NLG: నల్లగొండకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్
నల్లగొండ: వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం ఈనెల 7 వ తేదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, నల్గొండ జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రాక ఏర్పాట్ల విషయమై జిల్లా అధికారులతో కో-ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తాత్కాలిక సమాచారం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి 7 వ తేదీన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్, నల్గొండ మెడికల్ కళాశాల ప్రారంభం, స్కిల్ సెంటర్ తదితర వాటిని ప్రారంభించి.. అనంతరం నల్గొండ లోని నాగార్జున కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
ఇందుకుగాను ఆయా కార్యక్రమాల వద్ద ఇన్చార్జి అధికారులు ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని, ముఖ్యంగా బహిరంగ సభ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆమె ఆదేశించారు.
ఈ విషయమై ఆమె నీటిపారుదల శాఖ, వైటీపీఎస్, మున్సిపల్, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ తదితర శాఖల అధికారులతో ఏర్పాట్ల పై సమీక్షించారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు తదుపరి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు, ఏర్పాట్లపై సూచనలను తీసుకొని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.
అదనపు కలెక్టర్ జి. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిఆర్ఓ అమరేందర్, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

నల్లగొండ: వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం ఈనెల 7 వ తేదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, నల్గొండ జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

నల్లగొండ: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా, మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్జి కళాశాల మైదానం నుండి క్లాక్ టవర్ వరకు 2 కె రన్ ను, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు.
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థులు బాక్సింగ్ లో ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో గెలుపొంది జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఉపేందర్, ఫిజికల్ డైరెక్టర్ మల్లేశం తెలిపారు. ఎం.ముఖేష్, పి.వినయ్, ఎస్కె నయీమ్, బి. హరీష్,
చౌటుప్పల్: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా, ఇవాళ పారిశుధ్య కార్మికులు 19వ వార్డు
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీం పట్నం నియోజకవర్గం అంతర్గత రహదారుల అభివృద్ధి పనులకు రూ. 120 కోట్లు, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కృషితో మంజూరు జరిగింది.
నారాయణ కళాశాల విద్యార్థి తనుష్.. మృతి పైన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివ కుమార్ స్పందించారు. ఈ మేరకు నల్లగొండలో కట్టెల శివ మాట్లాడుతూ.. నారాయణ కళాశాల యాజమాన్యం ఒత్తిడి వల్ల గిరిజన విద్యార్థి బలైయ్యాడని తక్షణమే,యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
UP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్ రాజ్ లోని ‘మహా కుంభ్' ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించింది. దీనిని 'మహా కుంభమేళా' జిల్లాగా పిలుస్తారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
నల్లగొండ: ఆశా వర్కర్లతో లెప్రసీ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్దేశించిన క్రమంలో, ఇప్పటికే పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని లేకపోతే సర్వేను నిలిపివేస్తామని, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖా కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిఎంహెచ్ఓ పుట్ట శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు.సానుకూలంగా స్పందించిన డిఎంహెచ్ఒ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.
Dec 04 2024, 15:26
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
28.6k