/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png StreetBuzz కల్వకుంట్ల కుటుంబంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు TS breaking
కల్వకుంట్ల కుటుంబంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం లేపుతుంది. ప్రతిపక్షాలు అన్నీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. ఈ ఘటనకు మంత్రి కేటీఆర్ కారణమని ఆరోపిస్తున్నాయి. పేపర్ లీకేజీ ఘటనపై నేడు బిజెపి.. ధర్నా చౌక్ లో ” మా నౌకరీలు మాగ్గావాలే” అనే నినాదంతో మహధర్నా చేపట్టారు.

ఈ మహా ధర్నాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, విజయశాంతి, డీకే అరుణ సహా పలువురు బిజెపి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వంలో ఏళ్లుగా జరుగుతుందని ఆరోపించారు.

పేపర్ లీక్ అయితే సీఎం స్పందించలేదని, ఆయన నిద్ర మత్తులో ఉన్నాడని విమర్శించారు. ” కల్వకుంట్ల కుటుంబంలో ఒకరు బ్రోకర్, ఒకరు లిక్కర్, ఒకరు లీకర్. కెసిఆర్ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చిందా..? డ్రగ్స్ కేసు, నయీమ్ కేసు పై వేసిన సిట్ నివేదికల్లో ఏం తేలింది? పేపర్లు లీక్ చేసే వాళ్ళని వదిలేసి మాకు నోటీసులు ఇస్తున్నారు” అంటూ విరుచుకుపడ్డారు బండి సంజయ్.

బ్రౌన్‌ షుగర్‌ను చర్మానికి ఇలా వాడితే ముడతలే రావట..!

బ్రౌన్‌ రైస్‌ ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు.. అలాగే బ్రౌన్‌ బ్రెడ్‌ కూడా.. వైట్‌ బ్రెడ్‌తో పోలిస్తే.. బ్రౌన్‌ బ్రెడ్‌ తినడమే ఆరోగ్యానికి మంచిది.. వైట్‌ షుగర్‌ కంటే..బ్రౌన్‌ షుగర్‌ వాడటం వల్ల ప్రమాదం బారిన పడకుండా ఉండొచ్చు.. అయితే బ్రౌన్‌ షుగర్‌ ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని కూడా కాపాడుతుంది. బ్రౌన్ షుగర్‌ను 2 రోజులకు ఒకసారి మీ చర్మానికి అప్లై చేయడం వల్ల మీ చర్మ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. బ్రౌన్ షుగర్‌ను ముఖం, మెడకే కాకుండా మోచేతులు, మోకాళ్లు, చేతులు, కాళ్లకు కూడా ఉపయోగించవచ్చు.

బ్రౌన్ షుగర్ డెడ్ స్కిన్ సెల్స్ ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మానికి ప్రకాశవంతమైన మెరుపును అందిస్తుంది. చర్మంపై ఉన్న ట్యాన్‌ని తొలగించి, మెరిసేలా చేస్తుంది. టొమాటో స్లైస్‌లో బ్రౌన్ షుగర్ వేసి, యాంటీ క్లాక్ వైజ్‌లో ముఖం, మెడపై నెమ్మదిగా మసాజ్ చేయండి. 5 నిమిషాల పాటు మసాజ్ చేసి కాసేపు అలాగే ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మళ్లీ రెండు నిమిషాలు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి.

బ్రౌన్ షుగర్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. గ్లైకోలిక్ యాసిడ్, ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్, చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి మృతకణాలను తొలగిస్తుంది. కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. బ్రౌన్ షుగర్ చనిపోయిన కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. తేనె, బ్రౌన్ షుగర్‌ను సమాన పరిమాణంలో తీసుకుని దానికి లావెండర్ ఆయిల్ జోడించండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించండి…10-15 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా మారుతుంది.

బ్రౌన్ షుగర్ సహజ హ్యూమెక్టెంట్. ఇది సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేసి చర్మాన్ని మృదువుగా, తేమగా చేస్తుంది… సాధారణ చక్కెర కంటే బ్రౌన్ షుగర్ మెత్తగా ఉంటుంది. కొబ్బరి నూనెతో కొద్దిగా బ్రౌన్ షుగర్ కలపండి. లావెండర్ నూనె జోడించండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసి కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం సాఫ్ట్‌గా అవుతుంది.

బ్రౌన్ షుగర్‌ను చర్మానికి అప్లై చేయడం వల్ల మచ్చలు తగ్గుతాయి. బ్రౌన్ షుగర్‌లో ఉండే గ్లైకోలిక్ యాసిడ్ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. ఇది మెలనిన్ ఏర్పడటాన్ని కూడా నియంత్రిస్తుంది. నువ్వుల నూనెలో ఒక చెంచా బ్రౌన్ షుగర్ వేసి ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా 15 రోజులు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బ్రౌన్ షుగర్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల మొటిమలు రాకుండా చేస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే సరిపోతుంది.

అలాగే, చర్మంపై బ్రౌన్ షుగర్ ఉపయోగించేటప్పుడు సున్నితంగా మసాజ్ చేయండి. లేకపోతే దద్దుర్లు రావచ్చు. పురుషులు కూడా బ్రౌన్ షుగర్‌ను వాడొచ్చు.. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ట్రై చేసి చర్మాన్ని మరింత కాంతివంతంగా చేసుకోండి.!

అక్కడ జీడిపప్పు కేజీ 30 రూపాయలు మాత్రమే..! ఎగబడి కొంటున్న జనం

జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా ఇవన్నీ..రిచ్‌ ఫుడ్స్‌.. వీటిలో పోషకాలు రిచ్‌గానే ఉంటాయి.. వీటి కాస్ట్‌ కాస్ట్‌లీగానే ఉంటుంది. కేజీ కొనాలంటే.. ఇక ఆ ఏరియా, క్వాలిటీని బట్టి.. 1000 రూపాయలు కూడా ఉండొచ్చు. మన దేశంలోనే ఒక ప్రాంతంలో మాత్రం కేవలం కూరగాయల ధరకే జీడిపప్పును అందిస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజమే. కేజీ 30 రూపాయలే..! ఇంతకీ ఎక్కడ అంటారా..?

జీడిపప్పును అత్యంత తక్కువ ధరకే అమ్ముతున్న ఏకైక ప్రదేశం జార్ఖండ్లోని జంతార అనే జిల్లాలో ఉన్న నాలా అనే గ్రామం. దీన్ని ‘జార్ఖండ్ జీడిపప్పు నగరంగా పిలుస్తారు. ఈ గ్రామానికి వెళ్తే మీకు కిలో జీడిపప్పు కేవలం 20 నుంచి 30 రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంది. కూరగాయల కంటే తక్కువే.. చుట్టుపక్కల ప్రాంతాల వారు, నగరాల వారు ఎంతోమంది వచ్చి నాలా గ్రామంలోనే జీడిపప్పును కొని తీసుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచే దళారులు అధికంగా కొన్ని, బయట ప్రాంతాల్లో వంద రెట్లు అధిక ధరకు అమ్ముతారు.

ఎందుకు ఇంత తక్కువ కాస్ట్..

జీడిపప్పును ఇంత తక్కువ ధరకు నాలా గ్రామంలో ఎందుకు విక్రయిస్తున్నారు? ఈ గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో జీడి తోటలనే వేశారు. 2010లో నాలా గ్రామంలోని వాతావరణం, నేలలు జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉంటాయని అటవీ శాఖ గుర్తించింది. అంతేకాదు గ్రామస్తులు అందరికీ ఈ విషయాన్ని చెప్పి జీడి తోటను పెంచే విధంగా చేసింది. అలా ఒకేసారి గ్రామం అంతా పెద్ద ఎత్తున జీడి సాగు మొదలుపెట్టారు. ఇందుకోసం అప్పట్లో ఐఏఎస్ కృపానంద ఝా ఎంతో కష్టపడ్డారు. ఆయన జంతారా జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఈ నాలా గ్రామం విశిష్టతను వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడి అక్కడ నేలలు, నీటిని పరీక్షించేలా చేశారు.

రైతులకు మాత్రం మిగిలింది ఏం లేదు..

అటవీశాఖ చొరవ తీసుకొని ఆ గ్రామంలో జీడి తోటలో పెంచేలా చేశారు. అయితే ఇంతగా జీడిపప్పు పండడం వల్ల అక్కడ రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది… అంతా వచ్చి తక్కువ ధరకే జీడిపప్పును కొని పట్టుకెళ్తున్నారు. అది కూడా రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుండడం వల్ల కిలో 30 నుంచి 50 రూపాయలకే అమ్మాల్సి వస్తోంది. ఇంతగా జీడిపప్పు పండుతున్నప్పటికీ అక్కడ ఎలాంటి ప్రాసెసింగ్ ప్లాంటు లేదు. అక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు, జీడిపప్పు ధర కూడా పెరిగే అవకాశం ఉంది.

యూనివర్సిటీ సస్పెన్షన్ పై హైకోర్టుకు బండి సంజయ్ కుమారుడు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనయుడు బండి సాయి భగీరథపై వివాదం మరింత వేడెక్కింది. తోటి విద్యార్థులను దూషించి కొడుతున్న రెండు వీడియోలు బయటకు రావడంతో రాజకీయ దుమారం రేగింది. వరుస వివాదాలు, కేసుల కారణంగా బండి సంజయ్ కుమారుడిని మహేంద్ర యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. దీనిపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో బండి సంజయ్ కొడుకు కావడంతో ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఈనేపథ్యంలో.. బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్ ఇవాళ హై కోర్టు ను ఆశ్రయించారు. జనవరి 20 న భగీరధ్ ను మహేంద్ర యూనివర్సిటీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.. తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ సస్పెండ్ చేసిందని కోర్ట్ కు భగీరధ్ తెలిపాడు. ఇంటర్నల్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్ట్ ను భగీరధ్ కోరాడు. అయితే.. పిటిషన్ ను విచారించిన హై కోర్ట్.. భగీరధ్ సస్పెన్షన్ పై హై కోర్టు స్టే విధించింది. పరీక్షకు రాసేందుకు అనుమతి ఇవ్వాలని మహేంద్ర యూనివర్సిటీ కు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మార్చ్ 9 న హై కోర్ట్ ఉత్తర్వులు జారీచేసింది. హై కోర్ట్ అదేశలతో బండి భగీరద్ పరీక్షలు రాశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భగీరధ్ ను క్లాస్ లోకి అనుమతించాలని యూనివర్సిటీ కు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓ వైపు నేతల మధ్య ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మరో వీడియో లీక్ కావడం సంచలనం సృష్టిస్తోంది. తోటి విద్యార్థి అని కనికరం లేకుండా కాళ్లతో విచక్షణారహితంగా బాధిత విద్యార్థిపై కొట్టడం విద్యార్థుపట్ల ఇదే నా గౌరవం అంటూ కమెంట్లు చేస్తున్నారు. ఎంత తప్పుచేస్తే మాత్రం కాళ్లతో కొట్టాలా? అంటూ ప్రశ్నించారు. 

అయితే ఆ వీడియోలో దాడికి గురైన యువకుడి వీడియోను బీజేపీ మద్దతుదారులు వైరల్ చేశారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కొట్టిన స్టూడెంట్ తానే ఓ అమ్మాయిని ఏడిపించడంతో అది తెలసిన భగీరత్ తనని కొట్టాడని ఆ యువకుడు చెప్పుకున్నాడు. భగీరథ్ స్టూడెంట్స్ పై దాడిచేసిన రెండు వీడియోలతో అటు బీఆర్ఎస్ నేతలు, ఇటు బీజేపీ నేతలు ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. కారులోనే సెక్యూరీటి గార్డ్ సజీవ దహనం

స్వప్రలోక్‌ ఘటన మరువక ముందే.. హైదరాబాద్‌ అబిడ్స్‌లో మరో భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంది. బొగ్గుల కుంటలోని కామినేని హాస్పిటల్ పక్కనే వున్న కారు మెకానిక్‌ షెడ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఆమంటలు గ్యారేజీ మొత్తానికి మంటలు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఆప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భయభ్రాంతులైన కింగ్ కోఠి కామినేని హాస్పిటల్ సిబ్బంది.. ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను పూర్తీగా అదుపుచేశారు. 

ఈప్రమాదంలో దాదాపు ఐదు కార్లు దగ్ధమయ్యాయి. ఐదుకార్లలో ఒకకారులో సెక్యూరిటీ గార్డ్‌ నిద్రపోయాడు. అందులో కూడా మంటలు అంటుకోవడంతో సెక్యూరిటీ గార్డ్‌ మంటల్లో చిక్కుకుని చనిపోయాడు. కారులో సజీవ దహనమైన సెక్యూరిటీ గార్డ్‌ సంతోష్‌ గా గుర్తించారు పోలీసులు. ఈ సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. సెక్యూరిటీ గార్డ్‌ సంతోష్‌ కు అమ్మ, న్నాన్న, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తను కుటుంబాన్ని పోషించుకునేందుకు రెండు ఉద్యోగాలు చేస్తున్నాడు. అబిడ్స్‌లో ఉదయం చెప్పులు కుట్టడం, రాత్రి సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు.

రోజు మాదిరిగానే నిన్న ఉదయం ఇంట్లోంచి ఉద్యోగానికి వెళ్ళిన సంతోష్ చెప్పులు దుకాణంలో విధులు ముగించుకొని కార్ల గ్యారేజ్ లో డ్యూటీకి వచ్చాడు. రాత్రి భోజనం చేసిన తరువాత పన్నెండు గంటలకు తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. తిన్నానని పడుకుంటున్నాని తల్లికి చెప్పి సంతోష్ కారులో నిద్రించాడు. ఉదయం సంతోష్ చనిపోయాడని ఫోన్ చేసి చెప్పడంతో గ్యారేజ్ దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాను కుటుంబ సభ్యులు. ఈ మధ్యనే సంతోష్ అన్న చనిపోయాడని ఇప్పుడు చిన్న కొడుకు కూడా చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబానికి పెద్దదిక్కుగా వుండి పోషిస్తూ వస్తున్న సంతోష్‌ కూడా చనిపోయాడని ఇక మాకు దిక్కెవరని వాపోయారు. సంతోష్‌ కుటుంబ సభ్యుల రోదనలు విని స్థానికులు చలించిపోయారు. అయితే.. కామినేని హాస్పిటల్ కి అనుకునే ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆసుపత్రి సిబ్బంది, పేషంట్లను తరలించేందుకు సిద్దమయ్యారు. అంతేకాకుండా.. ప్రమాద ఘటనకు పక్కనే హాస్పిటల్ కి సంబంధించిన పవర్ జనరేటర్స్ కూడా ఉన్నాయి. అయితే ఫైర్‌ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపుచేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.

నాందేడ్‌ జిల్లా కంధార్‌ నియోజకవర్గం లోహా పట్టణంలో ఈనెల 26న బీఆర్ఎస్ బహిరంగ సభ

బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో బలపరచాలనే ఉద్దేశంతో ఆ పార్టీ అధినాయకత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి రైతులకు హామీల వర్షం కుప్పించింది. తాజాగా మరోసారి అక్కడి బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కంధార్‌ నియోజకవర్గం లోహా పట్టణంలో ఈనెల 26న బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది.

బీఆర్ఎస్ పార్టీ బహిరంగ నేపథ్యంలో లోహా పట్టణం గులాబీమయమైంది. ప్రధాన రహదారులన్నీ బీఆర్ఎస్ బ్యానర్లు, హోర్డింగులతో ముస్తాబయ్యాయి. బైల్‌ బజార్‌లో 15 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం సిద్ధమవుతోంది. బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లను ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌, బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు మాణిక్‌రావు కదం, కంధార్‌ మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గె, కన్నాడ్‌ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ జాదవ్‌ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలో కాంగ్రెస్‌, బీజేపీ, శివసేన కాకుండా మరే పార్టీ కూడా ఈ స్థాయిలో సభను నిర్వహించలేదు. దీంతో సభా ఏర్పాట్లను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

నేటి బీజేపీ మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీకి నిరసనగా ‘మా నౌకర్లుమాగ్గావాలె’ నినాదంతో శనివారం బీజేపీ తలపెట్టిన మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ధర్నాలో 500 మందికి మించరాదని, ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలు చేయరాదని షరతులు విధించింది. ధర్నాలో పాల్గొనే బీజేపీ ముఖ్య నేతల వివరాలను శుక్రవారం రాత్రి 9 గంటల వరకు పోలీసులకు అందజేయాలని సూచించింది.

ధర్నాకు అవసరమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. టీఎస్‌‌‌‌ పీఎస్సీ పేపర్ల లీకేజీకి నిరసనగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఈ నెల 25న ధర్నా చౌక్‌‌‌‌ వద్ద మహా ధర్నా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ధర్నాకు పర్మిషన్‌‌‌‌ ఇవ్వాలని పోలీసులకు దరఖాస్తు చేసుకోగా,శుక్రవారం మధ్యాహ్నం వరకు వారు స్పందించలేదు. దీంతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌‌‌‌రెడ్డి హైకోర్టులో లంచ్‌‌‌‌ మోషన్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిని జస్టిస్‌‌‌‌ విజయ్‌‌‌‌సేన్‌‌‌‌ రెడ్డి విచారణ చేపట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ ధర్నా చేస్తున్నదని ప్రభుత్వ తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌ వాదించారు. పేపర్ల లీకేజీ విషయంలో బీజేపీ స్టేట్‌‌‌‌ చీఫ్‌‌‌‌ బండి సంజయ్‌‌‌‌కి సిట్‌‌‌‌ నోటీసులిచ్చిందని, అయితే, ఆయన విచారణకు సహకరించడం లేదన్నారు. కోర్టు స్పందిస్తూ.. పేపర్ల లీకేజీపై రాజకీయ పార్టీలు నిరసనలు తెలపకూడదని ఎక్కడా లేదు కదా అని ప్రశ్నించింది. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని చెప్పింది. ధర్నా చౌక్‌‌‌‌లో అనుమతి ఇవ్వకుంటే ప్రజలు ఎక్కడ ధర్నా చేసుకుంటారని ప్రశ్నిస్తూ, షరతులతో ధర్నాకు అనుమతి ఇచ్చింది. 

ధర్నా చౌక్‌‌‌‌ వద్ద ఏర్పాట్ల పరిశీలన...

మహా ధర్నాను సక్సెస్ చేసేందుకు బీజేపీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నది. శుక్రవారం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు తదితరులు ఇందిరా పార్క్‌‌‌‌ వద్దకు వెళ్లి సభ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, పార్టీ నాయకులు, స్టూడెంట్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీజేపీ నేతలు కోరారు. పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాతీయ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొననున్నారు.

తెలంగాణలో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సంగారెడ్డిలో కీలక సమావేశం..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నెలాఖరులో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల‌ 31న సంగారెడ్డిలో పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికలకు సంబంధించి ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా, తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. రెండు పార్టీల మధ్య ఎన్నడూ లేనంతగా మారాయి పరిస్థితులు. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటుండటంతో తెలంగాణలో రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పతాకస్థాయికి చేరుకున్నాయి.

దీనికి తోడు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్‌ను ఇరుకునపెడుతోంది. ఈ తరుణంలో నడ్డా పర్యటనపై తెలంగాణలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

పరీక్ష రాస్తుండగానే.. తెలంగాణ ఇంటర్‌ విద్యార్ధినికి గుండెపోటు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం (మార్చి 23) పరీక్ష రాస్తున్న సమయంలో ఇంటర్ విద్యార్థినికి గుండెపోటు వచ్చిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పరీక్షరాస్తున్న సమయంలో బిందు అనే ఇంటర్‌ విద్యార్ధిని అస్వస్థతకు గురైంది. దీంతో సదరు పరీక్ష కేంద్రంలోని పీఆర్డీవో వెంకటేశ్వర్లు 108కు ఫోన్ చేశారు. పరీక్ష కేంద్రానికి చేరుకున్న 108 సిబ్బంది సీపీఆర్ చేసి విద్యార్థిని ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్నివయసుల వారికి గుండెపోటు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇంటర్‌ విద్యార్ధినికి గుండెపోటు రావడం ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది.

TS : టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన ఛాయిస్‌.. అలాగే హాల్ టికెట్స్ ..

తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు సమయం దగ్గర పడుతుంది. శుక్రవారం నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. స్కూల్ ఎడ్యూకేషన్ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది విద్యాశాఖ. వచ్చే నెల 3వ తేది నుంచి పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. టెన్త్ ఎగ్జామ్స్ రాసేందుకు 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు.

కాగా ఈ సారి టెన్త్ ఎగ్జామ్స్‌ పేపర్స్‌లోని వ్యాసరూప ప్రశ్నల సెక్షన్‌లో స్వల్పంగా ఛాయిస్‌ పెంచారు. 6 ప్రశ్నల్లో నాలుగింటికి ఆన్సర్స్ రాస్తే చాలు. ఈ మేరకు విద్యాశాఖ జ‌న‌వ‌రి 11నే ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబ‌రు 28న వచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. వ్యాసరూప క్వచ్చన్స్ సెక్షన్‌లో ఇంతకుముందు ఇంటర్నల్‌ ఛాయిస్‌ మాత్రమే ఉంది. అంటే ప్రతి ప్రశ్నలో A లేదా B అని రెండు ప్రశ్నలిస్తారు. అందులో ఏదో ఒకదానికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 

దీనిపై టీచర్స్‌తో పాటు పేరెంట్స్‌ నుంచి కాస్త వ్యతిరేకత వచ్చింది. 2 సంవత్సరాలు కోవిడ్ కారణంగా ఆన్ లైన్ క్లాసులకు మాత్రమే స్టూడెంట్స్ హాజరయ్యారు. దీంతో లెర్నింగ్ కెపాసిటీ తగ్గింది. దీంతో ఎగ్జామ్ పాట్రన్‌లో మార్పులు చేయాలని..ఛాయిస్‌ పెంచాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో తాజాగా ఇంటర్నల్‌ ఛాయిస్‌ను రిమూవ్ చేసింది. 6 ప్రశ్నల్లో నాలుగింటికి ఆన్సర్స్ రాయాలని పేర్కొంది.

దీనివల్ల మిగిలిన రెండు సెక్షన్లలో ఒక్కో ప్రశ్నకు మార్కుల అలాట్‌మెంట్ మారింది. ఈ మార్పు తెలుగు, ఇంగ్లీషు, హిందీ సబ్జెక్టులకు ఉండదు. మ్యాథ్స్, సైన్స్‌, సోషల్‌లకు…అదీ వచ్చే ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షలతో పాటు 2023-24 అకడమిక్ ఇయర్‌కు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మార్పులన్నీ తొమ్మిదో తరగతికీ వర్తించనున్నాయి. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.