/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యజమానుల పైన చర్యలు తీసుకోవాలి Yadagiri Goud
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యజమానుల పైన చర్యలు తీసుకోవాలి

•బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాల యజమానులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధన ఉల్లంఘిస్తున్నారు ఆర్థిక ఇబ్బందులు తో సతమతం అవుతున్న పేద ప్రజల నుండి బలవంతంగా ఫీజులు ముందే కట్టాలని ఫీజులు చెల్లిస్తేనే పుస్తకాలు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు కొన్ని పాఠశాలల్లో అరకొర వసతులతోనే ప్రవేట్ పాఠశాలలను ప్రారంభించారు.

నార్కట్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతి లేకుండా చైతన్య ఈటెక్నిక్ స్కూల్ పేరుతో పాఠశాల పారంభిస్తామని చెప్పి అడ్మిషన్లు చేసుకోవడం జరుగుతుంది కావున తక్షణమే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. విద్యాహక్కు చట్టాన్ని కూడా అమలు చేయాలని , ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని

ప్రతి ఒక్కరికి పాఠ్య పుస్తకాలు అందజేయాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున కోరుతున్నాము ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్, జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, నరేష్, పండ్ల హరికృష్ణ, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పశువుల మందపై పెద్ద పులి దాడి

నంద్యాల జిల్లా:జూన్ 19

ఆత్మకూరు మండలం పెద్ద అనంతపురం గ్రామ సమీపంలో సోమవారం ఉదయం అవుల మంద పై పెద్దపులి దాడి చేసింది.. ఈ దాడిలో రెండు అవులు మృతి చెందాయి… పులి దాడిని ప్రత్యక్షంగా చూసిన పశువుల కాపర్లు కేకలు వేయడంతో పులి అడవులలోకి పారిపోయింది..

సమాచారం అందుకున్నఅటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పులి దాడి చేసిన వివరాలను సేకరించారు.. . ఇటీవల అడవి సమీప గ్రామాలలో పశువులపై తరుచు పులులు దాడులు చేస్తున్నాయని,

పులుల బారి నుంచి తమను కాపాడాలని స్థానికుల వేడుకున్నారు.. పులి దాడితో భయపడుతున్న ప్రజలకు భరోసా ఇస్తూ, పికెట్ ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు...

SB NEWS

రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన : వైయస్ షర్మిల

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ , రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛ‌త్తీస్ గ‌ఢ్ సీఎం భూపేష్ బ‌ఘేల్, ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్, శివ‌సేన పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే , ఎంపీ సంజ‌య్ రౌత్ , టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ న‌వ్ జ్యోత్ సింగ్ సిద్దూ తో పాటు ప‌లువురు రాహుల్ గాంధీకి అభినంద‌న‌లు తెలిపారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. రాహుల్ గాంధీకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు, ఇది చాలా సంతోష‌క‌ర‌మైన రోజని, మీరు మీ ప‌ట్టుద‌ల‌, స‌హ‌నంతో ప్ర‌జ‌ల‌కు స్పూర్తినిస్తూ హృద‌య పూర్వ‌క ప్ర‌య‌త్నాల ద్వారా సేవ చేస్తూ ఉండాల‌ని షర్మిల ట్వీట్ లో కోరారు. ఆరోగ్య‌వంతంగా, సుఖ సంతోషాల‌తో విల‌సిల్లాల‌ని అకాంక్షించారు.

కాంగ్రెస్ లో విలీనం నిజమేనా?

తెలంగాణలో వైఎస్పార్ టీపీ ని కాంగ్రెస్ లో కలిపేస్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ రాహుల్ కు షర్మిల విషెస్ చెప్పటం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేకించి రాహుల్ కు షర్మిల ట్వీట్ చేయటం వెను క ఉద్దేశం కూడా అదే అని పలువురు నేతలు రీ ట్వీట్లు మొదలుపెట్టారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రెండు సార్లు బెంగళూరు వెళ్లిన షర్మిల డిప్యూటీ సీఎం ను కలిసిన సందర్భాలను కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అయితే షర్మిల మాత్రం అవన్నీ ఏమీ లేవని , తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు....

నేటి నుంచి పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

సికింద్రాబాద్‌:జూన్ 19

నిర్వహణ పనుల కారణంగా సోమవారం 19 నుంచి 25 వ తేదీ వరకు కొన్ని మార్గాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు.

లింగంపల్లి - హైదరాబాద్‌ (రైలు నెంబర్‌: 47129, 47132, 47133, 47135, 47136), హైదరాబాద్‌-లింగంపల్లి (రైలు నెంబర్‌: 47105, 47108, 47109, 47110, 47112), ఉందానగర్‌- లింగంపల్లి (రైలు నెంబర్‌: 47165, 47211),

లింగంపల్లి - ఫలక్‌నుమా (రైలు నెంబర్‌: 47189, 47179), లింగంపల్లి - ఉందానగర్‌ (రైలు నెంబర్‌: 47178, 47212), ఫలక్‌నుమా -లింగంపల్లి (రైలు నెంబర్‌: 47158) సర్వీసులను ఈ రోజు నుంచి 24 వరకు రద్దు చేశారు.

ఉందానగర్‌ - లింగంపల్లి (రైలు నెంబర్‌: 47214) , రామచంద్రాపురం - ఫలక్‌నుమా (రైలు నెంబర్‌: 47177), ఫలక్‌నుమా-లింగంపల్లి (రైలు నెంబర్‌: 47156), ఉందానగర్‌-లింగంపల్లి (రైలు నెంబర్‌: 47157), లింగంపల్లి-ఉందానగర్‌ (రైలు నెంబర్‌: 47181) సర్వీసులను 25వ తేదీ వరకు రద్దు చేశారు. లింగంపల్లి-ఫలక్‌నుమా (రైలు నెంబర్‌: 47182) సర్వీసును ఈనెల 25న రద్దు చేశారు....

నిజంనిప్పులాంటిది

సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ‘చేతబడి’ చేశారన్న ఆరోపణతో దళిత దంపతులను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. సదాశివపేటకు చెందిన యాదయ్య, అతని భార్య చేతబడి చేస్తున్నారన్న అ

చేతబడి చేశారంటూ దంపతులను చెట్టుకు వేలాడదీసి దారుణంగా కొట్టిన గ్రామస్తులు
సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ‘చేతబడి’ చేశారన్న ఆరోపణతో దళిత దంపతులను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. సదాశివపేటకు చెందిన యాదయ్య, అతని భార్య చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో కొంతమంది గ్రామస్తులు యాదయ్య అతని భార్యను గ్రామ నడివీధిలోని చెట్టుకు తాళ్లతో వేలాడదీసి కర్రలతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.....
ఆహార కల్తీలు కట్టడి : ఎలా❓️

హైదరాబాద్:జూన్ 19

నగరంలో కల్తీ దందా ఎక్కువైపోతోంది. ఐస్‌క్రీములు, చాక్లెట్లు, మషాలాలు, నూనె, అల్లంవెల్లుల్లి పేస్ట్ ఇలా ఇంట్లోకి ఉపయోగించే సరుకులు, చిన్నారులు తినే వాటిపై కన్నేసిన కేటుగాళ్లు కల్తీకి తెరలేపారు. ప్రమాదకరమైన వాటితో, ఆకర్షించే ప్యాకింగ్లతో కల్తీ సరుకును తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాడమాడుతున్నారు. కల్తీ దందాలపై అధికారులు ఎప్పడికప్పుడు కొరడా ఝుళిపిస్తున్నప్పటికీ ఏదో ఒక చోట కల్తీ పరిశ్రమలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

తాజాగా నాసిరకం వస్తులతో బిస్కట్లను తాయరు చేస్తున్న పరిశ్రమపై ఎస్వోటీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. నగరంలోని అల్లాపూర్‌లో కల్తీ బిస్కట్ పరిశ్రమపై సైబరాబాద్ ఎస్ఓటీ బృందం దాడులు నిర్వహించింది.

నాసిరకమైన వస్తువులతో బిస్కట్లు తయ్యారి చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్న కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు.

కల్తీ బిస్కట్ల తయారీతో నిర్వాహకులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. పరిశ్రమలోని పరిసరాలు కంపుకొడుతున్న పరిస్థితి. ఎలాంటి అనుమతులు లేకుండానే పరిశ్రమ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదకరమైన ఫుడ్ కలర్స్ కలిపి వివిధ ప్లేవర్స్ బిస్కట్ తయారీకి కంత్రీగాళ్లు తెరలేపారు.

పరిశ్రమలలో ఫుడ్ సేఫ్టీ మెజర్స్ ఎక్కడా కనిపించని పరిస్థితి. దీంతో భారీగా కల్తీ బిస్కట్స్‌లను ఎస్వోటీ బృందం చేసింది. కల్తీ బిస్కట్ పరిశ్రమ నడుపుతున్న షేక్ ఖదీర్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు....

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్ళింది అని మనస్థాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం ఉదయం ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఫిలింనగర్ పరిధిలోని దుర్గాభవానీ నగర్‌కు చెందిన నరసింహకు రెండేళ్ల క్రితం శివాని అనే యువతితో వివాహం జరిగింది. కొద్ది రోజుల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి.

దీంతో తాజాగా శివాని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తతో పాటు కుటుంబీకులతో శివాని మాట్లాడకపోవడంతో భర్త నరసింహ మనస్తాపానికి గురయ్యాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఫ్యాన్‌కు ఉరేసుకుని నరసింహ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు....

తెలంగాణలో ముస్తాబ్ అవుతున్న ఆదర్శ రైల్వే స్టేషన్లు

ప్రయాణికులకు సౌకర్యాలు పెంచడం లక్ష్యంగా మంజూరుచేసిన ఆదర్శ రైల్వేస్టేషన్ల డిజైన్లు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 39 ఆదర్శ రైల్వేస్టేషన్లుగా ఎంపికయ్యాయి. మరికొద్దివారాల్లో రాష్ట్రంలోని మరో 32 స్టేషన్లనూ ఈ పథకంలో ఎంపిక చేయనున్నారు. పార్కింగ్‌కు విశాలమైన స్థలంతో పాటు హైదరాబాద్‌లోని స్టేషన్లలో సిటీ బస్సుల, రైళ్ల ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా డిజైన్లు తయారు చేస్తున్నట్లు రైల్వేవర్గాలు తెలిపాయి.

ఎంపికైన ఆదర్శ స్టేషన్లు ఇవే..

ఆదిలాబాద్‌, బాసర, కాచిగూడ, మల్కాజిగిరి, బేగంపేట, భద్రాచలం రోడ్‌, గద్వాల, హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్‌, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, కాజీపేట, ఖమ్మం, లింగంపల్లి, మధిర, మహబూబాబాద్‌,

మహబూబ్‌నగర్‌, మలక్‌పేట, మంచిర్యాల, మేడ్చల్‌, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్‌, షాద్‌నగర్‌, జోగులాంబ, తాండూరు, ఉందానగర్‌, వికారాబాద్‌, వరంగల్‌, రాయగిరి, యాకుత్‌పురా, జహీరాబాద్‌, జడ్చర్ల.

ఏమేం ఉంటాయి?

ఆదర్శ స్టేషన్‌ పథకంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారేలా సౌకర్యాలు కల్పించబోతున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది............

మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత

ఇదివరకు పంజాబ్‌లో తరచూ మత్తు పదార్థాల గుట్టు రట్టు అయ్యేది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియాలు రెచ్చిపోతున్నాయి.

చాక్లెట్లు అమ్మినట్లుగా డ్రగ్స్ అమ్మేస్తున్నాయి. ఈరోజు ఉదయం తాజాగా హైదరాబాద్... మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్‌ని పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు.

వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా దగ్గర డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. మొత్తం 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్‌లను సీజ్ చేశారు......

SB NEWS

కొత్త మండలాలు.. పాత భవనాలు

మండలాలు ఏర్పాటైనా పాత, అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు

కొమరంభీంజిల్లా:జూన్‌19 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రజలకు అధికారులు చేరువలో ఉండి పరి పాలన సౌలభ్యంగా ఉండాలని ప్రభుత్వం కొత్త మండ లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అయిన ఆయాశాఖల కార్యాలయ నిర్వహణ మాత్రం గాల్లోకి వదిలేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన జిల్లాలు ఏర్పడి ఆరేళ్లు కావస్తున్నా ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా అద్దె భవనాలు, పాత ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగడమే ఇందుకు నిదర్శణం. పాలనా సౌలభ్యం కోసం నూతన మండలాలను ఏర్పాటు చేశామని చెబుతున్న ప్రభుత్వం ఆయాశాఖల కార్యాలయాలకు నూతనభవన నిర్మాణాలు చేపట్టడం లేదు. అద్దె,పాత భవనాల్లోనే పలు కార్యాల యాలు కొనసాగుతున్నాయి. మరి కొన్నింటిని ఇతర శాఖ కార్యాలయాల్లో సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. నూతన జిల్లాలో భాగంగా కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాను 2016లో ఏర్పాటు చేశారు. పూర్వ 12మండలాల నుంచి పెంచికలపేట, చింతలమానేపల్లి, లింగాపూర్‌ మూడు మండలాలను కొత్తగా ఏర్పాటు చేయగా 15మండలాలతో కూడిన నూతనజిల్లా ఆవిష్కృతమైంది. నూతన మండ లాలు ఏర్పాటు చేసినప్పటికీ కార్యాలయాలకు భవనాలు లేకపోవడంతో అటు అధికారులు, సిబ్బంది, వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

నూతనంగా ఏర్పాటు అయిన మూడు మండలాల్లో మండల సర్వసభ్య సమావేశాలతోపాటు ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కార్యక్రమాలను ప్రస్తుతం అద్దె భవనాల్లో నిర్వహించేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతిమూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశాలను ఇరుకు గదుల్లోనే, స్థానిక రైతువేదికలో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. కార్యాలయాలకు రోజు వందల సంఖ్యలో ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. కార్యాలయాల ముందు కనీసం పార్కింగ్‌ స్థలాలు లేకపోవడంతో అంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైన మండలాల్లో సొంతభవనాల నిర్మాణంపై దృష్టిసారించి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

నూతనంగా ఏర్పాటైన పెంచికలపేట మండలంలో తహసీల్దార్‌ కార్యాలయం ఆరె సంక్షేమ సంఘ భవనంలో కొనసాగుతోంది. ఎంపీడీవో కార్యాలయం ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో కొనసాగుతుండగా వ్యవసాయశాఖ అధికారులు రైతువేదికలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అటవీ శాఖ కార్యాలయం బీట్‌ఆఫీసర్‌ వసతిగృహంలో కొనసాగుతోంది.

పోలీసుస్టేషన్‌, ఎంఆర్‌సీ భవనం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం భవనాలను నూతనంగా నిర్మించి ఇటీవలే ప్రారంభించారు. మండల ఏర్పాటుకు పూర్వం నుంచి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, పశువు వైద్యశాలలు ఉన్నాయి.

తహసీల్దార్‌ కార్యాలయం ప్రభుత్వ పాఠశాలలో కొనసా గుతుండగా ఎంపీడీవో కార్యాలయం జిల్లా పరిషత్‌ పాఠశా లలో కొనసాగుతోంది. వ్యవసాయ అధికారులు స్థానిక రైతు వేదికలో కొనసాగిస్తున్నారు. పోలీసు స్టేషన్‌, కేజీబీవీ పాఠశాల భవనాలు నూతనంగా నిర్మించి ఇటీవలే ప్రారం భించారు. పూర్వం నుంచే ఆస్పత్రి, పశువైద్యశాలలు ఉన్నాయి.

తహసీల్దార్‌ కార్యాలయం పాత జడ్పీఎస్‌ఎస్‌ పాఠ శాలలో, ఎంపీడీవో కార్యాలయం గ్రామపంచాయతీ కార్యా లయంలో కొనసాగుతున్నాయి. అటవీశాఖ కార్యాలయం వీఎస్‌ఎస్‌ కమ్యూనిటీ హాల్‌లో, వ్యవవసాయశాఖ రైతు వేదికలో కొనసాగుతున్నాయి. ఎంఆర్‌సీ భవన నిర్మాణం పూర్తైనా ఇంకా ప్రారంభించలేదు. మండలానికి పూర్వమే పోలీసు స్టేషన్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.

భవన నిర్మాణాలు చేపట్టాలి..

ప్రజల సౌలభ్యం కోసం నూతన మండలాలు ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ ఆరు సంవత్సరాలు గడుస్తున్నా నేటివరకు ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల ఊసేలేదు. దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన సొంత భవనాలు నిర్మించి వినియోగంలోకి తేవాలి.........