NLG: నాగార్జున కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సాంస్కృతిక విభాగం మరియు మహిళా సాధికారికత విభాగం ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే పూలను పూజించే పండుగ ఇదొక్కటేనని తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్దలతో కోలుచుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ మన సాంస్కృతిక ప్రతీక అని పేర్కొన్నారు.
కోటొక్క పూల పండుగ బతుకమ్మను ప్రతి యేటా జరుపుకునే తెలంగాణ ప్రజలు, ఆడబిడ్డలు.. పిల్లాపాపలతో, పాడి పంటలతో క్షేమంగా ఉండాలని అకాంక్షిoచారు. ఈ సందర్బంగా నిర్వహించిన బతుకమ్మ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
విద్యార్థినిలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడి పాడారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. బి. సురేష్ బాబు, అకాడమిక్ కోఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్, సాంస్కృతిక విభాగం కన్వీనర్ డా.వి. శ్రీధర్, మహిళా సాధికారికత విభాగం అధ్యక్షులు డా. గంజి భాగ్యలక్ష్మి, అడ్మినిస్ట్రెటివ్ ఆఫీసర్ శ్రావణి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారులు కోటయ్య, మల్లేశం, శివరాణి, సావిత్రి, అనిల్ కుమార్, వెంకట్ రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి నాగరాజు, అధ్యాపకులు డా. కిరీటం, డా. ప్రసన్న కుమార్, సుధాకర్, వేణు, విద్యార్థులు పాల్గొన్నారు.

నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సాంస్కృతిక విభాగం మరియు మహిళా సాధికారికత విభాగం ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే పూలను పూజించే పండుగ ఇదొక్కటేనని తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్దలతో కోలుచుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ మన సాంస్కృతిక ప్రతీక అని పేర్కొన్నారు.

నల్లగొండ జిల్లా:
ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యం చేరాలంటే కష్టపడి చదవాలని, ఈరోజు శ్రమిస్తే రేపు భవిష్యత్ తరాలకు విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.
అనంతరం తన దగ్గర లేకున్నా పురోహితం చేసుకుంటూ పాఠశాల పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం సాయంత్రం తన సొంత డబ్బులతో స్నాక్స్ ను అందిస్తున్న మంచన హరిబాబు ను సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాలతి ఉపాధ్యాయులు ఎం.మూర్తి, శ్రీనివాస్ రెడ్డి, ఉదయశ్రీ, జ్యోతి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం రాత్రి కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు.73 ఏళ్ల నటుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ బృందం నటుడిని పరీక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ హైస్కూల్ లో 8,9,10 తరగతి చదువుతున్న బాలికలకు ప్రభుత్వ మెడికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సోమవారం హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు.
హైదరాబాద్: కుటుంబ డిజిటల్ కార్డుల పంపిణీ సమయంలో కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే కుటుంబం ఫొటో తీయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
నల్లగొండ జిల్లా:
నల్లగొండ జిల్లా:
డిల్లీ:
నల్లగొండ: జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ నూతన కమిటీని ఆదివారం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డివీఎస్,ఫణి కుమార్, ప్రధాన కార్యదర్శి జాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ మేరకు జిల్లా కార్యదర్శిగా అద్దంకి సునీల్ ఎన్నికయ్యారు.
Oct 01 2024, 22:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.3k