/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయ‌క్ బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై Yadagiri Goud
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయ‌క్ బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై

ఖానాపూర్ పట్టణంలోని అధికార పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ఆమె వెల్లడించారు.

నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వరాజీనామా పత్రాలను పార్టీకి త్వరలో పంపుతాను అన్నారు. కేవలం కేటీఆర్ మిత్రుడు ను టికెట్ ఇచ్చేందుకు ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని నిలిపి వేశారాణి ఆరోపించారు..

మంత్రి కేటీఆర్ తన స్నేహితుడికి ఖానాపూర్ టిక్కెట్ ఇచ్చారన్నారు. తాను ఏం తప్పు చేశాను? కుంభకోణాలకు పాల్పడ్డానా? టిక్కెట్ ఎందుకు నిరాకరించారు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చిన జాన్సన్ ఎస్టీ కానే కాదన్నారు.

కేటీఆర్ మిత్రుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా ఖానాపూర్ నియోజకవర్గం గురించి ఆయనకి ఏం తెలుసని మండిపడ్డారు . మొన్నకి మొన్న నిర్మల్లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సభ ఫ్లెక్సీలో త‌న ఫోటో పెట్టలేదని అన్నారు, ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోటీకి బరిలో ఉంటాన‌ని, ఏ పార్టీ నుంచి అనేది త్వరలోనే చెప్తాను అన్నారు .

ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తారో నేనూ చూస్తానంటూ సవాల్ చేశారు. అధికార పార్టీ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తానన్నారు. తనకు అనవసరంగా టిక్కెట్ నిరాకరించారంటూ రేఖా నాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఇప్పుడు ఏడుస్తున్నానని, కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏడిపించడం ఖాయమన్నారు.

రేపటి నుంచి ఖానాపూర్ నుండి ఇంద్రవెల్లి వరకు నియోజకవర్గ మొత్తం పాదయాత్ర చేస్తానని అన్నారు...

22 రోజుల తర్వాత తల్లిని కలిసిన నారా లోకేష్

నారా లోకేష్, ఆయన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.

అంతకు ముందు విజయవాడ నుంచి భారీ ర్యాలీతో లోకేష్ రాజమండ్రికి చేరుకున్నారు.

చాలా రోజుల తర్వాత అక్కడ భువనేశ్వరి, బ్రాహ్మణిలను లోకేష్ కలుసుకున్నారు. నారా లోకేష్‌ను కలుసుకున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి భావోద్వేగానికి గురైయ్యారు.

కాసేపు అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.

ఏసీబీ వలలో బంజారాహిల్స్‌ సీఐ నరేందర్‌

బంజారాహిల్స్‌: లంచం తీసుకుంటూ బంజారాహిల్స్‌ సీఐ ఏసీబీ వలకు చిక్కారు. ఓ సమస్య పరిష్కారం కోసం బాధితుడి నుంచి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ సీఐ నరేందర్‌ రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు..

ప్రస్తుతం బంజారాహిల్స్ పీఎస్‌లో ఎన్‌స్పెక్టర్‌ నరేందర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా కొంతకాలంగా సీఐ నరేందర్‌పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బంజారాహిల్స్ పీఎస్‌, నరేందర్‌ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు జరుపుతోంది..

Nara Brahmani: చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదు: నారా బ్రాహ్మణి ట్వీట్‌

అమరావతి: చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని కొందరు అనుకుంటున్నారని.. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి (Nara Brahmani) అన్నారు..

చంద్రబాబు అరెస్ట్‌ తదనంతర పరిణామాల నేపథ్యంలో 'కాంతితో క్రాంతి' నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బ్రాహ్మణి ట్వీట్‌ చేశారు.

''మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి.. దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు.

కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి?

అక్టోబర్‌ 7న రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆఫ్‌ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‌ఫోన్‌ టార్చ్‌, కొవ్వొత్తులు వెలిగిద్దాం.

రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్‌ చేద్దాం'' అని బ్రాహ్మణి పేర్కొన్నారు..

Assembly elections: అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా.. అక్టోబర్‌ 8-10 మధ్య షెడ్యూల్‌ ప్రకటన?

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) తేదీలను అక్టోబర్‌ 8 నుంచి 10వ తేదీ మధ్య ఎన్నికల సంఘం (EC) ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి..

ఈ ఏడాది తెలంగాణ(Telangana), రాజస్థాన్‌(Rajasthan), మిజోరం(Mizoram), మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో పోలింగ్‌ నవంబర్‌ మధ్య నుంచి డిసెంబర్‌ తొలి వారంలోపు జరపవచ్చని ఈసీ వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనాలు పేర్కొన్నాయి.

తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్‌ 17నే ముగియనుండగా.. తెలంగాణ, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో వివిధ తేదీల్లో ముగుస్తాయి..

అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వ్యూహాన్ని ఖరారు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం నేడు దిల్లీలో ఎన్నికల పరిశీలకులతో భేటీ జరపనుంది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధనం, కండ బలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని ఈసీ అమలు చేయనుంది.

ఇందుకోసం పోలీసులు, వ్యయాలు, సాధారణ విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో శుక్రవారం మొత్తం సమీక్ష జరిపి.. తుది ప్రణాళికకు ఆమోదం తెలపనుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు జరిపిన విషయం తెలిసిందే..

Breakfast Scheme: ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం.. విద్యార్థులతో టిఫిన్‌ చేసిన రాష్ట్ర మంత్రులు

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పౌష్టికాహారం అందించే లక్ష్యంగా సర్కార్‌ తీసుకొచ్చిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం' తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది..

వివిధ జిల్లాల్లో ఈ పథకాన్ని మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి పాల్గొని విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు.

అల్పాహార పథకం పేద పిల్లలకు వరమన్న మంత్రులు.. మఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ పథకం ప్రారంభించినా దానివెనక ఓ మానవీయ కోణం ఉంటుందని చెప్పారు. సికింద్రాబాద్‌ వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తిని.. కాసేపు వారితో ముచ్చటించారు. వారికి మంత్రి కేటీఆర్‌ అల్పాహారాన్ని వడ్డించారు. విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రోజుకో పౌష్టికాహారాన్ని వడ్డించనున్నామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యమే ముఖ్యమన్నారు..

రేపు నారా లోకేష్ చంద్ర‌బాబుతో ములాఖ‌త్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టారు.

చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఢిల్లీకి వెళ్లిన టీడీపీ యువనేత ఇరవై రోజులకు పైగా అక్కడే ఉన్నారు. న్యాయవాదులు, జాతీయ నాయకులతో సమావేశమవుతూ బిజీగా గడిపారు.

నిన్న ఆయన విజయవాడ చేరుకున్నారు. లోకేష్ కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయానికి వచ్చారు. వాహనాలపై వస్తోన్న కార్యకర్తలను మధ్యలోనే పోలీసులు అడ్డగించారు. దీంతో కార్యకర్తలు తమ వాహనాలను రోడ్డుపై వదిలి, నడుచుకుంటూనే విమానాశ్రయానికి చేరుకున్నారు. యువనేతకు ఘన స్వాగతం పలికారు.

అనంత‌రం విమానాశ్రయం నుంచి ఉండవల్లిలోని తమ నివాసానికి చేరుకున్నారు. రేపు ఉదయం రాజమండ్రి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేంద్రకారాగారంలో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.

సిరియాలో ఉగ్ర దాడి :100 మందికి పైగా మృతి

సిరియాలో మరోసారి ఉగ్రవాదులుశుక్రవారం భీకర దాడులు చేశారు. సిరియన్ మిలిటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా మృతి చెందారు.

ఈ దాడుల్లో 125 మంది గాయపడ్డారు..ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హోంస్‌లో డ్రోన్ దాడులకు ఉగ్రవాద సంస్థలు కారణమని సమాచారం.

.మరణించిన వారిలో సగం మంది సైనిక గ్రాడ్యుయేట్లు అని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది పేలుడు పదార్థాలతో నిండిన డ్రోన్లతో దాడి చేశారు.

వీరి మృతికి సంతాప సూచకంగా సిరియా ప్రభుత్వం శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది....

హైదరాబాద్‌లో రెండవ రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్‌లో రెండవ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అమీర్‌పేట్, శంషాబాద్ కూకట్‌పల్లితో సహా పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.

అమీర్‌పేట్‌లోని పూజ కృష్ణ చిట్‌ఫండ్స్‌పై ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. డైరెక్టర్ సోంపల్లి నాగ రాజేశ్వరి పూజాలక్ష్మి ఎండీ కృష్ణ ప్రసాద్ ఇళ్ల పై రెండో రోజు కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

శంషాబాద్‌లోని చిట్‌ఫండ్ సంస్థ యజమాని రఘువీర్ ఇల్లు, ఆఫీసులపై సోదాలు జరిగాయి.కూకట్‌పల్లిలోనూ హిందూ ఫార్చునాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

చిట్ ఫండ్స్ ఫైనాన్స్ సంస్థల్లో ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలతో రెండవ రోజు కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కీలకమైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

లండన్‌ వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

లండన్‌లో మహిళా రిజర్వేషన్‌ చట్టం అంశంపై జరిగే సదస్సులో పాల్గొనేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం సాయంత్రం లండన్ వెళ్లారు.

బ్రిడ్జ్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఆ సదస్సులో కవిత ప్రసంగించనున్నారు. అలాగే శనివారం నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ అండ్‌ అలుమిని యూనియన్‌ యూకే ఆఽధ్వర్యంలో చేపట్టే రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కవిత మాట్లాడనున్నారు