/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png StreetBuzz ఎమ్మెల్యే రఘునందన్ రావుపై IPS అధికారుల సంఘం సీరియస్ TS breaking
ఎమ్మెల్యే రఘునందన్ రావుపై IPS అధికారుల సంఘం సీరియస్

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై IPS అధికారుల సంఘం సీరియస్ అయింది. బీహార్ రాజ్యాంగాన్ని డీజీపీ అంజనీకుమార్ అమలు చేస్తున్నారని రఘునందన్ రావు అన్న వ్యాఖ్యలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర డీజీపీపై దారుణ పదజాలం ఉపయోగించారని ఫైర్ అయ్యారు. రఘనందన్ రావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్వీకర్ కు ఫిర్యాదు చేశారు. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా రఘునందన్ వ్యాఖ్యాలు ఉన్నాయని వెల్లడించారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పరామర్శించడానికి వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరామర్శించడానికి వచ్చిన వాళ్లను అరెస్ట్ చేయడం ఏంటని, తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని రఘునందన్ రావు.. పోలీసులను ప్రశ్నించారు. రఘునందన్ రావుతో పాటు మరికొందరు మహిళా బేజేపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ ముందు మరింత ఉద్రిక్త పరిస్థులు నెలకొంది.

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఛానెల్పై నిషేదం ఎత్తివేత

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. మలయాళ వార్తా ఛానెల్ ‘మీడియావన్’పై కేంద్రం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఇవాళ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా న్యూస్‌ ఛానెల్‌ టెలికాస్ట్‌ను నిషేధించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చి మీడియా వన్ ఛానెల్ ను బ్యాన్ చేసింది. దాంతో ఆ ఛానెల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై.. సుప్రీంకోర్టు ఇవాళ (ఏప్రిల్ 5) విచారణ చేపట్టింది.

ప్రభుత్వ విధానాలకు వ్యతిరకంగా ఛానెల్‌ చేసిన ప్రసారాలను.. పత్రికా వ్యవస్థకు విరుద్ధమైనవిగా పరిగణించలేమని సుప్రీం అభిప్రాయపడి ఛానెల్ పై విధించిన బ్యాన్ ను తొలగించింది. పటిష్టమైన ప్రజాస్వామ్యాం కోసం స్వతంత్ర పత్రికా వ్యవస్థ అవసరమని డివై చంద్రచూడ్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. మీడియావన్ ఛానెల్‌పై జాతీయ భద్రతా వాదనలు లేవనెత్తినందుకు హోమ్‌ మంత్రిత్వశాఖను సుప్రీం నిలదీసింది.

భూమిని పోలిన గ్రహం నుంచి రేడియో సిగ్నల్స్..

ఈ అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాన్ని కొన్ని ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు. భూమిలా జీవానికి అవసరం అయ్యే పరిస్థితుల ఏ గ్రహానికైనా ఉన్నాయా అని మన పాలపుంతలో శాస్త్రవేత్తలు గాలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొన్ని వందల ఎక్సో ప్లానెట్స్ గుర్తించినప్పటికీ భూమిని పోలిన గ్రహాల్లో జీవాలు ఉండే అవకాశం మాత్రం దాదాపుగా తక్కువే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా భూమి పరిమాణం ఉన్న ఓ ఎక్సో ప్లానెట్ ను గుర్తించారు. ఈ గ్రహం నుంచి వస్తున్న రేడియో సిగ్నల్స్ ను కనుగొన్నారు. భూమి లాంటి అయస్కాంత క్షేత్రాన్ని కలిగి, వాతావరణం కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అయస్కాంత క్షేత్ర ప్రభావంతో తన మాతృనక్షత్రం నుంచి విడుదలయ్యే హైఎనర్జీ పార్టికల్స్ ను తిప్పికొడుతూ తన వాతావరణాన్ని కాపాడుకుంటుందని, నక్షత్రం నుంచి వెలువడే విస్పోటనాలు ఈ అయస్కాంత క్షేత్రం గ్రహాన్ని కాపాడుతున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నక్షత్రం, గ్రహం మధ్య జరిగే చర్యల వల్ల రేడియో సిగ్నల్స్ ఉత్పన్నం అవుతున్నాయి.

ఈ గ్రహం భూమి నుంచి 12 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ మరుగుజ్జు నక్షత్రం ‘వైజెడ్ సెటి’ నక్షత్రం చుట్టూ ఈ గ్రహం ‘వైజెడ్ సెటీ బి’ పరిభ్రమిస్తోంది. కొలరాడో యూనివర్సిటీ, బక్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సెబాస్టియన్ పినెడ, జాకీ విల్లాడ్ సెన్, కార్ల్. జి జాన్స్కీ వేరి లార్జ్ అర్రే అనే రేడియో టెలిస్కోప్ ద్వారా వైజెడ్ సెటీ నుంచి వెలువడుతున్న సిగ్నల్స్ ను రికార్డ్ చేశారు. ఒక గ్రహం వాతావరణాన్ని కలిగి ఉందా లేదా..? అనేది దాని అయస్కాంత క్షేత్రం బలంపై ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

వైజెడ్ సెటీ బీ గ్రహం తన మాతృ నక్షత్రం చుట్టూ 2 రోజుల్లోనే పరిభ్రమణం పూర్తి చేస్తుంది. అంటే దాదాపుగా మన సౌర కుటుంబంలోని బుధుడి కక్ష్యకు సమానంగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు గురుగ్రహాల వంటి భారీ గ్రహాల అయస్కాంత క్షేత్రాలను కనిపెట్టారు. అయితే భూమి వంటి చిన్న గ్రహాల అయస్కాంత క్షేత్రాలను కనిపెట్టేందుకు ఓ నమూనాను తయారు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

ప్లాస్టిక్ తెచ్చిచ్చి గోల్డ్ తీస్కెళ్లండి!

 అది దక్షిణ కాశ్మీర్​లోని అనంత్ నాగ్ జిల్లాలోని సాడీవారా గ్రామం. చాలా ఊర్లలాగే ఆ ఊరు కూడా ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయింది. రోడ్ల వెంట, వీధుల్లో ఎక్కడ చూసినా వాడి పారేసిన పాలిథీన్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. చెత్తను తొలగించేందుకు గ్రామ పంచాయతీ నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ పేరుకుపోతూనే ఉంది. అందుకే ఆ గ్రామ సర్పంచ్, అడ్వొకేట్ ఫరూక్ అహ్మద్ గనై ఒక ప్లాన్ వేశాడు.

గ్రామస్తులు 20 క్వింటాళ్ల ప్లాస్టిక్​ను సేకరించి ఇస్తే పంచాయతీ తరఫున ఒక గోల్డ్ కాయిన్ ఇస్తామని ప్రకటించాడు. దీంతో ఊరోళ్లంతా ప్లాస్టిక్ వేటలో పడ్డారు. రోడ్లు, వీధుల వెంబడి మాత్రమే కాదు.. ఊరి పక్కనున్న నదిలో, వాగులు, కాలువల్లోనూ పడి ఉన్న ప్లాస్టిక్ ను సేకరించి తీసుకొచ్చారు. మొత్తంగా పదిహేను రోజుల్లోనే ఊరంతా ప్లాస్టిక్ చెత్త లేకుండా క్లీన్ అయిపోయింది. గ్రామాలను క్లీన్​గా ఉంచుకోవడంలో సాడీవారా ఇతర గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలిచిందని ఉన్నతాధికారులు మెచ్చుకుంటున్నరు. అయితే.. గ్రామంలో ప్లాస్టిక్ చెత్తను సేకరించినందుకు ఎంత మందికి గోల్డ్ కాయిన్ లు ఇచ్చారన్నది మాత్రం వెల్లడి కాలేదు.

నిజామాబాద్ లో కలకలం.. మరో మెడికో స్టూడెంట్ ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో ఏం జరుగుతుంది. విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తమ ఆత్మవిశ్వాన్ని కోల్పోయి ఇలా ఆత్మహత్యలకు పాల్పడి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి మంచి భవిష్యత్తుకై ఎదగాల్సిన విద్యార్తులు ఇలా ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. చదువుకుని ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తారనే తల్లిదండ్రులు ఆశలను అడిఆశలు చేస్తూ వారికి పుట్టెడుదుఖాన్ని మిగిలిస్తున్నారు. అలాంటి మరో ఘటన నిజామాబాద్ మెడికల్ కళాశాలలో చోటుచేసుకోవడంతో విద్యార్థులకు తీవ్ర మనస్తాపానికి గురిచేసింది.

నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుతున్న హర్ష ఘటన మరువకముందే మరో ఎం.బి.బి.ఎస్. విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. 2020 బ్యాచ్ కు చెందిన సనత్ మెడికల్ కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సనత్‌ పెద్ద పల్లి జిల్లాకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. MBBS మూడవ సంవ్సతరం పరీక్షలు రాసిన సనత్.. ప్రాక్టికల్ పరీక్షలకు సిద్ధమవుతుంగా సూసైడ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. రెండు నెలల కాలంలో ఇద్దరు మెడికో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులకు మెడికల్ కాలేజీ అధికారులు సమాచారం ఇచ్చారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో గడిచిన మూడు నెలల కాలంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చెందిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దాసరి హర్ష ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆ సంఘటన నుంచి మెడికల్ కళాశాల విద్యార్థులు తేరుకోకముందే మరో మెడికో స్టూడెంట్ ఆత్మహత్య కలకలం రేపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో జరుగుతున్న వరుస సంఘటనలు విద్యార్థులను ఆందోళన గురిచేస్తున్నాయి. 

ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడకు చెందిన దాసరి హర్ష నిజామాబాద్‌లో మెడిసిన్‌ చదువుతున్నాడు. ఈ ఉదయం తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగి మెడిసిన్ చదువుతున్న హర్ష మరణం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. పరీక్ష రాయాల్సిన హర్ష పరీక్షలకు హాజరు కాకుండా హాస్టల్‌లోనే ఉన్నాడు. పరీక్షల్లో ఎందుకు ఉత్తీర్ణత సాధించకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు హాస్టల్‌కు వెళ్లి చూడగా నిర్జీవంగా పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అలాంటి యాడ్స్ లో నటించొద్దు.. అమితాబ్ కి సజ్జనార్ రిక్వెస్ట్

యాడ్స్.. ప్రజెంట్ మార్కెట్లో చాలా కీలకం. కంపెనీలు తమ ప్రాడక్ట్స్ ను అమ్ముకోవడం కోసం ఎన్నో ఎత్తులు పై ఎ్తతులు వేస్తాయి. కోట్లు పెట్టి సెలబ్రిటీలతో యాడ్స్ తీసి సొమ్ము చేసుకుంటాయి ఈ కంపెనీలు. సెలబ్రిటీలు కూడా ఆ కంపెనీలు ఉత్పత్తి చేసే వస్తువులు, ప్రొడక్ట్స్ మంచివా, హానికరమైనవా చూడకుండా ప్రకటనల్లో నటిస్తారు. తర్వాత చిక్కుల్లో ఇరుక్కుంటారు.  

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా అమెరికాకు చెందిన ఆమ్వే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే ఇలాంటి యాడ్స్ చేయొద్దని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్  అమితాబ్ కి సూచించారు. ఆమ్వే లాంటి మోసపూరిత కంపెనీలకు సహకరించొద్దని ట్విట్టర్లో అభ్యర్థించారు. దేశ సామాజిక వ్యవస్థలను దెబ్బతీస్తున్న ఇలాంటి గొలుసు కట్టు సంస్థలను ప్రమోట్ చేయొద్దని సెలబ్రిటీలకు విజ్ఞప్తి చేశారు సజ్జనార్. 

ఆమ్వే కంపెనీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ కు పాల్పడుతోందని ఈడీ 2022 లో ఆరోపించింది. ఆమ్వే ఆస్తులను సీజ్ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

తెలంగాణలో ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు

తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 24వ తేదీ లాస్ట్ వర్కింగ్ డేగా పరిగణిస్తారు. 

ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు మొత్తం 48 రోజులు పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. జూన్ 12న తిరిగి స్కూళ్లు రీ-ఓపెన్ అవుతాయి. 

అకాడమిక్ ఇయర్ క్యాలెండర్‌కు అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ వేసవి సెలవుల తేదీలను ఖరారు చేసింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి.

అత్తాపూర్ లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌.. సెల్ ఫోన్ కాల్స్‌ పరిశీలిస్తున్న కాప్స్

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌ కలకలం రేపింది. ఇంట్లో తల్లి ఉండగానే డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌ కావడం సంచలనంగా మారింది. రాజేంద్రనగర్ లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ సంచలనంగా మారింది.

హైదరాబాద్‌ లోని అత్తాపూర్ లో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వారికి హుమర్ బెగమ్ అనే కూతురు కూడా ఉంది. గోల్కొండ మహిళ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న హుమర్ బెగమ్. రోజూ లాగానే తండ్రి ఉద్యోగానికి వెల్లడం, ఇంట్లో తల్లి, కూతురు ఉంటారు. అయితే హాల్ లో ఇద్దరూ కూర్చున్నారు. పని నిమిత్తం లోనికి వెల్లిన తల్లి బయటకు వచ్చిన తల్లికి ఇంట్లో హుమర్‌ బేగమ్‌ కనిపించలేదు. 

తన రూములో వుంటుందని భావించి కాసేపు హాల్‌ లోనే కూర్చుంది తల్లి. ఎంతసేపటి కూతురు బయటకు రాకపోవడంతో రూం లోకి వెల్లి చూసింది తల్లి. రూలో కూడా కూతురు కనిపించలేదు. దీంతో ఇల్లంతా వెతికింది అయినా ఫలితం లేకుండా పోయింది. ఎంత వెతికినా కూతురు కనిపించకుండా పోవడంతో భయాందోళన చెందిన తల్లి భర్తకు ఫొన్ చేసి సమాచారం ఇచ్చింది. విద్యార్థిని చదువుతున్న కళాశాలకు, స్నేహితులకు, బంధువులకు ఫోన్ చేశారు అయినా ఎక్కడా తన ఆచూకీ తెలియక పోవడంతో హుటాహుటిన అత్తాపూర్ పోలీసులను తల్లిదండ్రులు ఆశ్రయించారు.

దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన సెల్ ఫోన్ కాల్ లిస్టు ను పరిశీలిస్తున్నారు. ఎవరైనా ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లారా? లేక యువతి ఇష్టప్రకారమే ఎవరితోనైనా బయటకు వెళ్లిందా? వెల్లేటప్పుడు ఎవరెవరికి కాల్ చేసింది, ఎవరెవరిని సంప్రదించింది అనే కోణంలో క్యాప్స్ పరిశీలిస్తున్నారు.

17ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు సంచలనం.. మాఫియా డాన్‌, మాజీ ఎంపీకి జీవిత ఖైదు..

ఉమేశ్‌పాల్‌ కిడ్నాపింగ్‌ కేసులో యూపీ మాఫియా డాన్‌, మాజీ ఎంపీ అతిఖ్‌ అహ్మద్‌కు జీవితఖైదు విధించింది న్యాయస్ధానం. ప్రయాగ్‌రాజ్‌ కోర్టులో అతిఖ్‌తో పాటు 10 మంది నిందితులను గట్టి భద్రత మధ్య కోర్టులో హాజరుపర్చారు.అయితే, అతిఖ్‌తో పాటు ముగ్గురిని మాత్రమే దోషులను తేల్చింది న్యాయస్థానం. మిగతా ఏడుగురిని నిర్ధోషులుగా ప్రకటించింది. ముగ్గురు దోషులకు కఠిన జీవిత ఖైదుతో పాటుగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధించింది కోర్టు. ఈ జరిమానా మొత్తాన్ని ఉమేష్ పాల్ కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.

17 ఏళ్ల నాటి కేసులో అతిఖ్‌ అహ్మద్‌కు జీవితఖైదు విధించింది కోర్టు. అతిక్‌ అహ్మద్‌ సోదరుడు ఖలీద్‌ అజీంను ఈ కేసులో నిర్ధోషిగా ప్రకటించింది న్యాయస్దానం. తనకు ప్రాణహానీ ఉందని అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు అతిఖ్‌ అహ్మద్‌. అతిఖ్‌అహ్మద్‌ను కోర్టులో హాజరపర్చడానికి గుజరాత్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌ తీసుకొచ్చారు యూపీ పోలీసులు. తనను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తారని అంతకుముందు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాడు. అయితే అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లాలని అతిక్‌ అహ్మద్‌కు సూచించింది సుప్రీంకోర్టు. కోర్టులో అతిఖ్‌ అహ్మద్‌తో పాటు మిగతా నిందితులను ప్రవేశపెట్టినప్పుడు హైడ్రామా చోటు చేసుకుంది. లాయర్లు కోర్టులో నిరసన తెలిపారు.

2005లో జరిగిన రాజుపాల్ హత్య కేసులో కీలక సాక్షి అయిన ఉమేష్ పాల్ హత్యకు అహ్మద్, అష్రఫ్‌లు కూడా కుట్ర పన్నారనే ఆరోపణలు ఉన్నాయి. బీఎఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అతీక్ అహ్మద్. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసులో ప్రధాన సాక్షి ఉమేష్‌పాల్‌కు సంబంధించిన కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో 2006 ఫిబ్రవరి 28న అతిక్ అహ్మద్, అష్రఫ్ ఉమేష్ పాల్‌ను కిడ్నాప్ చేశారు. ఉమేష్ పాల్‌ను కొట్టి, అతని కుటుంబంతో కలిసి చంపేస్తానని బెదిరించి, కోర్టులో బలవంతంగా అఫిడవిట్ దాఖలు చేశారు. 2007లో మాయావతి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జూలై 5, 2007న, ఉమేష్ పాల్ అతిక్ మరియు అష్రఫ్‌తో సహా ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. పోలీసుల విచారణలో మరో ఆరుగురి పేర్లు తెరపైకి వచ్చాయి.

అతిక్, అష్రఫ్ సహా 11 మందిపై కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ 2009లో ప్రారంభమైంది. ప్రాసిక్యూషన్‌ నుంచి అంటే ప్రభుత్వం తరఫున మొత్తం 8 మంది సాక్షులను హాజరుపరిచారు. ఈ కేసులో 11 మంది నిందితుల్లో అన్సార్ బాబా అనే నిందితుడు చనిపోయాడు. అతీక్, అష్రఫ్ సహా మొత్తం 10 మంది నిందితులపై కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.

ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట

ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయి, కొట్టుకున్నారు. నేతలు జిక్కిడి ప్రభాకర్ రెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడంపై ఆయనకు మద్దతుగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కూడలిలో కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే మరో కాంగ్రెస్ నేత జిక్కిడి ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలు ఒక్కసారిగా మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దీక్షా శిబిరాన్ని ముట్టడించారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణలు చోటుచేసుకుంది.

గో బ్యాక్ మల్ రెడ్డి రాంరెడ్డి అంటూ నినాదాలు..

స్థానికులకు కాకుండా, స్థానికేతరులకు ఇంఛార్జిగా వ్యవరించడం సరియైన పద్ధతి కాదంటూ జిక్కిడి ప్రభాకర్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్య లేదని ఆరోపించారు. పెయిడ్ కార్యకర్తలను తీసుకొచ్చి దీక్షా శిబిరంలో కూర్చోబెట్టడం సిగ్గు చేటన్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి పెయిడ్ కార్యకర్తలను తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో ప్రజలు తిరస్కరిస్తే ఎల్బీనగర్ లో పెత్తనం చేయడం సరియైన పద్ధతి కాదని మండిపడ్డారు.