/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png StreetBuzz వెల్లుల్లి - ఆరోగ్య ప్రయోజనాలు TS breaking
వెల్లుల్లి - ఆరోగ్య ప్రయోజనాలు

మనలో చాలామందికి కొన్ని రకాల ఆహారపదార్ధాలు, చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు తినడం అంతగా అలవాటు ఉండదు. అందులో ముఖ్యమైంది వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కేవలం మాంసాహారం, చేపలు వంటివి తిన్నప్పుడు మాత్రమే వాడతారు. కానీ అల్లం, వెల్లుల్లిని విడిగా రోజువాడితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలీదు. వెల్లుల్లిలో విటమిన్లు B1, B2, B3, B6, ఫోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి వంటి పోషకాలెన్నో ఉంటాయి.

వెల్లుల్లిని ఏ రూపంలోనైనా మన డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, పచ్చి వెల్లుల్లిని ఉదయం పూట తిని నీళ్లు తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. వెల్లుల్లిని ఎక్కువగా నూనె, క్రొవ్వు పదార్థములు తినేవారు వెల్లుల్లి తప్పని సరిగా వాడాలి. వెల్లుల్లి మాంసాహారం మరియు ఇతర క్రొవ్వు పదార్ధములలో ఉన్న క్రొవ్వునకు విరుగుడుగా పని చేస్తుంది. గుండె జబ్బులను రానివ్వదు. వెల్లుల్లి పట్టు వేసిన తలనొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. వెల్లుల్లిని పాలతో కలిపి ఉడికించి త్రాగించిన అస్తమా, క్షయ, నిమోనియా తగ్గుతాయి. జలుబు తగ్గుతుంది. వెల్లుల్లిని రోజూ వాడేవారు తక్కువగా అనారోగ్యం బారిన పడతారని డాక్టర్లు చెబుతున్నారు.

ఆయుర్వేదములో వెల్లుల్లి రసాయనంగా వాడాలని చెబుతారు. పక్షవాతము మొదలుకొని కుష్ఠు, గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు, జ్వరము, జీర్ణాశయ వ్యాధులు మొదలైన అనేక వ్యాధులలో వెల్లుల్లికి మించిన ఔషధం లేదు. వెల్లుల్లి అత్యుత్తమమైన జీర్ణకారిగా పనిచేస్తుంది. గుండె జబ్బులు కలవారు బాగా లావుగా ఉన్నవారు ప్రతిరోజూ రెండు లేక మూడు చిన్నపాయలను తీసుకుంటే లావు తగ్గుతారు. స్త్రీలలో కలిగే వ్యాధులలో వెల్లుల్లి అత్యుత్తమంగా పని చేస్తుంది. ఋతు దోషములను పోగొట్టి సంతానాన్ని కలిగిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధులలో వెల్లుల్లిని పాలతో కలిపి ఉడికించి త్రాగించిన ఆస్త్మా, క్షయ, నిమోనియా తగ్గుతాయి. జలుబు తగ్గుతుంది.

చర్మానికి కాంతి కావాలంటే వెల్లుల్ని వాడాలి. వెల్లుల్లిపాయలను దంచి ఆ రసాన్ని 10 చుక్కల చొప్పున రోజుకి రెండు సార్లు త్రాగిస్తే పిల్లలకు కలిగే కోరింత దగ్గు తగ్గుతుంది. శుక్రకణాలు తక్కువగా ఉండి, సంతాన సాఫల్యత కోసం ఎదురుచూసే వారు వెల్లుల్లిని ఎక్కువగా వాడమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. చాలామంది చెవిపోటుతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు వెల్లుల్లిని వాడితే చెవిపోటు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఏ పదార్ధాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. వెల్లుల్లి అతిగా తింటే రక్తస్రావం, రక్తంతో కూడిన వాంతులు, రక్త విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తగు మోతాదులో జాగ్రత్తగా సేవిస్తే అమృతంలా పనిచేస్తుంది. మన శరీరం తత్వాన్ని బట్టి వెల్లుల్లిని సేవించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

సుప్రీంకోర్టులో కవితకు ఎదురుదెబ్బ : 24వ తేదీనే పిటీషన్ విచారిస్తాం

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ విచారణ.. 20వ తేదీన హాజరుకావాలన్న నోటీసులను సవాల్ చేస్తూ అత్యవసరం పిటీషన్ దాఖలు చేశారామె. దీనిపై మార్చి 17వ తేదీ శుక్రవారం అత్యున్నత న్యాయస్థానంలోని ధర్మాసనం విచారణ చేసింది. మీ పిటీషన్ పరిశీలించాం.. ముందుగా నిర్ణయించినట్లు.. మార్చి 24వ తేదీనే విచారిస్తాం అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

20వ తేదీన ఈడీ విచారణకు హాజరవుతున్న క్రమంలో.. 24వ తేదీన చేపట్టాల్సిన విచారణను.. ముందుగానే చేపట్టాలని సుప్రీంకోర్టును కోరారు కవిత. మహిళల హక్కులకు విరుద్ధంగా.. నిబంధనలకు భిన్నంగా ఈడీ వ్యవహరిస్తుందని.. బలవంతంగా వాంగ్మూలం తీసుకుంటారని తన పిటీషన్ లో స్పష్టం చేశారు కవిత.

సుప్రీంకోర్టులో పిటీషన్ పెండింగ్ లో ఉందన్న కారణంతో.. ఈడీ విచారణకు హాజరుకాలేదు కవిత. ఇప్పుడు కోర్టు అందుకు భిన్నంగా తీర్పు ఇవ్వటంతో.. 20వ తేదీన ఈడీ ఆఫీసుకు వెళ్లి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు క్రమంలో.. మరో మార్గం లేకుండా పోయింది కవితకు.

స్వప్నలోక్​ కాంప్లెక్స్​లో అగ్ని ప్రమాదంపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి ఏమన్నారంటే...

సికింద్రాబాద్​ స్వప్నలోక్​ కాంప్లెక్స్​లో గురువారం రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. ఆరుగురు ఊపిరాడక మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎటు చూసినా హాహాకారాలతో స్వప్నలోక్​ కాంప్లెక్స్​ పరిసరాల్లో విషాద వాతావరణం అలుముకుంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాంప్లెక్స్​లోని సిబ్బంది, స్థానికులు పరుగులు తీశారు. 

సెల్లార్​లో వైర్లు కాలి 4, 5, 6 , 7 ఫ్లోర్లలో మంటలు చెలరేగాయి. సుమారు సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్భంది.. ఘటనా స్థలానికి చేరుకొని 12 మందిని కాపాడారు. అందులో ఆరుగురు మరణించారు. అయితే, ఈ ఘటనపై స్పందించిన అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి.. ప్రమాదానికి గల కారణాన్ని వివరించారు. యజమానులకు ఫైర్ సేఫ్టీని పెట్టుకోమని చెప్పినా నిర్లక్ష్యం చేశారని, ఇందులో షాప్ కీపర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు.

స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ షాక్ అనే భావిస్తున్నారు. బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ పెట్టినా అవి ఏమాత్రం పని చేయలేదు. బిల్డింగ్ లో సెట్ బ్యాక్స్ అనుకూలంగా ఉన్న కారణంగా ఫైర్ ఫైటింగ్ ఈజీగా చేయగలిగారు. అయితే, ప్రస్తుతానికి బిల్డింగ్ పరిస్థితి బాగానే ఉందని నిర్థారించారు. 

ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ప్రతి కమర్షియల్ లో తప్పనిసరిగా ఉండాలని, ఫైర్ సేఫ్టీని మెయింటెనెన్స్ సరిగా ఉంచుకోవాలని నాగిరెడ్డి సూచించారు. ప్రధానంగా కమర్షియల్ కాంప్లెక్స్ లు లాక్ చేయకూడదు. అయితే, చనిపోయిన వాళ్ల ప్రాంతంలో తాళాలు వేసి ఉండటంతో వాళ్లు బయటపడలేక పోయారు. వ్యాపారా లావాదేవీలు నిర్వహించే వాళ్లు మెయింటేన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని, ఈ విషయంపై గతంలో స్వప్నలోక్ కాంప్లెక్ వారికీ నోటీసులు ఇచ్చినా వాటిని పాటించాలేదని నాగిరెడ్డి అన్నారు. 

కాంప్లెక్సులు ఉన్న వాళ్లు లిఫ్ట్ తోపాటు, మెట్ల దారిని కూడా తెరచి ఉంచాలని చెన్నారు. ఏ కాంప్లెక్ లో అయినా మెట్ల దారిని లాక్ చేస్తే 101 కు ఫోన్ చేయాలి, వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే నగరంలో 1150 ఎస్టాబ్లిష్ మెంట్ల అగ్నిమాపక శాఖ పరిశీలన చేశామని అన్నారు.

TS Sircilla Jilla : గిరిజన గురుకుల గర్ల్స్ స్కూల్​ హాస్టల్ లో ఫుడ్​ పాయిజన్... అస్వస్థతకు గురైన 50 మంది విద్యార్థినులు...

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని గిరిజన గురుకుల గర్ల్స్ స్కూల్​ హాస్టల్ లో గురువారం ఉదయం ఫుడ్​ పాయిజన్ ​అయ్యింది.

 బుధవారం సాయంత్రం స్కూల్​లో చేసిన పకోడి తినడంతో ఇలా జరిగిందని తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు గాఢనిద్రలో ఉన్న పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో 50 మంది అస్వస్థతకు గురయ్యారు.

 స్థానిక ఏఎన్ఎంను పిలిపించడంతో అందరికీ ట్యాబ్లెట్లు ఇవ్వగా 25 మందికి తగ్గలేదు. దీంతో 25 మందిని సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలించారు. పరిస్థితి మెరుగుపడని ఆరుగురిని అడ్మిట్​ చేసుకుని మిగతా వారికి ట్రీట్​మెంట్​ ఇచ్చి హాస్టల్​కు పంపించారు. ఏమైందో ఏమోగాని గంటలోనే వారిని కూడా డిశ్చార్జి చేసి పంపించారు. హాస్టల్ లోనే విద్యార్థులకు ట్రీట్​మెంట్​ ఇస్తుండగా, ఇద్దరికి సీరియస్​గా ఉండడంతో ఓ కారులో సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించినట్టు తెలుస్తోంది. 

అయతే, ఈ విషయాన్ని మాత్రం ధ్రువీకరించడం లేదు. ఫుడ్​ పాయిజన్​ ఘటన నేపథ్యంలో గురువారం హాస్టల్​లో మెడికల్​క్యాంప్​ ఏర్పాటు చేశారు. ఎవరికైనా బాగా లేకపోతే దవాఖానకు తీసుకెళ్లడానికి వీలుగా ఓ అంబులెన్స్​ను సిద్ధంగా ఉంచారు. కాగా, ప్రిన్సిపాల్ శకుంతల ఫుడ్ పాయిజన్ అయ్యిందని చెబుతుండగా, డీఎంహెచ్ఓ సుమన్​మోహన్​రావు మాత్రం వైరల్ ఫీవర్​ కారణమని చెబుతున్నారు.

TS : ఇంకా 3 దినాలు వర్షాలే వర్షాలు - వాతావరణ శాఖ

తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్నటి నుంచి తెలంగాణలో వ్యర్ధాలు పడుతునాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది.

టోలి చౌక్ లో 9.1సెం.మీ, రాజేంద్ర నగర్ శివరాంపల్లిలో 6.3సెం.మీ, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్‌లో 6.1సెం.మీ, కుత్బుల్లాపూర్ జీడిమెట్ల గాయిత్రినగర్‌లో 5.3సెం.మీ. కాజాగూడలో 5.3సెం.మీ, శంకర్‌పల్లి పొద్దుటూరులో 5.2సెం.మీ. జూ పార్క్ 5.1సెం.మీ పడింది.

ఇవాళ కూడా పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఆర్టీసీ ఎక్స్‌రోడ్స్‌, మాసబ్‌ట్యాంక్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో వర్షం. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉరుములతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. దీంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు వాతావరణ శాఖ పేర్కొంది.

TS : ఉపాధ్యాయ MLC ఎన్నికలో బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపు.

తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపొందారు. సమీప పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు.

చెన్నకేశరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో ఏవీఎన్ రెడ్డి గెలిచారు. గురువారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు లెక్కింపు పూర్తయింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవగా.. ఏ అభ్యర్థికీ సరైన మెజార్టీ దక్కలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో అభ్యర్థుల్లో ఎవరికీ గెలుపునకు అవసరమైన ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్‌ పద్దతిలో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు. మూడో స్థానంలో ఉన్న టీఎస్‌యూటీఎఫ్‌ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్‌ రెడ్డి విజయం ఖరారైంది.

మొత్తం 29,720 ఓట్లకు గాను 25,868 ఓట్లు పోలవగా, అందులో 452 ఓట్లు చెల్లకుండా పోయాయి. మిగిలిన 25,416 ఓట్లలో గెలుపునకు కావాల్సిన 12,709 ఓట్లు ఏ ఒక్క అభ్యర్థికి రాకపోవడంతో ఎలిమినేషన్‌ పద్దతిలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్‌రెడ్డి, పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి, యూటీఎప్‌టీఎస్‌ అభ్యర్థి మాణిక్‌రెడ్డికి, కాంగ్రెస్‌ బలపరచిన గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి పోటీ చేశారు.

మగజాతి మొత్తం అంతరించిపోయి స్త్రీ జాతికి నేనొక్కడినే దిక్కవ్వాలి.. రాంగోపాల్ వర్మ

టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరొకసారి వైరల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు తాజాగా నాగార్జున యూనివర్సిటీ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వర్మ విద్యార్థులతో మాట్లాడుతూ కాంట్రవర్సీకి తెర తీశారు. వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తూ వైరల్ గా మారారు.

తాజాగా నాగార్జున యూనివర్సిటీ లో జరిగిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ విద్యార్థులకు ఉచిత సలహాలు ఇచ్చారు. ఏం చేయాలన్నా ఈ వయసులోనే చేయాలి అందుకే నచ్చింది తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు.. ఉన్నది ఒకటే జీవితం దాన్ని పాడు చేసుకోవద్దు.. చనిపోయాక స్వర్గానికి వెళ్తే రంభ, ఊర్వశి, మేనకలు ఉండకపోవచ్చు కాబట్టి ఇక్కడే ఎంజాయ్ చేయండి అంటూ విద్యార్థులకు హితబోధ చేశారు. ఎవరికి నచ్చిన విధంగా వారు బతకాలని ఎవరి మాట వినాల్సిన అవసరం లేదని అన్నారు. కష్టపడి చదివే వారు ఎప్పుడూ పైకి రాలేరని అందుకే జీవితాన్ని ఎంజాయ్ చేయండి అని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ భయంకరమైన వైరస్ వచ్చి మగజాతి అంతా అంతరించిపోవాలని నేను మాత్రమే ఉండిపోయి స్త్రీ జాతికి దిక్కవ్వాలంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ మాటలకు అక్కడ వారెవరు అడ్డు చెప్పకపోగా రాంగోపాల్ వర్మ ఒక ప్రొఫెసర్, ఫిలాసఫర్ అంటూ ప్రశంసించడం మరో విశేషం. అంతేకాకుండా వర్మకు పిహెచ్ డి, ఆస్కార్ కంటే ఎక్కువ అర్హతలు ఉన్నాయని చెప్పటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.. ప్రస్తుతం ఈ మాటలు విన్న వారంతా వర్మపై విరుచుకుపడుతున్నారు విద్యార్థులకు చెప్పాల్సిన మాటలు ఇవేనా.. ఇలాంటి మాటలు వారికి చెప్తే వారి భవిష్యత్తు ఏమవుతుంది అంటూ మండిపడుతున్నారు.

వీధి వ్యాపారుల షెడ్లను వెంటనే ప్రారంభించాలి - మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి.

జగిత్యాల జిల్లా కేంద్రం లో వీధి వ్యాపారుల కోసం గొల్లపల్లి రోడ్డులో నిర్మించిన షెడ్లను వెంటనే ప్రారంభించి, వీధి వ్యాపారులకు అప్పగించాలని కోరుతూ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బిజెపి నాయకురాలు డాక్టర్ భోగ శ్రావణి గురువారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. 

రహదారుల వెడల్పు, వీధి వ్యాపారుల క్రమబద్ధీకరణలో భాగంగా పట్టణ ప్రగతి నిధులను వెచ్చించి పాత బస్టాండ్ నుండి గొల్లపల్లి రోడ్డులో వీది వ్యాపారుల కోసం కేటాయించే 37 షెడ్ల నిర్మాణం పూర్తి అయినప్పటికీ కొన్ని రాజకీయ కారణాలవల్ల ఆ షెడ్ల ను ప్రారంభించకుండా తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు. 

అదేవిధంగా పట్టణ ప్రగతి మరియు మెప్మా నిధుల ద్వారా నిర్మించవలసి ఉన్న మిగతా 23 షెడ్ల నిర్మాణాన్ని కూడా వెంటనే ప్రారంభించాలని కోరారు. 

ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన షెడ్ల ను వీధి వ్యాపారులకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేసి పట్టణం లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారంతోపాటు వీధి వ్యాపారులకు చేయూతనివ్వాలని వినతి పత్రం లో కోరారు.

మంత్రి కేటీఆర్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మీ కుటుంబం అప్పుల పాలు చేసి చంపేసింది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు.

“పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టల దొర కొడుకా కేటీఆర్.. తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపింది ఎవరు? 33 ప్రాజెక్టులు కట్టి తెలంగాణ బీడు భూములకు నీళ్ళు పారించినందుకు YSR తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపినట్టా? రుణమాఫీ,ఉచిత కరెంట్,సబ్సిడీ పథకాలు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసినందుకు కొట్టి చంపినట్టా? ఆరోగ్యశ్రీ, పక్కా ఇళ్లు, ఫీజు రీయింబర్స్ మెంట్, లక్షల కొద్దీ సర్కార్ ఉద్యోగాల భర్తీ ఇవన్నీ ప్రజలను కొట్టి చంపినట్లేనా? నిజానికి తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపుతున్నది నీ అయ్య “కసాయి రావే”. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని నీ కుటుంబం కోసం నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసి చంపేసిన మాట నిజం కాదా?

ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను, రుణమాఫీ అని రైతులను చంపుతున్నది నిజం కాదా? ఫీజులు చెల్లించక విద్యార్థులను, పోడుపట్టాలు ఇస్తామని గిరిజన బిడ్డలను కొట్టి చంపుతున్నది నీ అయ్య కసాయిరావే కదా? ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతుంటే.. తెలంగాణను దర్జాగా దోచుకుంటున్న దొంగలు మీరు. ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్లు కాజేసింది మీరు.మీ అక్రమాలకు అడ్డొస్తే, ప్రశ్నిస్తే చావగొట్టేది మీరు. తల్లిలాంటి తెలంగాణను చంపుతున్న అసలు కసాయి గూండాలు మీరే. ఈసారి ఓటు కోసం కాలు బయట పెట్టి చూడు. నీకు, నీ అయ్యకు ఆ రోకలి బండే సమాధానం” అని అన్నారు షర్మిల.

హైటెక్ సిటీలో బోర్డు తిప్పేసిన సాప్ట్‌వేర్ కంపెనీ

హైదరాబద్ మాదాపుర్ హైటెక్ సిటీలో ఓ సాప్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. కొండాపుర్ AMB మాల్ ఎదురుగా యునైటెడ్ అలయన్స్ టెక్నాలజీ పేరుతో ముగ్గురు వ్యక్తులు ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి భారీ మోసానికి పాల్పడ్డారు. వీరు సాఫ్ట్ వేర్ జాబ్ పేరిట ఎంతో మంది నిరుద్యోగుల నుంచి రూ. లక్షల్లో వసూలు చేశారు. కంపెనీ యాజమాన్యం ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.లక్షన్నర నుండి మూడున్నర లక్షలు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. 

జాబ్ ఇచ్చిన కంపెనీ.. నెల రోజుల పాటు అన్ లైన్ ట్రైనింగ్ ఇచ్చింది. ట్రైనింగ్ పూర్తైనా.. నెల రోజులుగా కంపెనీ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో బాధితులు కొడాపుర్ కు వచ్చి ఆరా తీశారు. కంపెనీ ముతబడి ఉండటంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు. వేంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ధీరజ్ ముత్యాల, అఖిల్, విషశ్రీ అనే ముగ్గురు వ్యక్తులు ఉద్యోగం ఇస్తామంటూ మత నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేశారని బాధితులైనా పవన్, రితీష్, యతీష్ లు పోలీసు ఫిర్యాదులో వెల్లడించారు. తమ బ్యాంకుల నుండి డబ్బులు పంపించినట్లు బ్యాంకు అకౌంట్లతో సహా పోలీసులకు అందించారు. తమ న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరారు. కేసు నుమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.