చండూరు: ఒంటి కాలు పై నిలబడి నిరసన తెలిపిన అంగన్వాడీ ఉద్యోగులు
నల్లగొండ జిల్లా, చండూరు: అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రీపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె 8వ రోజు చేరుకున్న సందర్భంగా అంగన్వాడి ఉద్యోగులు ఒంటి కాలు పై నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, వారి సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడి సిబ్బందితో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఆరోపించారు. వీరిచే ఇతర పనులు కూడా చేయించుకుంటూ శ్రమను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
రికార్డుల నిర్వహణ పేరిట అధికారులు వేధింపులు గురి చేస్తున్నారని, కొత్త యాప్ లు తీసుకొచ్చి మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు కనీస వసతులు కరువయ్యాయని పేర్కొన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, గతంలో మంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని కోరారు. అదనపు పనులను రద్దు చేయాలని, అంగన్వాడీల పై ప్రజాప్రతినిధుల పెత్తనాన్ని నివారించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న టిఎ, డిఎ ఇతర అలవెన్స్ ను వెంటనే విడుదల చేయాలన్నారు.
అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు అంగన్వాడీ సిబ్బంది చేసే సమ్మెకు పూర్తిగా మద్దతుగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సత్తమ్మ, తారకమ్మ, నాగమణి, రమణ, విజయలక్ష్మి, కేదారి, జగదీశ్వరి, సునీత, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా, చండూరు: అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రీపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె 8వ రోజు చేరుకున్న సందర్భంగా అంగన్వాడి ఉద్యోగులు ఒంటి కాలు పై నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, వారి సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడి సిబ్బందితో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఆరోపించారు. వీరిచే ఇతర పనులు కూడా చేయించుకుంటూ శ్రమను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: మాల మహానాడు మర్రిగూడెం మండల అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత నాగిల్ల మారయ్య మర్రిగూడెం మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు, మరియు గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాగిళ్ల మారయ్య మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జరిపే వేడుకల సమయంలో యువకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రశాంత వాతావరణంలో పండుగను ఆనందంతో జరుపుకోవాలని కోరారు.

NLG: బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ పునర్ విముక్తి ప్రతిజ్ఞ దివస్ జరిపారు. నకిరేకల్ బీఎస్పీ పార్టీ కార్యాలయంలో, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని జాతీయ జెండాను మరియు బహుజన్ సమాజ్ పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ నియంత్రృత్వ పాలన నుండి విముక్తి చేయడానికి ప్రతిజ్ఞ చేయడం జరిగిందని నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని తెలిపారు.
ఇదే రోజు మహనీయుడు పెరియార్ రామస్వామి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి మేడి ప్రియదర్శిని పూలమాలలు సమర్పించి మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగులు కలలుగన్న ఆశలు.. నిరాశలు గానే మిగిలినాయి... అని అన్నారు.
తెలంగాణలో ప్రజలందరూ బంగారు తెలంగాణ వస్తదని అనుకుంటే బాధలతో కూడిన తెలంగాణ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ తెలంగాణను ఈ దొరల నుండి విముక్తి చేయడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈ సెప్టెంబర్ 17ను తెలంగాణ పునర్విముక్తి ప్రతిజ్ఞ దివస్ గా జరుపుకొని ప్రతిజ్ఞ చేసి తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపన కోసం పాటుపడాలని ఆదేశించినారని తెలిపారు.
తెలంగాణలో 99 శాతం ఉన్న బహుజన జాతులన్నీ ఏకమై డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేసుకొని, బాధల తెలంగాణ నుండి బహుజన తెలంగాణను స్థాపించడం కోసం ప్రజలందరూ కలిసి రావాలని, మార్పు దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్, నియోజకవర్గ కోశాధికారి దేశాపాక రాజ్ కుమార్, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కట్టంగూర్ మండల అధ్యక్షులు మేడి సంతోష్, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.
NLG: బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ పునర్ విముక్తి ప్రతిజ్ఞ దివస్ జరిపారు. నకిరేకల్ బీఎస్పీ పార్టీ కార్యాలయంలో, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని జాతీయ జెండాను మరియు బహుజన్ సమాజ్ పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ నియంత్రృత్వ పాలన నుండి విముక్తి చేయడానికి ప్రతిజ్ఞ చేయడం జరిగిందని నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని తెలిపారు.
ఇదే రోజు మహనీయుడు పెరియార్ రామస్వామి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి మేడి ప్రియదర్శిని పూలమాలలు సమర్పించి మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగులు కలలుగన్న ఆశలు.. నిరాశలు గానే మిగిలినాయి... అని అన్నారు.
తెలంగాణలో ప్రజలందరూ బంగారు తెలంగాణ వస్తదని అనుకుంటే బాధలతో కూడిన తెలంగాణ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ తెలంగాణను ఈ దొరల నుండి విముక్తి చేయడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈ సెప్టెంబర్ 17ను తెలంగాణ పునర్విముక్తి ప్రతిజ్ఞ దివస్ గా జరుపుకొని ప్రతిజ్ఞ చేసి తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపన కోసం పాటుపడాలని ఆదేశించినారని తెలిపారు.
తెలంగాణలో 99 శాతం ఉన్న బహుజన జాతులన్నీ ఏకమై డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేసుకొని, బాధల తెలంగాణ నుండి బహుజన తెలంగాణను స్థాపించడం కోసం ప్రజలందరూ కలిసి రావాలని, మార్పు దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్, నియోజకవర్గ కోశాధికారి దేశాపాక రాజ్ కుమార్, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కట్టంగూర్ మండల అధ్యక్షులు మేడి సంతోష్, కేతేపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ: పట్టణం పాతబస్తీలోని ఒంటి స్తంభం శివాలయం వద్ద ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో బిజేపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి పాల్గొని, జాతీయ జెండా ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆగస్టు 15, 1947 నాడు దేశం స్వాతంత్రం పొందినప్పటికీ నిజాం రాక్షస పాలనలో మగ్గిపోతున్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు స్వాతంత్ర్యం అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్యతో సెప్టెంబర్ 17న స్వాతంత్రం లభించిందన్నారు.
ఆ సమయంలో ఎంతో మంది ప్రజలు నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారని తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బాలలు, యువకులు చరిత్ర తెలుసుకోవాలన్నారు.
హైదరాబాద్ నుంచి విడిపోయి కొన్ని ప్రాంతాలు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కలిసాయి. అక్కడ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న జాతీయ జెండాను ఎగర వేస్తూ విమోచన దినోత్సవం ఘనంగా జరుపుతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటల పోటీ లలో విజేతలుగా నిలిచిన వారికి కన్మంతరెడ్డి శ్రీదేవి బహుమతి ప్రదానం చేసారు.
యాదాద్రి జిల్లా, చౌటుప్పల్: పట్టణ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాచరిక పాలన నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు. సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు అని ఆయన అన్నారు. తెలంగాణ జాతి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం పొందింది అని అన్నారు.
చిన్న రాష్ట్రమైన, కొత్త రాష్ట్రమైన తెలంగాణ దేశంలోనే అభివృద్ధి లో ముందుందని అన్నారు. తెలంగాణ ప్రజలు జాతీయ సమైక్యతకు చిహ్నం అని అన్నారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు తెలంగాణ రాష్ట్రం పాటుపడుతుందని అన్నారు.
లింగోజిగూడెం అంబేద్కర్ చౌరస్తా నుంచి స్వచ్ఛ హి సేవ కార్యక్రమం చేపట్టి ర్యాలీగా వెళ్తూ చారిత్రక కట్టడమైనటువంటి రింగుల బావి సందర్శించి ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, MD బాబా షరీఫ్, కోరగొని లింగస్వామి, బండమీది మల్లేష్, ఆలె నాగరాజు, కొయ్యడ సైదులు, శ్రీధర బాబు,సుల్తాన్, గోపగొని లక్ష్మణ్, ఉబ్బు వెంకటయ్య, బొడిగే బాలకృష్ణ, బత్తుల స్వామి, కామిషెట్టి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
RR: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి షాక్. బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు మరియు మాజీ సర్పంచ్ కప్పరి లక్ష్మయ్య.
ఆదివారం టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు
ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా, అనుముల:
గ్రామంలో ప్రజలను ఉద్దేశించి బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమల్ల వెంకటేష్ మాట్లాడుతూ... సాగర్ నియోజకవర్గంలోని ఏ మండలంలో ఉన్న గ్రామాన్ని చూసిన వీధిలైట్లు, రోడ్లు , మురికి కాలువలు సరిగ్గా లేవని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వంలో హామీలు తప్ప ఆచరణ లేదని ఆరోపించారు. ఆ వచ్చే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి భీం ప్రసాద్ , బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బత్తుల ప్రసాద్ , నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటేశ్వర్లు, నియోజకవర్గ మహిళా కన్వీనర్ బైరాగి విజయ, దేవరకొండ నియోజకవర్గ మహిళ కన్వీనర్ సహాని , గుర్రంపోడు మండల అధ్యక్షుడు కొమ్ము రమేష్ , పెద్దవూర మండల ప్రధాన కార్యదర్శి ఆదిమల్ల సత్యనారాయణ , రాజు తదితరులు పాల్గొన్నారు.
Sep 18 2023, 20:31
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.7k