/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz కుదాబక్షిపల్లి గ్రామంలో ఆయుష్మాన్ భవ హెల్త్ మేళా నిర్వహించిన మండల నోడల్ సూపర్వైజర్ Mane Praveen
కుదాబక్షిపల్లి గ్రామంలో ఆయుష్మాన్ భవ హెల్త్ మేళా నిర్వహించిన మండల నోడల్ సూపర్వైజర్
నల్లగొండ జిల్లా: ఈరోజు మర్రిగూడ మండలం కుదాబక్షిపల్లి గ్రామంలో ఆయుష్మాన్ భవ హెల్త్ మేళ మరియు టి.బి, లెప్రసీ క్యాంపు లను మండల నోడల్ సూపర్వైజర్ ప్రేమ్ కుమార్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్యాంపులో బీపీ షుగర్ పరీక్షలు మరియు ఇతర వైద్య సేవలు ప్రజలకు అందించడం జరిగింది. ఈ క్యాంపులో ఎస్టిఎస్ సైదులు, డిపిఎమ్ఓ చంద్రశేఖర్ సార్ ,ఏఎన్ఎం లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST
TS: భక్తులతో సందడిగా ఖైరతాబాద్ మహా గణేశుడిని ప్రాంతం
హైదరాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఖైరతాబాద్ మహా గణేష్ విగ్రహానికి రాష్ట్రవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు, ప్రత్యేకత ఉన్నది. వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. నగరంలో రేపు ఖైరతాబాద్ గణేష్ నిమర్జనం ఉన్న సందర్భంగా, ఈ రోజు 69 అడుగుల, ఖైరతాబాద్ మహా గణేష్ దివ్య స్వరూపం చూడడానికి భక్తులు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో వచ్చి బుధవారం మహాగణపతిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరుసటి సంవత్సరం మళ్లీ వస్తాం స్వామి అనుకుంటూ తిరుగు ప్రయాణాలు ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల ఈ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణ నెలకొని సందడిగా ఉంది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక మధ్యాహ్నం సమయానికి భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు దర్శనాలను నిలిపివేశారు.

SB NEWS TELANGANA
TS: భక్తులతో సందడి నెలకొన్న ఖైరతాబాద్ మహా గణేశుడిని ప్రాంతం
హైదరాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఖైరతాబాద్ మహా గణేష్ విగ్రహానికి రాష్ట్రవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు, ప్రత్యేకత ఉన్నది. వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. నగరంలో రేపు ఖైరతాబాద్ గణేష్ నిమర్జనం ఉన్న సందర్భంగా.. ఈ రోజు 69 అడుగుల, ఖైరతాబాద్ మహా గణేష్ దివ్య స్వరూపం చూడడానికి భక్తులు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో వచ్చి బుధవారం మహాగణపతిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరుసటి సంవత్సరం మళ్లీ వస్తాం స్వామి అనుకుంటూ తిరుగు ప్రయాణాలు ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల ఈ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణ నెలకొని సందడిగా ఉంది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక మధ్యాహ్నం సమయానికి భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు దర్శనాలను నిలిపివేశారు. SB NEWS TELANGANA STREETBUZZ NEWS TELANGANA SB NEWS
NLG: ఏకదంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి

నల్గొండ పట్టణంలోని 48 వార్డు NG కాలనీలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BRS రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి హాజరై, ఆ ఏకదంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తదుపరి కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ యామ కవిత దయాకర్, 48 వార్డు అధ్యక్షుడు నాంపల్లి మనోహర్, సీనియర్ నాయకులు పుట్ట సుధాకర్ రెడ్డి, గుండ రాము, సోమయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు నితీష్, భరత్, మహేష్, మనిదీప్, చరణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
SB NEWS
NLG: నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం
నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించి, టీ ఏస్ పి ఏస్ సి బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేష్ స్వేరో పాల్గొని మాట్లాడుతూ.. ఎంతో మంది నిరుద్యోగుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ నిరుద్యోగులు బలైతూనే ఉన్నారని, గ్రూప్-1 పరీక్ష ఇప్పటికే రెండుసార్లు నిర్వహించారు. ఎలాంటి పారదర్శకత లేకుండా, అక్రమాల పుట్టగా ఉన్న టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయకుండా మళ్ళీ పరీక్షల నిర్వహించాలనుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని ఆయన అన్నారు. నిరుద్యోగుల పక్షాన తీవ్ర మొండి వైఖరి వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి యావత్ నిరుద్యోగ లోకమంతా రానున్న ఎలక్షన్లలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి దగ్గర పడ్డాయని, ఇప్పటికైనా కేసీఆర్ మేల్కొని, టిఎస్పిఎస్సి బోర్డు చైర్మన్ ను మరియు అలాగే సభ్యులను తొలగించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని, ప్రతి ఒక్క నిరుద్యోగికి ఒక లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, నూతన బోర్డును నియమించి జరగబోయే పరీక్షలను పారదర్శకతతో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేసారు. సిహెచ్ మౌనిక, సిహెచ్ కిరణ్మయి మాట్లాడుతూ.. కుటుంబాలను వదిలేసి వచ్చి సంవత్సరాలుగా లైబ్రరీలలో చదువుకుంటూ హాస్టల్ ఫీజులు కట్టి, ఒక పూట తిండి తిని తినక, మా కుటుంబాలు రోడ్లమీద పడే పరిస్థితి వచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనట్లేదని, మా నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నుండి వైఖరి తగదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రేణుక, మౌనిక, కోట క్రాంతి, వినోద్ చారీ, క్రాంతి కుమార్, కిరణ్, సైదులు, విక్రమ్, రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. SB NEWS

SB NEWS NALGONDA

SB NEWS TELANGANA
'అంగన్వాడి ఉద్యోగులను పెర్మనెంట్ చేసి కనీస వేతనం అమలు చేసే వరకు పోరాటం ఆగదు': నాంపల్లి చంద్రమౌళి
NLG: మర్రిగూడ మండలంలో అంగన్వాడీ ఉద్యోగులు 16వ రోజు సమ్మెలో భాగంగా మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజానాట్యమండలి నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడి ఉద్యోగులకు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు పది లక్షలు, హెల్పర్ కు 5 లక్షల చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని, 2017 నుండి టీఏ డీఏ ఇంక్రిమెంట్ ఇన్చార్జి అలవెన్సులు బకాయిలు మొత్తం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల మంది అంగన్వాడి ఉద్యోగులను పెర్మనెంట్ చేసి కనీస వేతనం అమలు చేసే వరకు పోరాటం ఆగదని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ శోభ, కే రజిత,జయశ్రీ, శారద, లక్ష్మి, సులోచన, అరుణ, అనంతలక్ష్మి, పద్మ, నిర్మల, సుగుణ యాదమ్మ,విమలాదేవి, తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA
రేషన్ కార్డుల నుండి పేర్లు తొలగిన వారి యొక్క పేర్లు నమోదు చేయడానికి అదనపు మీసేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి: నూనె వెంకట్ స్వామి
నల్లగొండ జిల్లా, చిట్యాల: ఇటీవల రేషన్ కార్డులలో పేర్లు నమోదు కానీ వారి యొక్క పేర్లను అన్నిటిని నమోదు చేయడం, వారి యొక్క ఫింగర్ ప్రింట్లను అప్డేట్ చేయడం, వారి యొక్క ఐరిష్ కెమెరాల ద్వారా కంటిపాప లను నమోదు చేయడం ఇటువంటి కార్యాక్రమాలకు సంబంధించి చిట్యాల లో ఒకే మీసేవ కేంద్రం ఉండడం వల్ల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని,  ప్రజా పోరాట సమితి నాయకులు మంగళవారం ఎంపిడిఓ కార్యాలయం ముందు బాధితులు అందరితో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మాట్లాడుతూ.. కలెక్టరేట్ లో ఉన్న మీసేవకు సంబంధించిన జిల్లా మేనేజర్ తో మాట్లాడి వెనువెంటనే చిట్యాల లో అదనపు మీసేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, చేయకపోతే కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్పిఎస్ నాయకులు చిట్టిమల్ల శ్రవణ్ కుమార్ యోధ, ఉయ్యాల లింగస్వామి గౌడ్, రొయ్య అంజయ్య, ఎన్నమల్ల ప్రదీప్, దొడ్డి యాదయ్య, ఎర్రమాద శ్రీనివాస్, రెడపాక లక్ష్మి, పానుగుల్ల పవిత్ర, సీమ, సునీత, బూడిద సంజీవ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA

STREETBUZZ NEWS APP
లెంకలపల్లి: వినాయకుడి పూజలో పాల్గొన్న దాసరి వెంకన్న దంపతులు

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా..  గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద నవరాత్రి గణేష్ పూజలలో భాగంగా, మంగళ వారం, గ్రామానికి చెందిన దాసరి వెంకన్న దంపతులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. దాసరి గణేష్, శివ లు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA STREETBUZZ NEWS APP

NLG: క్షేత్ర పర్యటన నిమిత్తం సీసీఎంబి హైదరాబాద్ వెళ్లిన ఎన్జీ కళాశాల విద్యార్థులు
నల్గొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ  కళాశాల మైక్రో బయాలజీ మరియు బయోటెక్నాలజీ గ్రూప్స్ విద్యార్థులు, ఈ రోజు క్షేత్ర పర్యటన నిమిత్తం సెంటర్ ఫర్ సెల్లులార్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబి) హైదరాబాడ్ కు "ఓపెన్ డే - వన్ నేషన్ వన్ ల్యాబ్" సందర్భంగా, శాస్త్రీయ పరిశోధనలు ప్రత్యక్షంగా చూసి సైంటిఫిక్ రీసెర్చ్ ను తెలుసుకోవడానికి, సీసీఎంబి హైదరాబాద్ కి వెళ్లారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్ శ్యామ్ తెలిపారు. మైక్రో బయాలజీ మరియు బయోటెక్నాలజీ విభాగాధిపతి నాగరాజు మాట్లాడుతూ.. నేషనల్ సైంటిఫిక్ ల్యాబ్స్ సందర్శించడం ద్వారా ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలు ఏ రంగాలలో ఏ విధంగా పరిశోధన చేస్తున్నారు, పరిశోధన ల్యాబ్ లలో ఉండేటువంటి అత్యాధునిక పరికరాలు ప్రత్యక్షంగా విద్యార్థులు చూడటం ద్వారా, ఆ పరికరాలు పనిచేసే విధానం ప్రస్తుతం దేశీయ అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన విధానాన్ని అర్థం చేసుకుంటారని, విద్యార్థులు ప్రత్యక్షంగా చూసి శాస్త్రవేత్తల ద్వారా అర్థం చేసుకుంటారని, భవిష్యత్తులో విద్యార్థులు పరిశోధనా రంగంలో రాణించటానికి ఈ సైంటిఫిక్ విజిట్ విద్యార్థులలో శాస్త్రీయ పరిశోధన స్ఫూర్తిని నింపుతుందని , ప్రస్తుత విద్యార్థులే భవిష్యత్ భారత దేశంలో పరిశోధకులుగా తయారు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోస్న, జంతు శాస్త్ర అధ్యాపకురాలు, డాక్టర్ దుర్గాప్రసాద్, గ్రంథ పాలకులు, మల్లేష్ ఫిజికల్ డైరెక్టర్ , విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA

STREETBUZZ NEWS APP