/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz భాస్కర్ రావు గెలుపు కోరుతూ బాపూజీ నగర్ లో బారి చేరికలు Raghu ram reddy
భాస్కర్ రావు గెలుపు కోరుతూ బాపూజీ నగర్ లో బారి చేరికలు

బి ఆర్ ఎస్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ అభ్యర్థి భాస్కరరావు గారి గెలుపును మరియు మిర్యాలగూడ అభివృద్ధిని కాంక్షిస్తూ ఉమ్మడి బాపూజినగర్ నుండి వివిధ పార్టీల యువ నాయకులు దొంతరబోయిన శ్రీనివాస్ , సింగిరాల విజయ్,Sk ఎక్బాల్ ,పెంట సైదులు,సింగిరాల రవి, అకులపల్లి సుధాకర్,సాంబశివ రావు, మున్నయ్య, షబ్బీర్,లతీఫ్ బుచ్చయ్య, రఫీ, ధర్మేంద్ర మీసాల తదితరులు మునిసిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణుగారి అధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు గారి సమక్షంలో బీ ఆర్ యస్ పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంజనేయ రాజు, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, పున్నా రాధ కృష్ణ, యార్రమళ్ళ దినేశ్, చిన్న మల్లయ్య, మీసాల జగదీష్, పెంకే రాంబాబు, sk అజ్గర్, ఆవుల బాలు యాదవ్, సత్యనారాయణ చారి, కుంచం శివకృష్ణ, పెరుమాళ్ల ధనమ్మ, మర్రి పద్మ తదితరులు పాల్గొన్నారు

అలుపెరగని సూర్యాపేట గులాబీ సేన

సూర్యాపేట లో బీఆర్‌ఎస్‌ ప్రచారం అలుపెరగకుండా సాగుతున్నది. రాష్ట్ర మంత్రి,అభ్యర్ధి జగదీష్ రెడ్డి తొ పాటు శ్రేణులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఊరూరా సభలు, సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహిస్తుండగా, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు పోలింగ్ సమీపిస్తున్న కొద్ది బిఆర్ఎస్ లో కి కాంగ్రెస్ ,బిజెపి నేతలు క్యూ కడుతున్నారు. చెరికల తో చివ్వెంల మండలంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయింది.. తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన అభివృద్ధికి మద్దతు తెలుపుతూ, సీనియర్ నాయకులు కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు రవి నాయక్, కాంగ్రెస్ జడ్పీటిసి అభ్యర్ధి సురేష్ నాయక్ తొ పాటు , బిజేపి నాయకులు రాజేందర్ సురేష్, యాదగిరి సాయికుమార్, గిరి లు జాయిన్ అయ్యారు. వస్త్రం తండాలో బిజేపి చెందిన వార్డు మెంబర్లు , పెన్పాడు మండలం లింగాల గ్రామానికి చెందిన టిడిపి సిపిఎం పార్టీకి చెందిన యూత్ నాయకులు అనపంగా సైదులు, జానయ్య ,మట్టయ్య మధు యాదవ్ పవన్ లు బిఆర్ఎస్ చెరారు. ఆత్మకూరు మండలం చెందిన బొప్పారం నుండి కాంగ్రెస్ నాయకులు రంగయ్య, ప్రతాప్ రెడ్డి,తుమ్మల పెన్ పహాడ్ గ్రామాల నుండి ఉయ్యాల రమేష్ నవీన్ వెంకటేష్, ప్రవీణ్ ,గణేష్, సైదులు , బిఆర్ఎస్ లో చేరగా, కండువాలు కప్పిన మంత్రి సాదరంగా ఆహ్వానించారు.

పతి కోసం సతీమణి ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి ,జగదీష్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ.. ఆయన సతీమణి సునిత జగదీష్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.సూర్యాపేట అభివృద్ధికి జగదీష్ రెడ్డి చేస్తున్న ,చేపట్టబోయే కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. సూర్యాపేట ను మరింత అభివృద్ధి చేసేందుకు మరోమారు ఆశీర్వదించాలని కోరారు . సూర్యాపేట అభివృద్ధి విషయానికొస్తే రాష్ట్ర ఏర్పాటుకు ముందు తర్వాత అన్న పద్ధతిలో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.

BRSకు జై కొట్టిన రాష్ట్ర మాల సంఘాల JAC

అభివృద్ధి అంటేనే కంచర్ల ... కంచర్ల అంటేనే అభివృద్ధి..

మాలల సమస్యలను పరిష్కరించే సత్తా BRSకే ఉందని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల JAC ఛైర్మన్ చెరుకు రాంచందర్ అన్నారు.

VT కాలనీలోని MLA గారి క్యాంప్ అఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచందర్ మాట్లాడుతూ.. 

20 ఏళ్ళు MLAగా ఉండి కోమటిరెడ్డి నల్గొండకు ఏం అభివృద్ధి చేశారో చెప్పకుండా.. స్కీములంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. 

నల్గొండ అభివృద్ధి అంటేనే కంచర్ల భూపాల్ రెడ్డి గారని.. అంచలా నల్గొండను అభివృద్ధి చేశారని, ఇది ఎవరో చెప్పడం కాదూ.. నల్గొండను చూస్తేనే తెలుస్తుందని అన్నారు. అందుకే రెండో దఫా కంచర్ల భూపాల్ రెడ్డి MLAగా 50 వేల మెజారిటీతో గెలుస్తారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమాభివృద్ది కోసం CM KCR అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని, దళిత బంధు ద్వారా దళితులను వ్యాపార వేత్తలుగా మార్చేందుకు KCR తీసుకున్న చొరవ అద్వితీయమైనదని ఆయన కొనియాడారు.  

125 అడుగుల అంబెడ్కర్ విగ్రహంతో పాటు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షనీయమన్నారు

ఆడపడుచుల పెళ్ళిళ్ళ కొరకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు..

ఈ కార్యక్రమంలో వర్కింగ్ ఛైర్మన్ తాళ్ళపల్లి రవి , కన్వీనర్ నల్లాల కనకరాజు , వినోద్ కుమార్, నరసింహ, మేక వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

జగదీషన్న పై అభిమానం చాటిన టైలర్ అన్న

సూర్యాపేట లో అభివృద్ధి పరుగులు పెట్టించి తమ జీవితాల్లో వెలుగులు నింపిన జగదీష్ అన్నకు మద్దతుగా సబ్బండ వర్గాలు ఏకమవుతున్నాయి. సూర్యాపేటలోని రామలింగేశ్వర థియేటర్ వద్ద ఓ టైలర్ అన్న చాటిన అభిమానమే దీనికి నిదర్శనం. తమ షాపు ముందు నుండి మంత్రి కాన్వాయ్ వెళ్లడానికి గమనించిన టైలర్ దేవేంద్ర చారి పరుగున వెళ్లి కాన్వాయ్ ను ఆపాడు. దేవేంద్ర చారి రాకను గమనించిన మంత్రి వాహనం ఆపాల్సిందిగా సిబ్బందికి సూచించారు. మంత్రి వద్దకు చేరుకున్న దేవేంద్ర చారి సూర్యాపేటలో మీరు చేసిన అభివృద్ధికి ఉడతా భక్తిగా మీరు సమ్మతిస్తే నా చేతులతో మీకు బట్టలు కుట్టి బహుమానంగా ఇస్తానని తన కోరికను మంత్రికి తెలిపారు. టైలర్ అన్న కోరికకు మొదట ఆశ్చర్యపోయిన మంత్రి, అతని కోరిక మేరకు కాన్వాయ్ దిగి టైలర్ దుకాణంలోకి వెళ్లి కొలతలు ఇచ్చారు. మంత్రి రాకతో చెప్పలేని ఆనందంతో కొలతలు తీసుకున్న టైలర్ దేవేంద్ర చారి తన కోరికను తీర్చిన మంత్రి జగదీష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధితో సూర్యాపేట ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు వచ్చాయని, అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో జీవన్ సాగిస్తున్నామని దేవేంద్ర చారి తెలిపారు. మూడోసారి మంత్రి జగదీష్ రెడ్డి సాధించడం ఖాయం అన్న చారి, పట్టణ ప్రజలంతా జగదీష్ అన్నకు అండగా నిలబడి భారీ మెజార్టీతో మూడవ సారి గెలిపించాలని కోరారు.

నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నామినిషన్ ప్రక్రియ ముందు తమ కుటుంబానికి సెంటిమెంట్ గా వస్తున్న పలు ఆలయాలను సందర్శించారు. తొలుత ఆత్మకూర్ మండలం నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీర్వాధం తీసుకున్నారు. ఆ తరువాత నకిరేకల్ నియోజకవర్గం లోని పాలెం లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ముడుపుకట్టి స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడ నుండీ అర్వపల్లి లోని శ్రీశ్రీశ్రీ యోగానంద లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో తుంగతుర్తి టిఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ తో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తరువాత సూర్యాపేట పట్టణం లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలునిర్వహించారు.

అనంతరం తన నివాసానికి చేరుకుని అక్కడ తన తండ్రి చంద్రారెడ్డి, అక్కా- బావ గారైన కట్టా శేఖర్ రెడ్డి- రేణుక దంపతులకు, అన్న వదినలు రమేష్ రెడ్డి,- మణిమాల దంపతులకు పాదాభివందనం చేశారు.అనంతరం నియోజకవర్గ నలుమూలల నుండి స్వచ్ఛందంగా తరలి వచ్చిన పార్టీ నేతలు,కార్యకర్తల నినాదాల నడుమ ధర్మ బిక్షం చౌరస్తాకు వెళ్లారు. అక్కడి నుండి పాదయాత్ర ద్వారా ర్యాలీ గా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు బయలుదేరి వెళ్లారు.

సూర్యాపేట ప్రజల ధైర్యం భీఆర్ఎస్

60 ఏళ్ళు నాశనమైన సూర్యాపేటను అభివృద్ధి చేసిన ఘనత భీఆర్ఎస్ పార్టీదే అని రాష్ట్ర మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో విద్యానగర్ పార్టీ కార్యాలయంలో 35 వ వార్డు చర్చి కాంపౌండ్ కు చెందిన కాంగ్రెస్ బిజెపి నేతలు ముకుమ్మడిగా టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విజయ శేఖర్, రాంబాబు, రాజశేఖర్ లతోపాటు 400 మంది కాంగ్రెస్ బిజెపి కార్యకర్తలు గులాబీ తీర్దం పుచ్చుకున్నారు. మంత్రికి మద్దతుగా ఏకగ్రీవంగా తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సూర్యాపేట ప్రజల ధైర్యం భీఆర్ఎస్ పార్టీ అన్నారు. సూర్యాపేటలో అభివృద్ధి కారు స్పీడ్ తో వెళ్తుందన్న మంత్రి, 2014లో కారు గుర్తుకు వేసిన ఓటు సూర్యాపేట ప్రజలను మూసి మురికి నీటి పీడ నుండి విముక్తి కల్పించి, గోదావరి జలాలను తీసుకొచ్చిందన్నారు. గతంలో ఎమ్మెల్యేని కలవాలంటే నే పెద్ద యజ్ఞం చేసే పరిస్థితులు ఉండేవన్నారు. సూర్యాపేట అభివృద్ధి నే ప్రామాణికంగా పని చేసిన నేను ఆనాడు ప్రజలకు చెప్పకున్నా మెడికల్ కళాశాల ను తెచ్చాను అన్నారు.. ఆనాడు కారు గుర్తుకు వేసిన ఓటు సూర్యాపేట కు బోటు తో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చింది అన్నారు. సూర్యాపేట లో వ్యాపారులు ధైర్యం గా వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారంటే దానికి కారణము ఇక్కడి శాంతి భద్రతలు, ఇక్కడ నెలకొని ఉన్న ప్రశాంత వాతావరణమే అన్నారు. ప్రస్తుతం సూర్యాపేట కు వచ్చిన షాపింగ్ మాల్సే సూర్యాపేట అభివృద్ధికి గీటురాయిగా పేర్కొన్నారు.

మంది ని ముంచడానుకి దొంగలంతా ఒక్కటవుతున్నారన్న మంత్రి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ అన్నారు. ఓటు విలువ చాలా గోప్పదన్న మంత్రీ, మన తల రాతను నిర్ణయించేది మనం వేసే ఓటే అన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సూర్యాపేటకు లొ పారిశ్రామిక హభ్ ను ఏర్పాటుచేసి పదివేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తానని పేర్కొన్నారు. చెప్పిన హామీలన్నీ నెరవేర్చడంతోపాటు, చేయబోయే కార్యక్రమాలను లిఖితపూర్వకంగా ప్రజల ముందు ఉంచిన ఏకైక పార్టీ దేశంలో బిఆర్ఎస్ మాత్రమే అన్నారు. లిఖితపూర్వకంగా ప్రజలకు హామీ ఇచ్చే ధైర్యం మరే పార్టీకి లేదన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే జరుగుతున్న అభివృద్ధి పనులను కొనసాగించడంతోపాటు, రైతు బీమా తరహాలో 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా, 400కే గ్యాస్ సిలిండర్, రైతుబంధు పెంపు, ఆసరా పెన్షన్లు 5000 రూపాయలు, దివ్యాంగులకు 6000, సౌభాగ్య లక్ష్మి, అన్నపూర్ణ పథకం ద్వారా అందరికీ సన్న బియ్యం, కెసిఆర్ ఆరో ఆరోగ్య రక్ష ద్వారా 15 లక్షల ఆరోగ్య భీమా సదుపాయం, ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి, మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు, అగ్రవర్ణ పేదలకు సైతం గురుకులాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సబ్బండావర్గాల సంక్షేమమే భీఆర్ఎస్ లక్ష్యం అన్న మంత్రి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆశీర్వదించండి... సేవకుడిగా పనిచేస్తా

   యువత కు ఉపాధి కల్పనే లక్ష్యంగా సూర్యాపేట లో రాబోయే పాలన ఉండబోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి సూర్యాపేట నియోజకవర్గం లో ప్రచార పర్వం తారాస్థాయి కి చేరుకుంది. ప్రత్యర్థులకు అందనంత గా బీఆర్ఎస్ అభ్యర్ధి జగదీష్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఈరోజు మొదట గా కుడ కుడ గ్రామం లో అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.. అనంతరం ధి సూర్యాపేట కార్పెంటర్స్ నూతన కార్యవర్గ పదవీ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గత రెండు పర్యాయాలు సూర్యాపేట ప్రజలకు చెప్పిన హామీలు మొత్తం నెరవేర్చామని అన్నారు. కారు గుర్తుకు వేసిన ఓటు సూర్యాపేట లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చింది అని అన్నారు.

పేట లొ పారిశ్రామికహబ్ నెల కొల్పడమే తన భవిష్యత్ లక్ష్యం ఆన్నారు.ఐటి పరిశ్రమను మూడు వేలకు విస్తరించాలనేదే నా సంకల్పం అన్నారు.కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోవద్దన్న మంత్రీ,

కాంగ్రెస్ గెలుపొందడం అంటే.... తోడేళ్ళమంద గొర్రె పిల్లలపై పడటమే అన్నారు. రాష్ట్రం లో ఇళ్లు లేని వారు ఉండకూడదు అనేది సిఎం కేసిఆర్ లక్ష్యం అనీ,సూర్యాపేట నియోజకవర్గం లొ కూడా ఇళ్లు లేని వారు ఉండకూడదు అనేదే నా శపథం అన్నారు.గత మ్యానిఫెస్టోలను నూటికి నూరు శాతం అమలు చేసిన ఏకైక నాయకుడు కేసిఆర్ అన్నారు.బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలోనే మహిళా సంఘాల అభివృద్ధి జరిగిందన్న మంత్రీ  పనిచేసే ప్రభుత్వానికి సబ్బండ వర్గాలు అండగా నిలబడాలి అని కోరారు. మరోసారి శాసన సభ్యుడిగా ఆశీర్వదించండి... సేవకుడిగా పనిచేస్తా అన్నారు.

ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టో అద్బుతంగా ఉందన్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు సౌభాగ్యలక్ష్మి అందిస్తామని, రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి మోసపోవొద్దని సూచించారు. కారు గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి, కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ , బిజెపి పాలిత రాష్ట్రాలలో ఇస్తున్న ఆసరా పెన్షన్ నాలుగువందల మాత్రమె అన్న మంత్రి బీఆర్ఎస్ అధికారం లోకి వస్టే పెన్షన్ 5000 కాబో అన్నారు. గ్యాస్ సిలిండర్ ధర కేవలం 400 కె ఇస్తామని మిగతా బారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. అనంతరం సుమంగళి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు.

సూర్యాపేట లో బీఎస్పీ కి షాక్

బీఎస్పీ ను వీడి మూకుమ్మడిగా బీఆర్ఎస్ లో చేరిన 13 వ వార్డ్ గాంధీనగర్ కు చెందిన మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు

   మత్స్యకార వృత్తిని ప్రోత్సహించి మా జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్ వైపే మా ప్రయాణం అంటూ సూర్యాపేట లో మత్స్యకారులు తేల్చిచెప్పారు. తెలిసో తెలియక బీఎస్పీ లోకి వెళ్ళిన తాము తిరిగి బీఆర్ఎస్ పార్టీ లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. సూర్యాపేట లోని 13 వ వార్డ్ గాంధీనగర్ కు చెందిన మత్స్య పారిశ్రామిక సంఘం 

సభ్యులు బి. ఎస్పీ కి రాజీనామా చేసి మూకుమ్మడిగా బీఆర్ఎస్ లో చేరారు. విద్యానగర్ లోని పార్టీ కార్యాలయం వద్ద గులాబీ కండువాతో మంత్రి జగదీష్ రెడ్డి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో బంటు మారయ్య, దువ్వ మల్లేష్, గోడదాటి సైదులు, దాసరి ఉప్పలయ్య, తిరుపతి రవి, మొర రామచంద్రు, చెన్నబోయిన అంజయ్య, లక్ష్మయ్య, బుచ్చి బాబు తో పాటు వంద మంది మత్స్యకారులు బీఆర్ఎస్ లో చేరారు..13 వ వార్డ్ అధ్యక్షుడు రఫీ, జనార్దన్ ఆధ్వర్యం లో చేరికలు జరిగాయి.

సూర్యాపేట లో కొనసాగుతున్న బీఆర్ఎస్ దూకుడు బీఎస్పీ కి నై.. బీఆర్ఎస్ కే జై అంటున్న గాంధీనగర్ వాసులు

   సాధారణ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూకుడు కొనసాగుతుంది. సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధితో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాన్ని ఖాయం చేసుకోగా, అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ ,బిజెపి ల నుండి వెల్లువలా కొనసాగుతున్న చేరికలతో బీఆర్ఎస్ అభ్యర్ధి జగదీష్ రెడ్డి భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. తాజాగా బీఎస్పీ కి నై అంటూ పట్టణం లోని గాంధీనగర్ , బాషానాయక్ తండా కు చెందిన నేతలు, కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. చేరిన వారిలో పురాణపు యాదగిరి, అంజయ్య, ప్రసాద్, రామకృష్ణ, చిన్నరాములు, చిన గురుస్వామి, సాయి కుమార్ తో పాటు 54మంది బిజెపి, కాంగ్రెస్ కార్యర్తలు బీఆర్ఎస్ లో చేరారు.13 వ వార్డ్ అధ్యక్షుడు రఫీ, జానయ్య, జనార్దన్ ఆధ్వర్యం లో చేరికలు జరిగాయి. ఇక చివ్వెంల మండలం వట్టి ఖమ్మం పహాడ్ లో రౌతు నర్సింహ రావు ఆధ్వర్యం లో 58 మంది కాంగ్రెస్, బిజెపి లకు చెందిన యాదవ సోదరులు, ఇతర పార్టీల కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అభివృద్ధి కి మద్దతుగా పార్టీ లో చేరిన వారందరికీ గులాబీ కండువాకప్పి మంత్రి జగదీష్ రెడ్డి సాదరస్వాగతం పలికారు.