. గుణదల కొండ వరకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది.

కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది.

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి టీఎస్‌ఎల్‌పీఆర్బీ, సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌కు సానుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వస నీయ సమాచారం.దీంతో నిరుడు అక్టోబర్‌ 4న ప్రకటించిన కానిస్టేబుల్‌ ఫలితాలనే ఫైనల్‌ చేస్తూ.. నేడో, రేపో టీఎస్‌ఎల్‌పీఆర్బీ తుది ప్రకటన చేయనున్నది.

జరిగిన తప్పొప్పులపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవరిస్తూ.. నిపుణుల కమిటీ వేయా లన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ టీఎస్‌ఎల్‌పీఆర్బీ అధికా రులు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లారు.

ఈ నేపథ్యంలోనే బోర్డుకు అనుకూలంగా తీర్చు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పోలీసు, జైళ్లు, ఫైర్‌, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్‌ శాఖల అధికారులకు టీఎస్‌ఎల్‌పీఆర్బీ నిరుడు అక్టోబర్‌ 4న ఇచ్చిన తుది ఫలితాలే ఫైనల్‌ అంటూ సమాచారం ఇచ్చినట్టు సమాచారం.

ఆయా విభాగాల నియామక పత్రాలు తయారు చేసుకో వాలంటూ రాష్ఱ్రహోంశాఖ రహస్యంగా ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఉన్నతాధి కారులకు ఎంపికైన అభ్యర్థుల వివరాల లిస్టు, ఇతర లేఖలు వెళ్లాయి. డ్రైవర్‌, మెకానిక్‌ పోస్టులకూ లైన్‌క్లియర్‌ అయినట్టు సమాచారం.

బోర్డు నుంచి సరైన వివరణ

సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా నోటిఫికేషన్‌ ఇచ్చిన దగ్గర్నుంచి..తుది ఫలితాలు విడుదల వరకు అన్నింటినీ పద్ధతి ప్రకారం నిర్వహించామని, సాంకేతి కంగా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకొన్నామని బోర్డు తరఫు న్యాయవాది వివరించారు.

దీంతో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు కూడా.. బోర్డు వాదనలకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిసింది

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కారు, టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు

ఈ ప్రమాదంలో మృతి చెందిన తల్లి, కూతురుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో కుమార్తె, కుమారుడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు

మాజీ ముఖ్యమంత్రి శరత్ పవార్ కు ఈసి షాక్

లోక్ సభ ఎన్నికలు దగ్గర కొస్తున్న వేళ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కు బిగ్ షాక్ తగిలింది.

ఎన్నికల సంఘం మహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ,ఎన్‌సీపీ,గా అధికారి కంగా గుర్తించింది. ఆరు నెలల పాటు ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈ మేరకు నిర్ణయానికి వచ్చింది.

శాసనసభలో మెజారిటీ నిరూపించుకున్న నేపథ్యంలో ఎన్సీపీ గుర్తు అజిత్ వర్గానికే చెందుతుందని ఈసీ తెలిపింది

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్ వర్గం తమ పార్టీకి కొత్త పేరు పెట్టుకునే వీలు కల్పిస్తు న్నట్లు ఈసీ పేర్కొంది. పార్టీ సింబల్ అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది

నేడు ఢిల్లీకి చంద్రబాబు

ఇవాళ చంద్రబాబు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళాను న్నారు. పొత్తులపై చర్చించ డానికి ఢిల్లీ రమ్మని చంద్ర బాబుకి అమిత్ షా ఆహ్వానం పంపారు

ఈ రాత్రికి అమిత్ షా జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ కానున్నారు.చంద్రబాబు అమిత్ షా భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

టీడీపీతో పొత్తు పెట్టుకోవా లని హైకమాండు కు ఇప్ప టికే మెజార్టీ ఏపీ బీజేపీ నేతల సూచించారు

వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ

ఈ నెల 9వ తేదీ లోపు కమిటీ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశం

వ్యూహం చిత్రాన్ని సెన్సార్‌ బోర్డు కమిటీ మరోసారి వీక్షించి నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు

వ్యూహం సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ రద్దు చేయాలని ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన తెదేపా

ఇరువైపులా ముగిసిన వాదనలు

ఈ నెల 9వ తేదీ లోగా సినిమాపై నిర్ణయం తీసుకోవాలని సెన్సార్‌ బోర్డును ఆదేశించిన తెలంగాణ హైకోర్టు