/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు. Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 09 2024, 12:56

పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది తెలంగాణ హైకోర్టు. సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే..

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది తెలంగాణ హైకోర్టు. సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ పెరిగిపోయింది. అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

ఇదిలాఉంటే.. బీఆర్ఎస్‌ పార్టీ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్‌ తో పాటు.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల తీర్పులను, ఫిరాయింపు చట్టం నిబంధనలను కోర్టు దృష్టి తీసుకెళ్లారు.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. పలు దఫాలుగా వాదనలు విన్నది. అనంతరం తీర్పును సోమవారం ఉదయానికి వాయిదా వేసింది. ఈ కేసులో హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది న్యాయస్థానం. మరి స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 09 2024, 12:52

స్లూయిజ్ గేట్ల చైన్లు తొలగించి ఉండటం చూసి షాకైన అధికారులు

ఇవాళ ప్రకాశం బ్యారేజ్ స్లూయిజ్ గేట్ల చైన్లను ఇంజినీరింగ్ అధికారులు తొలగించననున్నారు. మొత్తం 10 గేట్లు చైన్లు తొలగించి ఉండటాన్ని చూసి అధికారులు షాక్ అయ్యారు. బ్యారేజ్‌కు ఒకవైపు 6, మరో వైపు నాలుగు స్లూయిజ్ గేట్లు ఉన్నాయి. బ్యారేజ్ నీటి మట్టం తగ్గిన సమయంలో గేట్లు కింద వున్న వ్యర్థాలను బయటకు పంపేందుకు ఈ గేట్లను అధికారులు ఆపరేట్ చేయనున్నారు. ఈ గేట్లకు చైన్లు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఇప్పటికే బ్యారేజి మూడు గేట్లు కౌంటర్ వెయిట్లను పడవలు గుద్దు కోవడంతో విరిగిపోయిన అంశంపై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. తాజాగా స్లూయిజ్ గేట్లు చైన్లు ఊడిపోయి ఉండటంతో అధికారుల్లో సందేహాలు తలెత్తాయి. కావాలని చేశారా? లేక నిర్వహణ లేక ఊడిపోయి ఉన్నాయా? అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ స్లూయిజ్ గేట్లు ఓపెన్ చేస్తే బ్యారేజి నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్ళిపోయే అవకాశం ఉంది.

ఇక ప్రకాశం బ్యారేజీలో దెబ్బతిన్న కౌంటర్‌ వెయిట్ల స్థానంలో కొత్తవాటి ఏర్పాటు పూర్తయింది. దెబ్బతిన్న సిమెంటు దిమ్మెల స్థానం లో ఇనుప వెయిట్లు అమర్చారు. ప్రభుత్వ సలహాదారు, గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడి పర్యవేక్షణలో.. 3 రోజులుగా బెకమ్‌ కంపెనీ నిపుణుల బృందం ఈ పనిలో నిమగ్నమైంది. బ్యారేజీ గేట్ల వెనుక సిమెంట్‌ కౌంటర్‌ వెయిట్లు దన్నుగా ఉన్నాయి. ఇటీవలి వరద ఉధృతికి ఎగువ నుంచి ఇనుప బోట్లు వచ్చి ఢీ కొట్టడంతో 64, 67, 69, 70వ నంబర్‌ గేట్ల వద్ద ఉండే వెయిట్లు దెబ్బతిన్నాయి. వాటిలో 64వ వెయిట్‌ స్వల్పంగా దెబ్బతినడంతో దానిని మార్చాల్సిన అవసరం లేదని నిర్ఱయించారు.

67, 69 కౌంటర్‌ వెయిట్లు మధ్యకు విరిగిపోయాయి. 70వ నంబరు వెయిట్‌ కు పగుళ్లు వచ్చాయి. దీంతో ఈ మూడింటి స్థానంలో స్టీల్‌ వెయిట్లు బిగించారు. వీటిని హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చారు. బిగించిన వెయిట్లలో ఇప్పుడు ఇనుము, సిమెంటు మిశ్రమం పోయాల్సి ఉంది. కొత్త కౌంటర్‌ వెయిట్లను సీఎం చంద్రబాబు ఆదివారం పరిశీలించారు. కన్నయ్యనాయుడు పనుల వివరాలను ఆయనకు వివరించారు. అదే సమయంలో 69వ నంబరు గేటు వద్ద ఇరుక్కుపోయిన మూడు బోట్లను సీఎం పరిశీలించారు. వాటిపై అధికారుల ను ప్రశ్నించారు. ఈ బోట్లపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు బదులిచ్చారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 09 2024, 12:07

ఆపరేషన్ బుడమేరు - "హైడ్రా" మార్క్ ప్లాన్ తో చంద్రబాబు.!!

ఆపరేషన్ బుడమేరుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. విజయవాడ నగరాన్ని ముంచెత్తిన బుడమేరు పై ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. హైదరాబాద్ లో అమలు చేస్తున్న హైడ్రా తరహా ప్రణాళికలపై ఆలోచన చేస్తోంది. హైడ్రా తరహా చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందు కోసం పటిష్ఠ చట్టాన్ని తెస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వచ్చే మంత్రివర్గ సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు.

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు. బుడమేరు వాగు పొంగడానికి ఆక్రమణలే కారణమని సీఎం తేల్చి చెప్పారు. ల్యాండ్‌ గ్రాబర్స్‌, పొలిటికల్‌ సపోర్టుతో ఆక్రమణలకు పాల్పడ్డ వారికి బుద్ధి చెప్పే పటిష్టమైన చట్టం ఉంటుందన్నారు. కొంత మంది ఆక్రమణదారుల వల్ల లక్షలాది మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి వరదలు విజయవాడ పట్టణానికి మళ్లీ రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

కొల్లేరులో ఆక్రమణలు వల్ల నీరు వెనక్కి తన్నే పరిస్థితి ఉందని, దీనిని పరిశీలించి ఆక్రమణలు కొట్టేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ అండతో కొందరు విచ్చలవిడిగా చేశారని మండిపడ్డారు. ప్రజా భద్రత కంటే ఈ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని తేల్చిచెప్పారు.

ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తున్నామన్నారు. విజయవాడలో మరోసారి ఇలాంటి వరదలు రాకుండా ఉండాలంటే ఆక్రమణలు తొలిగించాలని డిసైడ్ అయ్యారు. బుడమేరు ఆపరేషన్ చేపడతామని, భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 09 2024, 12:04

రోడ్లపై మార్కింగ్‌ కలకలం

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) కోసం వేసిన కొలతల మార్కింగ్‌ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల నుంచి రోడ్డు వెళ్తుందని ఇప్పటికే అధికారు లు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. కానీ, ఎక్కడ నుంచి వెళ్తుందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకం.

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) కోసం వేసిన కొలతల మార్కింగ్‌ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల నుంచి రోడ్డు వెళ్తుందని ఇప్పటికే అధికారు లు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. కానీ, ఎక్కడ నుంచి వెళ్తుందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకం. ఐదు రోజుల క్రితం మండలంలోని పుట్టపాక, సర్వేల్‌, మల్లారెడ్డిగూడెం తదితర గ్రామాల్లో ఎవరో మార్కింగ్‌ చేశా రు.

ఈ మార్కింగ్‌ గుర్తులు ట్రిపుల్‌ఆర్‌ రోడ్డు కోసం చేసినట్టు ఆయా ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సర్వేల్‌, పుట్టపాక గ్రామాల పరిధిలో కల్వర్టులు, రోడ్లపై ఈ మార్కింగ్‌లు ఉన్నాయి. ఎస్‌- 92, ఎస్‌-93, ఎస్‌-94, ఎస్‌-95 అంటూ తెలుపు, నలుపు రంగులతో కూడిన గుర్తులు ఉన్నాయి. దీంతో రీజనల్‌ రింగ్‌ రోడ్డులో తమ భూములు పోతాయా? అంటూ రైతులు తెలిసిన వారిని ఆరా తీస్తున్నారు. ఏ గ్రామం? ఎక్కడి నుంచి, ఏ సర్వే నెంబర్లు? ఎంత వెడల్పులో రోడ్డు కోసం భూమి పోతుంది? తదితర విషయాలపై రైతులు ఆరా తీస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆర్‌ఆర్‌ఆర్‌పై సమీక్షలు నిర్వహించాక మ్యాప్‌లు, సర్వే నివేదికలు, మార్కింగ్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ మార్కింగ్‌పై మండలంలోని సోషల్‌ మీడియాలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సంస్థాన్‌ నారాయణపురం మండలం మీదుగా గ్యాస్‌ పైప్‌ లైన్‌ కోసం ఇటీవల సర్వే చేస్తున్నారు. దీంతో ఈ గుర్తులు రీజినల్‌ రింగ్‌ రోడ్డువా? లేదా గ్యాస్‌ పైప్‌లైన్‌వా? అంటూ పలువురు ఆందోళన చెందుతుండగా, దీనిపై అధికారులు వాస్తవాలను వెల్లడించాలని రైతులు కోరుతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 08 2024, 20:20

వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా కదిలొస్తున్న దాతలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో బుడమేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో విజయవాడ మహానగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బందనంలో చిక్కుకున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

ఈ నేపథ్యంలో వరద సహాయక చర్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందు రావాలని దాతలకు సీఎం చంద్రబాబు విజ్జప్తి చేశారు. ఈ నేపథ్యంలో పలువురు దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి సీఎం సహాయక నిధికి ఇప్పటికే భారీగా విరాళాలు అందజేశారు.

విజయవాడలో ఆదివారం సీఎం చంద్రబాబును కలిసి పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ఏపీ పోలీస్ అధికారుల సంఘం రూ.11 కోట్ల 12 లక్షల 50 వేల చెక్కును సీఎం చంద్రబాబుకు ఆ సంఘం అదికారులు అందజేశారు. అలాగే దీపక్ నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఏవీ సుబ్రహ్మణ్యం రూ. కోటి అందించారు.

వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూ. 50 లక్షలు ఇచ్చింది. వై. రాజారావు రూ.10 లక్షలు, కె.సాంబశివరావు రూ.5 లక్షలు, సీహెచ్. పూర్ణ బ్రహ్మయ్య రూ.5 లక్షలు, డాక్టర్ శరత్ బాబు రూ.5 లక్షలు, సి.టీ.చౌదరి రూ.2.55 లక్షలు, శ్రీ కోవిల్ ఫ్లాట్స్ ఓనర్స్ రెసిడెంట్ అసోసియేషన్ రూ.2, 21,116, వెలగపూడి సత్యనారాయణ రూ.2 లక్షల 116 వేలు, ఎమ్. శ్రీనివాసరావు రూ.2 లక్షలు, పువ్వాడ రామకృష్ణ రూ.2 లక్షలు, సీహెచ్. శివరామకృష్ణ రూ.1 లక్షా 32 వేలు, బి. నవీన్ బాబు రూ.1 లక్షా 116 వేలు, జాస్తి శైలజారాణి రూ.1 లక్ష, జె.శాంభవి రూ.1 లక్ష, శశాంక్ చౌదరి రూ.1 లక్ష, ఎస్. సాంబశివరావు రూ.1 లక్ష, ధూళిపాళ్ల రామకృష్ణ రూ.1 లక్ష, డాక్టర్ యు.గంగాధర్‌రెడ్డి రూ.1 లక్ష, చెరుకూరి వెంకటరావు రూ.1 లక్ష, జె.సత్యనారాయణ మూర్తి రూ.1 లక్ష, ఏపీ ప్రదేశిక్ మార్వాడి సమ్మెళనం రూ.1 లక్ష, ఎన్.నాగేశ్వరరావు రూ.70 వేలు, రాణి శారదా రూ.50 వేలు, పమిడి భానుచందర్ రూ.50 వేలు, నూతక్కి వాణి రూ.50 వేలుగుత్తికొండ వెంకటేశ్వరరావు రూ.50 వేలు, కె.భవానీ రూ.35 వేలు, దేవినేని సుధారాణి రూ.30 వేలు, వి.రామకృష్ణ రూ.25 వేలు, ఎమ్.అరుణ కుమారి రూ.25 వేలు, యలమంచిలి నళిని కుమారి రూ.25 వేలు, మోహిత్ చక్రి తరుష్ రూ.20 వేలు, గద్దె ఝాన్సీరాణి రూ.10 వేలు తదితరులు సీఎం చంద్రబాబును వ్యక్తిగతంగా కలిసి చెక్కులు అందజేశారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల పరిశీలించారు. ఇంకోవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలపై కేంద్రం వెంటనే స్పందించింది. అందులోభాగంగా రూ. 3,300 కోట్ల ఆర్థిక సాయంగా అందించింది. ఈ మొత్తాన్ని తక్షణ సాయంగా అందించినట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే టాలీవుడ్‌లోని పలువురు నటీనటులు సైతం మేము సైతం అంటూ ముందుకు వచ్చి భారీగా విరాళాలను ప్రకటించిన విషయం విధితమే.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 08 2024, 20:14

ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

రీల్ లైఫ్ విలన్ రియల్ లైఫ్ హీరో సోను సూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇటీవల వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన వేళ వారి కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చారు. గతంలో కరోనా మహమ్మారి సమయంలో నేనున్నానంటూ వలస కార్మికులకు భరోసానిచ్చి ఎంతోమందిని ఆదుకున్న సోనూసూద్ తన సేవా కార్యక్రమాలతో భారత దేశ ప్రజలతో మన్ననలు పొందుతున్నారు.

గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్

ఇక తాజాగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు వచ్చిన కష్టాన్ని చూసి చలించిన సినీనటుడు, గొప్ప మానవతావాది సోనూసూద్ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. చాలామంది హీరోల కంటే భారీ మొత్తంలో విరాళాన్ని ప్రకటించి ఆయన తన పెద్ద మనసును మరొక మారు చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వరద బాధితులు ఎవరైనా ఎలాంటి సహాయం కావాలన్నా తన స్వచ్ఛంద సంస్థ ద్వారా పొందవచ్చునని ను సంప్రదించాలని సూచించారు.

ఇప్పటికే వరద బాధితులకు ఆహారం, తాగునీరు, మెడికల్ కిట్స్ అందిస్తున్నారు. నివాసం కోల్పోయిన వారికి తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ కు సంబంధించిన వ్యక్తులు ఈ మేరకు సేవలు చేస్తున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు సోను సూద్ భారీగా విరాళం ప్రకటించారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల విరాళం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరొక 2.5 కోట్ల రూపాయలు చొప్పున విరాళం ప్రకటించారు. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు ఐదు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించి, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా తమ బృందాలు పనిచేస్తాయని సోనుసూద్ పేర్కొన్నారు.

సోనూ సూద్ కు పవన్ కళ్యాణ్ థాంక్స్

ఇక సోను సూద్ ప్రకటన పట్ల ఏపీ ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు కష్ట కాలంలో ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ తోడ్పాటు బలాన్ని ఇస్తుందని ఆయన సోను సూద్ విషయంలో కొనియాడారు. సోను సూద్ ఇచ్చిన ఈ భారీ విరాళం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 08 2024, 20:09

వాళ్లందరికీ హైడ్రా గుడ్ న్యూస్.. ఆక్రమణలు తొలగించబోమని ప్రకటన..

ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య ప్రజలు ఇప్పటికే నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని హైడ్రా ప్రకటన చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను మాత్రమే తాము కూలుస్తున్నామని..

హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు ఆగడం లేదు. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసిన నిర్మించిన కట్టడాలను కూలుస్తూ.. ఆక్రమణదారులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎటువంటి అనుమతలు తీసుకోకుండా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన బడా బాబులను హైడ్రా వదలడం లేదు. ఇదే సమయంలో సామాన్యుల ఇళ్లను హైడ్రా కూలుస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం పేద, మధ్య తరగతి ప్రజల నిర్మాణాలను తాము కూల్చడం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొన్నిచోట్ల పేద, మధ్య తరగతి ప్రజలు నివాసం ఉంటున్న గృహాలను కూలుస్తున్నారంటూ వార్తలు వస్తుండటంతో హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య ప్రజలు ఇప్పటికే నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని ప్రకటన చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను మాత్రమే తాము కూలుస్తున్నామని స్పష్టం చేశారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణంలో ఉన్న కట్టడాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

ఎఫ్‌టిల్, బఫర్ జోన్‌లోని ఆక్రమిత స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్న సామాన్య వ్యక్తుల ఇళ్లను కూల్చివేయడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టంచేశారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను హైడ్రా కూల్చివేస్తుందని తెలిపారు. మాదాపూర్ సున్నం చెరువు, దుండిగల్‌లోని మల్లంపేట్ చెరువులో ఆదివారం కూల్చివేసిన కట్టడాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో ఎటువంటి అనుమతలు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. అమీన్‌పూర్‌లో కూల్చివేసిన నిర్మాణాలకు సంబంధించి కాంపౌండ్ గోడలు, కొన్ని గదులు, షెడ్‌లు ఆక్రమణకు గురయ్యాయన్నారు. ఈ నిర్మాణాలు వైసీపీ నేత, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి చెందినవిగా తెలిపారు. సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు, హోటల్స్‌ను వాణిజ్యపరంగా వినియోగిస్తుండటంతో కూల్చివేశామని చెప్పారు.

ఆక్రమిత స్థలాల్లో ఉంటున్న సామాన్య వ్యక్తులకు సంబంధించి ఇళ్లు, నివాసాలు కూల్చివేయడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. మల్లంపేట చెరువు, దుండిగల్‌లో కూల్చిన 7 విల్లాలు ఇప్పటికీ నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భవనాలను ఎఫ్‌టిఎల్ పరిధిలో నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ భవన నిర్మాణాలతో స్థానికంగా లేడీ డాన్‌గా పిలిచే బిల్డర్ విజయలక్ష్మి, స్థానిక రాజకీయ నేతలకు సంబంధం ఉందన్నారు. బిల్డర్ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై స్థానిక పోలీస్ స్టేషన్లలో అనేకమంది ఫిర్యాదులు చేయడంతో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న సున్నం చెరువులో కొందరు నిర్మాణాలు చేసి అద్దెకు ఇస్తున్నారని, అలాంటివారిపై కేసులు పెడుతున్నామన్నారు. నిర్మాణాలు పూర్తై ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయడం లేదని చెప్పారు. సామాన్య ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమించి ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన ఇల్లు, ఫ్లాట్, భూమిని కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరుతున్నామని రంగనాథ్ తెలిపారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ పరిధిలో ఆస్తులు కొనే విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే హెచ్ఎండిఎ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. మరిన్ని సందేహాలు ఉంటే తమను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని హైడ్రా కమిషనర్ తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 08 2024, 20:00

బుడమేరుకు మళ్లీ పెరిగిన వరద.. టెన్షన్.. టెన్షన్

బెజవాడ వాసులను బుడమేరు (Budameru) ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు..విజయవాడ (Vijayawada) పట్ల బుడమేరు.పగ.. మేరులా మారి పట్టి పీడిస్తోంది. ఒకటా రెండా సుమారు పది రోజులుగా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది హమ్మయ్యా.. వానలు, వరద తగ్గాయ్ అనుకునే లోపే మళ్లీ బుడమేరు భయపెడుతోంది.

బెజవాడ వాసులను బుడమేరు (Budameru) ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు. విజయవాడ (Vijayawada) పట్ల బుడమేరు.. పగ.. మేరులా మారి పట్టి పీడిస్తోంది.ఒకటా రెండా సుమారు పది రోజులుగా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది.హమ్మయ్యా.. వానలు, వరద తగ్గాయ్ అనుకునే లోపే మళ్లీ బుడమేరు భయపెడుతోంది.దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనాలు బతుకుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆర్మీ సాయంతో బుడమేరు మూడు గండ్లు పూడ్చేసరికి కాస్త ఊపిరి పీల్చుకున్న నగరవాసులకు గంటల వ్యవధిలోనే మరో షాకింగ్ న్యూస్ వచ్చేసింది. విజయవాడ నగరంలో మళ్లీ వర్షం కురుస్తోంది. దీంతో క్రమక్రమంగా బుడమేరుకు వరద పెరిగిపోతోంది. దీనికి తోడు భారీ వర్షాలకు పులివాగు ప్రవాహం కూడా పెరిగిపోయింది. పులివాగు థాటికి బుడమేరు మరింత పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికే పూడ్చిన మూడు గండ్లను యుద్ధ ప్రతిపాదికన అధికారులు మరింత ఎత్తు పెంచుతున్నారు. అర్ధరాత్రి నుంచి దగ్గరుండి.. నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు పనులు పర్యవేక్షిస్తున్నారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు చేరవేస్తున్నారు. ఈ ప్రక్రియను కలెక్టర్ సృజన దగ్గరుండి చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. పులివాగు వరద థాటికి ముగ్గురు ఇరిగేషన్ అధికారులు చిక్కుకుపోయారు. ఎప్పుడేం జరుగుతుందో అని బెజవాడ వాసులు మరింత భయపడిపోతున్నారు.

అసలే వరద భయంతో బిక్కు బిక్కు మంటున్న విజయవాడ ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడింది. ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దీంతో ఇవాళ, రేపు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏలూరు, అల్లూరి, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అయితే.. ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాలోని కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

కాగా.. ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం మళ్లీ పెరిగింది. బ్యారేజి వద్ద 3, 82, 662 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. పులిచింతల, సాగర్ నుంచి పెరిగిన వరద నీరు విడుదల చేయడం జరిగింది. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో వరద ప్రవాహం మరింత పెరుగుతున్నది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పడుతున్న వర్షాలతో వరద ప్రవాహం మరింత పెరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. బ్యారేజి దిగువన నదీతీర గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఇదిలా ఉంటే.. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ పలుచోట్ల విస్తారంగా కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఒరిస్సాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలోని నాగావళి నదీ పరివాహక ప్రాంతవాసులను జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో అల్లకల్లోలంగా సముద్ర తీరం ఉంది. మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 08 2024, 19:55

విచారణను సెప్టెంబర్‌ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

బెంగాల్‌లోని ఆభయ హత్యాచార కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్‌ 9న సుప్రీంకోర్టు జాబితా చేసింది. ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి. పార్ధివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.

ఈ కేసును కోర్టు సుమోటోగా స్వీకరించి ఆగస్ట్‌ 22న ప్రాథమిక విచారణ చేపట్టింది. కోల్‌కతా ఆర్‌జి కార్‌ ఆస్పత్రిలో భద్రత కల్పిస్తున్న సెంట్రల్‌ ఇండిస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సిఐఎస్‌ఎఫ్‌)కి సహకరించలేదని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా విచారణ చేపట్టనుంది.

రిక్లెయిమ్‌ ది నైట్‌’ పేరిట కోల్‌కతా వైద్యులు సోమవారం (సెప్టెంబర్‌ 8న) మరోసారి నిరసన చేపట్టనున్నారు. గణేష్‌ చతుర్థి సందర్భంగా ..

గణేష్‌ మండపాల ద్వారా బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు గణేష్‌ పూజా కమిటీలు తెలిపాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 07 2024, 16:56

నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం... 24 గేట్లు ఎత్తిన అధికారులు

కృష్ణా నది ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో అధికారులు సాగర్ ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 2.63 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 

సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా... ప్రస్తుతం ప్రాజెక్టులో 311.4 టీఎంసీల నీరు ఉంది.

మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పటికీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నది పోటెత్తుతోంది.