/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz హీరో నవదీప్ కోసం పోలీసులు గాలింపు? Yadagiri Goud
హీరో నవదీప్ కోసం పోలీసులు గాలింపు?

మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో పోలీ సులు మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించింది.

పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది. తనను అరెస్టు చేయవద్దు అంటూ నవదీప్ ఇప్పటికే కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు.

దీంతో ఈరోజు మంగళవారం వరకు నవ దీప్‌ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదే శాలు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నవదీప్ మరో సారి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు.

నవదీప్ పిటిషన్‌పై నార్కోటిక్ పోలీసులు కౌంటర్ దాఖలు చేయ నున్నారు.

పోలిసులు వెళ్ళిన సమయంలో నవదీప్ ఇంట్లో లేకుండా పోయారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో 37, వ నిందితుడిగా నవ‌దీప్‌ను నార్కోటిక్ బ్యూరో పోలీసులు చూపెడుతున్నారు .

తన మిత్రుడు రామ్ చందు దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికే నవదీప్ స్నేహితుడు రామచంద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే....

రాష్ట్రనికి ఎన్నికల కమిషన్ నివేదిక !

- నేటితో ముగియనున్న ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ

- తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్దం

- అక్టోబర్ 3 నుంచి రాష్ట్రంలో ఎన్నికల సంఘం పర్యటన

- అక్టోబర్ నెలలో ఎన్నికల షెడ్యూలు కు తుది నిర్ణయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. అక్టోబర్‌ 3 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్న ఈసీ బృందం.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించనుంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగాలి. అక్టోబర్‌లో నోటిఫికేషన్, డిసెంబర్‌లో ఎన్నికలు, ఆ తర్వాత ఫలితాలు ఇలా షెడ్యూల్ ఉండనుంది. అయితే రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని ఏప్రిల్, మే నెలలో జరిగే ఛాన్స్ ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలకు చెక్ పెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. అక్టోబర్‌ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్న ఈసీ బృందం.. ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది.

ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా, తదితర నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో ఈ పర్యటనలో సమావేశం కానుంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని అడ్డుకునేందుకు తీసుకునే చర్యలపై వారితో చర్చించనుంది. ఈసీ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల అధికారులతో సమావేశమై భద్రతా పరమైన ఏర్పాట్లపై సమీక్షించనుంది.

ఈసీ బృందం అక్టోబర్ 4 పర్యటనలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమావేశం కానుంది. జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించనుంది. అక్టోబర్ 5న చివరి రోజు ఈసీ బృందం తెలంగాణ సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. అలాగే ఓటర్ల జాబితా, ఓటర్లకు అవగాహన, ప్రచార కార్యక్రమాల నిర్వహణ నేపథ్యంలో ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతోనూ కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశం కానున్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.

కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించింది. బీజేపీ, కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు కరత్తులు మెుదలుపెట్టాయి. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. త్వరలోనే ఆ రెండు ప్రధాన పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నాయి. ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నాయి.

టిఆర్ఎస్ ఫస్ట్ లిస్టులో మార్పులు ఉంటాయా?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శించిన విషయం తెలిసిందే. మొత్తం 115 మందితో తొలి జాబితాను వెల్లడించారు.

దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు కేటాయించారు. అయితే ఈ జాబితాలో కేవలం ఏడుగురు మహిళలకే అవకాశం కల్పించారు. దీంతో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్సీ కవితపై విపక్షాల నుంచి సోషల్ మీడియా నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడం కాదు.. ముందు మీ పార్టీలో మహిళలకు ఎన్ని సీట్లు కేటాయించారో చూడు’ అంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు.. ఢిల్లీ లిక్కర్‌ కేసు నుంచి తప్పించుకోవడానికి, ఈ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి 33శాతం మహిళా రిజర్వేషన్ నినాదం ఎత్తుకుందని. ఢిల్లీ రిజర్వేషన్ పోరాటం పెద్ద డ్రామా అని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

ఇదిలా ఉండగా.. తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని ఇవాళ మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రభుత్వం తీసుకువస్తుందని చెబుతున్నారు.

ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించబడతాయి. ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో ఇప్పటికే చాలా ప్లాన్‌లు వేసుకున్న చాలా రాష్ట్రాల లెక్కలు తారుమారు కానున్నాయి.

ఇందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మార్పులు అనివార్యంగా మారింది. అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు అంటే దాదాపు 40 సీట్ల వరకు కేటాయించాల్సి ఉంది. దీంతో తప్పక బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్‌లో మార్పులు చేయాల్సి ఉంది...

చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..

చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..

ఇకపై పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

ప్రగతి భవన్‌లో వినాయక చవితి వేడుకలు:పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు

వినాయక చవితి వేడుకలు ప్రగతి భవన్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. గణనాథుడుకి ముఖ్యమంత్రి కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

రాష్ట్ర ప్రజ‌ల‌కు సుఖ‌ శాంతుల‌ను అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగ‌తి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్ధించారు.

గణపతి పూజ కార్య క్రమంలో మంత్రి కేటీ ఆర్,శైలిమ దంప‌తులు, కూతురు అలేఖ్య, పాల్గొన్నారు.

ప్రత్యేక పూజ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి.. ప్రగతి భవన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు...

SB NEWS

SB NEWS

ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళి సై తొలి పూజ

వినాయక చవితి పర్వదినం సందర్భంగా సోమవారం ఖైరతాబాద్ గణపతి వద్ద కోలాహలం మొదలైంది. బడా గణేశుడికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలిపూజ చేశారు.

ఈ ఏడాది శ్రీ దశమహా విద్యాగణపతిగా గణనాథుడు దర్శనమిస్తున్నాడు. వైభవంగా జరిగిన తొలిపూజలో గవర్నర్ తో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున గణనాథుడికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు.

తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న ఖైరతాబాద్ మహాగణపతికి పద్మశాలి సంఘం గరికమాల, జంధ్యం, 75 అడుగుల భారీ కండువాను సమర్పించింది.

ఈ సారి 63 అడుగుల ఎత్తులో కొలువుదీరిన శ్రీదశమహా విద్యాగణపతికి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

నవరాత్రుల సందర్భంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు...

భూ వివాదంలో నాగార్జున సోదరి పై కేసు నమోదు

ప్రముఖ టాలీవుడ్‌ హీరో నాగార్జున సోదరి నాగ సుశీలపై కేసు నమోదయ్యింది.శ్రీజ ప్రకృతి దర్శపీఠం ఆశ్రమంపై దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేయడంతో మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈనెల 12న నాగసుశీల మరికొంత మంది కలిసి శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేశారని ఆరోపిస్తూ బాధితులు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై మొయినాబాద్‌ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

కాగా, గతంలో నాగసుశీల తన వ్యాపార భాగస్వామి అయిన నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావుతో కొన్నేళ్లుగా భూ వివాదాలు ఉన్నట్టు సమాచారం, కేసు కు సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియవలసి ఉంది..

SB NEWS

SB NEWS

వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించబోతున్న ఖైరతాబాద్ గణపతి

గణేష్‌ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది. హైదరాబాద్‌లో ఎటు చూసినా గణేష్‌ ఉత్సవ శోభే కనిపిస్తోంది. ఖైరతాబాద్ గణపయ్య రికార్డ్‌లకు కేరాఫ్‌గా మారాడు.

ఈ సారి దశమహా విద్యా గణపతిగా దర్శనమివ్వబోతున్నాడు ఖైరతాబాద్ గణేశుడు.. 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించాడు.

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ గణనాథుడు మరి కాసేపట్లో తొలి పూజలు అందుకోనున్నాడు.

చరిత్రలోనే తొలిసారి.. 63 అడుగుల ఎత్తైన మట్టి ప్రతిమను ఖైరతాబాద్‌లో ప్రతిష్టించారు. ఈ ఏడాది దశ మహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.

నేడు వినాయక చవితి పర్వదినాన వేద మంత్రోత్ఛరణల మధ్య స్వామి వారికి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించనున్నారు.

ఈ మహాక్రతువుకు ఉదయం 9:30 గంటలకు తొలి పూజను గవర్నర్‌ తమిళిసై సౌందరారాజన్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి నిర్వహిస్తారు...

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు...

గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సోమవారం నుంచి 5 రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో.. ప్రభుత్వం ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటుందా? అనే అనుమానం అందరిలోనూ ఉంది.

ఎజెండా ఇదీ అంటూ కొన్ని వివరాలను ప్రభుత్వం ప్రకటించినా అంతకు మించి ఏదో ఉందనే అన్ని వర్గాలు భావిస్తున్నాయి.

అసలు ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల లక్ష్యమేంటి? ఎందుకు కేంద్ర ప్రభుత్వం వీటిని నిర్వహిస్తోంది? అనే విషయం అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది.

ఆగస్టు 3న ఈ సమావేశాలపై ప్రకటన వెలువడినప్పటి నుంచీ ఈ ఉత్కంఠ కొనసాగుతోంది.

SB NEWS

పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా పని చేయండి: అధినేత్రి సోనియాగాంధీ

కాంగ్రెస్‌ పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చినపుడు సమన్వయం పాటించాలని, వీలైతే మీడియాకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ కోరారు.

రెండు రోజుల సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా అయిదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలపై

ఆదివారం జరిగిన చర్చ సందర్భంగా సోనియా జోక్యం చేసుకుని మీడియా సమావేశాల సందర్బంగా నాయకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వీలైతే మీడియాకు దూరంగా ఉండాలని, లేదంటే పొరపాటుగా చేసే చిన్న వ్యాఖ్య అయినా అది కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పారు.

వ్యక్తిగత అభిప్రాయాలను, ప్రయోజనాలను పక్కనబెట్టి పార్టీ గెలుపుకోసం అవిశ్రాంతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఐఖ్యత, క్రమశిక్షణతోనే విరోధులను జయించగలమని, ఇది కర్ణాటక ఎన్నికల్లో నిరూపితమైందని గుర్తు చేశారు.