/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz చంద్రబాబు చుట్టు స్కామ్ ల ఉచ్చు Yadagiri Goud
చంద్రబాబు చుట్టు స్కామ్ ల ఉచ్చు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు జగన్‌ సర్కార్‌ మరో షాక్‌ ఇచ్చింది.గతంలో సీఐడి దర్యాప్తు చేపట్టిన ఫైబర్‌ నె ట్‌ స్కాం కేసు మళ్లీ తెర మీదకు వచ్చింది.

ఈ కేసులనూ చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వందల కోట్ల రూపాయలు గోల్‌మాల్‌ జరిగినట్లు గుర్తించిన సీఐడి అందుకు ప్రధాన కారణం చంద్రబాబేనని అభియోగాలు మోపింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిబంధనలకు విరుద్ధంగా టెరా సాప్ట్‌ కంపెనీకి ఫైబర్‌ నెట్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చారనేది చంద్రబాబుపై ప్రధాన ఆరోపణ. .

దీంతో ఇప్పటికే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఫైబర్‌ నెట్‌ కేసులో అరెస్టు చేసేందుకు సీఐడి సిద్ధమవుతోంది. ఇందుకోసం విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం పీటీ వారెంట్‌ దాఖలు చేసింది.

అటు స్కిల్‌ కేసులో రిమండ్‌లో ఉంటుండగానే చంద్రబాబుపై సీఐడి అధికారులు ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ స్కాం కేసులో అరెస్టు చేసేందుకు ఇప్పటికే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ దాఖలు చేశారు.

అది పెండింగ్‌లో ఉంది. ఈ కేసులోనే చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరగ్గా ఈనెల 21కి వాయిదా పడింది.

అయితే చంద్రబాబును టార్గెట్‌ చేసిన సీఐడి ఫైబర్‌ నెట్‌ స్కాం కేసు తెర మీదకు తీసుకువస్తూ తాజాగా పీటీ వారెంట్‌ దాఖలు చేయగా విచారణకు న్యాయమూర్తి స్వీకరించారు. ఫైబర్‌ కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడు ఏ1గా సీఐడి పేర్కొంది...

తిరుపతి లో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది.

నేడు బుధవారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.స్వామివారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

ఇక మంగళవారం శ్రీవారిని 67,267 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.2.58 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

SB NEWS

SB NEWS

SB NEWS

రేపే పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు

మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం పార్లమెంటు ముందుకు రానుంది. బిల్లు ఆమోదం పొందే సమయానికి భారీగా వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు.

ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు చెప్పేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

చర్చించారు. ఢిల్లీ సమీప ప్రాంతాల నుంచి భారీగా మహిళల సమీకరణకు నిర్ణయించారు.

బీజేపీ బుధవారం లేదా ఒక రోజు తర్వాత ఢిల్లీలో లేదా ఢిల్లీకి ఆనుకుని ఉన్న రాజస్థాన్‌లోని ఏదైనా నగరంలో భారీ మహిళా సదస్సు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఆ సదస్సులో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని ప్రసంగించనున్నట్టు సమాచారం.

కాగా దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రేపు బుధవారం కొత్త పార్లమెంట్ భవనంలో ఈ బిల్లునను ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే.. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి వీలవుతుంది. దీంతో పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న మరికొన్ని బిల్లులకు సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సమాచారం.......

అభివృద్ధికి అడ్డాగా నారాయణఖేడ్: మంత్రి హరీష్ రావు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి అవకాశం వస్తే తెలంగాణపై విషం చిమ్ముతారని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు నారాయణఖేడ్ లో లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో సంబరాలు చేసుకోలేదని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

నారాయణఖేడ్ అంటే ఒకప్పుడు కొట్లాటలతో గంజాయి సాగుతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేదని ఇన్నాళ్లు పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు దీనికి కారణమని మంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అభివృద్ధికి అడ్డాగా నారాయణఖేడ్ మారిందన్నారు.

మనకి రావాల్సిన ప్రాజెక్టును ఆంధ్రకు తీసుకుపోయారు.

బీజేపీవి అన్ని అబద్ధాలే.. మాకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చారా.. తెలంగాణపై విష ప్రచారాలు మానుకోవాలని అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూ ఉంటుంది.. ఏం నిర్ణయం తీసుకోవాలన్న కాంగ్రెస్ నేతలు హై కమాండ్ పర్మిషన్ తీసుకోవాలని మంత్రి హరీష్‌రావు సెటైర్లు వేశారు..

ఫలించనున్న ఎమ్మెల్సీ కవిత పోరాటం: మంత్రి సత్యవతి రాథోడ్

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని పోరాడిన ఎమ్మెల్సీ కవిత పోరాటానికి కేంద్రం తగ్గిందని, మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌ కోసం పోరాడుతున్న బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత పోరాటం ఫలించనుందనిఆమె అన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ నెల 20వ తేదీన ఈ బిల్లుపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంట్‌లో ఈరోజు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. రేపటి నుంచి కొత్తగా నిర్మించిన భవనంలో ఈ సమావేశాలు జరుగనున్నాయి.

పార్లమెంట్‌లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీ కవిత ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని కోట్లాది మహిళల పక్షాన ఆమె ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష కూడా చేపట్టారు.

అంతేకాదు ఈ బిల్లుకు మద్దతు పలకాలని దేశంలోని 49 రాజకీయ పార్టీలను కోరారు. అందుకోసం రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలని, అందరూ ఒక్క మాటపై నిలబడి మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఒత్తిడి తేవాలని ఆమె ఆయా పార్టీలను అభ్యర్థించారు.......

నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు కేసు విచారణ

ఎసిబి కోర్టులో మరో మూడు పిటిషన్‌లపైనా చంద్రబాబు నాయుడు విచారణ ఎదుర్కొనున్నారు.

విజయవాడ ఎసిబి కోర్టుల్లో నేడు బాబు కేసుల విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నారు.

చంద్రబాబు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో హైకోర్టులో విచారణ చేయనున్నారు.....

SB NEWS

SB NEWS

SB NEWS

చంద్రబాబు అరెస్టుకు అమెరికాలో ఎన్ఆర్ఐ ల నిరసన

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా అమెరికాలో ఎన్‌ఆర్‌ఐలు నిరసన చేపట్టారు.బే ఏరియాలో ప్రవాసాంధ్రులు నిరసన వ్యక్తం చేశారు.

చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని ప్రవాసాంధ్రులు డిమాండ్ చేశారు.

ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేశారని ఎన్‌ఆర్‌ఐలు ప్రశ్నించారు. సైకో పోవాలి… సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు.

వియ్‌ఆర్‌విత్ సిబిఎన్ నినాదంతో ప్రవాసాంధ్రులు ర్యాలీ చేపట్టారు.

హైదరాబాద్ లో చంద్రబాబు క్షేమం కోరుతూ కూకట్‌పల్లిలో మంగళవారంఉదయం పూజలు చేశారు.

వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన అభిమానులు సుదర్శన హోమం చేశారు. సుదర్శన హోమంలో నందమూరి సుహాసిని పాల్గొన్నారు.

హీరో నవదీప్ కోసం పోలీసులు గాలింపు?

మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో పోలీ సులు మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించింది.

పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది. తనను అరెస్టు చేయవద్దు అంటూ నవదీప్ ఇప్పటికే కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు.

దీంతో ఈరోజు మంగళవారం వరకు నవ దీప్‌ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదే శాలు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నవదీప్ మరో సారి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు.

నవదీప్ పిటిషన్‌పై నార్కోటిక్ పోలీసులు కౌంటర్ దాఖలు చేయ నున్నారు.

పోలిసులు వెళ్ళిన సమయంలో నవదీప్ ఇంట్లో లేకుండా పోయారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో 37, వ నిందితుడిగా నవ‌దీప్‌ను నార్కోటిక్ బ్యూరో పోలీసులు చూపెడుతున్నారు .

తన మిత్రుడు రామ్ చందు దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికే నవదీప్ స్నేహితుడు రామచంద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే....

రాష్ట్రనికి ఎన్నికల కమిషన్ నివేదిక !

- నేటితో ముగియనున్న ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ

- తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్దం

- అక్టోబర్ 3 నుంచి రాష్ట్రంలో ఎన్నికల సంఘం పర్యటన

- అక్టోబర్ నెలలో ఎన్నికల షెడ్యూలు కు తుది నిర్ణయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. అక్టోబర్‌ 3 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్న ఈసీ బృందం.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించనుంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగాలి. అక్టోబర్‌లో నోటిఫికేషన్, డిసెంబర్‌లో ఎన్నికలు, ఆ తర్వాత ఫలితాలు ఇలా షెడ్యూల్ ఉండనుంది. అయితే రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని ఏప్రిల్, మే నెలలో జరిగే ఛాన్స్ ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలకు చెక్ పెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. అక్టోబర్‌ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్న ఈసీ బృందం.. ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది.

ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా, తదితర నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో ఈ పర్యటనలో సమావేశం కానుంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని అడ్డుకునేందుకు తీసుకునే చర్యలపై వారితో చర్చించనుంది. ఈసీ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల అధికారులతో సమావేశమై భద్రతా పరమైన ఏర్పాట్లపై సమీక్షించనుంది.

ఈసీ బృందం అక్టోబర్ 4 పర్యటనలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమావేశం కానుంది. జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించనుంది. అక్టోబర్ 5న చివరి రోజు ఈసీ బృందం తెలంగాణ సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. అలాగే ఓటర్ల జాబితా, ఓటర్లకు అవగాహన, ప్రచార కార్యక్రమాల నిర్వహణ నేపథ్యంలో ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతోనూ కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశం కానున్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.

కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించింది. బీజేపీ, కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు కరత్తులు మెుదలుపెట్టాయి. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. త్వరలోనే ఆ రెండు ప్రధాన పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నాయి. ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నాయి.

టిఆర్ఎస్ ఫస్ట్ లిస్టులో మార్పులు ఉంటాయా?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శించిన విషయం తెలిసిందే. మొత్తం 115 మందితో తొలి జాబితాను వెల్లడించారు.

దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు కేటాయించారు. అయితే ఈ జాబితాలో కేవలం ఏడుగురు మహిళలకే అవకాశం కల్పించారు. దీంతో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్సీ కవితపై విపక్షాల నుంచి సోషల్ మీడియా నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడం కాదు.. ముందు మీ పార్టీలో మహిళలకు ఎన్ని సీట్లు కేటాయించారో చూడు’ అంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు.. ఢిల్లీ లిక్కర్‌ కేసు నుంచి తప్పించుకోవడానికి, ఈ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి 33శాతం మహిళా రిజర్వేషన్ నినాదం ఎత్తుకుందని. ఢిల్లీ రిజర్వేషన్ పోరాటం పెద్ద డ్రామా అని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

ఇదిలా ఉండగా.. తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని ఇవాళ మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రభుత్వం తీసుకువస్తుందని చెబుతున్నారు.

ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించబడతాయి. ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో ఇప్పటికే చాలా ప్లాన్‌లు వేసుకున్న చాలా రాష్ట్రాల లెక్కలు తారుమారు కానున్నాయి.

ఇందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మార్పులు అనివార్యంగా మారింది. అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు అంటే దాదాపు 40 సీట్ల వరకు కేటాయించాల్సి ఉంది. దీంతో తప్పక బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్‌లో మార్పులు చేయాల్సి ఉంది...