/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన బిజెపి నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Mane Praveen
NLG: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన బిజెపి నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
బిజెపి పార్టీని వీడుతున్నట్టు మీడియాలో   వస్తున్న వార్తల పై మునుగోడు మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. పార్టీ మార్పు అనేది అవాస్తవం అని దీనిని ఖండిస్తున్నా అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ..నా వ్యక్తిగత స్వార్థం కోసం సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదు. నా చుట్టూ ఉన్న సమాజం కోసం నా వంతు మంచి చేయాలనే లక్ష్యం తో రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నా. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఎంపీ పదవికి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాను. సబ్బండ వర్గాలు  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు నన్నెంతో కలచివేశాయి. ప్రజా తెలంగాణ బదులు ఒక కుటుంబం కోసమే తెలంగాణ అన్నట్లు పరిస్థితి దాపురించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలను ముందుకు నడిపించే సత్తా నరేంద్ర మోడీ, అమిత్ షా లకు ఉందని విశ్వసించి దేశ సౌభాగ్యం లో నేను కూడా భాగస్వామి కావాలని అడుగు వేశానని తెలిపారు. నేనే కాదు ఇతర బిజెపి ముఖ్య నాయకులు ఎవరు బిజెపిని వీడరని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతమొందించే దిశగా భారతీయ జనతా పార్టీ సైనికులమై ముందుకు కదులుతున్నామని అన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
Mane Praveen

హైదరాబాద్: సెకండ్ ఏఎన్ఎం లు తమను పర్మినెంట్ చేయాలంటూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద ఏఎన్ఎం లు ధర్నా చేస్తున్న సందర్భంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తమ

TS: సెకండ్ ఏఎన్ఎం లను నిర్బంధించిన పోలీసులు (వీడియో)
హైదరాబాద్: సెకండ్ ఏఎన్ఎం లు తమను పర్మినెంట్ చేయాలంటూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద ఏఎన్ఎం లు ధర్నా చేస్తున్న సందర్భంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తమను అక్రమంగా నిర్బంధిస్తున్నారని ఏఎన్ఎం లు వాపోయారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇకనైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు.
NLG: జాతీయ స్థాయి బాలికల జూనియర్ ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన 6 గురు విద్యార్థినులు
నల్గొండ: ఈనెల 6 వ తేదీ నుండి 13వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో జరిగే జాతీయస్థాయి జూనియర్ బాలికల ఫుట్బాల్ పోటీలకు ఉమ్మడి జిల్లా పక్షాన దివ్య, యశస్విని, శైలు, రాజేశ్వరి, సిరి, నందిని లు ఎంపికయ్యారని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన 6 గురు క్రీడాకారినులను అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అధ్యక్షులు బండారు ప్రసాద్, మరియు అసోసియేషన్ సభ్యులందరూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ..గత 15 రోజుల నుండి తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, నిజామాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సెలక్షన్లలో అత్యుత్తమ ప్రతిభను కనబరచడం ద్వారా 6 గురు క్రీడాకారినులు తెలంగాణ రాష్ట్ర ఫుట్బాల్ జట్టుకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. జాతీయ జట్టులో ఉమ్మడి జిల్లా నుండి 6 గురు సెలెక్ట్ కావడం మన జిల్లాకే ఎంతో గర్వకారణమని తెలియజేస్తూ, క్రీడాకారినులలో ఉన్న సహజ ఫుట్బాల్ క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి జాతీయస్థాయిలో అవకాశాలు కల్పిస్తూ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ క్రీడాకారినులకు మంచి క్రీడా భవిష్యత్తు ను అందిస్తున్న తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ వారికి మరియు TFA ప్రధాన కార్యదర్శి ఫల్గుణ కు మరియు వారి టీంకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని తెలిపారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
TS: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
NLG: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామాలకు అత్యధిక నిధులు కేటయించాలని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వడం అధికార దుర్వినియోగమేనని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం చౌటుప్పల్, నకిరేకల్ లలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక ర్యాలీలో పాల్గొని ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మంత్రి వ్యాఖ్యలపై త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి  ఫిర్యాదు చేయనున్నట్లు ఆర్ఎస్పి తెలిపారు. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యల వెనుక కేసీఆర్ హస్తం ఉన్నట్లు ఆరోపించారు. తక్షణమే ఎన్నికల సంఘం మంత్రిపై చర్యలు తీసుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా నివారించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార బీఆర్ఎస్ నేతలకు పోలీసులు తోత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు కేసీఆర్ ప్రకటించే తాయిళాలకు ప్రజలు మోసపోవద్దన్నారు. ప్రతిపక్ష నేతల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని అన్నారు. మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే చర్లగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మీనామీషాలు లెక్కిస్తుందని, తక్షణమే రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతాలకు మిషన్ భగీరథ నీళ్లు అందడంలేదని ఆరోపించారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో భూసేకరణ జరుగలేదన్నారు. మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ చేయలేదన్నారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలు పట్టించుకోవడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. ఐటిపాముల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంలో, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మించడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. సూర్యాపేటలో వట్టే జానయ్య ను, నకిరేకల్ లో ఉన్నత విద్యావంతురాలైన మేడి ప్రియదర్శిని అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
దేవరకొండ: నియోజకవర్గ బీఎస్పీ ముఖ్య నాయకుల సమావేశం
నల్లగొండ జిల్లా, దేవరకొండ:  బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థి గా  నాన్ లోకల్ వ్యక్తి కి కేటాయించారని, నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ పట్టణ అధ్యక్షుడు అట్టికేశ్వరం దయాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాల నుండి బహుజన్ సమాజ్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీని గ్రామ గ్రామాన తండ తండ ప్రతి గూడేలకు తీసుకెళ్లిన రామావత్ రమేష్ నాయక్ ను కాదు అని నాన్ లోకల్ వ్యక్తిని తీసుకువచ్చి ఇక్కడ టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు విన్నవించుతూ..  సర్ దేవరకొండ నియోజకవర్గం లో ప్రతి ఒక్కరు కూడా నాన్ లోకల్ వ్యక్తికి టికెట్ కేటాయించడానికి వ్యతిరేకిస్తున్నారు. గ్రామాలలో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. వారి అభిప్రాయాలను, మా సూచనలను తీసుకొని మీరు పునరాలోచించి దేవరకొండ ప్రజలకు సుపరిచితుడు అయినటువంటి వ్యక్తి, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే వ్యక్తి ఎప్పుడు ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తి సుమారు 2014, 2015 సం. నుండి స్వేరో నెట్వర్క్ లో కీలకంగా పనిచేసి తన మార్కును చూపించినటువంటి వ్యక్తి, కోవిడ్ టైంలో ఎందరినో అభాగ్యులను ఆదుకొన గొప్ప మానత్వం కలిగి వ్యక్తి రామావత్ రమేష్ నాయక్ కు బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్నామని  వారు అన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమావత్ రమేష్ నాయక్ చింతపల్లి మండల అధ్యక్షులు ముదిగొండ మొగిలయ్య, కోండమల్లేపల్లి మండల అధ్యక్షులు గ్యార యాదగిరి, నేరేడుగొమ్ము మండల రావులపల్లి ఆంజనేయులు, చందంపేట మండల అధ్యక్షులు కేతావత్ మంగులాల్ నాయక్, పెద్దఅడిశర్లపల్లి మండల అధ్యక్షులు ధర్మాపురం శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇమ్రాన్, కోశాధికారి మత్తంగి జాన్,నల్లా శ్రీకాంత్, గ్యార సమేల్, అనిల్, అంజి, వెంకట్, శ్రీరాములు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
లెంకలపల్లి: గ్రామపంచాయతీ కార్మికుడు తిప్పర్తి లింగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం

నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామ పంచాయతీ కార్మికుడు తిప్పర్తి లింగయ్య అనారోగ్యంతో బుధవారం మరణించడం జరిగింది.  గ్రామ పంచాయతీ కార్యదర్శి  గుర్రం ఉమాదేవి తో కలిసి గ్రామ సర్పంచ్ పాక నగేష్ గురువారం తిప్పర్తి లింగయ్య పార్థివ దేహాన్ని సందర్శించి, వారి సతీమణి తిప్పర్తి జయమ్మ కు ఆర్ధిక సహాయం అందజేశారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా 'మానక్ మహోత్సవ్'
నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కళాశాల స్టాండర్డ్స్ క్లబ్ ఆధ్వర్యం లో గురువారం 'మానక్ మహోత్సవ్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిధులుగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నుంచి టి.రాకేష్, జాయింట్ డైరెక్టర్ మరియు జి‌. ప్రభాకర్ రిటైర్డ్ డి‌ఎస్‌ఓ పాల్గొని హాల్ మార్క్ తదితర స్టాండర్డ్స్ ప్రాముఖ్యతను, BIS పనితీరును వివరించారు. ప్రిన్సిపాల్ డా.ఘన్ శ్యామ్ మాట్లాడుతూ..నిత్య జీవితంలో స్టాండర్డ్స్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో  విద్యార్ధినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు BIS తరపున పది వేల రూపాయల నగదు బహుమతులు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, ఏ‌ఈసి డా.వెంకట కృష్ణ, అధ్యాపకులు రాజశేఖర్, యాదగిరి, నరసింహ రాజు, బిక్షమయ్య, అరుణ, నరేష్ పాల్గొన్నారు.

SB NEWS NALGONDA

SB NEWS TELANGANA
లెంకలపల్లి: తిప్పర్తి లింగయ్యకు ఘన నివాళి
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం, లెంకలపల్లి  గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ వర్కర్స్ సీనియర్ నాయకుడు కామ్రేడ్ తిప్పర్తి లింగయ్య కు గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సిఐటియు జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ  మాట్లాడుతూ.. కామ్రేడ్ తిప్పర్తి లింగయ్య  గ్రామపంచాయతీ వర్కర్స్ గా పనిచేస్తూ మండల అధ్యక్షుడిగా పనిచేస్తూ చురుగ్గా ఉద్యమంలో పాలుపంచుకొని ముందుకెళ్లాడని ప్రజా ఉద్యమానికి సిఐటియు కీలకంగా పని చేశాడని, ఆయన లోటు పూడ్చలేనిదని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఘన నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు  నాంపల్లి చంద్రమౌళి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, గ్రామపంచాయతీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు మండల అధ్యక్షుడు వట్టిపల్లి హనుమంతు, మండల కార్యదర్శి ఊరుపక్క లింగయ్య, నక్క నరసింహ, ఊరు పక్క వెంకటయ్య, బడే లక్ష్మీకాంత్, గుండెపూరి నరసింహ, ప్లంబర్ యూనియన్ నాగోల్, హైదరాబాద్ యూనియన్ అధ్యక్షుడు దామెర రవి, ఆశ వర్కర్స్ ఏర్పుల పద్మ, ఎస్.కె సైదాబేగం, అమరాబాదు సునీత,ఎడ్ల అంజయ్య, మంజుల తదితరులు పాల్గొన్నారు.
TS: ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ
HYD: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో బిజెపి ఎన్నికల కమిటీలను  ప్రకటించింది. 14 కమిటీలను నియమించింది.
వివరాలు ఇలా ఉన్నాయి
1. సోషల్ ఔట్‌రీచ్‌ కమిటీ చైర్మన్ డాక్టర్ కె. లక్ష్మణ్ (ఎంపీ)
కన్వీనర్ బొర్రా నర్సయ్య గౌడ్ (మాజీ ఎంపీ)
2. పబ్లిక్ మీటింగ్స్ చైర్మన్ బండి సంజయ్ కుమార్ (ఎంపీ)
కన్వీనర్ జి. ప్రేమేందర్ రెడ్డి
జాయింట్ కన్వీనర్ కాసం వెంకటేశ్వర్లు.
3. ఇన్‌ఫ్లుయెన్సర్ ఔట్‌ రీచ్‌ కమిటీ చైర్మన్ డీకే అరుణ.
కన్వీనర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి
4. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి.
కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి.
జాయింట్ కన్వీనర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
5. చార్జిషీట్ కమిటీ చైర్మన్ మురళీధర్ రావు.
కన్వీనర్ లక్ష్మీనారాయణ (మాజీ ఎమ్మెల్యే)
జాయింట్ కన్వీనర్ చింతల రామచంద్రారెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
జాయింట్ కన్వీనర్ రామచంద్రుడు (రిటైర్డ్ ఐఏఎస్)
6. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
కన్వీనర్ దుగ్యాల ప్రదీప్ కుమార్.
7. యాక్షన్ కమిటీ చైర్మన్ విజయశాంతి (మాజీ ఎంపీ)
కన్వీనర్ గంగిడి మనోహర్ రెడ్డి
8. సోషల్ మీడియా చైర్మన్ ధర్మపురి అరవింద్
కన్వీనర్ పొరెడ్డి కిషోర్ రెడ్డి
9. ఎన్నికల కమిషన్ ఇష్యూష్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి
కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్
10. హెడ్ క్వార్టర్స్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నల్లు ఇంద్రసేనా రెడ్డి
కన్వీనర్ బంగారు శృతి
11. మీడియా కమిటీ చైర్మన్ రఘునందన్ రావు,
కన్వీనర్ ఎన్. రామచంద్రరావు. (మాజీ ఎమ్మెల్సీ)
జాయింట్ కన్వీనర్ ఎస్. ప్రకాశ్ రెడ్డి (బీజేపీ సెక్రటరీ)
12. క్యాంపెయిన్ ఇష్యూ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్.
కన్వీనర్ ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్
13. ఎస్సీ నియోజకవర్గాల కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జితేందర్ రెడ్డి.
కన్వీనర్ జి. విజయ రామారావు (మాజీ మంత్రి)
14. ఎస్టీ నియోజకవర్గాల కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గరికపాటి మోహన్ రావు.
కన్వీనర్ సోయం బాపూరావు (ఎంపీ)
జాయింట్ కన్వీనర్ డి. రవీంద్ర నాయక్
TS: పెండింగ్ లో ఉన్న కరువుభత్యాలు అన్ని మంజూరు: సజ్జనార్
HYD: TSRTC ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న కరువు భత్యాలు (డీఏ) అన్నింటినీ మంజూరు చేసినట్లు టి ఎస్ ఆర్ టి సి మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్
తెలిపారు. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏ ను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏ ను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. సజ్జనార్ మాట్లాడుతూ..టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ టిఎస్ ఆర్టిసి అని, క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏ లను మంజూరు చేసింది. తాజా డీఏ మంజూరు తో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించింది. అని తెలిపారు.

SB NEWS TELANGANA