/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz అక్టోబర్ 2న మంత్రి కేటీఆర్ ప్రారంభించబోయే ఐటి హబ్ ప్రారంభోత్సవానికి పలు ఐటి కంపెనీలను జూమ్ మీటింగ్ ద్వారా ఆహ్వానించిన ఎమ్మెల్యే కంచర్ల Miryala Kiran Kumar
అక్టోబర్ 2న మంత్రి కేటీఆర్ ప్రారంభించబోయే ఐటి హబ్ ప్రారంభోత్సవానికి పలు ఐటి కంపెనీలను జూమ్ మీటింగ్ ద్వారా ఆహ్వానించిన ఎమ్మెల్యే కంచర్ల

ఫ్లాష్.. ఫ్లాష్

 అక్టోబర్ 2న మంత్రి కేటీఆర్ ప్రారంభించబోయే ఐటి హబ్ ప్రారంభోత్సవానికి పలు ఐటి కంపెనీలను జూమ్ మీటింగ్ ద్వారా ఆహ్వానించిన ఎమ్మెల్యే కంచర్ల..

ఈరోజు సాయంత్రం.. నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. అక్టోబర్ 2వ తేదీ పురపాలక & ఐటి శాఖ మాత్యులు కేటీఆర్ నల్లగొండలో ప్రారంభించనున్న ప్రతిష్టాత్మక ఐటీ హబ్ కు ఆహ్వానిస్తూ పలు ఐటి కంపెనీలతో.. జూమ్ మీటింగ్ లో ఆహ్వానించారు.

 

అదేవిధంగా గత నెలలో నిర్వహించిన జాబ్ మేళా సందర్భంగా... హాజరైన వివిధ కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడుతూ.. స్థానిక యువతను ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకునే విధంగా.. వారిని అభ్యర్థించారు.

 సకల సౌకర్యాలతో..నల్లగొండ ఐటి టవర్ అక్టోబర్ రెండు నా ప్రారంభించకపోతున్నందున...

 వెంటనే తమ కంపెనీలను నల్గొండలో ఏర్పాటు చేసుకొనుటకు.. తరలి రావలసిందిగా వారికి విజ్ఞప్తి చేశారు

 

ఈ జూమ్ మీటింగ్ లో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటి శాఖ ప్రతినిధి విజయ రంగీన్ గారు... టాస్క్ డైరెక్టర్ ప్రదీప్ రెడ్డి గారు.. పలువురు ఐటీ కంపెనీల యజమానులు పాల్గొన్నారు

గవర్నర్‌గా మీరు ఫిట్టా.. బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసి గవర్నర్‌ ఎలా అయ్యారు?: మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

గవర్నర్‌గా మీరు ఫిట్టా.. బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసి గవర్నర్‌ ఎలా అయ్యారు?: మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

ఆనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న దా సోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నియమించకుండా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఎలా తిరస్కరిస్తారని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

బీజేపీ అధ్యక్షురాలిగా ఉండి గవర్నర్‌ ఎలా అయ్యారు?

సర్కారియా సిఫారసులకు ఎలా తిలోదకాలిచ్చారు!: కేటీఆర్‌

బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులను ఎమ్మెల్సీలుగా నియమించలేదా?

ఉద్యమకారులను తిరస్కరిస్తారా?

బడుగు, బలహీనవర్గాల గొంతుకలు వినిపించకూడదా?

గవర్నర్‌పై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న దా సోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నియమించకుండా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఎలా తిరస్కరిస్తారని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. సర్కారియా కమిషన్‌ సిఫారసులను తుంగలో తొక్కి మీరు గవర్నర్‌ ఎలా అయ్యారని తమిళిసైని సూటిగా ప్ర శ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. 

క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించిన పంపిన సిఫారసులను గవర్నర్‌ ఎలా తిరస్కరిస్తారని నిలదీశారు. 'దాసోజు శ్రవణ్‌ ఉన్నత విద్యావంతుడు, ప్రొఫెసర్‌. తెలంగాణ ఉద్యమంతోసహా అన్ని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి. మా మీద కోపమున్నా శ్రవణ్‌పై గవర్నర్‌కు కోపం ఉండదని అనుకు న్నాం. గిరిజన సామాజిక వర్గానికి చెందిన కుర్రా సత్యనారాయణ జాతీయ కార్మిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న నాయకుడు. సంగారెడ్డి వంటి జనరల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నేత. ఈ ఇద్దరి నేపథ్యాలను గవర్నర్‌ మనసుతో ఆలోచిస్తే తక్షణం ఆమోదించి ఉండేవారు' అని అన్నారు.

వారు.. గవర్నర్‌ పోస్టుకు ఫిట్టా?

మోదీ అప్రజస్వామిక విధానాలను అనుసరిస్తున్నట్టే ఆయన ఏజెంట్లయిన గవర్నర్లు అంతకంటే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. 'రాజకీయాల్లో ఉన్నవాళ్లను ఎమ్మెల్సీ వంటి పదవుల్లోకి తీసుకురావద్దని గవర్నర్‌ పేర్కొనటం హాస్యాస్పదం. క్రీయాశీల రాజకీయాల్లో ఉన్నవాళ్లను గవర్నర్లుగా నియమించకూడదని సర్కారియా కమిషన్‌ సిఫారసులు చేసినా మీరు గవర్నర్‌ కా లేదా? ఆ సిఫారసులను తుంగలో తొక్కిన మో దీ అన్‌ఫిట్టా? గవర్నర్‌ పదవిని చేపట్టేనాటికి ఒ క్కరోజు ముందు కూడా రాజకీయాల్లో ఉన్న మీ రు అన్‌ఫిట్టా?' అని తమిళిసైని ప్రశ్నించారు. ఎ వరు ఫిట్‌.. ఎవరు అన్‌ఫిట్‌ అనే అంశాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పారు.

వాళ్లు ఫిట్‌.. మావాళ్లు అన్‌ఫిట్టా?

ఎమ్మెల్సీగా పనిచేయటానికి బీజేపీ వాళ్లు ఫిట్‌ కానీ, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవాళ్లు అన్‌ఫిట్టా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీకి ఒక విధానం, బీఆర్‌ఎస్‌కు మరో విధానమా? అని నిలదీశారు. రాజ్యసభ సభ్యులుగా, ఆయా రాష్ర్టాల ఎమ్మెల్సీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ఫిట్‌.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యమకారులైన బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారిని ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తే అన్‌ఫిట్టా? ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను తిరస్కరించాలని గవర్నర్‌కు పై నుం చి ఆదేశాలు వచ్చి ఉంటాయి. అందుకే వాటిని తిరస్కరించారు' అని మండిపడ్డారు.

కాంగ్రెస్‌లో పనిచేసి బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్యసింధియాను, రంజన్‌ గొగోయ్‌ని బీజేపీ రాజ్యసభకు నామినేట్‌ చేయలేదా?

యూపీలో బీజేపీ అధ్యక్షుడిగా చేసిన బ్రజ్‌ క్షేత్రాను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయలేదా?

గుజరాత్‌లో బీజేపీ నాయకుడు రాంసూరజ్‌ రాజధర్‌ అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోతే ఎమ్మెల్సీగా నామినేట్‌ కాలేదా?

యూపీలో ఆదిత్యనాథ్‌ తానా అంటే తం దానా అనే బీజేపీ నేత సాకేత్‌ మిశ్రాను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయలేదా?

బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్జీ నిర్మల్‌ ఎమ్మెల్సీ కాలేదా?

బీజేపీ వారణాసి అధ్యక్షుడు హన్స్‌రాజ్‌ ఎమ్మెల్సీగా నామినేట్‌ కాలేదా?

కర్ణాటక కాంగ్రెస్‌ క్యాంపెయిన్‌ కమిటీ చైర్మన్‌ ఎస్పీ సుధాందాస్‌, మరో కాంగ్రెస్‌ నేత సీతారాంను ఇటీవలే ఎమ్మెల్సీగా అక్క డి బీజేపీ గవర్నర్‌ ఎట్లా ఆమోదించారు?

కర్ణాటకలో ఉమాశ్రీని గవర్నర్‌ ఎలా నామినేట్‌ చేశారు? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

కిషన్‌రెడ్డి అసమర్థ కేంద్ర మంత్రి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంబర్‌పేటలో వచ్చే ఎన్నికల్లో ఏ అర్జున అవార్డీని రంగంలోకి దింపుతారో వేచిచూద్దామని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీలుగా అర్జున అవార్డు గ్రహీతను చేయాల్సి ఉండేదని కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యపై మంత్రి స్పందిస్తూ 'వచ్చే ఎన్నికల్లో కిషన్‌రెడ్డి ఏ అర్జున అవార్డీని దింపుతారో చూద్దాం' అని పేర్కొన్నారు. దేశంలో అత్యంత అసమర్థ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అని ఆరోపించారు. సొంత నియోజకవర్గంలో కనీసం ఒక ఫ్లై ఓవర్‌ను కూడా పూర్తి చేయలేని వ్యక్తి గురించి మాట్లాడటం దండుగ అని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.

గవర్నర్ల వ్యవస్థ అవసరమా?

వలసవాదానికి గుర్తుగా ఉన్న గవర్నర్ల వ్యవస్థ దేశానికి అవసరమా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. 'తమిళనాడు గవర్నర్‌ ఆ రాష్ట్ర పేరునే మారుస్తామంటున్నారు.

మరో రాష్ట్ర గవర్నర్‌ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు విలువ లేకపోతే ఈ ప్రభుత్వాలెందుకు? దేశంలో ఇంకా వలసవాద వాసనలు వస్తున్నాయి కనుక రాజ్‌పథ్‌ పేరు తీసేసి కర్తవ్యపథ్‌ పెడ్తున్నా అని ప్రధాని మోదీ అన్నారు. వలసవాదులు ఏలినప్పుడు పెట్టిన వైస్రాయ్‌లే నేటి గవర్నర్లు కదా? అలాంటప్పుడు ఈ గవర్నర్ల వ్యవస్థ అవసరమా? ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలి' అని సూచించారు.

ఆసియా గేమ్స్‌లో మెరిసిన తెలంగాణ బిడ్డ ఈషా సింగ్‌.. హర్షం వ్యక్తం చేసిన కేసీఆర్‌

ఆసియా గేమ్స్‌లో మెరిసిన తెలంగాణ బిడ్డ ఈషా సింగ్‌.. హర్షం వ్యక్తం చేసిన కేసీఆర్‌

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్-2023 పోటీల్లో తెలంగాణ బిడ్డ మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో ఈషా సింగ్ బృందం స్వర్ణ పతకం సాధించింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. 

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్-2023 పోటీల్లో తెలంగాణ బిడ్డ మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో ఈషా సింగ్ బృందం స్వర్ణ పతకం సాధించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు.

ఈషా సింగ్ బృందం 1,759 పాయింట్లతో భారత్‌కు గోల్డ్ మెడల్ సాధించి, టీమ్ స్పిరిట్‌ను చాటిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అమలుచేస్తున్న పటిష్ట కార్యాచరణే జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికల్లో తెలంగాణ క్రీడాకారులు కనబరుస్తున్న ప్రతిభకు నిదర్శనమని సీఎం అన్నారు. తెలంగాణ క్రీడాకారులు రానున్న రోజుల్లో మరెన్నో పతకాలు సాధించి, తెలంగాణ ఖ్యాతిని జగద్వితం చేయాలని సీఎం ఆకాంక్షించారు.

sb news

sb news telangana

sb news are national news

ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రముఖ జాతీయ ఉర్దూ దినపత్రిక అధిపతి, ఏసియన్ ఫిలిం అధినేత మీర్జా మెహతాబ్ బేగ్ నీ కలుసుకున్న కట్టెల శివకుమార్

ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రముఖ జాతీయ ఉర్దూ దినపత్రిక అధిపతి, ఏసియన్ ఫిలిం అధినేత మీర్జా మెహతాబ్ బేగ్ నీ కలుసుకున్న ఎస్సీ ఎస్టీ రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు కట్టెల శివకుమార్

ఢిల్లీ నగర ప్రముఖుడు, Dmef జాతీయ అధ్యక్షులు జాతీయ ఉర్దూ దిన పత్రిక అధిపతి,ASIAN PUBLIC SCHOOL వ్యవస్థాపకులు , ఏసియన్ ఫిలిమ్స్ అధినేత హిందీ చిత్ర నిర్మాత 

MIRZA MEHATAB BAIG గారిని

మర్యాదపూర్వకముగా కలిసి..

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ వేడుకలలో పాల్గొనడం జరిగింది.

మందుబాబులకు చేదు వార్త..


మందుబాబులకు చేదు వార్త


హైదరాబాద్: హైదరాబాద్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది. హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ సహా శివార్లలోని చెరువుల్లో గణేషుడి విగ్రహాలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేస్తోన్నారు మండపాల నిర్వాహకులు. ఆయా ప్రాంతాలన్నింట్లో కూడా సందడి నెలకొంది.

ఈ నెల 28వ తేదీన తుదిదశ గణేషుడి విగ్రహాల నిమజ్జనం జరుగనుంది. హైదరాబాద్ పాతబస్తీ, ఖైరతాబాద్ వినాయకుడు సహా నగరంలోని విగ్రహాలన్నీ ఆ రోజున హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కానున్నాయి. ఈ వేడుకను తిలకించడానికి లక్షలాది మంది భక్తులు హైదరాబాద్‌కు తరలిరావడం ఆనవాయితీగా వస్తోంది.


Closure of wine shops in Hyderabad on Sept 28 and 29


దీనితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేస్తోన్నారు. శోభయాత్ర సాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించనున్నారు. వాహనాలను దారి మళ్లించనున్నారు. దీనికోసం ఎక్కడికక్కడే బ్యారికేడ్లను ఏర్పాటు చేయనున్నారు.

నిమజ్జనం సజావుగా సాగడానికి ఎక్కడికక్కడ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సుమారు 3,600 సీసీ కెమెరాలు వినియోగిస్తోన్నారు పోలీసులు. సున్నిత, సమస్యాత్మక ప్రదేశాలపై డేగకన్ను వేశారు. అలాంటి చోట్ల ముందస్తు చర్యలు తీసుకున్నారు. అదనపు పోలీసు బలగాలను మోహరింపజేయనున్నారు.

తుదిదశ నిమజ్జనోత్సవం నాడు 21,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. పారా మిలటరీ బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను సైతం రంగంలోకి దింపనున్నారు. దీనిపై ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్ష సైతం నిర్వహించారు.



ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా- నిమజ్జనోత్సవం నాడు హైదరాబాద్ నగరంలోని అన్ని పోలీస్ కమిషనరేట్ల పరిధిల్లో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. 28వ తేదీన తెల్లవారు జామున 6 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలన్నీ మూతపడనున్నాయి.

కల్లు దుకాణాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఈ రెండు రోజుల పాటు మూసివేయాల్సి ఉంటుందని హైదరాబాద్ నగర పోలీసులు ఆదేశించారు. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బుల్లో ఉండే బార్ అండ్ రెస్టారెంట్లకు మాత్రం మినహాయింపును ఇచ్చినట్లు వెల్లడించారు.

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవం

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవం

వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సాగర్ రోడ్ లో ఉన్నటువంటి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...

భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకిరి కోసం ఉద్యమించినటువంటి గొప్ప వీరనారి చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లాలో పుట్టి తాను ఆనాడు నిజాం ప్రభులకు విష్ణు రామచంద్రరావు తో పోరాటం చేసినటువంటి గొప్ప వీరనారి వారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయడం బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేశారు.

కానీ బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారంలో వాటా పంచుకోనంతవరకు ఈ రాష్ట్రం బంగారు తెలంగాణ కాదని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల్లో 33 శాతం ఉన్నటువంటి దాన్ని 18 శాతాన్ని గుద్దిస్తూ ఎన్నికలకు పోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని చట్టసభల్లో 50% రిజర్వేషన్ ఇవ్వాలని అదేవిధంగా జనాభాలో లో కులగన జరపాలని నలగొండ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరి నారాయణ యాదవ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మున్నాస ప్రసన్నకుమార్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ బిసి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి యాదగిరి జిల్లా కార్యదర్శి మార్గం సతీష్ కుమార్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి కల్లూరు సత్యం గౌడ్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పగిళ్ల కృష్ణ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షురాలు ఖమ్మం పార్టీ దుర్గ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయం చేసినారు.

sb news

sb news telangana

SB NEWS TELANGANA

ఫ్లాష్ ఫ్లాష్.... నల్లగొండ మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి పనుల కోసం రూ.87 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ.

నల్లగొండ మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి పనుల కోసం రూ.87 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ.

: ఫ్లాష్... ఫ్లాష్....

 నల్లగొండ పట్టణంలో... వివిధ అభివృద్ధి పనుల కొరకు, GO RT NO..747 dt.25/09/2023 ద్వారా కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం... 87 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు

 

నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు పత్రికా ప్రకటన ద్వారా... తెలియచేశారు. ఎందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి.. కల్వకుంట్ల తారక రామారావు గారికి, జిల్లా మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారికి, కృతజ్ఞతలు తెలియజేశారు

♦️ పట్టణంలోని 48,వార్డులలో ... వివిధ అభివృద్ధి పనులు .. సీసీ రోడ్లు,డ్రైనేజీల, పార్కు ల అభివృద్ధి.. వాటర్ వర్క్స్..తదితర పనులకు కొరకు 55 కోట్లు

♦️ డీఈఓ ఆఫీస్ నుండి కేశరాజు పల్లి వరకు... మీడియన్ సెంట్రల్ లైటింగ్, చెట్ల పెంపకం.. కొరకు అదనంగా 18 కోట్ల రూపాయలు..

♦️వివేకానంద స్టాచ్యూ నుండి పెద్ద బండ వరకు.. మీడియన్, సెంట్రల్ లైటింగ్, ఫుట్పాత్ ల నిర్మాణం.. డ్రైనేజీ నిర్మాణం కొరకు అదనంగా 14 కోట్ల రూపాయలు..

 ఈరోజు..మొత్తం 87 కోట్ల రూపాయలు.. తాను దత్తత తీసుకున్న నల్లగొండ అభివృద్ధి కొరకు.. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు జిల్లా అభివృద్ధి ప్రదాత గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారికి తాను రుణపడి ఉంటానని.

 

నల్లగొండ అభివృద్ధికి అడిగినన్ని నిధులు కేటాయించి.. నల్లగొండను సుందర నందనవనంగా అభివృద్ధి పరుస్తు.. తనను కూడా, టికెట్ ఇచ్చి mla ను చేసి..అభివృద్ధిలో భాగస్వామిని చేసినందుకు కెసిఆర్ గారికి సర్వదా కృతజ్ఞడనని... తెలియచేసారు.

 ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నల్గొండ.

Sb news.

SB NEWS TELANGANA

విగ్నేశ్వరునికి వినతి పత్రం అందజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్

విగ్నేశ్వరునికి వినతి పత్రం అందజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ 

నేడు నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు గ్రూప్ 1 గ్రూప్ 2 మరియు dsc నోటిఫికేషన్ ఇయ్యకపోవడం చాలా దౌర్భాగ్యకరం  sc st bc మైనార్టీ ఉద్యోగాలు రాకపోవడం వల్ల మానసిక వేదన గురి అవుతున్నారు.

 గ్రూప్ వన్ రెండుసార్లు రద్దు చేయడం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది వారు లక్షల రూపాయలు వేచించి కోచింగ్ తీసుకున్నారు కావున గ్రూప్ వన్ రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి 1 ఒక లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ దేవునికి వినతి పత్రాన్ని సమర్పించారు kcr ముఖ్యమంత్రి గారి మనసు నిరుద్యోగుల పక్షాన ఉండాలని దేవుని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అల్లంపల్లి కొండన్న దుర్గాప్రసాద్ కిన్నెర మనోజ్ సిద్దు కుమార్ హేమంత్ రాజ్ శివతేజ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

SB NEWS TELANGANA

Sb news are national news

సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ టికెట్ దామన్నను కాదని ఇతరులకు కేటాయిస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా

సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ టికెట్ దామన్నను కాదని ఇతరులకు కేటాయిస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా

 సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావుల రాంబాబు

సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ దామన్నదే ఒకవేళ కాదని ఎవరికైనా టికెట్ ఇస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావుల రాంబాబు తెలిపారు.

సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రావుల రాంబాబు మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గత 40 సంవత్సరాలుగా కాపాడుతున్న రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారికి అధిష్టానం సూర్యాపేట టికెట్ కేటాయించాలని కోరారు.

నా లాంటి ఎంతో మంది యువకులకు కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇచ్చిన దామన్న సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు.

SB NEWS

SB NEWS TELANGANA

Sb news are national news

మళ్లీ షాక్ ఇచ్చిన గవర్నర్ తమిళసై...

TS News: కేసీఆర్ సర్కార్‌కు తమిళిసై మళ్లీ షాక్.. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు తిరస్కరణమళ్లీ షాక్ ఇచ్చిన గవర్నర్ తమిళసై...


తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయటానికి అర్హతలు అడ్డొస్తున్నాయంటూ ప్రభుత్వానికి ఆమె లేఖ రాశారు. అభ్యర్థులిద్దరూ ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు.. సేవా విభాగాల్లో పాల్గొన్నట్లు కనిపించలేదంటూ గవర్నర్ ప్రత్యేక లేఖ ద్వారా తెలియజేశారు.

రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) చెబుతోందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

గతంలో కౌశిక్‌రెడ్డికి కూడా ఇదే ఎదురుదెబ్బ తగిలింది. కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించి గవర్నర్‌కు పంపించింది. అప్పుడు కూడా కౌశిక్‌రెడ్డి ఎక్కడా సేవా కార్యక్రమాలు చేసినట్లు కనిపించలేదని తిరస్కరించారు.

తాజాగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు కూడా ఇలాంది ఎదురుదెబ్బ తగిలింది.