/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz జాతీయ జెండా మరియు బీఎస్పీ జెండా ఆవిష్కరించిన మేడి ప్రియదర్శిని Mane Praveen
జాతీయ జెండా మరియు బీఎస్పీ జెండా ఆవిష్కరించిన మేడి ప్రియదర్శిని
NLG: బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ పునర్ విముక్తి ప్రతిజ్ఞ దివస్ జరిపారు. నకిరేకల్ బీఎస్పీ పార్టీ కార్యాలయంలో, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని జాతీయ జెండాను మరియు బహుజన్ సమాజ్ పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ నియంత్రృత్వ పాలన నుండి విముక్తి చేయడానికి ప్రతిజ్ఞ చేయడం జరిగిందని నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని తెలిపారు. ఇదే రోజు మహనీయుడు పెరియార్ రామస్వామి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి మేడి ప్రియదర్శిని పూలమాలలు సమర్పించి మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగులు కలలుగన్న ఆశలు.. నిరాశలు గానే మిగిలినాయి... అని అన్నారు. తెలంగాణలో ప్రజలందరూ బంగారు తెలంగాణ వస్తదని అనుకుంటే బాధలతో కూడిన తెలంగాణ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ తెలంగాణను ఈ దొరల నుండి విముక్తి చేయడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈ సెప్టెంబర్ 17ను తెలంగాణ పునర్విముక్తి ప్రతిజ్ఞ దివస్ గా జరుపుకొని ప్రతిజ్ఞ చేసి తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపన కోసం పాటుపడాలని ఆదేశించినారని తెలిపారు. తెలంగాణలో 99 శాతం ఉన్న బహుజన జాతులన్నీ ఏకమై డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేసుకొని,  బాధల తెలంగాణ నుండి బహుజన తెలంగాణను స్థాపించడం కోసం ప్రజలందరూ కలిసి రావాలని,  మార్పు దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్, నియోజకవర్గ కోశాధికారి దేశాపాక రాజ్ కుమార్, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కట్టంగూర్ మండల అధ్యక్షులు మేడి సంతోష్, కేతేపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.
జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర బిజేపి కార్యవర్గ సభ్యురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి
నల్లగొండ: పట్టణం పాతబస్తీలోని ఒంటి స్తంభం శివాలయం వద్ద ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో బిజేపి  తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి పాల్గొని, జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆగస్టు 15, 1947 నాడు దేశం స్వాతంత్రం పొందినప్పటికీ నిజాం రాక్షస పాలనలో మగ్గిపోతున్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు స్వాతంత్ర్యం అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్యతో సెప్టెంబర్ 17న స్వాతంత్రం లభించిందన్నారు. ఆ సమయంలో ఎంతో మంది ప్రజలు నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారని తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బాలలు, యువకులు చరిత్ర తెలుసుకోవాలన్నారు. హైదరాబాద్ నుంచి విడిపోయి కొన్ని ప్రాంతాలు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కలిసాయి. అక్కడ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న జాతీయ జెండాను ఎగర వేస్తూ విమోచన దినోత్సవం ఘనంగా జరుపుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటల పోటీ లలో విజేతలుగా నిలిచిన వారికి కన్మంతరెడ్డి శ్రీదేవి బహుమతి ప్రదానం చేసారు.
తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తోంది అంటున్న వెన్ రెడ్డి రాజు
యాదాద్రి జిల్లా, చౌటుప్పల్: పట్టణ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాచరిక పాలన నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు. సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు అని ఆయన అన్నారు. తెలంగాణ జాతి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం పొందింది అని అన్నారు. చిన్న రాష్ట్రమైన, కొత్త రాష్ట్రమైన తెలంగాణ దేశంలోనే అభివృద్ధి లో ముందుందని అన్నారు. తెలంగాణ ప్రజలు జాతీయ సమైక్యతకు చిహ్నం అని అన్నారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు తెలంగాణ రాష్ట్రం పాటుపడుతుందని అన్నారు. లింగోజిగూడెం అంబేద్కర్ చౌరస్తా నుంచి స్వచ్ఛ హి సేవ కార్యక్రమం చేపట్టి ర్యాలీగా వెళ్తూ చారిత్రక కట్టడమైనటువంటి రింగుల బావి సందర్శించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్  ఎస్ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, MD బాబా షరీఫ్, కోరగొని లింగస్వామి, బండమీది మల్లేష్, ఆలె నాగరాజు, కొయ్యడ సైదులు, శ్రీధర బాబు,సుల్తాన్, గోపగొని లక్ష్మణ్, ఉబ్బు వెంకటయ్య, బొడిగే బాలకృష్ణ, బత్తుల స్వామి, కామిషెట్టి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బిఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు
RR: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి షాక్. బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు మరియు మాజీ సర్పంచ్ కప్పరి లక్ష్మయ్య. ఆదివారం  టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.
బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం: ఆదిమల్ల వెంకటేష్
నల్లగొండ జిల్లా, అనుముల:
అక్టోబర్ 7వ తేదీన బహుజన సింహగర్జన సభ ను విజయవంతం చేయడం కోసం సాగర్ నియోజకవర్గంలో  3వ విడతలో భాగంగా, ఆదివారం బహుజన చైతన్య సైకిల్ యాత్ర అనుముల మండలంలో 3వరోజు ఉదయం మారేపల్లి నుండి బయలుదేరి పులిమామిడి గ్రామానికి చేరుకుంది. గ్రామంలో ప్రజలను ఉద్దేశించి బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమల్ల వెంకటేష్ మాట్లాడుతూ... సాగర్ నియోజకవర్గంలోని ఏ మండలంలో ఉన్న గ్రామాన్ని చూసిన వీధిలైట్లు, రోడ్లు , మురికి కాలువలు సరిగ్గా లేవని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో హామీలు తప్ప ఆచరణ లేదని ఆరోపించారు. ఆ వచ్చే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి భీం ప్రసాద్ , బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బత్తుల ప్రసాద్ , నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటేశ్వర్లు, నియోజకవర్గ మహిళా కన్వీనర్ బైరాగి విజయ, దేవరకొండ నియోజకవర్గ మహిళ కన్వీనర్ సహాని , గుర్రంపోడు మండల అధ్యక్షుడు కొమ్ము రమేష్ , పెద్దవూర మండల ప్రధాన కార్యదర్శి ఆదిమల్ల సత్యనారాయణ , రాజు తదితరులు పాల్గొన్నారు.
సోనియా గాంధీకి ఘన స్వాగతం పలికిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
TS: హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వీరికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అగ్రనేతలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, తదితరులు ఘన స్వాగతం పలికారు. వివిధ రాష్ట్రాల నేతలు కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. రేపు సాయంత్రం తుక్కగూడ లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో సోనియా గాంధీ సహా అగ్ర నేతలంతా పాల్గొంటారు.
YRP ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండలో మట్టి వినాయకుని విగ్రహాల పంపిణీ
నల్లగొండ: YRP ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ లో మట్టి వినాయకుని విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వై ఆర్ పి ఫౌండేషన్ డైరెక్టర్ ఎలిషాల హేమ్ చందర్ పాల్గొని వినాయకుని విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు నల్గొండ పట్టణంలోని 6 ప్రాంతాల్లో ఎటువంటి కెమికల్ మరియు పెయింట్స్ లేని 12 వేల మట్టి విగ్రహాలను కలకత్తాలో తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించిన వారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో యామా దయాకర్, బొమ్మపాల గిరిబాబు, మద్ది కరుణాకర్ లు పాల్గొన్నారు.
NLG: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశాలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి: సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం, ఆశాల న్యాయమైన డిమాండ్ల కోసం మర్రిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ దీపక్ ను కలిసి  సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా ల పారితోషకాలను  రూ.18, 000/- లకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని అన్నారు. పారితోషకం లేని అదనపు పనులు ఆశలతో  చేయించకూడదని, టిబి, లెప్రసీ, కంటి వెలుగు తదితర పెండింగ్ బిల్లు వెంటనే చెల్లించాలని, లెప్రసీ సర్వేలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించాలని అన్నారు. వాలంటరీలను ఏర్పాటు చేసి, ఆశాలకు పనిభారం తగ్గించాలి. ఆశాలకు జాబ్  చార్ట్ విడుదల చేయాలి. కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ రూ.1000/- చొప్పున 16 నెలల బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలి. 32 రకాల రిజిస్టర్ లను వెంటనే ప్రింట్ చేసి ప్రభుత్వమే సప్లై చేయాలి. క్వాలిటీతో కూడిన ఐదు సంవత్సరాల పెండింగ్ యూనిఫామ్ వెంటనే ఇవ్వాలని, ఆశలకు ప్రసూతి సెలవుల సర్కిలర్ వెంటనే జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సెప్టెంబరు 25 నుండి సమ్మెలోకి పోవడానికి సిద్ధమవుతున్నారని, ఈ లోపుగా వారి న్యాయమైన 11 డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు మర్రిగూడ మండల అధ్యక్ష కార్యదర్శులు సబ్ సెంటర్ల నాయకురాలు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, లప్పంగి తబిత, అందుగుల యాదమ్మ, కలమ్మ, బి.యాదమ్మ, రోజా, బాలమణి తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి: మాల మహానాడు మండలాధ్యక్షుడు
NLG: మర్రిగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఏర్పాటు చేయాలని మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత నాగిళ్ల మారయ్య  ప్రభుత్వాన్ని  కోరుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మర్రిగూడెంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు, దూర ప్రాంతాలకు వెళ్లి ఖర్చు చేసి విద్యను అభ్యసించలేక చదువు మానేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని,  ప్రైవేట్ కళాశాలలో ఎక్కువ ఫీజులు ఉండటం వల్ల ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మర్రిగూడెం నుండి  15 - 30 కిలోమీటర్ల దూరంలో కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వారు స్పందించి, మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఏర్పాటు చేస్తే మండలానికి చెందిన వందలాది మంది పేద విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పాటు అందించిన వారవుతారని అన్నారు. ఇకనైనా మర్రిగూడ మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మాల మహానాడు మండలాధ్యక్షుడు నాగిల్ల మారయ్య కోరారు.
మర్రిగూడ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి: మాల మహానాడు మండలాధ్యక్షుడు
NLG: మర్రిగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఏర్పాటు చేయాలని మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత నాగిళ్ల మారయ్య  ప్రభుత్వాన్ని  కోరుతున్నట్లు ఒక ప్రకటన తెలిపారు. మర్రిగూడెంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు, దూర ప్రాంతాలకు వెళ్లి ఖర్చు చేసి విద్యను అభ్యసించలేక చదువు మానేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని,  ప్రైవేట్ కళాశాలలో ఎక్కువ ఫీజులు ఉండటం వల్ల ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మర్రిగూడెం నుండి  15 - 30 కిలోమీటర్ల దూరంలో కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వారు స్పందించి, మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఏర్పాటు చేస్తే మండలానికి చెందిన వందలాది మంది పేద విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పాటు అందించిన వారవుతారని అన్నారు. ఇకనైనా మర్రిగూడ మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మాల మహానాడు మండలాధ్యక్షుడు నాగిల్ల మారయ్య కోరారు.