/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పని ఇద్దరిది-పని భారం పది మందిది Yadagiri Goud
పని ఇద్దరిది-పని భారం పది మందిది

రాష్ట్ర ప్రభుత్వం బిసి లకు లక్ష రూపాయల లోన్ అనగానే జాతరను తలపిస్తుంది గద్వాల తహసీల్దార్ కార్యాలయం.20-50 వేల మంది జనాభ వున్న మండలానికి ఇద్దరు అధికారులు.లక్ష-రెండు లక్షలు జనాభ వున్నా మండలానికి ఇద్దరు అధికారులు.గద్వాల తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్నది ఇద్దరు రెవెన్యూ అధికారులే.

కానీ పని భారం మాత్రం పది మంది రెవెన్యూ అధికారులది.జిల్లా కేంద్రంలో ప్రోటోకాల్ వాళ్ళే చూడాలి, అధికారుల మంచి-చెడులు వాళ్ళే చూడాలి,ప్రెస్, పోలీస్, పొలిటికల్ వాళ్ళు ఎవరైనా కార్యాలయంకు వస్తే పరిష్కారం వాళ్ళే చెప్పాలి,భూ సమస్యలు వాళ్ళే చూడాలి, సర్టిఫికెట్స్ వాళ్ళే చూడాలి... ఇలా ఒక్కటా రెండా? చెబుతూ పోతే వాళ్ళ సమస్యలు ఒక లక్ష.ఇందులో ఏ ఒక్కరిని ఆగండి చేస్తాం, చూస్తాం అనడానికి రాదు.

అలా ఒకవేళ చెప్పారనుకోండి అప్పుడు పైనుండి రెకమెండేషన్ మళ్ళీ..... ఆముదానికి కొత్తిమీర బిర్యానీ అడిగింది అన్నట్టుగా వుంది ఈ ఇద్దరి ఉద్యోగం అని అనుకుంటున్నారు సామాన్య ప్రజనీకం సైతం.60-70 ఏళ్ళ వయసులో రావాల్సిన రోగాలు 35-45 ఏళ్ళ వయసులో వస్తున్నాయంటే ఇలాంటి పనిభారం వున్నప్పుడు రాక తప్పదు అంటున్నారు వైద్యులు.37 వార్డులున్న ఇంత పెద్ద గద్వాల పట్టణం,సుమారు 25 కి పైగా వున్న గ్రామపంచాయతీ లు వున్న గద్వాల మండలానికి ఒకే కార్యాలయం ఉండటమే పని భారానికి కారణం అంటున్నారు.

మండలానికి సపరేట్ తహసీల్దార్ కార్యాలయం, పట్టణానికి సపరేట్ తహసీల్దార్ కార్యాలయం ఉంటేనే అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు.పని త్వరగా పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది.జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆ దిశగా అడుగులు వేసి కార్యాలయాలను మెరుగు పరిస్తే బాగుండు అని ప్రజలు అనుకుంటున్నారు.

నందిగామలో సంచలనం సృష్టించిన జంట హత్యలు..! : బీహార్ గ్యాంగ్ ఘాతకం

చిన్నారి, వృద్ధురాలిని హత మార్చిన బీహారీ జంట

షాద్ నగర్ నియోజక వర్గం నందిగామ మండలంలో ఘటన

కొన్ని గంటల వ్యవధిలోనే హంతకులను పట్టుకున్న నందిగామ పోలీసులు

హంతకుల వేటలో నందిగామ సీఐ రామయ్య నేతృత్వంలో నాలుగు పోలీసు బృందాలు

పోలీసుల అదుపులో హంతకులు..!

అభం శుభం తెలియని 9 ఏళ్ల బాలిక, 60 ఏళ్ల వృద్ధురాలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని నందిగామలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. అయితే, వీరిని ఎవరు, ఎందుకు హత్య చేశారనే కోణంలో స్ధానిక సీఐ రామయ్య నేతృత్వంలో పోలీసులు క్లూస్‌ టీంతో సహా దర్యాప్తు చేశారు.

కేవలం హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు చాకచక్యంగా వలపన్ని హంతకులను అరెస్టు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం చిన్నారిని, వృద్ధురాలిని హత్య చేసిన హంతకులు పోలీసుల అదుపులో ఉన్నారు. నందిగామ సిఐ రామయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డికి సమాచారం అందించగా వారు రంగంలోకి దిగారు. రాత్రికి రాత్రి నాలుగు పోలీసు బృందాలు హంతకుల కోసం జల్లెడ పట్టాయి. ఈ నేపథ్యంలో హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే బీహార్ కు చెందిన ఇద్దరు భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం వారిని పోలీసు కస్టడీలో ఉంచినట్టు తెలుస్తోంది.

అసలేం జరిగింది..?

స్థానికుల కథనం ప్రకారం నందిగామ మండల కేంద్రానికి చెందిన కృష్ణ, శశికళ దంపతులు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి ఇంటి పక్కనే వారి బంధువు పార్వతమ్మ(60) అంగన్‌వాడీ ఆయాగా పనిచేసేకుంటూ ఒంటరిగా ఉంటోంది. దీంతో కృష్ణ, శశికళల కూతురు భానుప్రియ(9) నాలుగేళ్లుగా పార్వతమ్మకు తోడుగా ఆమె వద్దే ఉంటోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా భానుప్రియ కనిపించడం లేదని ఆ చిన్నారి తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి పార్వతమ్మ ఇంటికి వెళ్లి చూశారు. అప్పటికే భానుప్రియ రక్తపు మడుగులో పడి ఉంది. ఆ బాలికను మెడపై గుర్తు తెలియని వ్యక్తులు కోసి హత్య చేసినట్టు గుర్తించారు. అంతేకాకుండా పార్వతమ్మపై కూడా దాడి చేసినట్లు గుర్తించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. కొన ఊపిరితో ఉన్న పార్వతమ్మను షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. రెండు రోజుల క్రితం బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి పార్వతమ్మ ఇంట్లో అద్దెకు దిగాడు. ఈ హత్య తర్వాత అతను కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. జంట హత్యలపై నందిగామ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ నారాయణరెడ్డి పరిశీలించారు.

బంగారం నగదు కోసమే

ఇంట్లో అద్దెకు దిగిన బిహారీలు ఆలుమగల జంట ఇంత ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న పార్వతమ్మ, చిన్నారి భానుప్రియలను హతమార్చి ఆమె వద్ద ఉన్న బంగారం నగదు దోచుకెళ్లడానికి మర్డర్ ప్లాన్ చేశారు. ఇంట్లో వారిని లక్ష్యంగా చేసుకొని దారుణాతి దారుణంగా హింసించి చంపారు. అయితే కొన ఊపిరితో ఉన్న పార్వతమ్మ మార్గమధ్యలో మరణించింది. స్థానికులు నందిగామ సిఐ రామయ్యకు ఈ విషయం చెప్పగా రంగంలోకి దిగిన రామయ్య తదితర పోలీసు బృందాలు హంతకులను వెంటాడి వేటాడి పట్టుకున్నారు. పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకోవడంతో వారు దొరికారు. లేకపోతే వారు వారి బీహార్ రాష్ట్రానికి గుట్టుగా వెళ్లిపోయేవారు. కేవలం గంటల వ్యవధిలోనే మర్డర్ కేసు చేదించిన నందిగామ సిఐ రామయ్య తదితర పోలీసు బృందంపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

నేడు వరంగల్‌ జిల్లాలో కేటీఆర్‌ పర్యటన

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సిటీ సమీపంలోని గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే నన్నపునేని

 తెలంగాణ పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ శనివారం వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో రూ.840 కోట్లతో యంగ్‌వన్‌ కంపెనీ ఎవర్‌ టాప్‌ టెక్స్‌టైల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో చేపట్టే వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పార్కు నుంచి మంత్రి కేటీఆర్‌ హెలిక్యాప్టర్‌ ద్వారా ఖిలావరంగల్‌కు చేరుకుంటారు. మొదట వరంగల్‌లోని నర్సంపేట రోడ్డులో ఉన్న ఓ సిటీలో నిర్మాణం పూర్తి చేసుకున్న వరంగల్‌తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కేటీఆర్‌ ప్రారంభిస్తారు. ఆ తర్వాత సమీపంలో ఉన్న అజంజాహిమిల్స్‌ గ్రౌండ్‌లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీవోసీ) నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేస్తారు.

అనంతరం దేశాయిపేట వద్ద రూ.12.60 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన 200 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను, వరంగల్‌లో రూ.135 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న పదహారు స్మార్టు రోడ్లను కూడా వరంగల్‌చౌరస్తా వద్ద కేటీఆర్‌ ప్రారంభిస్తారు. రూ.75 కోట్లతో వరంగల్‌ మోడ్రన్‌ బస్‌స్టేషన్‌, రూ.313 కోట్లతో ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులకూ ఆయన శంకుస్థాపన చేస్తారు.

కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ(కుడా) జీ ఫ్లస్‌ ఫైవ్‌ అంతస్తులతో బస్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అజంజాహిమిల్స్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ జరగనుంది. 50 వేల మందితో నిర్వహించనున్న ఈ సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తారని వరంగల్‌తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ తెలిపారు. ఈ మేరకు సభాస్థలిని శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు......

నిజామాబాద్ జిల్లాకు రానున్న హైకోర్టు న్యాయమూర్తి

నిజామాబాద్:జూన్ 17

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మిస్ట్రేటివ్ జడ్జి శ్రీసుధ శనివారం జిల్లాకు రానున్నారు. హైకోర్టు న్యాయమూర్తి సమావేశపు హల్ లో జిల్లాలోని వివిధ కోర్టులకు చెందిన న్యాయాధికారులతో సమావేశమై న్యాయస్థానాలలో సివిల్,క్రిమినల్ కేసుల వివరాలు, న్యాయ విచారణ తీరుతెన్నులు సమీక్షీస్తారు.

న్యాయాధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేస్తారు.అనంతరం న్యాయసేవ సదన్ లో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించ నున్న”పోస్టల్ భీమా పథకాలు”అనే అంశంపై జరుగనున్న సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేసి సర్టిఫికెట్లనుప్రధానం చేస్తారు..

సదస్సులో అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ,జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఛైర్ పర్సన్ సునీత కుంచాల, సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి,జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,

ఇంచార్జీ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాస్ చాందక్,పోస్టల్ డిపార్ట్మెంట్ సీనియర్ మేనేజర్ మదన్ మోహన్ ఖాంది తదితరులు పాల్గొంటారు...

నెత్తురు పారుతున్న రోడ్లు : మూడు వేరు వేరు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం

రాష్ట్రంలో రోడ్లు నెత్తురోడాయి! వాహనదారుల నిర్లక్ష్యం.. మితిమీరిన వేగానికి నిండు ప్రాణాలు బలయ్యాయి! వారి ఇళ్లలో అంతులేని విషాదం నెలకొంది! శుక్రవారం మూడు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో తోబుట్టువులైన ఇద్దరు చిన్నారులున్నారు. వారి తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉంది.

ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ద్విచక్రవాహనాన్ని వరంగల్‌-2 డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది! ఆ బైక్‌పై ప్రయాణిస్తున్న కొత్తూరు మొట్లగూడెం గ్రామపంచాయతీ పరిధి శ్రీరాంనగర్‌ గొత్తికోయగూడానికి చెందిన మాడివి సురేశ్‌, కుమారి దంపతులు, వారి ఇద్దరు కుమారులు శివ (11), నవీన్‌ (5) కిందపడ్డారు. శివ, నవీన్‌పై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన సురేశ్‌, కుమారిని తొలుత ఏటూరునాగారంలోని ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. ఇద్దరి పరిస్థితీ విషమంగానే ఉంది.

వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం సుల్తాన్‌పూర్‌ శివారులో 16 మంది ప్రయాణికులతో పరిగి వైపు వెళుతున్న ఓ ఆటోను కొడంగల్‌ వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న అందరూ గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా పీర్లగుట్ట తండాకు చెందిన హేమిబాయి (58), కొత్తపల్లికి చెందిన బోయిని అంజిలమ్మ (48), గుండాలకు చెందిన దార శశికళ (45) మృతిచెందారు. శశికళ ఇద్దరు పిల్లలు కావ్యశ్రీ, కార్తీక్‌లకు గాయాలయ్యాయి. పిల్లలను పరిగి ప్రభుత్వ హాస్టల్‌లో చేర్పించేందుకు, వారిని వెంటబెట్టుకొని శశికళ బయలుదేరగా ఈ ప్రమాదం జరిగింది. మిగతా ప్రయాణికుల్లో తీవ్ర గాయాలైన చంద్రమ్మ, పోచమ్మలను హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు.

ఇక కారులో ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో డ్రైవర్‌ సురేశ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం రాయిచెడి గ్రామంలో ఓ ఇంటి వద్ద చెట్టు కింద కూర్చుని సేదతీరుతున్న నలుగురు మహిళలపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి యజమాని, ఆశా కార్యకర్త అమృతమ్మ (37) అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడ్డ మహిళలు అనిత, హేస్సేనమ్మలను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనిత మృతిచెందింది. హుస్సేనమ్మను మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు......,...

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమల :జూన్ 17

తిరుపతి దేవస్థానం శనివారం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

క్యూ కాంప్లెక్స్‌ లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది

కాగా నిన్న శుక్రవారం శ్రీవారిని 72,299 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.92 కోట్ల రూపాయలు వచ్చినట్టు

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 36,378 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.....

Bapatla: 'మేమే మీకు రూ.లక్ష ఇస్తాం.. దయచేసి వెళ్లిపోండి'.. ఎంపీ మోపిదేవికి నిరసన సెగ..

చెరుకుపల్లి: బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పదో తరగతి చదువుతున్న ఓ బాలుడిని ఒక యువకుడు పెట్రోలు పోసి సజీవ దహనం చేసిన ఘటన రాజోలులో శుక్రవారం ఉదయం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..

జిల్లాలోని ఉప్పలవారిపాలెంలో ఇవాళ బాలుడి అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు గ్రామానికి వచ్చిన వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణకు నిరసన సెగ తగిలింది. గ్రామంలోకి రావొద్దంటూ బాలుడి బంధువులు, స్థానికులు ఎంపీని అడ్డుకున్నారు. కనీసం బాధిత కుటుంబం ఉంటున్న ఇంటివద్దకు కూడా ఎంపీని వెళ్లకుండా అడ్డుకున్నారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఇంత పెద్ద ఘటన జరిగితే తీరిగ్గా పరామర్శించేందుకు వచ్చారా? అంటూ గ్రామస్థులు ప్రశ్నించారు. అయితే, తాను వ్యక్తిగతంగా కలిసి రూ.లక్ష పరిహారం అందించేందుకు వచ్చానని మోపిదేవి చెప్పగా.. ''మేమే మీకు రూ.లక్ష ఇస్తాం.

దయచేసి ఇక్కడినుంచి వెళ్లిపోండి. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి'' అని గ్రామస్థులు హెచ్చరించారు. దీంతో చేసేదిలేక మోపిదేవి అక్కడినుంచి వెళ్లిపోయారు. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి పికెట్‌ ఏర్పాటు చేశారు.

ఈ నెల 19 నుంచి వర్షాలు : వాతావరణశాఖ ప్రకటన

ఈ నెల 19 నుంచి వర్షాలు ఉన్నట్లు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ఈ నెల 18 నుంచి 21 మధ్య ఋతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది..

ఈ నెల 19 నుంచి తిరుపతి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, వైయస్సార్, చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కోస్తాంధ్రలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ నెల 19 నుంచి వర్షాలు ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది..

SB NEWS

లండన్‌లో త్రివర్ణ పతాకాన్ని అవమానించిన ఖలిస్తానీ మద్దతుదారు అవతార్ సింగ్ ఖండా మరణం,

అమృతపాల్ సింగ్ మిత్రుడు

ఖలిస్తానీ వేర్పాటువాది, లండన్‌లోని భారత హైకమిషన్‌పై దాడికి సూత్రధారి అవతార్ సింగ్ ఖండా UKలో మరణించాడు. ఖండా ఖలిస్తానీ మద్దతుదారు అమృతపాల్ సింగ్‌కు సన్నిహితుడిగా పరిగణించబడ్డాడు. అందిన సమాచారం ప్రకారం, ఖలిస్తానీ మద్దతుదారుడు మరియు వారిస్ పంజాబ్ సంస్థ అధినేత అమృతపాల్ సింగ్ యొక్క సన్నిహితుడు అవతార్ సింగ్ ఖండా బర్మింగ్‌హామ్‌లో మరణించారు. అతను బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని మరియు బర్మింగ్‌హామ్‌లోని ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.

అవతార్ సింగ్ ఖాండా విషప్రయోగం చేసినట్లు అనేక సోషల్ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఆ తర్వాత అతను UKలోని బర్మింగ్‌హామ్ నగరంలోని ఒక ఆసుపత్రిలో చేరాడు. అవతార్ సింగ్ కూడా చాలా కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడని చెబుతున్నారు. బుధవారం, ఖాండాను లండన్ ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ అతన్ని లైఫ్ సపోర్ట్‌లో ఉంచారు. క్యాన్సర్ కారణంగా ఏర్పడిన గడ్డ పగిలిపోవడం వల్ల ఖాండా శరీరం విషపూరితమైందని వర్గాలు తెలిపాయి.

ఖండా అమృతపాల్‌ని సిద్ధం చేశాడు

'వారిస్ పంజాబ్ దే' సంస్థ నాయకుడిగా అవతార్ సింగ్ అమృతపాల్‌ను పంజాబ్‌కు పంపినట్లు భావిస్తున్నారు. కొన్ని నివేదికలలో, అతను అమృతపాల్‌కు శిక్షణ ఇచ్చాడని కూడా చెప్పబడింది. దీప్ సిద్ధూ రూపొందించిన చిత్రం 'వారిస్ పంజాబ్ దే'. దీనితో పాటు, అతను చాలా మంది సిక్కు యువకులకు బాంబులు తయారు చేయడం మరియు IEDలను ఉపయోగించడంలో శిక్షణ ఇచ్చాడు. అవతార్ సింగ్ తండ్రి మరియు మామ ఇద్దరూ ఖలిస్తానీ ఫోర్స్‌లో క్రియాశీల సభ్యులు మరియు అతని మామ గుర్జంత్ సింగ్ బుద్ సింగ్‌వాలా ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ అని చెప్పబడింది. ఖాండా మామ 1988లో, అతని తండ్రి 1991లో చంపబడ్డారని దయచేసి చెప్పండి.

ఖండంగా ఉండేవాడు

లండన్‌లోని భారత హైకమిషన్‌పై దాడి చేసిన ఖలిస్తాన్ మద్దతుదారులలో కొంతమంది ప్రధాన నిందితుల ఛాయాచిత్రాలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) విడుదల చేసిందని మీకు తెలియజేద్దాం. ఇందులో 2023 మార్చి 19న లండన్‌లోని ఇండియా హౌస్‌పై దాడి చేసిన వారి వివరాలను కోరింది. అందులో ఒకటి అవతార్ సింగ్ ఫోటో కూడా. ఖండా ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ (KLF) లండన్ యూనిట్ చీఫ్ మరియు KLF ఉగ్రవాది కుల్వంత్ సింగ్ ఖుక్రానా కుమారుడు.

మోడీ అంటే పగ, సంకుచితత్వానికి మరో పేరు

మోడీ ప్రభుత్వం ఇప్పుడు నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరును మార్చిందని కాంగ్రెస్ పేర్కొంది

న్యూఢిల్లీలో ఉన్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ పేరు మార్చబడింది. ఇప్పుడు అది ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీగా పిలవబడుతుంది. నెహ్రూ మెమోరియల్ పేరు మార్చడంపై కాంగ్రెస్ మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.

కాంగ్రెస్ ప్రధాని మోదీని టార్గెట్ చేసింది

నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి ప్రధాని నరేంద్ర మోడీ పేరు మార్చారని, ఆయన సంకుచిత మనస్తత్వం, ప్రతీకారం తీర్చుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శించారు. సంకుచితత్వం, ప్రతీకార ధోరణికి మోదీ మరో పేరు అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ట్వీట్‌ చేశారు. 59 సంవత్సరాలకు పైగా, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ ప్రపంచ మేధోపరమైన మైలురాయి మరియు పుస్తకాలు మరియు రికార్డుల నిధిగా ఉంది. ఇక నుంచి దీనిని ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ సొసైటీగా పిలుస్తున్నారు. భారత దేశ-రాష్ట్ర రూపశిల్పి పేరు మరియు వారసత్వాన్ని కించపరచడం, కించపరచడం మరియు నాశనం చేయడం ప్రధాని మోదీ ఏమి ఆపలేదు. తన అభద్రతా భారంతో, ఒక పొట్టి మనిషి స్వయం ప్రకటిత ప్రపంచ గురువుగా తిరుగుతున్నాడు.

రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది

నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ ప్రత్యేక సమావేశంలో దీని పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా మార్చాలని నిర్ణయించారు. మీడియా కథనాల ప్రకారం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం ప్రత్యేక సమావేశం జరిగింది, ఇందులో నెహ్రూ మెమోరియల్ పేరు మార్చే నిర్ణయానికి ఆమోదం లభించింది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి రాజ్‌నాథ్ సింగ్ వైస్ చైర్మన్. మరియు ప్రధానమంత్రి దీనికి చైర్మన్. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, జి కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ సహా 29 మంది సభ్యులు ఈ సొసైటీలో ఉన్నారు.

దేశంలోని ప్రధాన మంత్రులందరికీ అంకితం చేసిన మ్యూజియాన్ని ప్రధాని మోదీ ప్రతిపాదించారు

తీన్ మూర్తి కాంప్లెక్స్‌లో దేశంలోని ప్రధాన మంత్రులందరికీ అంకితం చేయబడిన మ్యూజియం నిర్మించాలని 2016 సంవత్సరంలో ప్రధాని మోదీ ఒక ప్రతిపాదన చేశారని మీకు తెలియజేద్దాం. అదే సంవత్సరం నవంబర్ 25న జరిగిన NMML 162వ సమావేశంలో ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం గత ఏడాది ఏప్రిల్ 21న ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

ఇంతకు ముందు కూడా చాలా పేర్లు మారాయి

2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల పేర్లు మార్చేశారని చెప్పుకుందాం. గతంలో మొఘల్ గార్డెన్స్ పేరు అమృత్ ఉద్యాన్ గా మార్చబడింది. ఈ తోట రాష్ట్రపతి భవన్ ముందు ఉంది. మొఘల్ గార్డెన్స్ పేరు మార్చడంపై రాజకీయ దుమారం చెలరేగింది. పేరు మార్పు చరిత్రను తుడిచిపెట్టే దిశగా కాంగ్రెస్‌ అభివర్ణించింది.

ఈ భవనం ఒకప్పుడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నివాసం

తీన్ మూర్తి మార్గ్‌లో నిర్మించిన ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ నివాసం అని గమనించవచ్చు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ భారత ప్రధాని అయిన తర్వాత తుది శ్వాస విడిచే వరకు అక్కడే నివసించారు. 1948లో పండిట్ నెహ్రూ దేశ ప్రధానమంత్రి అయినప్పుడు తీన్ మూర్తి భవన్ ఆయన అధికారిక నివాసంగా మారింది. పండిట్ నెహ్రూ 16 సంవత్సరాలు ఈ ఇంట్లోనే ఉంటూ ఇక్కడే తుది శ్వాస విడిచారు. ఆయన మరణానంతరం ప్రభుత్వం ఆ ఇంటిని స్మారక చిహ్నంగా ప్రకటించి అదే ఇంటి ఆవరణలో గ్రంథాలయాన్ని నిర్మించింది. ఈ గ్రంథాలయంలో దేశంలోని జర్నలిస్టులు, రచయితలు, పరిశోధక విద్యార్థులు నెహ్రూ నాటి ప్రభుత్వాలు, వారి విధానాలు, సమకాలీన దేశాల పుస్తకాలను చదువుతారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ లైబ్రరీ పేరును మార్చింది, దీనిపై కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది.