/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png StreetBuzz ఎవర్నీ కించపరచలే.. తెలంగాణలోని సామెతను చెప్పిన : బండి సంజయ్ TS breaking
ఎవర్నీ కించపరచలే.. తెలంగాణలోని సామెతను చెప్పిన : బండి సంజయ్

తాను ఎవరిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కవినుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మార్చి 18న మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అనంతరం మాట్లాడిన ఆయన తెలంగాణలోని సామెతను మాత్రమే చెప్పానన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నట్లు రెండు పేజీల్లో వివరణ ఇచ్చారు. ఆయన సమాధానం పట్ట మహిళా కమిషన్ ఏ నిర్ణయం తీసుకుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది . 

 ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవినుద్దేశించి వ్యాఖ్యలు చేశారని మహిళా కమిషన్ బండి సంజయ్ కు నోటీసులిచ్చింది. మార్చి 15న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కోరింది. పార్లమెంట్ సమావేశాలున్నందును మార్చి 15న హాజరు కాలేనని 18న హాజరవుతానని మహిళా కమిషన్ కు బండి సంజయ్ లేఖ రాశారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు.

టెక్నాలజీని మంచి పనికి ఉపయోగించాలి: గవర్నర్ తమిళి సై

పరీక్షలు జరుగుతున్నాయి అంటే అప్పటి కాలంలో ఎలా చదవాలి అని విద్యార్థులు అడిగేవారు అని కానీ ఇప్పుడు పరీక్ష పత్రాలు ఎక్కడ ప్రింట్ చేస్తున్నారు అని అడిగే పరిస్థితి నెలకొంది అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై అన్నారు. మార్చి 18న కూకట్ పల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో నిర్వహించిన 11వ స్నాతకోత్సవనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మభూషణ్ గ్రహీత, రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కృష్ణస్వామి కస్తూరీరంగాకి డాక్టరేట్ ప్రధానం చేయడంతో పాటు వివిధ భాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 46 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందించారు. యూజీ, పీజీ, పీహెచ్.డీ భాగాలలో 92,005 వేల మందికి డిగ్రీలను ప్రధానం చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్.. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై దృష్టి పెట్టడంతోపాటు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి అని సూచించారు. మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని డిగ్రీలు సంపాదించిన ఉపయోగం ఉండదు అని తెలియజేశారు. ప్రస్తుతం ఊర్లలోనే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని వాటిని ప్రతి ఒక్కరు అందుపుచ్చుకోవాలని గవర్నర్ కోరారు. మహిళా విద్యార్థులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో కూడా దృష్టి సారించాలని వారికి తెలిపారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక యుగంలో సమయం త్వరగా గడిచిపోవడంతో పాటు టెక్నాలజీ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని.. దానిని ఎప్పుడు మంచి పనికి ఉపయోగించాలని విద్యార్థులకు తెలియపరిచారు.

ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్.. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై దృష్టి పెట్టడంతోపాటు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి అని సూచించారు. మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని డిగ్రీలు సంపాదించిన ఉపయోగం ఉండదు అని తెలియజేశారు. ప్రస్తుతం ఊర్లలోనే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని వాటిని ప్రతి ఒక్కరు అందుపుచ్చుకోవాలని గవర్నర్ కోరారు. మహిళా విద్యార్థులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో కూడా దృష్టి సారించాలని వారికి తెలిపారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక యుగంలో సమయం త్వరగా గడిచిపోవడంతో పాటు టెక్నాలజీ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని.. దానిని ఎప్పుడు మంచి పనికి ఉపయోగించాలని విద్యార్థులకు తెలియపరిచారు

ఇది ఇద్దరు దుర్మార్గులు చేసిన తప్పిదం.. పేపర్ లీకేజ్‌పై కేటీఆర్ స్పష్టత

పేపర్ లీకేజ్ టీఎస్‌పీఎస్‌సీ వ్యవస్థ తప్పు కాదని.. ఇద్దరు దుర్మార్గులు (ప్రవీణ్, రాజశేఖర్) చేసిన తప్పు అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పేపర్ లీకేజ్ అంశం చాలా దురదృష్టకరం అన్నారు. ఈ వ్యవహారంపై తామంతా చర్చించామని, సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చామని అన్నారు. 155 నోటిఫికేషన్‌ల ద్వారా 37 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని.. గత 8 ఏళ్లలో ఇండియాలోనే ఎక్కువగా ఉద్యోగాలు భర్తీ చేసింది ఒక్క టీఎస్‌పీఎస్‌సీ మాత్రమేనని పేర్కొన్నారు. 7 భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బోర్డ్‌పై ఎన్నో ఆరోపణలు వచ్చాయని గుర్తు చేసిన ఆయన.. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు చెసిన తప్పు వల్ల వ్యవస్థకే చెడ్డు పేరు వచ్చిందని మండిపడ్డారు. ఆ ఇద్దరు వ్యక్తులే కాదు.. వారి వెనకాల ఎవరున్నా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. వ్యక్తుల వల్ల వచ్చిన పొరపాటు మళ్ళీ జరక్కుండా తప్పకుండా చర్యలు తీసుకుంటాం హామీ ఇచ్చారు. ఈ లీకేజ్ కారణంగా నాలుగు పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చిందని.. త్వరలోనే ఆ పరీక్షలను నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు.

విద్యార్థుల బాధను తాము అర్థం చేసుకోగలమని, కానీ తప్పని పరిస్థితుల్లో పరీక్షల్ని రద్దు చేయక తప్పలేదని క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ జరగబోయే పరీక్షల కోసం అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు.. కోచింగ్ మెటీరియల్ ఉచితంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో పెడతామని, స్టడీ సెంటర్‌లో 24 గంటలు రీడింగ్ రూమ్ అందుబాటులో ఉంచుతాం, అక్కడే భోజన వసతి కూడా కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వ్యవస్థ పటిష్టంగానే ఉందని భరోసా కల్పించారు. రాజకీయ నిరుద్యోగులు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ఏమాత్రం పట్టించుకోవద్దని సూచించారు.

కమిషన్‌లో పాదర్శకత తీసుకురావడం కోసం అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు. వన్ టైం రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించామన్నారు. యూపీఎస్‌సీ ఛైర్మన్ రెండుసార్లు తెలంగాణకు వచ్చి, రెండుసార్లు మన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ని విజిట్ చేసి, ఇక్కడి విధానాలపై అధ్యయనం చేశారన్నారు. 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషనర్లు వచ్చి కూడా పరిశీలించారన్నారు. ఇన్నేళ్లలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. 95 శాతం రిజర్వేషన్లు స్థానికులకే ఇచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం చట్టసవరణ చేసిందన్నారు.

ఇక ఈ పేపర్ లీక్‌లో ఉన్న ప్రధాన నిందితుడు రాజశేఖర్ ఒక బీజేపీ క్రియాశీలక కార్యకర్త అని, సామాజిక మాధ్యమాల్లో అతడు బీజేపీకి ప్రచారం చేస్తున్నాడని ఆధారాలతో సహా కేటీఆర్ వెల్లడించారు. నోటిఫికేషన్లు ఇవ్వడమే కుట్ర అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గతంలో చెప్పారని, విద్యార్థులను బిజీగా పెడుతున్నారని వ్యాఖ్యానించారని, ఇప్పుడు పేపర్ లీకేజ్‌లో ఆ పార్టీ కార్యకర్తే ఏ2గా ఉండటం అనుమానాలకు తావిస్తోందని కేటీఆర్ అన్నారు. దీనిపై లోతుగా విచారణ చేయాలని తాము డీజేపీని కోరామన్నారు.

దీని వెనుక ఏ పార్టీ వాళ్ళున్నా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, కానీ వాటిని భర్తీ చేయట్లేదని విమర్శించారు. టీఎస్‌పీఎస్‌సీ తమ అధీనంలో ఉండదని.. ఐటీ శాఖతో ఆ వ్యవస్థకు సంబంధం ఉండదని.. అలాంటప్పుడు ఐటీ మంత్రిని రాజీనామా చేయమనడం హాస్యాస్పదమని చెప్పారు. గతంలో గుజరాత్‌లో 13 లీక్‌లు జరిగాయని.. మరి అప్పుడు ఎవరినైనా బర్తరఫ్ చేశారా? అని ప్రశ్నించారు. వ్యాపం స్కామ్‌లో మధ్యప్రదేశ్ సీఎం పేరొస్తే రాజీనామా చేశారా? అని నిలదీశారు.

Hyd : రూ.17 లక్షల హవాలా డబ్బు సీజ్.. ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బును సీజ్ చేశారు కాచిగూడ పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్ లో వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు..ఓ వ్యక్తి వద్ద రూ. 17 లక్షల హవాలా డబ్బును గుర్తించారు. నగరంలోని బడిచౌడి ప్రాంతానికి చెందిన హరి నారాయణ కొట్టారి అనే వ్యక్తి రూ. 17 లక్షల అక్రమ నగదు కాటేదాన్ ప్రాంతానికి చెందిన షోహెల్ అనే వ్యక్తుల మధ్య చేతులు మారుతుండగా గుర్తించిన పోలీసులు రెడ్ హ్యానడెడ్ గా పట్టుకున్నారు. 

పోలీసులు నగదును సీజ్ చేసి ఐటీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని.. ఈ డబ్బు ఎవరికి చెందినదని.. దీని వెనుకాల ఎవరు ఉన్నారని ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కాచీగూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుదునూరు,ఆర్ కొత్తగూడెం రహదారిలో మార్చి 18న మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు కలకలం రేపాయి.

 మార్చి 23ను భగత్ సింగ్, సుఖదేవ్ రాజ్ గురు ల అమరత్వ దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చారు మావోయిస్టులు. ప్రజా వ్యతిరేక హిందూ ఫాసిస్టు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరాటాలు సాగించాలని మావోయిస్టులు కరపత్రాల్లో వెల్లడించారు. కుదునురు, ఆర్ కొత్తగూడెం ప్రధాన రహదారి.. దానవాయిపేట, చింతగుప్పా, వెంకటాపురం రహదారిలో మావోయిస్టులు ఈ బ్యానర్లు, కరపత్రాలను అతికించారు. 

తెలంగాణ కమిటీ భారత మావోయిస్టు పార్టీ పేరుతో ఈ కరపత్రాలు వెలిశాయి. దీంతో సమాచారం అందుకున్న ఇంటెలిజెన్స్‌ విభాగం పోలీస్‌ యం త్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా గస్తీ నిర్వహి స్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామీణ పల్లెలను జల్లెడ పడుతున్నారు.

మహిళా కమిషన్ ముందుకు బండి సంజయ్..

భారత్ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆమె వద్ద ఈడీ అధికారులు విచారణ కూడా జరిపారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

దీంతో ఆయనపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అదేసమయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. సుమోటాగా స్వీకరించిన మహిళా కమిషన్ బండి సంజయ్‌కు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసుల్లో ఈ నెల 13వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని పేర్కొనగా, 18వ తేదీన హాజరువుతానని బండి సంజయ్ మహిళా కమిషన్‌కు రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలో నేడు కమిషన్ ముందు బండి సంజయ్ హాజరుకానున్నారు. 

మరోవైపు, బండి సంజయ్‌పై మహిళా సంఘాలతో పాటు తెరాస నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే తెరాస పార్టీ శ్రేణులు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా పలురకాలైన ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయంతెల్సిందే.

నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు హైకోర్టులో చుక్కెదురు

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. బీజేపీ ఎంపీ అరవింద్ కు తాజాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లో చుక్కెదురైంది.

ఎస్సీ ఎస్టీ లను కించపరిచేలా వాఖ్యలు చేశారని మాదన్నపేటలో 2022లో నమోదైన ఎస్సీ ఎస్టీ కేస్ ట్రైయిల్ ఫేస్ చేయాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు తీర్పు ఇచ్చింది. 

ఈ కేసు పై విధించిన స్టే వేకెట్ చేసింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. FIR నమోదుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అరవింద్.. పోలీసులు తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పేపర్ లీక్ కేసులో టీఎస్ పీఎస్సీకి సిట్ నివేదిక

టీఎస్ పీఎస్సీ(TSPSC) పేపర్ లీక్ లో కీలక సూత్రధారి రాజశేఖరేనని సిట్ తేల్చింది. టీఎస్ పీస్సీకి అందజేసిన నివేదికలో సిట్ కీలక విషయాలు వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగానే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు.  టెక్నికల్ సర్వీస్‌ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన రాజశేఖర్.. కారుణ్యానియమకంలో ఉద్యోగంలో చేరాడని గుర్తించారు. ప్రవీణ్ తో రాజశేఖర్ సంబంధాలు కొనసాగించాడని తెలిపారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్న రాజశేఖర్ కంప్యూటర్ ని హ్యాక్ చేసి పాస్ వర్డ్ ని దొంగిలించాడని పేర్కొన్నారు.

పాస్ వర్డ్ ని శంకర్ లక్ష్మి ఎక్కడా రాయలేదని.. ఆమె చెప్పినదాంతోనే రాజశేఖర్ కంప్యూటర్ ని హ్యాక్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. పెన్ డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను కాపీ చేసిన రాజశేఖర్.. పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కు ఇచ్చాడని వెల్లడించారు. ఫిబ్రవరి 27నే రాజశేఖర్ ఏఈ పేపర్ ను కాపీ చేశాడని.. ఆ పేపర్ ను ప్రవీణ్ రేణుకకు అమ్మినట్లు గుర్తించారు. గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ లీకైనట్లు సిట్ అధికారులు తేల్చారు. అయితే ప్రవీణ్ కు గ్రూప్ 1లో 103 మార్కులు రావడంపై విచారిస్తున్నారు. సెక్రటరీ దగ్గర పీఏగా పనిచేస్తూ గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ ను కొట్టేసినట్లు సిట్ నిర్దారించింది.

టీఎస్పీఎస్సీ పేపర్​ లీక్​ ఘటనలో మొత్తం తొమ్మిది మంది నిందితులకు మరో ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. నిందితులను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కు స్పందించిన కోర్టు 6 రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. నిందితులను మార్చి 18 నుంచి మార్చి 23 వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనే డిమాండ్‌తో హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈ పోలీసులు ఈ దీక్షను భగ్నం చేశారు. 

టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరుతున్న సంజయ్‌ని అరెస్ట్ చేశారు. సంజయ్‌తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంజయ్ అరెస్ట్ సందర్భంగా పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో వారి మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకోగా, ఉద్రిక్తత నెలకొంది.

వెల్లుల్లి - ఆరోగ్య ప్రయోజనాలు

మనలో చాలామందికి కొన్ని రకాల ఆహారపదార్ధాలు, చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు తినడం అంతగా అలవాటు ఉండదు. అందులో ముఖ్యమైంది వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కేవలం మాంసాహారం, చేపలు వంటివి తిన్నప్పుడు మాత్రమే వాడతారు. కానీ అల్లం, వెల్లుల్లిని విడిగా రోజువాడితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలీదు. వెల్లుల్లిలో విటమిన్లు B1, B2, B3, B6, ఫోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి వంటి పోషకాలెన్నో ఉంటాయి.

వెల్లుల్లిని ఏ రూపంలోనైనా మన డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, పచ్చి వెల్లుల్లిని ఉదయం పూట తిని నీళ్లు తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. వెల్లుల్లిని ఎక్కువగా నూనె, క్రొవ్వు పదార్థములు తినేవారు వెల్లుల్లి తప్పని సరిగా వాడాలి. వెల్లుల్లి మాంసాహారం మరియు ఇతర క్రొవ్వు పదార్ధములలో ఉన్న క్రొవ్వునకు విరుగుడుగా పని చేస్తుంది. గుండె జబ్బులను రానివ్వదు. వెల్లుల్లి పట్టు వేసిన తలనొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. వెల్లుల్లిని పాలతో కలిపి ఉడికించి త్రాగించిన అస్తమా, క్షయ, నిమోనియా తగ్గుతాయి. జలుబు తగ్గుతుంది. వెల్లుల్లిని రోజూ వాడేవారు తక్కువగా అనారోగ్యం బారిన పడతారని డాక్టర్లు చెబుతున్నారు.

ఆయుర్వేదములో వెల్లుల్లి రసాయనంగా వాడాలని చెబుతారు. పక్షవాతము మొదలుకొని కుష్ఠు, గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు, జ్వరము, జీర్ణాశయ వ్యాధులు మొదలైన అనేక వ్యాధులలో వెల్లుల్లికి మించిన ఔషధం లేదు. వెల్లుల్లి అత్యుత్తమమైన జీర్ణకారిగా పనిచేస్తుంది. గుండె జబ్బులు కలవారు బాగా లావుగా ఉన్నవారు ప్రతిరోజూ రెండు లేక మూడు చిన్నపాయలను తీసుకుంటే లావు తగ్గుతారు. స్త్రీలలో కలిగే వ్యాధులలో వెల్లుల్లి అత్యుత్తమంగా పని చేస్తుంది. ఋతు దోషములను పోగొట్టి సంతానాన్ని కలిగిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధులలో వెల్లుల్లిని పాలతో కలిపి ఉడికించి త్రాగించిన ఆస్త్మా, క్షయ, నిమోనియా తగ్గుతాయి. జలుబు తగ్గుతుంది.

చర్మానికి కాంతి కావాలంటే వెల్లుల్ని వాడాలి. వెల్లుల్లిపాయలను దంచి ఆ రసాన్ని 10 చుక్కల చొప్పున రోజుకి రెండు సార్లు త్రాగిస్తే పిల్లలకు కలిగే కోరింత దగ్గు తగ్గుతుంది. శుక్రకణాలు తక్కువగా ఉండి, సంతాన సాఫల్యత కోసం ఎదురుచూసే వారు వెల్లుల్లిని ఎక్కువగా వాడమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. చాలామంది చెవిపోటుతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు వెల్లుల్లిని వాడితే చెవిపోటు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఏ పదార్ధాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. వెల్లుల్లి అతిగా తింటే రక్తస్రావం, రక్తంతో కూడిన వాంతులు, రక్త విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తగు మోతాదులో జాగ్రత్తగా సేవిస్తే అమృతంలా పనిచేస్తుంది. మన శరీరం తత్వాన్ని బట్టి వెల్లుల్లిని సేవించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.