/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz వాట్సప్ సరికొత్త ఫీచర్... ఇప్పుడు సెండ్ అయిన మెసేజ్ లను సవరించవచ్చు... Mane Praveen
వాట్సప్ సరికొత్త ఫీచర్... ఇప్పుడు సెండ్ అయిన మెసేజ్ లను సవరించవచ్చు...
NEW: వాట్సాప్ మరొక సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. మీరు పంపిన వాట్సాప్ మెసేజ్ లు సవరించుకోవడానికి అవకాశం కల్పించింది. సందేశాన్ని టైప్ చేయడంలో చిన్న పొరపాటు జరిగిందా? పెద్ద గా చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు మెసేజ్‌ లను పంపిన తర్వాత 15 నిమిషాల వరకు సులభంగా ఎడిట్ చేయవచ్చు, మీరు తప్పు ను రద్దు చేయాలన్నా లేదా ఎమోజీని మార్చాలనుకున్నా సులభంగా మార్చవచ్చు. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మెసేజ్ టైప్ చేసినప్పుడు పొరపాటు జరిగి సెండ్ చేశారా, ఐతే 15 నిమిషాల లోపు కుడివైపు పైన ఉన్న మూడు చుక్కల వద్ద క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్లి మీరు మార్చాలనుకున్న  సందేశాన్ని మార్చి తిరిగి  పంపవచ్చు.
NLG: తెలంగాణ తైక్వాండో మహిళా జట్టు కోచ్ గా అంబటి ప్రణీత్
ఈ నెల 9వ తేదీ నుండి 11 వ తేదీ వరకు అస్సాంలో నిర్వహించే 39వ జాతీయ తైక్వాండో సీనియర్ కైరూగీ మరియు 12వ జాతీయ పూమాస్  క్రీడల సందర్భంగా,  తెలంగాణ తైక్వాండో మహిళా జట్టు కోచ్‌ గా అంబటి ప్రణీత్  ను నియమించారు. ఈ సందర్భంగా ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన గ్రాండ్ మాస్టర్ TTA ప్రెసిడెంట్ డి. సతీష్ గౌడ్, TTA జనరల్ సెక్రటరీ గ్రాండ్ మాస్టర్ ఏ. ప్రవీణ్ కుమార్, TTA రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు TTAN నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మాస్టర్ Md. యూనస్ కమల్‌ లకు ప్రత్యేక ధన్యవాదాలు అని  కోచ్ అంబటి ప్రణీత్ తెలిపారు.
NLG: గట్టుప్పల్ మండల ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
నల్లగొండ జిల్లా:
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని  గట్టుప్పల్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు నేడు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా చండూరు  జడ్పిటిసి కర్నాటి వెంకటేశం హాజరై‌ ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చండూరు ఎంపీపీ పల్లె కళ్యాణి రవి కుమార్, గట్టుప్పల్ ఎమ్మార్వో, చండూరు మండల ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఎన్జీ కళాశాలలో ఓటర్ నమోదు పై అవగాహన సదస్సు
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు రాజనీతి శాస్త్రము మరియు ప్రభుత్వ పాలన శాస్త్రం ఆధ్వర్యంలో ఓటర్ నమోదు పై  అవగాహన  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్డీవో రవి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 సంవత్సరాల నిండిన విద్యార్థినీ విద్యార్థులు అందరూ ఓటరుగా తమ పేరు నమోదు చేయించుకోవాలని, అదేవిధంగా విధిగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని,సమర్థులైన వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయాలంటే యువత, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. విద్యార్థులు నిజాయితీగా నిబద్ధతతో తమ ఓటును వినియోగించుకోగలిగినప్పుడే సరి అయిన ప్రభుత్వాలు ఏర్పడతాయని అన్నారు. అనంతరం 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులందరికీ ఓటర్ నమోదు పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు నాగుల వేణు, డాక్టర్ ఎస్. యాదగిరి, ఈ. యాదగిరి రెడ్డి, గంజి భాగ్యలక్ష్మి, శివ రాణి, అధ్యాపకులు సీతారాం రాథోడ్, గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్, డాక్టర్ కృష్ణ కౌండిన్య, వెంకటరమణ, మరియు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హోంగార్డ్ రవీందర్ కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించి, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి: వైయస్ షర్మిల
TS: రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన కేసీఆర్ కు.. హోం గార్డు లకు సకాలంలో జీతాలు ఇవ్వాలన్న మనసు లేకపోవడం బాధాకరం అని  వైఎస్ఆర్ టిపి అధినేత్రి వైయస్ షర్మిల అన్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన హోం గార్డు రవీందర్ కు సకాలంలో జీతం అందక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని, రవీందర్ చావుకు ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వమే కారణం అని ఆమె ఆరోపించారు.

హోం గార్డులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ 2017లో హామీ ఇచ్చినా నేటికీ నెరవేర్చలేదని అన్నారు. హోంగార్డు లకు సమయానికి జీతాలు రావు, కనీస గౌరవం ఉండదని, మీ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలవ్వాలని  ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హామీ ఇచ్చిన విధంగా 20 వేల మంది హోంగార్డులను తక్షణమే పర్మినెంట్ చేసి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, హెల్త్ కార్డులు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రవీందర్ కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించి, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నామని షర్మిల తెలిపారు.
SRPT: అమ్మవారి విగ్రహ పున: ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి
సూర్యాపేట: నియోజకవర్గంలోని నెమ్మికల్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ దండు మైసమ్మ అమ్మవారి విగ్రహ పున: ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయాల పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.
కార్యక్రమంలో పలువురు బి ఆర్ ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే నోముల భగత్
NLG: "మన ఊరు- మన ఎమ్మెల్యే" కార్యక్రమంలో భాగంగా మాడుగుల పల్లి మండలం గోపాలపురం గ్రామంలో శుక్రవారం సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ పర్యటించి ప్రజల సమస్యలను  అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల్ని వీలైనంత తొందరగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఎన్ఆర్ ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ను ఆయన ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఎర్రజెండాలతో చండూరు నడిబొడ్డున నిరసన
నల్లగొండ జిల్లా:
చండూర్:  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల ఫై వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలు అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వారు అన్నారు. రాజ్యాంగ సంస్థలైన ఈ డి, సి బి సి, ఐడి, ఎన్నికల కమిషన్, పార్లమెంటరీ కోర్టులను తమ జేబు సంస్థలుగా వాడుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని వారు అన్నారు. పెట్రోల్,డీజిల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం.. సబ్కా సాత్, సబ్కా వికాస్ అనే నినాదంతో దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు. పెరుగుతున్న నిత్యవసర ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఏటా కోటి ఉద్యోగాలన్న మోడీ ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ద్వసం చేశారన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రుణ మాఫీ తో సహా వడ్డీ మాఫీ చేయాలని, గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్న నిరుపేదలను ఆదుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సైదులు,ఉపాధ్యక్షులు నల్లగంటి లింగ స్వామి, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మీ ఫోన్‌ సిమ్‌ కార్డు సడెన్‌గా బ్లాక్‌ అయ్యిందా, ఐతే మీ బ్యాంకు ఖాతాలో సొమ్ము హాం ఫట్!
HYD: హ్యాకర్లు కొత్త తరహా మోసం.. ఆదమరిస్తే ఇక పోలీస్ స్టేషన్ నే గతి.. స్మార్ట్‌ ఫోన్‌ వచ్చాక వ్యక్తిగత సమాచారం సులువుగా ఇతరులు చేతుల్లోకి వెళ్లిపోతోంది. క్షణాల్లో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. రోజుకో కొత్త మార్గంలో అమాయకుల ఫోన్ల నుంచి కేటుగాళ్లు నగదు దోచుకుంటున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి ఫోన్‌ మూడు రోజులుగా పనిచేయడం మానేసింది. నెట్‌వర్క్‌ సమస్య వచ్చి ఉంటుందని భావించాడు. సమీపంలోని ఏటీఎంలో నగదు విత్‌ డ్రా చేసుకోవడానికి వెళ్లితే అకౌంట్‌ లో జీరో బ్యాలెన్స్‌ చూపించే సరికి ఉలిక్కిపడ్డాడు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి బ్యాంక్ కు వెళ్లి ఆరా తీస్తే తన అకౌంట్‌ నుంచి దాదాపు రూ.3 లక్షల నగదు వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపింది. హబ్సిగూడకు చెందిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగికు ఈ చేదు అనుభవం ఎదురైంది. మెహిదీ పట్నం కి చెందిన మరో వ్యక్తి అకౌంట్ నుంచి రూ.20 వేలు డెబిట్‌ అయినట్లు ఫోన్‌కు సందేశం వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపు దఫాలుగా అతని అకౌంట్‌ నుంచి 6 లక్షల రూపాయలు మాయం చేశారు. నేరుగా అతని ఫోన్‌కు కాల్‌ చేసిన సైబర్ నేరగాళ్లు తన ఫోన్‌కు వచ్చిన లింక్‌ క్లిక్‌ చేయవల్సిందిగా కోరారు. అనంతరం బాధితుడి ఫోన్‌కు వచ్చిన ఓటీపీ తెలుసుకొని దశల వారీగా మొత్తం డబ్బు కొట్టేశారు. ఈ మధ్యకాలంలో ఫోన్‌ సిమ్‌ కార్డులు ఉన్నట్లుండి బ్లాక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. అనేక మంది ఫోన్‌లలో సిమ్‌లు అలాగే ఉంటున్నాయి. అకస్మాత్తుగా సిమ్‌కార్డులు బ్లాక్‌ అవుతున్నాయి. ఏం జరిగిందో గుర్తించేలోపుగానే బ్యాంకు అకౌంట్‌లో డబ్బు గుట్టుచప్పుడుకాకుండా మాయం అవుతోంది. రెండేళ్ల క్రితం ఈ తరహా స్విమ్‌కార్డు క్లోనింగ్‌, సిమ్‌స్వాపింగ్‌లతో సైబర్‌ నేరగాళ్లు వరుస మోసాలకు పాల్పడ్డారు. ఇప్పుడు మళ్లీ అచ్చం అదేమాదిరి ఫోన్‌ సిమ్‌కార్డుల ద్వారా అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. గ్రేటర్‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో వస్తున్న సైబర్‌ ఫిర్యాదుల్లో ఓటీపీ బాధితులే అధికంగా ఉంటున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే అవగాహనే సరైన మార్గమని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు. తద్వారా హ్యాకర్లు, మాయగాళ్లు కలసి చేస్తున్న మోసాలకు పుల్‌స్టాప్‌ పెట్టవచ్చని అంటున్నారు.

అసలు ఫోన్‌ నెంబర్లతో వీళ్లేం చేస్తారంటే.. చేతి తిరిగిన నైజీరియన్‌ హ్యాకర్లు, మెయిల్‌ ఐడీలు లక్ష్యంగా ఈ విధమైన మోసాలకు పాల్పడుతున్నారు. సులువైన పాస్‌వర్డ్‌ ఉన్నవాటిని తేలికగా హ్యాక్‌ చేసి వాటి సాయంతో బ్యాంకు ఖాతా, ఫోన్‌ నంబర్లను సేకరిస్తారు. అలా సేకరించిన సమాచారాన్ని రాజస్థాన్‌, ఢిల్లీలోని సైబర్‌ నేరస్థులకు చేరవేస్తారు. ఆయా సెల్‌నంబర్లకు వేర్వేరు సిమ్‌కార్డుల నుంచి 5 సార్లు ఫోన్లు చేస్తారు. వాటి ఆధారంగా సమీపంలోని సర్వీస్‌ప్రొవైడర్‌ ఆఫీస్‌కు వెళ్లి తమ సెల్‌ఫోన్‌ పోయిందని, సిమ్‌కార్డు బ్లాక్‌ చేయమని కోరతారు. సర్వీస్‌ ప్రొవైడర్ల నిబంధనల ప్రకారం చివరిగా ఫోన్‌చేసిన 5 నంబర్లు అడుగుతారు. వాటి ద్వారా అదే నంబర్‌తో కొత్త సిమ్‌లు సేకరిస్తారు. ఇలా సేకరించిన సిమ్‌ కార్డులను ఫోన్‌ వేస్తారు. బ్యాంకు లావాదేవీల సమయంలో ఆ నెంబర్‌కు ఓటీపీలు వస్తాయి. అలా వచ్చిన ఓటీపీతో ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి మోసాలు నిందితులు శని, ఆదివారాల్లో మాత్రమే చేస్తారు. ఈ రెండు రోజులు బ్యాంకులకు సెలవు దినాలు. బాధితులు ఫోన్‌ చేసినా బ్యాంకు సేవలు పొందేందుకు ఆలస్యమవుతుండటమే అందుకు కారణం. ఈ మోసాల నుంచి బయటపడాలంటే.. గుర్తు తెలియని ఫోన్ల ఉంచి ఐదు ఫోన్‌కాల్స్‌ వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వరుసగా రెండు మూడ్రోజులు సిమ్‌ పనిచేయకపోతే వెంటనే సర్వీస్‌ ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేయాలి. బ్యాంకు ఖాతా నుంచి ఆన్‌లైన్‌ సేవలు నిర్వహించకుండా ఆ నంబర్‌ను బ్లాక్‌ చేయాలి. అలాగే బ్యాంకులపేరిట వచ్చే లింకులను క్లిక్‌ చేయకూడదు. ఎవరైనా ఈ తరహాలో మోసపోతే వెంటనే 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలని సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.
YBD: ఉట్లు కొట్టే కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు
యాదాద్రి జిల్లా, చౌటుప్పల్: పట్టణ కేంద్రంలోని తాల్లసింగారంలో శ్రీ కృష్ణాష్టమి పండుగ సందర్భంగా, యాదవ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసినటువంటి ఉట్లు కొట్టే కార్యక్రమంలో చౌటుప్పల్  మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు పాల్గొన్నారు. వారి చేతుల మీదగా ఉట్ల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బత్తుల స్వామీ, బి ఆర్ ఎస్ వార్డు అధ్యక్షులు బొంగు నాగేష్, బొంగు మల్లేష్, మాజీ సర్పంచ్ నల్ల అంజయ్య, మాజీ సర్పంచ్ సుర్వి నరసింహా, చిలువేరు శ్రీశైలం,గణేష్, ప్రవీణ్, మల్లేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.