/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు కాస్త ఊరట Yadagiri Goud
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు కాస్త ఊరట

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఈ నెల 26 వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

నళినీ చిందబరం తరహాలోనే తనకూ ఊరట ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె వేసిన పిటిషన్పై ఈడీ న్యాయవాది స్పందనను సుప్రీం ధర్మాసనం కోరింది. అందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు.

అందులో భాగంగా ఈ నెల 26 వరకు సమన్లు జారీ చేయవద్దని ఈడీకి జస్టిస్ కౌల్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) గురువారం మరోసారి సమన్లు జారీ చేసింది.

అందులో శుక్రవారం దిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఉంది. ఈ విషయంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద తనకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని ఆమె సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు.

ఈడీ జారీ చేసిన సమన్లు.. మహిళలను వారు నివసించే చోటే విచారించాలన్న సీఆర్పీసీలోని సెక్షన్ 160 నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నందున వెంటనే వాటిని కొట్టేయాలని కవిత కోరారు. దీంతో సుప్రీంకోర్టు కాజ్లిస్ట్ ప్రకారం శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చి.. ఈ నెల 26 వరకు సమన్లు జారీ చేయవద్దని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది....

అధినేతను కలిశాకే నిర్ణయం: ఎమ్మెల్సీ కవిత

లిక్కర్ స్కామ్ కేసులో నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్,ఈడీ, అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసుల్లో ఈ రోజు శుక్రవారం విచారణ హాజరుకావాలని పేర్కొన్నారు.

ఎన్నికలు సమీపిస్తోన్న బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే నినాదాన్ని కాంగ్రెస్ గట్టిగా ప్రస్తావిస్తున్న తరుణంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా..

కాసేపట్లో కవిత ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈడీ ముందుకు ఎలా వెళ్లాలి, ఏం చేయాలో కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తండ్రి సూచన మేరకు కవిత తన తదుపరి అడుగులు వేయనుందని సమాచారం. అంతేగాక, ఇవాళ కవిత తరపు న్యాయవాదులు ఢిల్లీకి వెళ్లనున్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం అటు జాతీయ స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలోనూ చర్చకు దారితీసింది. మార్చి 21న ఆమెను ఈడీ విచారించినా ఆరు నెలల పాటు ఎలాంటి హడావిడీ లేదు. కవితకు వ్యాపార సన్నిహితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లయ్ అప్రూవర్‌గా మారినట్లు వార్తలు వచ్చిన మరుసటి రోజునే ఆమెకు ఈడీ నుంచి నోటీస్ రావడం రకరకాల చర్చలకు దారితీసింది.

పొలిటికల్ పార్టీల్లో జరిగే చర్చలు ఒక రకంగా ఉంటే సామాన్య జనంలో మాత్రం మరో తీరులో ఉన్నాయి. ఈడీ ఎంక్వయిరీకి కవిత హాజరవుతారా?.. అటెండ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది?.. అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి...

స్త్రీలకు మాత్రమే!!

ఇటీవల కాలంలో పలు రద్దీ ప్రాంతాలకు విద్యార్థినిలు, మహిళల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ లేడీస్ స్పెషల్ బస్సుల సర్వీస్ కల్పిస్తున్నది.

ఈ నేపథ్యంలోనే తాజాగా మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం మెహిదీపట్నం టూ సీబీఐటీ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును ఏర్పాటు చేసినట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

120 రూట్ నెంబర్ గల ఈ సర్వీస్.. ప్రతి రోజు ఉదయం 08:30 గంటలకు మెహిదీపట్నం నుంచి ప్రారంభమవుతుందని, తిరిగి సాయంత్రం 04:00 గంటలకు సీబీఐటీ నుంచి బయలుదేరుతుందని వెల్లడించారు.

ఆ మార్గంలో వెళ్లే ఇంజనీరింగ్ విద్యార్థినులు, మహిళలు ఈ స్పెషల్ బస్సు సదుపాయాన్ని వినియోగించుకోగలరని సూచించారు...

కరీంనగర్ లో భారీ ర్యాలీ ప్రారంభించిన: మంత్రి గంగుల

కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లిలో శుక్రవారం ఉదయం మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలోభారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.

కరీంనగర్ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా భారీగా ప్రజలు తరలివచ్చారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహించిన ఈ ర్యాలీని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, విప్ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీష్ బాబు, మేయర్ సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ వర్చువల్ గా మెడికల్ కళాశాల ప్రారంభానికి ముందు ఈ ప్రదర్శన జరిగింది...

టెట్ ఎగ్జామ్ సెంటర్ లో గర్భిణీ మృతి

సంగారెడ్డిజిల్లా:

టెట్‌ పరీక్ష రాసేందుకు వెళ్లిన గర్భిణి రాధిక పరీక్ష కేంద్రంలోనే మృతి చెందింది. ఈ ఘటన పటన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో ఈరోజు ఉదయం జరిగింది.

సమయానికి చేరుకోవాలనే తొందరలో పరీక్ష కేంద్రంలోని గదికి చేరుకునేందుకు ఆమె వేగంగా వెళ్లింది.

ఈ క్రమంలో బీపీ ఎక్కువై పరీక్ష గదిలోనే రాధిక పడిపోయింది. హుటాహుటిన రాధికను పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి ఆమె భర్త అరుణ్‌ తీసుకెళ్లారు.

అయితే అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

గణేష్ ఉత్సవ కమిటీలకు మట్టి విగ్రహాలు పంపిణీ: మంత్రి జగదీష్ రెడ్డి

ఎప్పటిలాగే ఈ వినాయక చవితికి కూడా మట్టి విగ్రహాలను పెట్టుకుని పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

సూర్యాపేటను పర్యావరణహితమైన పట్టణంగా తీర్చిదిద్దుకుందామని చెప్పారు. వినాయక నవరాత్రి పూజలను పురస్కరించుకుని సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీలకు శుక్రవారం మట్టి విగ్రహాలను అందజేశారు.

మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తలో సూర్యాపేటకు ఇప్పటికే జాతీయ స్థాయి గుర్తింపు దక్కిందని చెప్పారు.

ప్లాస్టిక్‌ నివారణ విషయంలో కూడా సూర్యాపేట ముందుండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ప్లాస్టిక్‌తో ముప్పు పొంచి ఉన్నదని, ప్లాస్టిక్‌ నివారణ కోసం మనం చేయగలిగిన మేలు చేయాలని మంత్రి సూచించారు.

ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనం వల్ల నీరు కాలుష్యం అవుతుందని, ఆ నీటితో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని మంత్రి తెలిపారు.

ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల నీరు, భూమి, గాలి కలుషితమై క్యాన్సర్‌ వ్యాధులు వస్తాయని, అందుకే మట్టి విగ్రహాలు పెట్టుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

గత తొమ్మిది సంవత్సరాలుగా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతున్నదని చెప్పారు.ఉత్సవ కమిటీలు విధిగా మట్టి విగ్రహాలను పూజించాలని మంత్రి కోరారు. సూర్యాపేట మున్సిపాలిటీతోపాటు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లలో అందుబాటులో ఉన్న మట్టి విగ్రహాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

కొత్తగా సీడ్ విగ్రహాలను తయారు చేశారని, ఈ విగ్రహాలను ఇండ్లలో పూజించి భూమిలో నాటితే మొక్కలుగా పెరుగుతాయని, అలా చేస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారవుతారని మంత్రి పేర్కొన్నారు...

ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ

తెలంగాణ గడ్డపై తొలిసారిగా రెండు రోజులు 16, 17 తేదీల్లో, హైదరాబాద్‌ వేదికగా తాజ్‌కృష్ణా హోటల్‌లో జరిగే ఈ కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశాలకు.. కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు..

దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, , ముఖ్యమంత్రులు, ఏఐసీసీ ప్రధాన కార్యర్శులు, కేంద్ర మాజీ మంత్రులు, ఇతర సీనియర్లతో కలిపి దాదాపుగా 200 మందికి పైగా ప్రతినిధులు సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరుకానున్నారు.

ఇప్పటీ వరకు ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయం వార్‌రూమ్‌లో జరిగే ఈ సమావేశం.. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుండటంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.

పార్టీ అగ్రనాయకత్వం అంతా రాష్ట్రానికి రావడం, కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నతంగా భావించే సీడబ్ల్యూసీ సమావేశాలు తెలంగాణలో నిర్వహిస్తుండటంతో.. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటుంది. ఏమాత్రం లోటుపాట్లు లేకుండా పకడ్బందిగా ఏర్పాటు చేస్తున్నారు.

ఒక్కో వీఐపీకి పీసీసీ నుంచి ఒక డెలిగెట్‌ను ఏర్పాటు చేశారు. ఏయిర్‌పోర్టు నుంచి దిగినప్పటికి నుంచి సమావేశానికి హాజరకావడం, తిరిగి వెళ్లే వరకు పీసీసీ కేటాయించిన నాయకులు చూసుకునే విధంగా కార్యాచరణ తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2005లో కాంగ్రెస్‌ అధిష్టానం ఏఐసీసీ ప్లీనరీని నిర్వహించింది.

దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు మొదటిసారిగా సీడబ్ల్యూసీ సమావేశాలను ఇప్పుడు హైదరాబాదులో నిర్వహిస్తున్నారు...

నేడు టెట్’ పరీక్ష: సర్వం సిద్ధం చేసిన అధికారులు

టీచర్ ఎలిజిబులిటీ టెట్ పరీక్షకు అధికారులు సర్వం సిద్ధమైంది. పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

శుక్రవారం ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది.

మొత్తం 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా పేపర్ 1 కు 2,69,557 మంది, పేపర్ 2కు 2,08,498 మంది అప్లికేషన్ చేసుకున్నారు.

పేపర్ 1 నిర్వహణకు 1139 కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. పేపర్ 2కు 913 సెంటర్లు సిద్ధం చేశారు. మొత్తం 2052 కేంద్రాలకు గాను 2052 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2052 మంది డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లు, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 మంది హాల్ సూపరింటెండెంట్లను అధికారులు నియమించారు.

నిఘా నీడలో పరీక్షలు నిర్వహించనున్నారు. పారదర్శకంగా నిర్వహించేందుకే సీసీ టీవీలు ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టంచేశారు. కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. వైద్యం, రవాణాకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు...

శ్రావణ శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది!!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు చివరి శ్రావణ శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే ఉంది.

నేడు శ్రీవారి దర్శనానికి 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

కాగా గురువారం స్వామివారిని 61,926 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.32 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.......

రాజకీయ కక్షతో పంపిన మోడీ(ఈడీ)నోటీసులు

తనకు మోడీ నోటీసు వచ్చిందని, అది రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈడీ నోటీసును తమ పార్టీ న్యాయ విభాగానికి ఇచ్చామని, ఆ విభాగం ఎలా చెబితే అలా ముందుకెళ్తామని తెలిపారు.గురువారం ఆమె నిజామాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఈడీ నోటీసులు అందాయని క‌విత తెలిపారు. నోటీసుల‌ను పార్టీ లీగ‌ల్ సెల్‌కు అంద‌జేశాం. వారి సూచ‌న‌ల మేర‌కు ముందుకు వెళ్తాం. రాజ‌కీయ కక్షతోనే నోటీసులు ఇచ్చిన‌ట్లు బ‌లంగా న‌మ్ముతున్నాం. తెలంగాణ‌లో రాబోయే ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని దృష్టిలో పెట్టుకుని త‌న‌కు నోటీసులు ఇచ్చారు.

గ‌త ఏడాది కాలం నుంచి ఆ కేసులో ద‌ర్యాప్తు జరుగుతోంద‌ని, ఇంకెన్నాళ్లు ఆ విచార‌ణ ఉంటుందో త‌న‌కు తెలియ‌దు. 2జీ కేసులో కూడా ఇంత కాలం విచారణ జ‌ర‌గ‌లేద‌నుకుంటా. రాజ‌కీయ ఉద్దేశంతోనే కేసు సాగుతోంద‌ని, తెలంగాణ ప్ర‌జ‌లు దీన్ని సీరియ‌స్‌గా తీసుకోరు. పార్టీ లీగ‌ల్ బృందం ఇచ్చే స‌ల‌హాల మేర‌కు ముందుకు వెళ్తామ‌న్నారు.

తాము ఏ పార్టీతోనూ క‌ల‌వ‌లేద‌ని, కేవ‌లం తెలంగాణ ప్ర‌జ‌లు, భార‌త దేశ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యామ‌న్నారు. దేశ ప్ర‌జ‌లు సీఎం కేసీఆర్‌ను కావాల‌నుకుంటున్నార‌ని, దీంతో ఆ రెండు పార్టీల‌కు ఆ భ‌యం ప‌ట్టుకున్న‌ట్లు ఆమె తెలిపారు.

మేం ఎవ‌రికీ బీ టీమ్ కాద‌న్నారు. అంతులేని టీవీ సీరియ‌ల్ త‌ర‌హాలో విచార‌ణ సాగుతున్న‌ద‌ని, అదేమీ పెద్ద విష‌యం కాద‌న్నారు. బీజేపీ ఎన్నిక‌ల స్టంట్‌లో భాగంగా ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆమె ఆరోపించారు. ప్ర‌జ‌లే ఆ పార్టీకి బుద్ధి చెబుతార‌ని క‌విత పేర్కొన్నారు...