చండూరు: అంగన్వాడీల సమ్మెకు సిపిఎం మద్దతు: బండ శ్రీశైలం
NLG: అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం తెలిపారు.
గురువారం చండూరు తహసిల్దార్ కార్యాలయం ముందు జరుగుతున్న 11వ రోజు నిరవధిక సమ్మె లో భాగంగా బతుకమ్మలాడుతూ నిరసన తెలిపారు.
సమ్మె శిబిరానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం హాజరై మద్దతు ప్రకటించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 వేల మంది గత 48 సంవత్సరాలుగా పేద మహిళలకు, రక్తహీనత పిల్లలకు పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయుటకు ఎంతగానో కృషి చేస్తున్న అంగన్వాడి టీచర్లకు, ఆయా లకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఇందులో 90 శాతం మంది దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలని వారిని వెంటనే పర్మినెంట్ చేయాలని, ఆలోపు వారికి గౌరవ వేతనాలు కాకుండా కనీస వేతనం టీచర్ కు రూ. 26000/- ఆయా కు రూ.18000/- వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రజా ప్రతినిధులు అధికారులు బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటు అని అన్నారు నల్లగొండ జిల్లా 'నాటి నైజాం సర్కార్ను తరిమికొట్టిన పోరు గడ్డ' అని, వీర వనిత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని అందుకున్న అంగన్వాడీ మహిళలని ఎమ్మెల్యేలు బెదిరిస్తే భయపడేది లేదని వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ప్రభుత్వం వెంటనే పోరాడుతున్న అంగన్వాడీ సంఘాల జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని, లేనిపక్షంలో అంగన్వాడీలు చేసే పోరాటాల్లో సిపిఎం ప్రత్యక్షంగా పాల్గొంటూ వారికి అండదండలుగా ఉంటూ పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సిఐటియు జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు దోటి వెంకన్న, సిఐటియు సీనియర్ నాయకులు మొగుదాల వెంకటేశం, సిపిఐ మండల సహాయ కార్యదర్శి బొడ్డు వెంకన్న, బరిగెల రమణమ్మ, నాగమణి, కేదారి జగదీశ్వరి, తారక, పి.జ్యోతి, కే.రాజేశ్వరి, బి.శోభ, కే.శారద, జంగమ్మ, పెద్దమ్మ, ఉష, వనజాత, పద్మ, సునీత, పి.సునీత, విజయనిర్మల, భాగ్యలక్ష్మి, వెంకటమ్మ, పార్వతమ్మ, విజయలక్ష్మి, బి ప్రమీల, జ్యోతి, సుజన, ఆయాలు అండాలు, సుగుణమ్మ, అనూష, కృష్ణవేణి, సోనీ, సాయమ్మ, వెంకటమ్మ, రాణి, నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NALGONDA




పశ్చిమగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో రోడ్ ప్రమాదం
ప్రణాళికాబద్ధమైన ట్రయల్ ప్రాసెస్లో భాగంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సహకారంతో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, భారత ప్రభుత్వం ద్వారా ఈ సందేశం పంపబడుతోంది.
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా.. బుధవారం వారం గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద నవరాత్రి గణేష్ పూజలలో భాగంగా 3వ రోజు, గ్రామానికి చెందిన దంపతులు చాపల మల్లయ్య- పద్మ మరియు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
SB NEWS




బీఎస్పీ సహా చాలా పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సానుకూలంగా ఓటేస్తాయి. ఈ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత గతంలో మాదిరిగా పెండింగ్ కాకుండా ఈ సారి ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాను.
మహిళలకు ప్రతిపాదిత 33 శాతం రిజర్వేషన్లు కాదు.. 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. మహిళల జనాభాను దృష్టిలో పెట్టుకుని వారికి 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గతంలోనూ బీఎస్పీ పార్టీ తరపున పార్లమెంటులో ఆమె మాట్లాడినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఆలోచిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.
మహిళలకు ఇచ్చే రిజర్వేషన్లలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు సెపరేట్ కోటా ఉండాలి. అలాగైతేనే వారికి న్యాయం దక్కుతుంది అని మాయావతి అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీలను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మునుగోడు అసెంబ్లీ కార్యదర్శి అన్నేపాక శంకర్, అసెంబ్లీ మున్సిపల్ అధ్యక్షులు బూసిపాక మాణిక్యం, సీనియర్ నాయకులు బొట్ట శివ, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము గణేష్, మరియు ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.
SB NEWS NALGONDA
DOWNLOAD SB NEWS APP
Sep 21 2023, 15:21
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.7k