/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png StreetBuzz AP Inter Evaluation: రేపట్నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం.. జూనియర్ కాలేజీలకు ఆదేశాలు Andrapradesh
AP Inter Evaluation: రేపట్నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం.. జూనియర్ కాలేజీలకు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యంకనం ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి మాచవరంలోని ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో జరగనున్నట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా ఆర్‌ఐవో పి రవికుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, గణితం, సివిక్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం రేపట్నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఇంటర్‌ విద్యా మండలి నుంచి ఉత్తర్వులు అందుకున్న ఆయా అధ్యాపకులు మూల్యాంకనానికి విధిగా హాజరవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపల్‌లు, ప్రైవేటు యాజమాన్యాలు తమ అధ్యాపకులు విధులకు హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. అధ్యాపకులను పంపని కళాశాలల గుర్తింపును రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. కాగా ఏపీ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 3వ తేదీతో ముగియనున్నాయి. ద్వితియ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌ 4తో ముగియనున్న సంగతి తెలిసిందే.

శ్రీరామనవమిలో అపశ్రుతి ! తృటిలో తప్పిన పెనుప్రమాదం…

ఈ రోజున దేశవ్యాప్తంగా రాములవారు ప్రసిద్ధి చెందిన అన్ని చోట్ల శ్రీరామనవమిని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా రాముని వేడుకలు జరుగుతున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామం లో అనుకోకుండా ఒక అపశృతి జరిగింది. దువ్వ లోని వేణుగోపాలస్వామి ఆలయం ప్రాంగణంలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీరామనవమి వేడుకలలో భాగంగా ఆలయం బయట చలువ పందిళ్లను వేసి చక్కగా అలంకరించారు.

భక్తులు అందరూ చలువ పందిళ్ళ కిందనే ఉండగా ఈ ప్రమాదం జరిగింధి. ఒక్కసారిగా మంటలు వ్యాపించగా భక్తులు ఆందోళనకు గురై వెంటనే బయటకు వచ్చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణం గానే ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు గుర్తించారు. ఆ శ్రీరాముని దయ వలన ఇంత ప్రమాదం జరిగినా ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేడనై భక్తులు శ్రీరామనామ జపం చేస్తున్నారు.

సీఎం జగన్‌ పై అసభ్యకర పోస్టులు..NRI అరెస్ట్‌

సోషల్ మీడియాల్లో సిఎం జగన్ పై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడని ఎన్ఆర్ఐ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. యూఎస్ లో 5 సంవత్సరాలు ఉద్యోగం చేసి తన సొంత గ్రామం గన్నవరం లో తల్లి దండ్రులు ఇంటికి వచ్చాడు కోటిరత్నం అంజన్. ట్విట్టర్ లో సీఎం జగన్‌ పై అసభ్యంగా పోస్ట్ పెట్టడంతో నిన్న సాయంత్రం అంజన్ అరెస్ట్ చేశారు గన్నవరం పోలీసులు.

అంజన్ ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు..అంజన్ ఫోన్, ల్యాప్ ట్యాప్,బ్యాంక్ లావాదేవీలు అడిగి తెలుసుకున్నారు. అంజన్ కి ట్విట్టర్ , సోషలో మీడియాలో పై ఆసక్తి ఎక్కువ అని తెలిపారు తల్లి రత్నకుమారి. నిన్న సాయంత్రం అంజన్ నీ అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులు..ఇప్పటి వరకు అంజన్ ఎక్కడ ఉన్నాడో తల్లి దండ్రులకు తెలుపలేదు. దీంతో పోలీసులు తీరు పై మండి పడుతున్నారు అంజన్ తల్లి దండ్రులు.

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. రూ. 1441 కోట్లతో భారీ ప్రాజెక్ట్‌.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం వరాలజల్లు కురిపించింది. దేశంలోని మూడు బల్క్ డ్రగ్ పార్కుల్లో ఒకదానిని ఆంధ్ర ప్రదేశ్‌కు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఫార్మాస్యూటికల్స్ శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖూబా తెలిపారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో పాటు ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మూడు బల్క్ డ్రగ్ పార్కులను మంజూరు చేసిందని కేంద్ర ఫార్మాస్యూటికల్స్ శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖూబా రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తొండంగి మండలంలో 2000.46 ఎకరాల విస్తీర్ణంలో బల్క్ డ్రగ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని, పార్క్ అభివృద్ధికి అవసరమైన భూమిని ఇప్పటికే సేకరించామని కేంద్ర మంత్రి తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్‌లో కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ (CIF) అభివృద్ధి అంచనా వ్యయం రూ.1441 కోట్లు అని, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు గ్రాంట్‌గా ఇస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.

బల్క్ డ్రగ్ పార్క్‌లోని తయారీ యూనిట్లకు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి అడిగినప్పుడు ఇతర ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం స్థిర మూలధన పెట్టుబడి కోసం తీసుకున్న టర్మ్ లోన్‌పై కేంద్రం 3% వడ్డీ రాయితీని ఇస్తోందని, 10 సంవత్సరాల కాలానికి రాష్ట్రానికి చేరిన నికర SGSTలో 100% తిరిగి కేంద్రం చెల్లించనుందనీ కేంద్రమంత్రి తెలిపారు. కాకినాడ ప్రాంతంలో ఫార్మాస్యూటికల్ రంగానికి ఆర్థిక కార్యకలాపాలను రూపొందించడానికి ఈ పార్క్ ఉపయోగపడనుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. 

కేంద్ర సహాయంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్క్ అభివృద్ధి చేయడం వల్ల కాకినాడ ప్రాంతం దేశంలోనే ఫార్మాస్యూటికల్ హబ్‌గా ఎదగడానికి దోహదపడుతుందన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి జీవీఎల్ కృతజ్ఞతలు తెలిపారు.

గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్ కో..

గుంటూరులో గ్రానైట్ తవ్వకాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది.. గ్రానైట్‌ తవ్వకాలు నిలిపివేయాలంటూ గుంటూరు జిల్లా చిలకలూరపేటలో మురికిపుడి రైతులు హైకోర్టును ఆశ్రయించారు.. దీనిపై గతంలో విచారణ జరిపి మంత్రి విడదల రజనీ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు.. ఇక, ఈ రోజు మరోసారి విచారణ చేపట్టిన కోర్టు.. స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఈ కేసులో మంత్రి విడదల రజనీ, ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, మరదలు స్వేతారెడ్డి, జీవీ దినేష్ రెడ్డి, శివపార్వతులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.. అయితే, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డీకే పట్టాలు రద్దుచేయకుండా గ్రానైట్ తవ్వకాలకు ఎన్‌వోసీ ఇవ్వడంపై హైకోర్టులో రైతులు పిటిషన్‌ వేశారు.. ఈ పిటిషన్ తరపున వాదనలు వినిపించారు న్యాయవాది వీవీ లక్ష్మినారాయణ.. మొత్తం 21 ఎకరాల 50 సెంట్లు భూమిలో గ్రానైట్ తవ్వకాలకు ఎన్‌వోసీ ఇచ్చిన ఎమ్మార్వోకు, రైతులు పనులు చేస్తుంటే అడ్డుకున్న ఎస్సైకి కూడా నోటీసులు ఇచ్చింది.

ఒక్కో ఎకరాలో 200 కోట్లు విలువ చేసే గ్రానైట్ నిల్వలు ఉన్నాయని అంచనా ఉండగా.. రైతులకు తెలియకుండానే ఎన్‌వోసీ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.. ఇక, దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, వచ్చేనెల 10 వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది.. అప్పటి వరకు స్టేటస్ కో ఉత్తర్వులు. కౌంటర్ లు దాఖలు చేయాలని మంత్రి, ఇతరులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

శ్రీశైలంలో మహా కుంభాభిషేకం.. ప్రధాని, సీఎంకు ఆహ్వానాలు..!

ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో ఒకటైన శ్రీశైలంలో మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. శ్రీశైలంలో మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది.. ఇప్పటికే సీఎం జగన్‌కు ఆహ్వానం అందగా.. ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇక, మహా కుంభాభిషేకంలో భాగంగా శివాజీ గోపురం కలిశా ప్రతిష్టాపన చేయనుంది దేవస్థానం.. మహా కుంభాభిషేక సమయంలోనే పంచమఠ లింగాల ప్రతిష్టాపన చేయనున్నట్టు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య స్వామీజీ వెల్లడించారు. వీర శైవ ఆగమ శాస్త్రం, బ్రాహ్మణ ఆగమ శాస్త్రం ప్రకారం కలశ ప్రతిష్ట పనులు నిర్వహించాలన్నారు.. బ్రాహ్మణ, వీరశైవులకు సమాన అవకాశం ఇవ్వాలని ఈవోని కోరుతున్నాం అన్నా జగద్గురు పీఠాధిపతి.

ఇక, మహా కుంభాభిషేకానికి సీఎం జగన్ ను ఆహ్వానించాం.. ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి. కాగా, దేశంలోనే ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో శ్రీశైలంలో ఒకటి.. నల్లమల ఫారెస్ట్‌లో కృష్ణానది ఒడ్డున.. శ్రీశైలం డ్యామ్‌ పరిసరాల్లో ఈ ఆలయం ఉంది.. శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రంగా గుర్తింపు పొందింది. అంతేకాదు.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం రెండవది కావడం విశేషం.. అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో ఆరోది కూడా శ్రీశైలమే… దీంతోపాటు దశ భాస్కర క్షేత్రాల్లో ఆరోది. అందుకే శ్రీశైలాన్ని శ్రీగిరి, సిరిగిరి అని భక్తులు పిలుస్తుంటారు. శ్రీశైలం అంటే సంపద్వంతమైన పర్వతమని పండితులు పేర్కొన్నారు.. ఇక, ఈ క్షేత్రంలో మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.

వైఎస్ వివేక హత్య కేసు.. తులసమ్మ వాంగ్మూలం రికార్డ్ చేసిన కోర్ట్

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ 5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలాన్ని పులివెందుల కోర్టు నమోదు చేసింది. తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని, కేసు విచారణలో సిబిఐ ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ తులసమ్మ కోర్టులో పిటిషన్ వేశారు.

వివేక హత్య కేసులో సిబిఐ చేస్తున్న విచారణ తీరుపై పులివెందులలో ఫిబ్రవరిలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దేవిరెడ్డి శంకర రెడ్డి భార్య తులసమ్మ. ఈ నేపథ్యంలో నేడు పులివెందుల కోర్టులో వివేక పిఏ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ నమోదు. ఈ సందర్భంగా దేవి రెడ్డి శంకర్ రెడ్డి భార్య తులసమ్మ న్యాయవాది కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..

“వివేకానంద రెడ్డి రెండవ వివాహం చేసుకున్నారు. ఆయన రెండవ భార్య షమీం కు ఒక కుమారుడు ఉన్నారు. వారికి ఆస్తి పోతుందని వివేకానంద రెడ్డితో ఆయన కుటుంబ సభ్యులు గొడవపడేవారు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతతో పాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి వివేకతో గొడవ పడేవారు. హత్యానంతరం అక్కడ లభించినవంటి లేఖను ఆయన మొబైల్ ను పోలీసులకు ఇవ్వకుండా అడ్డుకున్నారని కోర్టులో పిఏ కృష్ణారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు ” అని తెలిపారు కోదండరామిరెడ్డి.

SPO ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాక పోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను - PDSU అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు : మల్లెల ప్రసాద్

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం

PDSU రాయదుర్గం డివిజన్ కార్యదర్శి : మల్లెల ప్రసాద్

 రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన  SPO లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలి  రాష్ట్రంలో ఎస్ పి ఓ ఉద్యోగాలు తొలగించడం వల్ల చెక్ పోస్ట్ వద్ద భద్రత లేక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా కర్ణాటక మద్యం మాదకద్రవ్యాలు గుట్కా ప్యాకెట్లు విచ్చలవిడిగా గ్రామస్థాయిలో కూడా మద్యపానం మాదకద్రవ్యాలు గుట్కా అన్ని కూడా సరఫరా అవుతున్నాయి, వీటిని నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

 రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్పీఓ ఉద్యోగాలను ఎలాంటి సమాచారం వారికి ఇవ్వకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు ప్రకటించడం దారుణం ఎంతోమంది యువకులకు ఉపాధి లేకుండా చేసేటటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి ప్రభుత్వ సలహాదారులు సజ్జాల రామకృష్ణ SPO లకు మళ్ళీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ఇప్పుడు సంవత్సరం అవుతున్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా యువకులకు పూర్తిగా ఉపాధి లేకుండా చేస్తూ యువకుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు చెక్ పోస్టులు వద్ద SPO లు లెక్క పోవడం తో కర్ణాటక రాష్ట్రము నుంచి మద్యం గుట్కా మాధక ద్రవ్యలు విచ్చలవిడిగా వస్తున్నపటికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి ఈ SPO ఉద్యోగాలపై సరైన వంటి పద్ధతి కాదు మీ ధోరణి మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నాము మరి అదేవిధంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఎస్పీఓ ఉద్యోగాలను భర్తీ చేయాలిలేని పక్షంలో చలో అసెంబ్లీ ముట్టడి కూడా పిలుపునిస్తామని ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తరుపున నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అసెంబ్లీ లో SPO ఉద్యోగాలు గురించి చర్చించి నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష కు సిద్ధం,

        ఇట్లు

PDSU అనంతపురం జిల్లా ఉపాధ్యాక్షుడు : మల్లెల ప్రసాద్

 ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం,

GVL Narasimha Rao: 2017లో టీడీపీ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ చేస్తోంది

దళిత క్రిస్టియన్‌లకు ఎస్సీ హోదా కల్పించాలనే వైసీపీ ప్రభుత్వ ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. ఇవన్నీ ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న రాజకీయాలని.. ఇలాంటి రాజకీయ ప్రయత్నాలను బీజేపీ వ్యతిరేకిస్తోందని అన్నారు. 2017లో టీడీపీ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలు కూటమి కట్టి.. నైతికత లేకుండా పోరాటాల పేరుతో రోడ్డెక్కుతున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై కోర్టు తీర్పును రాజకీయ పార్టీలు వక్రీకరిస్తున్నాయని విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ఎప్పుడైనా ముప్పు వాటిల్లిందంటే.. అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనేని ఆరోపణలు చేశారు. పరాజయాన్ని జీర్ణించుకోలేకే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నోటి దురుసు, అహంకారంతో కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్లుగా దూషణలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సామాజిక వర్గమంతా దొంగలు అనడం.. రాహుల్ అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని చెప్పుకొచ్చారు.

అంతకుముందు.. ఈసారి తమకు అవకాశం ఇస్తే, సమస్యలను ప్రధాని మోడీకి చూపించి అభివృద్ధి చేస్తామని జీవీఎల్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక్క బీజేపీతోనే సాధ్యం అవుతుందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని.. ఇక్కడి నుంచి పొట్టకూటి కోసం ప్రజలు వలస వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో గెలిచిన ఎంపీలు.. ఇక్కడి సమస్యలపై పార్లమెంట్‌లో గానీ, సంబంధిత మంత్రులు గానీ కలిసిన దాఖలాలు లేవన్నారు. అపారమైన వనరులు ఉన్నప్పటికీ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఈ ప్రాంతం నుంచి పెద్దపెద్ద నాయకులు ఎన్నుకోబడినా.. ప్రయోజనం మాత్రం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతున్నారని, ఇది దురదృష్టకరమని జీవీఎల్ పేర్కొన్నారు.

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..కరెంట్ ఛార్జీలపై కీలక నిర్ణయం

2023-24కి సంబంధించిన విద్యుత్‌ టారిఫ్‌ను రిలీజ్‌ చేశారు ఏపీ ఈఆర్సీ ఛైర్మన్‌ , రిటైర్డ్‌ జస్టిస్‌ సీవి. నాగార్జునరెడ్డి. ఆర్థిక అవసరాలపై డిస్కంలు ఇచ్చిన టారిఫ్‌ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి టారిఫ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 3 డిస్కంలకు(రైతులకు ఫ్రీ కరెంట్, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు వరకు ఇస్తున్న సబ్సిడీ.. ఆక్వా రంగం, నాయీ బ్రాహ్మణలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలు) కలిపి ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చే విద్యుత్‌ వల్ల 10,135 కోట్ల ఆదాయ లోటు వచ్చిందన్నారు.

సాధారణ, పారిశ్రామిక వినియోగదారుల కేటగిరిలో ఎవరిపై అదనపు ఛార్జ్‌లు ఉండబోవన్నారు రిటైర్డ్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి. ఈ ఏడాది విద్యుత్ వినియోగదారులు ఎటువంటి భారం మోపడంలేదన్నారు. ఎనర్జీ ఇంటెన్సివ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలకు ఇచ్చే హెచ్‌టీ వినియోగదారులకు మాత్రం కిలోవాట్‌కు 475 రూపాయల అదనపు డిమాండ్‌ ఛార్జ్‌ల ప్రతిపాదనను అంగీకరించామన్నారు. వీటి టారిఫ్‌ దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువేనన్నారు. మిగతా పెంపు ప్రతిపాదనలు తిరస్కరించామన్నారు.