/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ప్రగతిభవన్ ను ముట్టడించిన ఉపాధ్యాయులు Yadagiri Goud
ప్రగతిభవన్ ను ముట్టడించిన ఉపాధ్యాయులు

తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ప్రగతి భవన్ ముట్టడికి 317 జీవో ద్వారా ఇబ్బందులు పడుతున్న నాన్ స్పౌజ్ ఉపాధ్యాయులు ప్రయత్నించారు.

దీంతో ప్రగతి భవన్ పరిసరాలు అట్టుడికి పోయాయి. నాన్ స్పౌస్ ఉపాధ్యాయ బాధితులు తమను స్థానిక జిల్లాలకు పంపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతి ఇచ్చేందుకు ప్రగతి భవన్ వద్దకు వెళ్లినట్టు పలువురు టీచర్లు చెబుతున్నారు.

వినతిపత్రం ఇవ్వడానికి పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రగతి భవన్‌కు బయలుదేరారు. పోలీసుల బారికేడ్లను కూడా ఛేదించుకుని ప్రగతి భవన్ సమీపం వరకు చేరుకున్నారు.

దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది.

పోలీసులు అడ్డుకోవడంతో టీచర్లు రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు తెలిపారు. పలువురు కేసీఆర్ మాస్కులను ధరించి మూకుమ్మడిగా ప్రగతి భవన్ రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు.

స్థానికత పునాదుల మీద ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో స్థానికత అనే అంశమే పరిహాసంగా మారిందని టీచర్లు ఆవేదన వ్యక్తంచేశారు...

భారత్ కు తొలి స్వర్ణ పతకం

చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడలు-2023లో భారత్‌ తొలి గోల్డ్‌మెడల్‌ సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది .

రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌లతో కూడిన జట్టు భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది.క్వాలిఫికేషన్ ఫైనల్‌ రౌండ్‌లో 1893.7 స్కోర్‌తో భారత్‌ అగ్రస్ధానంలో నిలిచింది.

ఆ తర్వాతి స్ధానంలో నిలిచిన ఇండోనేషియా 1890.1 స్కోర్‌, సిల్వర్‌ మెడల్‌ సొం‍తం చేసుకుంది. మూడో స్ధానంలో నిలిచిన చైనా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది..

మూసీ నదిపై ప్యారిస్ తరహా బ్రిడ్జిలను నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో అనేక సంస్కరణలు చేపడుతున్నారు.

మంత్రి కేటీఆర్‌ మార్గదర్శకత్వంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇప్పటికే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి మంచి పర్యాటక కేంద్రంగా మారింది.

అక్కడ ఏర్పాటు చేసిన పార్కు సైతం పర్యాటకులను ఆకట్టుకుంటున్నది.

దీంతో ఆ చెరువు పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించింది. చెరువులో మురుగునీరు చేరి కలుషితం కాకుండా.. జలమండలి ఆధ్వర్యంలో అక్కడ మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని 7 ఎంఎల్‌డీ సామర్థ్యంతో పూర్తి చేసింది.

ఈ ఎస్టీపీతో పాటు చెరువులో రెండు చోట్ల మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ను సోమవారం నేడు మంత్రి కేటీఆర్‌ ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నారు.

వీటితో పాటు చారిత్రక మూసీ, ఈసీలపై ప్యారిస్‌ తరహాలో గ్రేటర్‌ నగరంలో హైలెవల్‌ బ్రిడ్జిల పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. రూ.545 కోట్లతో మూసీ-ఈసీలపై మొత్తం 55 కిలోమీటర్ల మేర 15 బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

ఇందులో భాగంగానే దాదాపు రూ.200 కోట్లతో ఏడు చోట్ల బ్రిడ్జిల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయగా.. ఈ పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు..

సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ నేడు తీర్పు

టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.

మరోవైపు ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటీషన్ విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది.

రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగియడంతో మళ్లీ కస్టడీకి కావాలని సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.

కస్టడీ పొడిగింపు పిటీషన్‌పై తమ వాదనలు కూడా వినాలని చంద్రబాబు తరపు న్యాయవాది పోసాని నిన్ననే కోరారు.

ఈ రోజు మెమోపై కోర్టు విచారించే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబుపై ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులలో పిటీ వారెంట్‌లపై కూడా విచారించాలని సీఐడీ కోరింది.

కాగా సుప్రీం కోర్టు లో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటీషన్‌పై ఏమి జరుగుతుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు....

అక్టోబర్ మొదటి వారంలో టీఎస్ కాంగ్రెస్ మొదటి జాబితా?

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. సర్వేల ఫలితాలు, నియోజకవర్గాల్లో నేతల పనితీరు, సామాజి క అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తోంది.

ఇటీవల ఢిల్లీలో రెండు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ భేటీ కావడంతో పాటు దా దాపు 80 మంది అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఖ రారు చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సీల్డ్ కవర్ లో ఆ జాబితాను పంపినట్టుగా తెలిసింది.

ఈ జాబితాను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రా హుల్ గాంధీ పరిశీలించిన తర్వాత ఆమోదం తెలుపనున్నారు.

అనంతరం అక్టోబర్‌లో కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. తొలి జాబితాలో సీనియర్ నేతల పేర్లు కూడా ఉండనున్నాయి.

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భ ట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు పేర్లతో పాటు పలువురు సీనియర్ నేతల పే ర్లు ఉన్నట్టుగా తెలిసింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువమంది సీటు కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఎవరికి సీటు ఇవ్వాలో కాంగ్రెస్ తేల్చుకోలేకపోతుంది. అలాంటి స్థానాలపై ఆచితూచి వ్య వహారించాలని అధిష్టానం నిర్ణయించింది.

మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ నిర్వహించి ఇలాంటి స్థా నాలపై చర్చించి రెండో జాబితాను తయారుచేయాలని నిర్ణయించింది.

ఈ నెల 29వ తేదీ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు స్క్రీనింగ్ కమిటీ పంపిన తొలి జాబితాను పరిశీలించనున్నా రు. అనంతరం తొలి జాబితాను విడుదల చేయనున్నారు. అక్టోబర్ తొలివారంలో తొలి జాబితా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మకాం వేసిన ఆశావహులు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలతో సైతం చర్చలు జరుపుతున్నట్టుగా తెలిసింది. సర్వేల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని వారికి టిపిసిసి ముఖ్యనేతలు సర్దిచెబుతున్నట్టుగా సమాచారం

నేడు పట్టాలెక్కిన 9వందే భారత్ రైళ్లు

దేశవ్యాప్తంగా 9 వందే భారత్‌ రైళ్లు ఆదివారం పట్టాలెక్కాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా జెండా ఊపి వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.

ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ రైళ్లను ఫ్లాగ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ప్రయాణ సౌలభ్యంపై కేంద్రం దృష్టి సారించిందని

గత ప్రభుత్వాలు రైల్వేకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 25 వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మరో 9 వందే భారత్‌ రైళ్లు ప్రారంభం అయ్యాయి.

త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే దిశగా కార్యచరన రూపొందిస్తున్నాం. భారతీయ రైల్వే బడ్జెట్‌ను కూడా కేంద్రం పెంచింది. మల్టీ-మోడల్ కనెక్టివిటీపై కూడా ప్రభుత్వం పనిచేస్తోంది.

వేగం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా వందే భారత్‌ రైళ్లు పనిచేస్తున్నాయి. కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగానికి ఇది ఒక ఉదాహరణ’ అంటూ ప్రధాని మోదీ కార్యక్రమంలో ప్రసంగించారు.

తాజాగా ప్రారంభించిన 9 వందే భారత్ రైళ్ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. కాచిగూడ- యశ్వంత్‌పూర్‌, విజయవాడ-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుని కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

ఆసియా గేమ్ లో సత్తా చాటిన భారత హాకీ జట్టు

ఆసియా కప్ లో భారత హాకీ జట్టు విశ్వరూపం చూపించింది. పూల్‌ ఏ ప్రిలిమనీ రౌండ్‌లో ఉజ్బెకిస్తాన్‌పై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

చైనాలోని హాంగ్‌జో వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఏకంగా 16-0 తేడాతో ఉజ్బెకిస్తాన్‌పై అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది.

ముగ్గురు భారత ఆటగాళ్లు హ్యాట్రిక్స్‌ సాధించారు. అలాగే లలిత్‌ ఉపాధ్యాయ్‌, వరుణ్‌ కుమార్‌ చెరో నాలుగు గోల్స్‌ చేయడం విశేషం.

మన్‌దీప్ సింగ్‌ మూడు గోల్స్‌ చేసి సత్తా చాటాడు. అభిషేక్‌, సుఖ్‌జీత్‌ సింగ్‌ అమిత్‌ రోహిదాస్‌, సంజయ్‌ ఒక్కో గోల్‌ చేశారు.

ఈ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్‌ మంగళవారం సింగపూర్‌తో జరిగే మ్యాచ్‌లో తలపడనుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్ లేకపోయినా భారత హాకీ జట్టు చెలరేగి ఆడింది.

తొలి క్వార్టర్‌లో లలిత్‌, వరుణ్‌లు 2-0 అధిక్యంతో నిలిచారు. అనంతరం అభిషేక్‌, మన్‌దీప్‌లు 4-0తో స్కోరు సాధించారు.

ఇక రెండో క్వార్టర్‌లోనూ భారత్‌ ఆధిక్యంలో నిలిచింది. ఆపై సుఖ్‌జీత్, మన్‌దీప్‌ జోడి కట్టడంతో భారత్‌ విజేతగా నిలిచింది...

ప్రగతి భవన్ ముట్టడికి గ్రూప్ 1 అభ్యర్థుల యత్నం

గ్రూప్-1 ప్రిలిమ్స్ హైకోర్టు రద్దు చేయడంతో ఆదివారం అభ్యర్థులు ప్రగతి భవన్ వైపు దూసుకొచ్చారు. గ్రూప్-1 అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

గ్రూప్-1 పరీక్షలలో అవకతవకలు జరగడానికి ప్రభుత్వం అలసత్వం కారణమని అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. గ్రూప్-1 పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు.

రెండు మూడు సంవత్సరాల నుంచి గ్రూప్-1 కోసం ప్రిపేర్ అవుతున్నామని, ఇప్పటికే రెండు సార్లు పరీక్ష రద్దు కావడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టిఎస్ పిఎస్సీని రద్దు చేయాలని నిరసన తెలియజేస్తున్నారు. పరీక్షలు సరిగా నిర్వహించని ప్రభుత్వం ఎందుకు అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇప్పటికే పలు పరీక్షలు పేపర్లు లీక్ కావడంతో ప్రభుత్వంపై నిరుద్యోగులు విరుచుకపడుతున్నారు......

Nara Brahmani: నారా బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు

రాజమహేంద్రవరం: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కోడలు నారా బ్రాహ్మణిని జనసేన నేతలు కలిశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులు ఆమెతో సమావేశమై సంఘీభావం తెలిపారు..

అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జనసేన నేత కందుల దుర్గేష్‌, మాజీ మంత్రి చినరాజప్ప ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రెండు పక్షాలు ఉమ్మడిగా కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు..

Nara Lokesh: వచ్చేవారం నారా లోకేశ్‌ 'యువగళం' తిరిగి ప్రారంభం..!

రాజోలు: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిలిపివేసిన యువగళం పాదయాత్రను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. వచ్చేవారం నుంచి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..

చంద్రబాబు అరెస్టుతో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూ.గో. జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళాన్ని తిరిగి ప్రారంభించనున్నారు.

చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలతో నారా లోకేశ్‌ ఇవాళ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు ఆయన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు..