/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz నూతన ఎక్స్ ప్రెస్ రైళ్లను ను ప్రారంభించిన: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి Raghu ram reddy
నూతన ఎక్స్ ప్రెస్ రైళ్లను ను ప్రారంభించిన: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

స్విట్జర్లాండ్‌తో సమానంగా భారతీయ రైల్వే నెట్‌ వర్క్‌ను అభివృద్ధి చేశామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. 53 శాతం రాయితీతో భారతీయ రైల్వే సేవలు అందిస్తున్నదని అన్నారు.

రోజుకు 16 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ పెరుగుతున్నదని తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మంత్రి కిషన్‌ రెడ్డి ఈరోజు ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో రైల్వే బడ్జెట్‌ రూ.8 వేల కోట్ల నుంచి రూ.29 వేల కోట్లకు పెరిగిందన్నారు. అయితే మోదీ ప్రభుత్వంలో అది రూ.2.8 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు.

దక్షిణమధ్య రైల్వే మరో మూడు రైళ్లను ప్రయాణి కులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. హుబ్బల్లి-నర్సాపూర్‌, విశాఖపట్నం-గుంటూరు, నంద్యాల-రేణిగుంట ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మంత్రి కిషన్‌ రెడ్డి ప్రారంభించారు. నేటి నుంచి ఇవి సేవలను ప్రారంభిస్తాయని ఆయన అన్నారు

బిఆర్ఎస్ పార్టీకి 21 మంది కౌన్సిలర్లు రాజీనామా

తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కు 21 మంది కౌన్సిలర్లు రాజీనామా ఈరోజు రాజీనామా చేశారు.

మంచిర్యాల జిల్లా బెల్లం పల్లిలో క్యాంపు రాజకీ యాలు ఉత్కంఠ రేపు తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి 21 మంది కౌన్సిలర్లు గురువారం రాజీనామా చేశారు.

వారం రోజుల క్రితం బీఆర్ఎస్ కు చెందిన 18 మంది కౌన్సిలర్లు క్యాంపు నకు తరలి వెళ్లారు.

బెల్లంపల్లిలో ఈ నెల 12న అవిశ్వాసం నేపథ్యంలో కౌన్సిలర్లు ఒక్కసారిగా పార్టీకి రాజీనామాలు ప్రకటించడం చర్చనీ యాంశంగా మారింది.

జగిత్యాల జిల్లా కేంద్రంలో చోరీ

జగిత్యాల పట్టణంలోని పురాణిపేటకు చెందిన నోముల సాగర్ ఇంట్లో గురువారం తెల్లవారు జామున చోరీ జరిగింది.

ఇంటి యజమాని తన కుటుంబ సభ్యులతో గత నెల రోజుల క్రితం అమెరి కాకు వెళ్ళగా తాళం వేసి వున్న ఇంటిని గమనించిన దొంగలు గడ్డపార సాయంతో ఇంటి తాళాలు పగులగొట్టి కప్ బోర్డులో ఉన్న లాకర్ లో ఉన్న అర తులం బంగారం, 5వేల నగదు ఎత్తుకెళ్లారనీ నోముల సాగర్ తెలిపారు.

నేడు మహబూబాబాద్ జిల్లా పార్లమెంటు ఎన్నికల సమీక్ష సమావేశం

పార్లమెంట్‌ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే.. నేడు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీర్ఎస్‌ సమీక్షా సమావేశం నిర్వహించనుంది.

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు, నర్సంపేట డోర్నకల్ మహబూబాబాద్ ఇల్లందు, పినపాక భద్రా చలం నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించ నున్నారు.

మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీర్ఎస్‌ సమీక్షా సమావే శానికి బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర సీనియర్ నేతలు హాజరు కానున్నారు

మోహాలీ వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ టి20 మ్యాచ్

నేడు ఇండియా , ఆఫ్ఘన్‌ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఆఫ్ఘనిస్తాన్, భారత జట్ల మధ్య జరిగే తొలి టీ20 మొహలీ వేదికగా జరుగనుంది..తొలి టీ20లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ జరిగే మొహాలీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలి స్తుంది.

ఒకవేళ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోర్ చేస్తే చేదనలోను అదే జోరు కనిపించే ఛాన్స్ ఉంది. ఎందుకంట ఇక్కడ 6 మ్యాచులు జరిగితే నాలుగింట్లో ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఇక భారత్ ఇక్కడ 4 టీ20ల్లో 3 నెగ్గింది. ఆస్ట్రేలియా చేతిలో 2022లో ఓడింది. ఇక ఈ మ్యాచ్‌ కు కోహ్లీ దూరం కానున్నాడు. ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

A P అంగన్వాడి ల పై ఎస్మా అన్యాయం ప్లే కార్డులతో నిరసన

    పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని అడిగితే ఎస్మా లు ఉపయోగిస్తారా అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (CITU )అనుబంధం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి లు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

       మంగళవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ సిడిపిఓ ఆఫీస్ ముందు నల్ల జెండాలు, ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వేతనాల కోసం సమ్మె చేస్తున్న ఏపీ అంగన్వాడీలపై ఏస్మా పేరుతో జీవో నెంబర్ రెండు తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.అధికారంలోకి వచ్చిన నాడు ఏపీ జగన్మోహన్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువజీతాలు పెంచుతానని చెప్పిన మీ మాటలు ఎటు పోయాయి అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఎంపీలకు ముఖ్యమంత్రులకు లక్షల్లో జీతాలు పెంచుకునే మీకు నిరంతరం పేద ప్రజల కోసం దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే పిల్లలను తీర్చిదిద్దే వారికి మెరుగైనటువంటి పౌష్టికాహారం అందించేటువంటి అంగన్వాడీ టీచర్స్ కు ఎందుకు జీతాలు పెంచడంలేదని ప్రశ్నించారు.పదివేల జీతం టీచర్స్ కు, హెల్పర్స్ ,మినీ టీచర్స్ కు 7000 రూపాయల జీతంతో ఎలా అంగన్వాడీలు బతుకుతారని, వాళ్ళ కుటుంబ పోషణ ఎలా సాగుతుందని ప్రశ్నించారు.కడుపు కాలీ సమ్మె చేస్తుంటే జీతాలు పెంచకుండా ఎస్మా ఉపయోగించడం ప్రభుత్వ చేతగానితనం అన్నారు కార్మికులకు సమ్మెకు జన్మ హక్కు అని దాన్ని కాలరాసే ఏ ప్రభుత్వానికైనా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు గతంలో అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు శంకరగిరి మాన్యాలు పట్టారని గుర్తు చేశారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులతో చర్చలు జరిపి వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్మిక వర్గం ఎక్కడ పోరాటాలు చేసిన వారికి అండగా సంఘీభావంగా సిఐటియు ఉంటుందని వారు తెలిపారు

   ఈ కార్యక్రమంలో సునంద సముద్రమ్మ సరిత రేణుక అనిత శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

ఏపీలో 108, 104 సిబ్బంది సమ్మె నోటీసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 108, 104 సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. జనవరి 22లోపు తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేదంటే 23 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు..

ఈ మేరకు సమ్మె నోటీసుల ప్రతులను ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేశారు. మొత్తం 7వేల మంది ఉద్యోగులు 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈఎంటీ పోస్టుల భర్తీలో వెయిటేజీ కల్పించాలని కోరారు. ఈ నెల 22 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు..

గందరగోళం లేకుండా ఓటరు జాబితా సవరణకు చర్యలు: ముకేశ్‌ కుమార్‌ మీనా

అమరావతి: ఈ ఏడాది ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా 2023 డిసెంబర్‌ 9 వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్ కుమార్ మీనా తెలిపారు..

ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను జనవరి 12లోపు పరిష్కరిస్తామని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గందరగోళం లేకుండా ఓటరు జాబితాను సవరించేందుకు కార్యాచరణ చేపట్టామని తెలిపారు

మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించాం. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 5,64,819 పేర్లను అనర్హులుగా తేల్చాం. కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. కాకినాడ నగరంలో ఫాం 7 ద్వారా గంపగుత్తగా ఓటర్లను చేరుస్తున్న 13 మంది, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దురుద్దేశ పూర్వకంగా దాఖలు చేసిన ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం

చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు పెట్టాం. అక్కడ ఉల్లంఘనలకు పాల్పడిన 24 మంది బీఎల్‌వోలపై చర్యలు తీసుకున్నాం. పర్చూరులో 10 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశాం. జీరో డోర్ నంబర్లు, ఒకే ఇంటిలో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసుల్లో 97 శాతం మేర తనిఖీలు పూర్తి చేసి ఓటర్ల జాబితాను సవరించాం. ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మారిపోయిన ఘటనలు విశాఖ, ఎన్టీఆర్ జిల్లాల్లో నమోదయ్యాయి అని ముకేశ్‌కుమార్‌ మీనా వివరించారు

వాళ్లిద్దరు ఎక్కడ పోటీ చేసినా మద్దతిస్తా: మాజీ ఎంపీ లగడపాటి

రాజమహేంద్రవరంలో: రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ హర్షకుమార్‌ను ఆయన కలిశారు

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు..

కాకినాడలో శుభకార్యానికి వెళ్లాల్సి ఉందిమార్గమధ్యంలో హర్షకుమార్‌ను కలిశా. ప్రజల కోసం భవిష్యత్తును లెక్కచేయకుండా కాంగ్రెస్‌ను విడిచిపెట్టాం. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో మేం పూర్తిగా విభేదించాం. నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌, హర్షకుమార్‌ ఎక్కడ పోటీ చేసినా మద్దతిస్తా. అవసరమైతే వారి తరఫున ప్రచారం చేస్తా. గతంలో జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం చాలా సంతోషం'' అని లగడపాటి వెల్లడించారు..

నేడు ఏపీకి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో వాతావరణం సడెన్‌గా మారింది. ఒక్కసారిగా భారీ మేఘాలతో అల్పపీడనం లాంటిది పరుగులు పెడుతూ ఏపీవైపు వస్తోంది. ఇప్పటికే ఇది తమిళనాడు దగ్గరకు వచ్చేసింది.

ఇవాళ ఏపీకి చేరే అవకాశం ఉంది . అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్‌కి భారీ వర్ష సూచన ఉంది అని భారత వాతావరణ విభాగం చెప్పింది.

తాజా వాతావరణ బులిటెన్ ప్రకారం.. బంగాళాఖాతంలో అల్పపీడనం దక్షిణ శ్రీలంక నుంచి బయలుదేరి.. పశ్టిమ మధ్య బంగాళాఖాతం గుండా పరుగులు పెడుతూ.. ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతానికి వస్తోంది.

దీని మేఘాలు ఇప్పటికే ఏపీపైకి వచ్చేశాయి. తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లో 5 రోజులపాటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి అనీ, అలాగే తమిళనాడు, కేరళలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయనీ, అలాగే జనవరి 8న ఏపీలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం బాగా ఉంది అని చెప్పింది.

మరింత స్పష్టత కోసం శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాలను చూస్తే, ఇవాళ తమిళనాడు తీరంలో ఆల్రెడీ వానలు పడుతు న్నాయి. ఉదయం నుంచే రాయలసీమలో భారీ మేఘాలున్నాయి. ఇవి మధ్యాహ్నానికి తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకూ