/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదుల హతం Yadagiri Goud
జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదుల హతం

నగర్‌: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి..

ఈ ఘటనలో అయిదుగురు విదేశీఉగ్రవాదులను జవాన్లు హతమార్చారు.

ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న సైన్యం, పోలీసులు గురువారం రాత్రి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు.

ఈక్రమంలోనే పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని కాశ్మీర్‌ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు మరణించారని.. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు..

SB NEWS

నేడు, రేపు పలు ప్రాంతాల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ :జూన్ 16

నేడు, రేపు పలు ప్రాంతాల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నగరానికి రానున్న నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.

ఈ రోజు సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు.. 17న ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీటీఓ జంక్ష న్, పీఎన్బీ ఫ్లైఓవర్, జంక్షన్, హెచ్పీఎస్ స్కూల్ ఔట్ గేట్, బేగంపేట ఫ్లై ఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్ రోడ్, ఎంఎం. టీఎస్, వివి స్టాట్యూ జంక్షన్, పంజాగుట్ట జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు తలెత్తాయి.

సికింద్రాబాద్ నుంచి వయా బేగంపేట మీదుగా అమీర్‌పేట్, మెహదీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈ రూట్‌లో రాకుండా అప్పర్ ట్యాంక్బండ్‌పై దారి మళ్లించనున్నారు. రాజభవన్ రోడ్, మొనప్ప జం క్షన్, వీవీ స్టాచ్యూ భైరతాబాద్ ఈ మార్గాల్లో రెండు వైపులా రోడ్ మూసివేశారు. పంజాగుట్ట రాజభవన్ క్వార్టర్స్ రోడ్డులో వాహనాలకు అనుమతి లేదు.

సీటీఓ జంక్షన్, మినిస్టర్ రోడ్డులో వచ్చే వాహనాలను రసూల్పరా జంక్షన్ వద్ద కొంత సమయం పాటు నిలిపివేస్తారు. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్ మీదుగా బేగంపేట ఎయిర్‌పోర్టు మీదుగా వచ్చే వాహనాలను ప్రకాష్ నగర్ టీ జంక్షన్ వద్ద కొంత సమయం నిలుపుదల చేస్తారు. ఈ రూట్‌లలో ప్రయాణించే వాహనదారులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసుల సూచించారు....

తిరుమలలో మరింత పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల :జూన్ 16

తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వీకెండ్ కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. నేడు (శుక్రవారం) క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది.

గురువారం 70,896 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.07 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 37,546 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న శర్వా దంపతులు..

శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామి వారిని హీరో శర్వానంద్ దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఏపీ హైకోర్టు సీజే ఏ.వి శేష సాయి, ఏపీ హైకోర్టు జడ్జి రవినాథ్ తిలహరి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు...

SB NEWS

పవన్ కళ్యాణ్‌కు చెప్పులు చూపించి వార్నింగ్ ఇచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని. "నువ్వు ఒక్క చెప్పు చూపిస్తే... నేను రెండు చెప్పులు చూపిస్తా...

మాకు లేవా చెప్పులు" అంటూ పేర్ని నాని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. నిన్న కత్తిపూడిలో.. వారాహి యాత్ర చేపట్టి... వాహనం పై నుంచి ప్రసంగించిన పవన్ కళ్యాణ్... ఆ సందర్భంగా... వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ... గంటకు పైగా ప్రసంగించారు. ఆ వ్యాఖ్యలకు తాజాగా మంత్రి పేర్ని నానీ కౌంటర్స్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్‌ గత వీడియోలను ప్లే చేసిన పేర్ని నానీ.. వాటిలో ఆయన మాట్లాడిన మాటలకూ... నిన్న చేసిన ప్రసంగానికీ పోలిక చూపిస్తూ... మాటల్లో ఎంత తేడా ఉందో గుర్తించాలని కోరారు. పవన్ కళ్యాణ్ పరిస్థితులకు అనుగుణంగా తన కులాన్ని మార్చేస్తారనీ... తగిన ఓట్లు వచ్చే ఛాన్స్ లేకపోయినా... సీఎం అయిపోవాలని కలలు కంటున్నారని విమర్శలు చేశారు. అన్నీ తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని పేర్ని నానీ మండిపడ్డారు..

పవన్ కళ్యాణ్‌ గత వీడియోలను ప్లే చేసిన పేర్ని నానీ.. వాటిలో ఆయన మాట్లాడిన మాటలకూ... నిన్న చేసిన ప్రసంగానికీ పోలిక చూపిస్తూ... మాటల్లో ఎంత తేడా ఉందో గుర్తించాలని కోరారు. పవన్ కళ్యాణ్ పరిస్థితులకు అనుగుణంగా తన కులాన్ని మార్చేస్తారనీ... తగిన ఓట్లు వచ్చే ఛాన్స్ లేకపోయినా... సీఎం అయిపోవాలని కలలు కంటున్నారని విమర్శలు చేశారు. అన్నీ తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని పేర్ని నానీ మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రసంగించినా... కచ్చితంగా వైసీపీ నేతల నుంచి కౌంటర్స్ రావడం కామన్. ఇప్పుడు పేర్ని నానీ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఆయన.. ఓ అడుగు ముందుకు వేసి ప్రెస్ మీట్‌లో 2 చెప్పులూ తీసి మరీ చూపిస్తూ వాయిస్తానని వార్నింగ్ ఇవ్వడం రాజకీయ ఉద్రిక్త పరిస్థితిని వెల్లడిస్తోంది.

ప్రైవేటు పాఠశాలలలో ఫీజుల దోపిడి ని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

బి సి యువజన సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్

తెలంగాణ రాష్ట్రంలో విద్య పూర్తిగా వ్యాపారంగా మారిందని మిర్యాలగూడలో అమరవీరుల స్తూపం దగ్గర నిరసన తెలియజేస్తూ మాట్లాడుతున్న బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ

ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వలన విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున విద్యా వ్యాపారం నడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన పాఠశాల యాజమాన్యాల ఫీజులకు అంతే లేకుండా పోయింది.

ఒక L K G విద్యార్థికే 40 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నప్పటికీ కూడా విద్యాశాఖ అధికారులు అలాంటి విద్యా సంస్థలపై నేటికీ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం అయింది పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునేందుకు వీలు లేకుండా ఈ ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడిని ప్రభుత్వం అరికట్టకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఆయన అన్నారు.

ప్రైవేటు పాఠశాలలను నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ యూనిఫామ్ బుక్స్ ఇలా అన్ని ప్రైవేట్ వాళ్ళ పాఠశాలలోనే తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడికి గురి చేస్తున్నాను విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుండి తల్లిదండ్రులను విద్యార్థుల ఫీజుల పట్ల నేటికి తీవ్ర ఆందోళన కొనసాగుతూ ఉంది విద్యని వ్యాపారంగా చేసి విద్యని అమ్ముకుంటున్న విద్యాసంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోతే మాత్రం పాఠశాలల ఎదుట తీవ్రస్థాయిలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన అన్నారు.

ఇకనైనా ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలకు వత్తాసుగా ఉండకుండా పేదల పక్షపాతిగా ప్రతి పేద విద్యార్థి ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే విధంగా ప్రభుత్వం ఫీజ్ స్ట్రక్చర్ నియమించి పేద విద్యార్థులందరికీ విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్లపూడి శీను, అజయ్, గంగాధర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

స్టాలిన్ ప్రభుత్వం పెద్ద నిర్ణయంతో తమిళనాడులో సీబీఐ విచారణకు అనుమతి తీసుకోవాల్సి ఉంది

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని నిత్యం ఆరోపణలు వస్తున్నాయి. కాగా, తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని బుధవారం అరెస్టు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, కేంద్ర ఏజెన్సీ ఇప్పుడు దర్యాప్తు కోసం రాష్ట్ర అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. కేసులను దర్యాప్తు చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుండి తమిళనాడు సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నట్లు తమిళనాడు హోం శాఖ బుధవారం (జూన్ 14) తెలిపింది. రాష్ట్రం.

తమిళనాడు ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది, తమిళనాడు హోం శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ప్రకటన ప్రకారం, కేంద్ర ఏజెన్సీ సిబిఐ ఇప్పుడు తమిళానికి పంపబడింది. రాష్ట్రంలో తాజా కేసు విచారణకు నాడు.. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇది ఇప్పటికే పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కేరళ, మిజోరాం, పంజాబ్ మరియు తెలంగాణలలో చేసినట్లు ప్రకటనలో పేర్కొంది.

ఈ రాష్ట్రాల్లో కూడా సీబీఐకి అనుమతి తప్పనిసరి

వాస్తవానికి, ఏకాభిప్రాయం ఉపసంహరించుకున్న తర్వాత, ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా కేసును విచారించే ముందు కేంద్ర దర్యాప్తు సంస్థ తమిళనాడు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.సిబిఐ దర్యాప్తు కోసం ఏకాభిప్రాయాన్ని ఉపసంహరించుకున్న పదో రాష్ట్రంగా తమిళనాడు అవతరించింది. . అంతకుముందు, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మేఘాలయ, మిజోరాం, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ మరియు పశ్చిమ బెంగాల్ వంటి ఇతర 9 రాష్ట్రాలు ఈ కేసులను దర్యాప్తు చేయడానికి సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి.

మంత్రి వి సెంథిల్ అరెస్ట్ తర్వాత నిర్ణయం

తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీపై ED దాడుల తర్వాత స్టాలిన్ ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసింది.ఈ చర్య బిజెపి నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది, ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ ప్రత్యర్థి నాయకులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. సెంథిల్ బాలాజీ అరెస్టు తర్వాత, కాంగ్రెస్‌తో సహా పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు మరియు అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై రాజకీయ ప్రక్షాళన మరియు ప్రతీకారం తీర్చుకుంటున్నారని అన్నారు.

తమిళనాడు రవాణా శాఖలో ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో తమిళనాడు మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం అరెస్టు చేసినట్లు వివరించండి. తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కేంద్ర ఏజెన్సీ నుండి ఇటువంటి చర్యను ఎదుర్కొన్న మొదటి మంత్రి బాలాజీ. ఈ విషయంపై ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. విచారణకు పూర్తి సహకరిస్తామని బాలాజీ హామీ ఇచ్చినప్పుడు సుదీర్ఘంగా విచారించాల్సిన అవసరం ఏముందన్నారు. ఇడి అటువంటి అమానవీయ చర్య సమర్థించబడుతుందా అని ఆయన అన్నారు. 2014-15లో నేరం జరిగినప్పుడు బాలాజీ అన్నాడీఎంకేలో ఉన్నారు మరియు అప్పుడు రవాణా మంత్రిగా ఉన్నారు.

అధికార పార్టీ నేతలపై రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

అధికార పార్టీ నేతలపై రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీ లోని శేఖర్ రెడ్డి నివాసంలోనూ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

Moజేసీ బ్రదర్స్ షోరూమ్స్‌తో పాటు అమీర్‌పేట్‌లోని కార్పొరేట్ ఆఫీసులో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ బ్రదర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో మర్రి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల సతీమణులు రెండు కంపెనీలకు డైరెక్టర్స్‌గా ఉన్నారు.

ముగ్గురూ కలిసి పలు కంపెనీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఫైళ్ళ శేఖర్ రెడ్డి బ్యాంకు లాకర్స్‌ను సైతం అధికారులు ఓపెన్ చేశారు. ఐటి సోదాలపై బీఆర్ఎస్ శ్రేణులు మండి పడుతున్నాయి...

సైక్లోనిక్ తుఫాను బిపార్జోయ్ నేడు గుజరాత్‌ను తాకనుంది, భారీ వర్షాలు కురుస్తాయి, 74 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు

అరేబియా సముద్రం నుంచి ఎగిసిపడిన తుఫాను బిపర్‌జోయ్‌ తుఫాను ప్రమాదకరంగా దాటింది. మరికొద్ది గంటల్లో గుజరాత్‌ను తాకబోతోంది. ఈరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని చెబుతున్నారు.భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తుఫాను గురించి సమాచారం ఇస్తూ, సైక్లోన్ బైపార్జోయ్ సౌరాష్ట్ర, కచ్ వైపు కదులుతున్నట్లు తెలిపారు. ఇది జఖౌ నుండి దాదాపు 180 కి.మీ.ల దూరంలో ఉంది. గంటకు 125-135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇది చాలా తీవ్రమైన తుఫాను, ఇది సాయంత్రం నాటికి తీరాన్ని చేరుకుంటుంది. దీని వల్ల చెట్లు, చిన్న ఇళ్లు, మట్టి ఇళ్లు, డబ్బా ఇళ్లు దెబ్బతింటాయి.

74,345 మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు

తీర ప్రాంతాల నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ బుధవారం ఉదయం నాటికి పూర్తయిందని గుజరాత్ రిలీఫ్ కమిషనర్ అలోక్ పాండే తెలిపారు. 74,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎనిమిది కోస్తా జిల్లాల్లో మొత్తం 74,345 మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు. ఒక్క కచ్ జిల్లాలోనే దాదాపు 34,300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీని తర్వాత, జామ్‌నగర్‌లో 10,000 మంది, మోర్బీలో 9,243 మంది, రాజ్‌కోట్‌లో 6,089 మంది, దేవభూమి ద్వారకలో 5,035 మంది, జునాగఢ్‌లో 4,604 మంది, పోర్‌బందర్‌లో 3,469 మంది, గిర్ సోమ్‌నాథ్ జిల్లాలో 1,605 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

8 జిల్లాల్లో హై అలర్ట్

బిపార్జోయ్ తుఫాను దృష్ట్యా, గుజరాత్‌లోని 8 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. తుఫాను కారణంగా గుజరాత్‌కు మరియు తిరిగి వచ్చే 100 కి పైగా రైళ్లు రద్దు చేయబడ్డాయి. రాజ్‌కోట్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలను కూడా మూసివేశారు.

ఎన్‌డిఆర్‌ఎఫ్‌, సైన్యం బాధ్యతలు చేపట్టింది

తుఫాను తాకిడికి ముందు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) గుజరాత్ మరియు మహారాష్ట్రలలో సహాయ మరియు సహాయక చర్యలను నిర్వహించడానికి మొత్తం 33 బృందాలను కేటాయించింది. గుజరాత్‌లో 18 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను ఉంచారు, ఒకటి డయ్యూలో మోహరించారు. నాలుగు నౌకలు సిద్ధంగా ఉన్నాయని భారత నావికాదళం తెలిపింది. పోర్‌బందర్ మరియు ఓఖా వద్ద ఐదు సహాయక బృందాలు మరియు వల్సురా వద్ద 15 సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయి. గోవాలోని ఐఎన్‌ఎస్ హంసా, ముంబైలోని ఐఎన్‌ఎస్ షిక్రా నావల్ ఎయిర్‌స్టేషన్‌లో నేవీ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలని కోరారు.

విడిగా వస్తానో, కూటమితో వస్తానో ఇంకా నిర్ణయించలేదు : పవన్‌

జనసేన కథ ఏంటో తొందరలోనే తేలిపోతుందా? పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు విన్నతర్వాత అందరికీ ఇలాగే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోతోందని చెప్పారు..

ఇంతవరకు బాగానే ఉందికానీ ఎన్నికల్లో జనసేన ఎవరితోనూ పొత్తు పెట్టుకోవటంలేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికలను ఒంటరిగానే ఎదుర్కొని పార్టీ సత్తా ఏమిటో చూపిస్తుందని చెప్పారు. ఈ మాటతోనే అందరికీ అనుమానం పెరిగిపోతోంది.

“ఎంతసేపూ… నువ్వు విడిగా రా… నువ్వు విడిగా రా అంటారు. నేను విడిగా వస్తానో, ఉమ్మడిగా వస్తానో ఇంకా నిర్ణయించుకోలేదు. ఆ సమయం వచ్చినప్పుడు కుండబద్దలు కొట్టినట్టు చెబుతాను.

కానీ ఒక్క విషయం… వచ్చే ఎన్నికల్లో గెలిచి నేను అసెంబ్లీలో అడుగుపెట్టాల్సిందే… పెడతాను. దాన్ని కోసం ఎన్ని వ్యూహాలైనా అనుసరిస్తాం. ముఖ్యమంత్రి పదవిని ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాం. ముఖ్యమంత్రి పదవి మనకు రావాలంటే ఏం చేయాలి, ఎలా వెళ్లాలి అనేది మాట్లాడుకుందాం” అంటూ పవన్ తన మనసులో మాట చెప్పారు..

మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తాం

- మైనర్లు వాహనాలు నడిపితే రోడ్డుపై జరిగే ప్రమాదాలకు తల్లిదండ్రులదే బాధ్యత

- నల్లగొండ టూ టౌన్ ఎస్సై ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి

మైనర్లకు వాహనాలు ఇస్తే బండి యజమానులపై కేసులు నమోదు చేస్తామని నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు.

బుధవారం రాత్రి నల్లగొండ పట్టణంలోని రామగిరిలో జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మైనర్లు నడుపుతున్న 20 వాహనాలను పట్టుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపడం మూలంగా రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయక ప్రజలు మరణిస్తున్నారన్నారు.

మైనర్లు వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలకు తల్లిదండ్రుల బాధ్యత వహించాలని అన్నారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా లైసెన్స్ తీసుకొని వాహనాలు నడపాలన్నారు. లైసెన్స్ లేకుండా, నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపే వారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బుధవారం 34 కేసులు నమోదు చేసి రూ. 20 వేల జరిమానా విధించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు సంపత్, జూకూరు సైదులు, సిబ్బంది నరసింహ, ధార లింగస్వామి, వెంకన్న, అనిల్ పాల్గొన్నారు.