TS: పారదర్శకత, అక్రమాల నివారణకు ఈ - మైనింగ్ మొబైల్ యాప్: మంత్రి పట్నం మహేందర్ రెడ్డి
HYD: గనులు భూగర్భ వనరుల శాఖలో మరింత పారదర్శకతను పెంచుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ- మైనింగ్ మొబైల్ యాప్ దోహదం చేస్తుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయ భవనంలో సిఎస్ శాంతి కుమారి, గనుల శాఖ డీఎం జిపి.కాత్యాయని దేవి లతో కలిసి శనివారం, తెలంగాణ ఈ - మైనింగ్ మొబైల్ యాప్ ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గనులు, భూగర్భ వనరుల శాఖ మరియు హైదరాబాద్ లోని జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్ఐసి) సంయుక్తంగా ఈ మొబైల్ యాప్ ను అభివృద్ధి పరిచినట్లు తెలిపారు. ఈ- మైనింగ్ యాప్ తో గనులు, ఇటుక, ఇసుక రవాణా జరిగినప్పుడు రవాణా వాహనాలను తనిఖీ చేసి ట్రాన్సిస్ట్ ఫామ్ మరియు ట్రాన్సిస్టర్ అనుమతులు ఉన్నాయా లేవా అనే అంశాలను ఆన్లైన్లో వెంటనే సిబ్బంది తెలుసుకోవచ్చని తెలిపారు.
అక్రమ రవాణా, అనుమతులు లేకుండా, అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో రవాణా కు పాల్పడితే వారిపై చర్యలు తీసుకొని, పెనాల్టీ విధించి ఆ సమాచారాన్ని వాహన యజమానికి ఆన్లైన్ పద్ధతిలో లింక్ ద్వారా పంపించి, వెంటనే పెనాల్టీ వసూలు చేసేందుకు సిబ్బందికి.. అలాగే చెల్లించేందుకు వాహన యజమానికి వెసులుబాటు ఉంటుందని అన్నారు.
డీలర్లు మరియు లీజు హోల్డర్లు ఖనిజ రవాణాలో ఆన్లైన్ ద్వారా తమ రవాణా చేసుకునేందుకు శాఖా పరమైన అనుమతుల నిర్ధారణ సైతం తెలుసుకోవచ్చని అన్నారు. అలాగే తనిఖీలు నిర్వహించే గనుల శాఖ ఏడీ లు, అసిస్టెంట్ జియాలజిస్టులు, టెక్నికల్ అసిస్టెంట్లు, రాయల్టీ ఇన్స్పెక్టర్ లకు వాహనాల తనిఖీ చాలా సులభం అవుతుందని వెల్లడించారు.
ఈ - మైనింగ్ మొబైల్ యాప్ ద్వారా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు వెంటనే తీసుకోవడంతో పాటు పారదర్శకత మరింత పెరుగుతుందని ఆయన తెలిపారు. ఇసుకతో పాటు ఇటుక, ఖనిజాల అక్రమ రవాణాలో పారదర్శకతకు ఎంతో తోడ్పడుతుందని, దేశంలోనే ఎక్కడలేని విధంగా అభివృద్ధి పరిచే దశలో ఉందని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు.
SB NEWS TELANGANA

HYD: గనులు భూగర్భ వనరుల శాఖలో మరింత పారదర్శకతను పెంచుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ- మైనింగ్ మొబైల్ యాప్ దోహదం చేస్తుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయ భవనంలో సిఎస్ శాంతి కుమారి, గనుల శాఖ డీఎం జిపి.కాత్యాయని దేవి లతో కలిసి శనివారం, తెలంగాణ ఈ - మైనింగ్ మొబైల్ యాప్ ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గనులు, భూగర్భ వనరుల శాఖ మరియు హైదరాబాద్ లోని జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్ఐసి) సంయుక్తంగా ఈ మొబైల్ యాప్ ను అభివృద్ధి పరిచినట్లు తెలిపారు. ఈ- మైనింగ్ యాప్ తో గనులు, ఇటుక, ఇసుక రవాణా జరిగినప్పుడు రవాణా వాహనాలను తనిఖీ చేసి ట్రాన్సిస్ట్ ఫామ్ మరియు ట్రాన్సిస్టర్ అనుమతులు ఉన్నాయా లేవా అనే అంశాలను ఆన్లైన్లో వెంటనే సిబ్బంది తెలుసుకోవచ్చని తెలిపారు.
అక్రమ రవాణా, అనుమతులు లేకుండా, అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో రవాణా కు పాల్పడితే వారిపై చర్యలు తీసుకొని, పెనాల్టీ విధించి ఆ సమాచారాన్ని వాహన యజమానికి ఆన్లైన్ పద్ధతిలో లింక్ ద్వారా పంపించి, వెంటనే పెనాల్టీ వసూలు చేసేందుకు సిబ్బందికి.. అలాగే చెల్లించేందుకు వాహన యజమానికి వెసులుబాటు ఉంటుందని అన్నారు.
డీలర్లు మరియు లీజు హోల్డర్లు ఖనిజ రవాణాలో ఆన్లైన్ ద్వారా తమ రవాణా చేసుకునేందుకు శాఖా పరమైన అనుమతుల నిర్ధారణ సైతం తెలుసుకోవచ్చని అన్నారు. అలాగే తనిఖీలు నిర్వహించే గనుల శాఖ ఏడీ లు, అసిస్టెంట్ జియాలజిస్టులు, టెక్నికల్ అసిస్టెంట్లు, రాయల్టీ ఇన్స్పెక్టర్ లకు వాహనాల తనిఖీ చాలా సులభం అవుతుందని వెల్లడించారు.

నల్లగొండ: పట్టణంలోని మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన, నల్గొండ డివిజన్ స్థాయి కబడ్డీ అండర్ 17 బాలుర విభాగంలో, నల్గొండ మండల జట్టు అద్భుతమైన ఆటతీరుతో అన్ని మండల జట్లపై విజయం సాధించి ఫైనల్ కు చేరుకొని.. కేతెపల్లి మండలం పై అద్భుతమైన విజయం సాధించి డివిజన్ స్థాయి విజేతగా నిలిచిందని, శనివారం కబడ్డీ టీం కోచ్ బొమ్మపాల గిరిబాబు తెలిపారు.
గత వారం రోజుల నుండి మండల కబడ్డీ జట్టుకు హైదరాబాద్ రోడ్ లోని ఏస్ ఆర్ ప్రైమ్ స్కూల్ లో ప్రత్యేక శిక్షణను పాఠశాల పిఇటి ల పర్యవేక్షణలో నిర్వహించామని, తద్వారా క్రీడాకారులు మంచి ప్రావిణ్యాన్ని పొందారని ఈ సందర్భంగా కోచ్ బొమ్మపాల గిరిబాబు తెలిపారు.
SB NEWS
SB NEWS NALGONDA DIST
హైదరాబాద్: కేరళ రాష్ట్ర ప్రభుత్వ పోర్ట్స్, మ్యూజియమ్స్, అర్కియాలజీ శాఖల మంత్రి అహ్మద్ దేవర కోవిల్ శనివారం తెలంగాణ రాష్ట్ర శాసన సభ, శాసన మండలిని సందర్శించారు.
ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా తో సత్కరించి, చార్మినార్ మెమెంటో ను అందజేశారు. కేరళమంత్రికి శాసన సభ, శాసన మండలి సమావేశ మందిరాలను చూపించి.. తెలంగాణ రాష్ట్రంలో సమావేశాలు జరిగే తీరు, నియమ నిబంధనలు అన్నింటిని సుఖేందర్ రెడ్డి వివరించారు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి కూడా కేరళ మంత్రి కి ఆయన వివరించారు. ఈ ప్రోగ్రామ్స్ వల్ల తెలంగాణ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి పథంలో నడుస్తున్నదని కేరళ మంత్రి అహ్మద్ దేవర కోవిల్ ఈ సందర్భంగా కొనియాడారు.
నల్గొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగుల ఆధ్వర్యంలో శనివారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య పాల్గొని, మద్దతు తెలిపి మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు 10 లక్షలు హెల్పర్ కు 5 లక్షల చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని, 2017 నుండి టీఏ డీఏ ఇంక్రిమెంట్, అలవెన్సులు బకాయిలు మొత్తం చెల్లించాలని, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు.
SB NEWS NALGONDA DIST
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడం ఆనందంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసై శనివారం కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. "తమకు (మహిళలకు) 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రధాని మోదీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఒకప్పుడు నేను భాజపా నేతను, ఇప్పుడు గవర్నర్ను.. రాజకీయాలపై ఇష్టం వల్లే వైద్య వృత్తికి దూరంగా ఉన్నా, రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువ. నేను గవర్నర్గా వచ్చినప్పుడు ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. గవర్నర్గా వచ్చిన తర్వాత ఇద్దరు మహిళలు మంత్రులు అయ్యారు.
నల్గొండ: జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బంగ్లాలో అరుంధతీయ మేధావుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భాషపాక చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంలో జిల్లా కలెక్టర్ ఉండాలని, ప్రభుత్వం నుండి అందిస్తున్న సంక్షేమ పథకాలను పేదలకు అందే విధంగా కృషి చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం ముఖ్య సలహాదారు బాకీ యాదగిరి, ఎం ఈ ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న, నల్లగొండ జిల్లా అధ్యక్షులు యల్ నగేష్, తదితరులు పాల్గొన్నారు.
HYD: మాదన్న పేట పోలీస్ స్టేషన్ ఆవరణలో వ్యక్తిపై, రౌడీషీటర్ దాడి చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఫిరోజ్ అనే వ్యక్తిపై రౌడీషీటర్ ఇబ్రహీం ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
పోలీస్ స్టేషన్ ముందే కత్తితో దాడి చేయడంతో జనం భయంతో పరుగులు తీశారు. దాడి చేసిన రౌడీషీటర్ పారిపోయాడు. ఫిరోజ్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరి మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు ఉన్నట్టు సమాచారం. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,,
భద్రాచలం జిల్లా: మరి కొద్దిసేపట్లో డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లవలసిన శ్రీదేవి అనే మహిళ హెడ్ కానిస్టేబుల్ మృత్యు ఒడిలోకి వెళ్ళింది. రామాలయం సమీపంలో ఉన్న డ్రైనేజీలో పడి శనివారం మధ్యాహ్నం ఆమె ప్రాణాలు కోల్పోయింది.
కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీదేవి ప్రాణాలు కోల్పోయింది. కెటిఆర్ పర్యటన కు బందోబస్తుకు వచ్చిన ఆమె.. రామాలయం వద్ద వాహనాలు పార్కింగ్ చేసే స్థలం వద్ద నుంచి అన్నదాన సత్రం వైపు నడుచుకుంటూ వస్తుండగా డ్రైనేజ్ లో పడిపోయింది.
స్థానికుల సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్లోయిస్ గేట్ల వద్ద కానిస్టేబుల్ శ్రీదేవి మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం: అజిలాపురం- నర్శింహ్మపురం గ్రామాల అనుబంధ రహదారిని బి.టీ రోడ్డుగా మార్చాలని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి వినతిపత్రాన్ని శనివారం మెగావత్ చందు నాయక్ అందజేశారు.
అజిలాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఆవాస గ్రామం నర్సింహ్మ పురం రోడ్డు సరైనది లేక ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని కలిసి సేవ సమాజ్ నిర్మాణ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
మెగావత్ చందు నాయక్ మాట్లాడుతూ.. అజిలాపురం గ్రామం నుండి నర్శింహ్మపురం మీదుగా నర్శింహ్మ పురం గేటు అనగా మెయిన్ రోడ్డు వరకు రోడ్డు పూర్తిగా కంకర తేలిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించి నర్శింహ్మపురం రోడ్డు ను బి టి రోడ్డుగా మార్చవలసిందిగా కోరారు.
SB NEWS
Oct 01 2023, 09:36
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.3k