/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz AP: మధ్యంతర బెయిల్ తో విడుదల కానున్న చంద్రబాబు Mane Praveen
AP: మధ్యంతర బెయిల్ తో విడుదల కానున్న చంద్రబాబు

AP: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్య కారణాలను చూపుతూ ఆయన దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ కు కోర్టు ఆమోదం తెలిపింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్ట్ అయిన చంద్రబాబు.. సెప్టెంబర్ 10 నుండి 52 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్లను పలుమార్లు కొట్టేసిన కోర్టు.. ఆయన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం.

విచారణను హైకోర్టు 4 వారాల పాటు వాయిదా వేసింది. మెడికల్ గ్రౌండ్స్ పై చంద్రబాబుకు వచ్చే నెల 24 వరకు బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయవాదులు చెబుతున్నారు. బెయిల్ కు సంబంధించి కోర్టు ఎలాంటి షరతులు విధించిందనే వివరాలు తెలియాల్సి ఉంది. బెయిల్ కు సంబంధించిన తీర్పు కాపీ వచ్చాకే పూర్తి వివరాలు తెలుస్తాయని వివరించారు. కాగా, ప్రధాన బెయిల్ పిటిషన్ వచ్చే నెల 10న విచారణకు రానుంది. అయితే ఈరోజు సాయంత్రం వరకు ఆయన బెయిల్ పై విడుదల కానున్నట్లు సమాచారం.

Breaking news: చంద్రబాబు కు మధ్యంతర బెయిల్ మంజూరు

AP: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.

గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకోనున్న నల్లగొండ ఉమెన్స్ కాలేజ్ అధ్యాపకులు

TS: హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 83వ కాన్వకేషన్ సందర్భంగా, యూనివర్సిటీ ఛాన్స్లర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరియు ఎడబో(Adobe ) సిఈఓ శాంతన్నారాయణ , యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రవీందర్ చేతుల మీదుగా.. నేడు నల్లగొండలోని ప్రభుత్వ మహిళ కళాశాల అధ్యాపకులు డాక్టరేట్ అధ్యాపకులు  తీసుకోనున్నారు.

గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకోనున్న అధ్యాపకులు:

డాక్టర్ ఎస్.రాజారాం-లైబ్రరీ సైన్స్

డాక్టర్ బి.జ్యోతి-కెమిస్ట్రీ

డాక్టర్ ఆర్.నరేష్-జువాలజీ

డాక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు-ఫిజిక్స్

డాక్టర్ ఎం.రవి-కెమిస్ట్రీ

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు సహచర అధ్యాపకులు, విద్యార్థులు వారికి అభినందనలు తెలుపుతున్నారు.

TS: 43 మంది అభ్యర్థులతో బీఎస్పీ రెండో జాబితా విడుదల

HYD: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. బహుజన సమాజ్ పార్టీ సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రెండో జాబితా విడుదల చేసింది. ఈ నెల 3న 20 మందితో తొలి జాబితా విడుదల చేసిన బిఎస్పీ,, సోమవారం 43 మందితో రెండో జాబితా ప్రకటించింది.

ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే పార్టీలకు ఓట్లు వేయవద్దన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచే, ప్రలోభాలకు గురిచేసే పార్టీలకు ఓట్లను అమ్ముకోవద్దన్నారు. జనాభాలో 99 శాతం పేదలకు అధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమన్నారు.

43 అభ్యర్థులతో బీఎస్పీ రెండో జాబితాలో విడుదల చేశారు. ఇప్పటి వరకు ప్రకటించిన మొత్తం 63 అసెంబ్లీ స్థానాలకు తొలి, రెండో విడత జాబితా కలిపి బీసీ-26, ఎస్సీ -21, ఎస్టీ-11, ఓసీ-03, మైనార్టీలు-02 లకు సీట్లు కేటాయించారు.

బహుజన్ సమాజ్ పార్టీ రెండో విడత అభ్యర్థుల జాబితా:

1.బెల్లంపల్లి(ఎస్సీ) –జాడీ నర్సయ్య

2.మంచార్యాల–తోట శ్రీనివాస్

3.ఆసిఫాబాద్ (ఎస్టీ) –కనక ప్రభాకర్

4.బోథ్(ఎస్టీ)–మెస్రాం జంగుబాపు

5.కామారెడ్డి –ఉడతావర్ సురేష్ గౌడ్

6.కోరుట్ల– నిశాంత్ కార్తీకేయ గౌడ్

7.జగిత్యాల–బల్కం మల్లేష్ యాదవ్

8.రామగుండం–అంబటి నరేష్ యాదవ్

9.సిరిసిల్ల–పిట్టల భూమేష్ ముదిరాజ్

10.హుజూరాబాద్ –పల్లె ప్రశాంత్ గౌడ్

11.దుబ్బాక–సల్కం మల్లేష్ యాదవ్

12.ఉప్పల్– సుంకర నరేష్

13.రాజెందర్ నగర్–ప్రొ. అన్వర్ ఖాన్

14.చేవేళ్ల(ఎస్సీ)–తొండుపల్లి రాజా అలియాస్ రాజమహేంద్రవర్మ

15.పరిగి–యంకెపల్లి ఆనంద్

16.మలక్ పేట్–అల్లగోల రమేష్

17.నాంపల్లి–మౌలానా షఫీ మసూదీ

18.చంద్రాయణగుట్ట- మూల రామ్ చరణ్ దాస్

19.కొడంగల్–కురువ నర్మద కిష్టప్ప

20.మహుబూబ్ నగర్–బోయ స్వప్న శ్రీనివాసులు

21.దేవరకద్ర–బసిరెడ్డి సంతోష్ రెడ్డి

22.మక్తల్–వర్కటన్ జగన్నాధ్ రెడ్డి

23.అచ్చంపేట్(ఎస్సీ) – మెత్కూరి నాగార్జున

24.కల్వకుర్తి–కొమ్ము శ్రీనివాస్ యాదవ్

25.షాద్నగర్–పసుపుల ప్రశాంత్ ముదిరాజ్

26.కొల్లాపూర్–గగనం శేఖరయ్య

27.హుజూర్ నగర్– రాపోలు నవీన్

28.మునుగోడు–అందోజు శంకరాచారి

29.ఘన్పూర్ –స్టేషన్ (ఎస్సీ)– తాళ్లపల్లి వెంకటస్వామి

30.పాలకుర్తి – సింగారం రవీంద్రగుప్త

31.డోర్నకల్(ఎస్టీ) –గుగూలోత్ పార్వతీనాయక్

32.నర్సంపేట్– డా.గుండాల మధన్ కుమార్

33.వరంగల్ ఈస్ట్–చిత్రపు పుష్పిత లయ

34.వర్థన్పేట్(ఎస్సీ)–డా.వడ్డేపల్లి విజయ్ కుమార్

35.ములుగు(ఎస్టీ)–భూక్యా జంపన్న నాయక్

36.పినపాక(ఎస్టీ)–వజ్జ శ్యామ్

37.మధిర(ఎస్సీ)–చెరుకుపల్లి శారద

38.ఆశ్వారావుపేట్(ఎస్టీ)–మడకం ప్రసాద్

39.భద్రాచలం(ఎస్టీ)–ఇర్పా రవి

40.ఇబ్రాహీం పట్నం - గొరిగే మల్లేష్ యాదవ్

41.మహబూబాబాద్ - గుగులోత్ శేఖర్ నాయక్

42.శేరిలింగంపల్లి - ఒంగూరి శ్రీనివాస్ యాదవ్

43.వేములవాడ - గోలి మోహన్

కరీంనగర్ జిల్లాకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నియామకం

TS: కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా 2015 బ్యాచ్ కు చెందిన పమేలా సత్పతి ని నియమిస్తూ,, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు

ప్రస్తుతం పమేలా సత్పతి,, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా పనిచేశారు.

కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గా అభిషేక్ మహంతి ని నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

2011 బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారి మహంతి.. ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేసి గత కొన్ని నెలల క్రితం తెలంగాణకు నియమించబడ్డారు. కడప జిల్లా ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం ఆయన రాచకొండ ట్రాఫిక్ డిసిపి గా విధులు నిర్వహిస్తున్నారు.

TS: ఆ 13 నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఈ మేరకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.

సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకే పోలింగ్ జరగనుంది. మిగతా 106 స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

ప్రజా వ్యతిరేక బీజేపీ, బిఆర్ఎస్ లను ఓడించండి: ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి

నల్లగొండ: జాగో (మేలుకో) తెలంగాణ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (TELANGANA STATE DEMOCRATIC FORUM (TSDF) సంయుక్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేయడం కొరకు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో "ఓటర్ల చైతన్య యాత్ర" బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఉదయం ఎన్జీ కళాశాల, అంబేద్కర్ విగ్రహం (డిఇఓ ఆఫీస్), పెద్ద గడియారం సెంటర్, జిల్లా గ్రంధాలయం లో నిరుద్యోగులతో సభలు నిర్వహించారు.

ఈ బస్సు యాత్ర కార్యక్రమంలో ఆకునూరి మురళి మాజీ కలెక్టర్, జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ పాల్గొని మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో అవినీతి, నియంతృత్వం తో, దోపిడీ చేస్తున్న బీజేపీ, బి.ఆర్.ఎస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. మద్యానికి, నోటుకు, కులానికి, మతానికి లోబడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. 

తెలంగాణ ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన తెలంగాణ సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు. 

సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జె.వి చలపతిరావు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీజేపీ, బి.ఆర్.ఎస్ పార్టీలు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో అభ్యర్థులను నిలదీయాలని అన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడని, రైతు రుణమాఫీ, దళిత బంద్, కౌలు రైతులకు హార్దిక సహాయం, పంటల బీమా, ముస్లిం మైనారిటీలకు 12% రిజర్వేషన్ లు,15 లక్షల నల్లధనం, అంశాలపై పాలకులను నిలదీయాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 36 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని లక్ష ఎకరాలకైనా అందించారా అని ప్రశ్నించారు. బడా కార్పోరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారని తెలిపారు. 

దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరుగుతుంది తప్ప పరిష్కారం చూపలేదని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక సలహాదారు ప్రొ. వినాయక్ రెడ్డి Rtd (తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక రాష్ట్ర కన్వీనర్), టి.జె.ఎస్ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి, ఎం. హన్మేశ్ (TSDF కో కన్వీనర్) , నైనాల గోవర్ధన్ (తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యక వేదిక సమన్వయకర్త), ప్రదీప్ PYL రాష్ట్ర నాయకులు, రాజ్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ OU విద్యార్థి సంఘం నాయకులు, ఇందూరు సాగర్ (ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు), PDSU జిల్లా కార్యదర్శి పోలె పవన్, బొంగరాల నర్సింహా, AIKMS జిల్లా నాయకులు బీరెడ్డి సత్తిరెడ్డి, ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రావుల సైదులు, కళాకారులు బాల నరసయ్య, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

HYD: బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో నిరసనలు..

నల్లగొండ జిల్లా:

మునుగోడు నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పెండెం ధనుంజయ నేతకు బీఎస్పీ టికెట్ ఇవ్వాలని, సోమవారం బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో, మునుగోడు మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన పెండెం ధనుంజయ నేత.. బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అర్హుడని వారికే బీఎస్పీ టికెట్ కేటాయించాలని కోరారు.

NLG: రేపు గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డు తీసుకోనున్న ఎన్జీ కళాశాల అధ్యాపకులు

రేపు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం 83వ కాన్వకేషన్ సందర్భంగా, యూనివర్సిటీ ఛాన్స్లర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరియు ఎడబో(Adobe ) సిఈఓ శాంతన్నారాయణ , యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రవీందర్ చేతుల మీదుగా నల్లగొండలోని నాగార్జున కళాశాల అధ్యాపకులు డాక్టరేట్ తీసుకోనున్నారు.

డాక్టర్.సయ్యద్ మునీర్- చరిత్రలో , డాక్టర్.ఆనందం దుర్గాప్రసాద్ -గ్రంధాలయ సమాచార శాస్త్రంలో, డాక్టర్.శీలం యాదగిరి-రాజనీతి శాస్త్రంలో, డాక్టర్.గంజి భాగ్యలక్ష్మి- జంతు శాస్త్రంలో, డాక్టర్.నాగుల వేణు- ప్రభుత్వ పాలన శాస్త్రంలో, డాక్టర్.టి.సైదులు -తెలుగు సబ్జెక్టులో డాక్టరేట్ అవార్డు అందుకోబోతున్నారని, కళాశాల నుంచి ఆరుగురు అధ్యాపకులు ఒకే సంవత్సరంలో డాక్టర్ అవార్డు పొందడం హర్షం వ్యక్తం చేస్తూ, తద్వారా కళాశాలలో విద్యార్థులలో పరిశోధన అభివృద్ధి తీసుకురావడానికి ఎంతో అవకాశం ఉందని, జిజ్ఞాస ప్రాజెక్టులు, పరిశోధన వ్యాసాలు ,విద్యార్థుల్లో పరిశోధన ఆసక్తిని పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు

TS: ఓటరు నమోదుకు రేపే తుది గడువు

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికీ ఓటు పొందని వారు.. కొత్తగా ఓటు పొందేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. వీరితోపాటు ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రకటించిన తుది జాబితాలో పేరు లేని వారంతా కొత్తగా మళ్లీ ఓటు పొందేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు.

జాబితాలో పేరు ఉన్నా వారి నివాసం వేరే చోటికి మార్చినా, పేరు ఇతర వివరాలు తప్పుగా అచ్చు అయ్యి ఉన్నా వారంతా నవంబర్‌ 30న జరగనున్న రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఓటేసేందుకు అనర్హులుగా ఎంచబడతారు.

ఇలాంటి వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్‌ 31వ తేదీలోపు అవకాశాన్ని కల్పించింది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం 6, ఇతర ప్రాంతాలకు ఓటు బదిలీ, పేరు, ఫొటో వివరాలను సరి చేసుకోవడానికి 8 దరఖాస్తులను అక్టోబర్ 31తేదీలోగా సమర్పిస్తే వారందరికీ ఓటు హక్కు లభిస్తుంది.

ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారితో ప్రత్యేకంగా అనుబంధ ఓటర్ల జాబితాను ఎన్నికల యంత్రాంగం ప్రచురించనుంది. తుది ఓటర్ల జాబితా తో పాటు అనుబంధ ఓటర్ల జాబితాలోని ఓటర్లకు వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ముగింపునకు 10 రోజుల ముందు నాటికి వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటారు. అందులో అర్హులైన వారికి ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు.

నవంబర్‌ 3న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. అదే నెల 10వ తేదీతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. ఇక నామినేషన్ల దాఖలుకు సరిగ్గా 10 రోజుల ముందు అంటే అక్టోబర్‌ 31వ తేదీ నాటికి ఓటర్ల నమోదు దరఖాస్తులు నిలిపివేస్తారు.

గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు.