/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz హైద‌రాబాద్ సీపీగా రెండోసారి సీవీ ఆనంద్ నియామ‌కం Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 07 2024, 16:32

హైద‌రాబాద్ సీపీగా రెండోసారి సీవీ ఆనంద్ నియామ‌కం

హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్‌గా సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ సీవీ ఆనంద్‌ను నియ‌మిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా ఆనంద్ నియామ‌కం కావ‌డం ఇదే తొలిసారి కాదు.

హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్‌గా సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ సీవీ ఆనంద్‌ను నియ‌మిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా ఆనంద్ నియామ‌కం కావ‌డం ఇదే తొలిసారి కాదు. స‌రిగ్గా ఏడాది క్రితం వ‌ర‌కు ఆనంద్.. హైద‌రాబాద్ సీపీగా సేవ‌లందించారు.

1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2021 డిసెంబ‌ర్ నుంచి 2023 అక్టోబ‌ర్ వ‌ర‌కు హైద‌రాబాద్ సీపీగా ప‌ని చేశారు. తెలంగాణ కేడ‌ర్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2017లో అదన‌పు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీసుగా ప‌దోన్న‌తి పొందారు. కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిన ఆయ‌న 2021లో తిరిగి తెలంగాణ‌కు చేరుకున్నారు.

2023 ఆగ‌స్టులో డీజీపీ హోదా క‌ల్పిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2023 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న‌ను సీపీ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత ఆనంద్‌కు ఏసీబీ డీజీగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇప్పుడు మ‌ళ్లీ హైద‌రాబాద్ సీపీగా నియామ‌కం అయ్యారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 07 2024, 16:18

హైడ్రా.. ఆపరేషన్‌ నాలా..!

వర్షాలు.. ముంపు ముప్పు నేపథ్యంలో హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) వరద నీటి నిర్వహణ మెరుగుదలపై దృష్టి సారించింది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగిస్తూనే, ఆపరేషన్‌ నాలా కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.

వర్షాలు.. ముంపు ముప్పు నేపథ్యంలో హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) వరద నీటి నిర్వహణ మెరుగుదలపై దృష్టి సారించింది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగిస్తూనే, ఆపరేషన్‌ నాలా కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. నాలాల్లో వరద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న నిర్మాణాల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తోంది. నాలాలకు అడ్డుగా ఉన్న, కబ్జా చేస్తు చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని పౌరులను కోరుతోంది. రాంనగర్‌(Ramnagar)లోని మణెమ్మ బస్తీలో స్థానికుల ఫిర్యాదు మేరకు పలు ప్రభుత్వ విభాగాలు ఇటీవల ఆక్రమణలు తొలగించాయి. అదే తరహాలో ఇతర ప్రాంతాల్లోనూ చర్యలు చేపట్టాలని హైడ్రా భావిస్తోంది. జీహెచ్‌ఎంసీ(GHMC)తోపాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు ఉన్న ఏరియాల్లో నాలాల విస్తరణకు ప్రస్తుతం ప్రాధాన్యతమిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 370 కి.మీల మేర మేజర్‌ నాలాలు, 1250 కి.మీల వరద నీటి కాలువలు (స్ర్టామ్‌ వాటర్‌ డ్రైన్‌) ఉన్నాయి. వీటి ప్రవాహ వ్యవస్థ సామర్థ్యం గంటకు 2 సెం.మీలు మాత్రమే . కొన్నాళ్లుగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతోన్న నేపథ్యంలో రహదారులు జలమయమవుతున్నాయి. నాలాల పక్కనున్న కాలనీలు, బస్తీలు నీట మునుగుతున్నాయి. పట్టణీకరణ నేపథ్యంలో నగరంలో పరిస్థితులు మరింత తీసికట్టుగా మారుతున్నాయి. ఈ ఇబ్బందులకు చెక్‌పెట్టేలా హై-సిటీ కార్యక్రమంలో భాగంగా నాలాల విస్తరణ, అ భివృద్ధి పనులు చేపడుతున్నారు. దీనికి సమాంతరంగా ఆక్రమణల తొలగింపూ చేపట్టాలన్నది సర్కారు యోచనగా తెలుస్తోంది.

ఈ క్రమంలో దీర్ఘకాలంగా ఉంటోన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా నివాసేతర నిర్మాణాలను మాత్రమే తొలగించాలని నిర్ణయించారు. గతంలో జీహెచ్‌ఎంసీ నిర్వహించిన సర్వేలో నగరంలోని నాలాలపై 12 వేలకుపైగా ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో దాదాపు 35 శాతం వరకు నివాసేతర నిర్మాణాలే. నాలాలకు అడ్డంగా రెండు, మూడంతస్తుల భవనాలు నిర్మించారు. కొన్నిచోట్ల 30 అడుగుల వెడల్పు ఉన్న నాలాలు.. పది అడుగుల లోపునకు కుచించుకుపోయాయి. ఇంకొన్ని చోట్ల నాలాలు రెండు, మూడు అడుగుల కంటే వెడల్పు లేకపోవడం గమనార్హం. దీంతో పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. నాలాల సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లు అవసరమని గతంలో ప్రణాళికలు రూపొందించారు.

నిధుల కొరత, ఆక్రమణల తొలగింపు, పునరావాసం తదితర ఇబ్బందుల నేపథ్యంలో కార్యరూపం దాల్చలేదు. ‘నివాసేతర ఆక్రమణల తొలగింపు ద్వారా వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం’ అని హైడ్రా వర్గాలు చెబుతున్నాయి. చెరువుల్లో ఆక్రమణల ఫిర్యాదులనూ హైడ్రా పరిశీలిస్తోంది. చెరువులను రంగనాథ్‌ పరిశీలిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో పలు చెరువుల్లో నీటి నిల్వల ఆధారంగా ఎఫ్‌టీఎల్‌ను సూత్రప్రాయంగా అంచనా వేస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 07 2024, 16:15

తెలంగాణ బీజేపీలో ముసలం..!

తెలంగాణలో బీజేపీకి బలం పెరిగిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఆ పార్టీ దూసుకెళ్తోన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్లు సాధించడం.. ఆ తర్వాత నిజామాబాద్, కరీంగనర్, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపింది. హుజూరాబాద్, దుబ్బాక ఉపఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించి సత్తా చాటింది. మునుగోడులో కూడా గట్టి పోటీ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నకల్లో కూడా

ప్రభావం చూపింది.

బీజేపీ నుంచి ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ను వెనక్కు నెట్టి 8 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో కాషాయ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు కూడా దక్కాయి. దీంతో భవిష్యత్ లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు ఆశతో ఉన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో విభేదాలు తలెత్తుతున్నాయి. బీజేఎల్బీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇతర నేతల మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ బీజేపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించింది. రెండు బృందాలుగా ఏర్పాటు చేసి పర్యటనలు చేయాలని భావించింది. ఒక బృందానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, మరో బృందానికి మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నాయకత్వం వహిస్తారని ప్రకటించారు. బీజేఎల్పీ నేతగా ఉన్న తనకు ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పకపోవడంపై ఏలేటి అలకబూనినట్లు తెలుస్తోంది. బృందంలో ఏలేటి ఉన్నా.. అయన బాధితుల పరామర్శకు వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది.

ఈటల బృందంలో తనను సభ్యుడిగా చేర్చడంపై మహేశ్వర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ఫ్లోర్ లీడర్‌గా అసెంబ్లీలో గళమెత్తే బాధ్యత ఏలేటిపై ఉండగా ఆయనకు నేతృత్వం ఇవ్వకపోవడం ఏంటని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. దీంతో కిందస్థాయి నేతలు పార్టీలోని పరిస్థితులపై ఆందోళన చెందుతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 07 2024, 16:11

కోట్లు వసూలు చేసి.. బోర్డు తిప్పేసిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ

భూమి కొంటే.. ఇచ్చిన డబ్బులకు నెలనెలా వడ్డీ చెల్లిస్తామన్నారు... ఇచ్చిన కాలవ్యవధిలో వడ్డీతోసహా అసలు చెల్లించి.. రిజిస్ట్రేషన్‌ చేసిన భూమిని తిరిగి తీసుకుంటామని నమ్మించారు. అలా కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ చివరికి బోర్డు తిప్పేసింది.

కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్‌ 6 : భూమి కొంటే.. ఇచ్చిన డబ్బులకు నెలనెలా వడ్డీ చెల్లిస్తామన్నారు… ఇచ్చిన కాలవ్యవధిలో వడ్డీతోసహా అసలు చెల్లించి.. రిజిస్ట్రేషన్‌ చేసిన భూమిని తిరిగి తీసుకుంటామని నమ్మించారు. అలా కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ చివరికి బోర్డు తిప్పేసింది. మోసం పోయామని గుర్తించిన బాధితులు కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు క్యూ కట్టారు.

పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ, సర్దార్‌ పటేల్‌ నగర్‌లో కె.సురేశ్‌కుమార్‌, వెంకటేశ్‌ రెండేండ్ల కిందట వీ వన్‌ ఇన్‌ ఫ్రా గ్రూపు పేరుతో రియల్‌ ఎస్టేట్‌ సంస్థను ఏర్పాటు చేశారు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం, నర్సాపూర్‌ గ్రామంలో సంస్థకు చెందిన 30 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టారు. ఈ స్థలంలో గుంటకు ఐదు లక్షలుగా రేటు ఫిక్స్‌చేసి.. మార్కెట్‌ చేయడం మొదలు పెట్టారు.

ఐదు లక్షలు చెల్లించిన వారికి గుంట భూమిని రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఆ తర్వాత నెల నుంచి చెల్లించిన ఐదు లక్షలకు గాను.. ప్రతి నెలా రూ.20వేల చొప్పున వడ్డీ చెల్లిస్తారు. 25 నెలల కాలవ్యవధి తర్వాత వడ్డీతోపాటు అసలు చెల్లించి.. కొనుగోలు చేసిన భూమిని తిరిగి తీసుకుంటామనేది సంస్థ వాగ్ధానం. దీన్ని నమ్మిన చాలామంది వడ్డీతో పాటు.. అసలు కూడా వస్తుందని ఆశతో భూములను కొన్నారు. మొదట్లో భూమిని కొన్నవారికి నమ్మకంగా వడ్డీ చెల్లించారు. దీంతో ఒకరికి తెలియకుండా మరొకరు భూమిని కొనుగోలు చేశారు.

అయితే అందులో కొందరికీ నెలనెలా వడ్డీ రాకపోవడంతో సంస్థ కార్యాలయానికి వచ్చి ఆరా తీయగా.. సరైన సమాధానం రాలేదు. అలాగే.. ఎండీ సురేశ్‌కుమార్‌ కూడా కనిపించలేదు. దీంతో మోసపోయామని గుర్తించిన దాదాపు 80 మంది బాధితులు.. శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీ పీఎస్‌ను ఆశ్రయించారు. అయితే ఏడుగురు మాత్రమే ఫిర్యాదు చేశారని, ఈ కేసును ఇవోడబ్ల్యూ పోలీసు విభాగం దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్‌రావు తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 07 2024, 12:32

సిఎం రేవంత్‌తో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ భేటీ కానున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియామకం అయ్యాక.. తొలిసారి మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.

తన నియామకానికి సహకరించిన రేవంత్‌ రెడ్డికి మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కృతజ్ఞతలు చెప్పనున్నారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పటి నుంచి పీసీసీ చీఫ్‌గా ఎవరుంటారనే ప్రశ్న అందరినీ వెంటాడింది.

మహేష్‌ కుమార్‌ గౌడ్‌ నియామకంతో క్వశ్చన్‌మార్క్‌కు పుల్‌ స్టాప్‌ పడింది. ప్రస్తుతం ఎమ్మెల్సీతో పాటు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్‌ కుమార్‌ గౌడ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లందరితో సత్సంబంధాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అధిష్టానం ఆయనకే పట్టం కట్టింది. బీసీ నేతకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై బీసీ నాయకులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 07 2024, 12:29

ఖైరతాబాద్ గణేష్‌ ప్రత్యేకత.. ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులు..

ఖైరతాబాద్ మహా గణపయ్యకు పూజలు ప్రారంభమయ్యాయి. అయితే..ఒగ్గుడోలు, బోనాలెత్తుకున్న మహిళలతో పద్మశాలీయులంతా ఊరేగింపుగావచ్చి ఖైరతాబాద్ గణేశునికి చేనేత నూలు కండువా, గాయత్రి సమర్పించారు. 70 వసంతాల సందర్భంగా.. ఈ ఏడాది బడా గణేష్ 70 అడుగుల ఎత్తులో కొలువుదీరారు. పది రోజుల పాటు మహా గణపతి భక్తుల పూజలు అందుకోనున్నారు.

ఈ నెల 17న ఘనంగా నిమజ్జనోత్సవం నిర్వహించనున్నారు. పూర్తిగా మట్టితో చేసిన ఎకో ఫ్రెండ్లీ బడా గణేష్. గణేశుడి విగ్రహం తయారీ పనులు ఆలస్యంగా ప్రారంభమైనా తక్కువ సమయంలోనే విగ్రహాన్ని ఉత్సవ కమిటీ పూర్తి చేసింది. ఈసారి ఖైరతాబాద్ విగ్రహ తయారీలో 190 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈసారి భక్తులకు శ్రీసప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నారు

విగ్రహంలో మొత్తం ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులు ప్రతిష్టించబడ్డాయి. ఇక ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ఉన్నాయి. అంతే కాకుండా.. బడా గణేష్ విగ్రహ పాదాల చెంత అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.

గణపతిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఖైరతాబాద్ కు రానున్నారు. వీరి కోసం ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వర్షంలో భక్తులు తడవకుండా నిర్వాహకులు ప్రత్యేక షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. గతేడాది దాదాపు 22 లక్షల మంది భక్తులు బడా గణేష్‌ను దర్శించుకున్నారు. ఈ ఏడాది 30 లక్షల మంది భక్తులు వస్తారని ఉత్సవ్ కమిటీ అంచనా వేస్తోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 07 2024, 11:35

బుడమేరు గండ్ల పూడ్చివేత వేళ బిగ్ అలర్ట్..!!

విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లు ఇంకా టెన్షన్ పెంచుతున్నాయి. బుడమేరు వరద కొనసాగుతోంది. నందివాడ మండలంలోని 12 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జాతీయ రహదారిపై రెండు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. బుడమేరుకు మూడు గండ్లు పడటంతో ప్రభుత్వం సైన్యం సహకారంతో పూడ్చివేత పనులు కొనసాగిస్తోంది. అక్కడే మకాం వేసిన మంత్రి రామానాయుడు ఈ సాయంత్రానికి పూడ్చివేత పనులు పూర్తవుతాయని వెల్లడించారు.

బుడమేరు ప్రవాహం పైన ప్రభుత్వం అప్రమత్తమైంది. శాంతించినట్లు కనిపిస్తున్నా...పూర్తిగా ముప్పు తొలిగిపోలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇంకా 12 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలకు పడవల ద్వారానే ఆహారం... ఇతర సహాయ కార్యక్రమాలను అధికారులు అందిస్తున్నారు. వినాయక చవితి పండుగకు బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు దూరమయ్యాయి. విజయవాడ నగరంలో శుక్రవారం రెండు అడుగుల మేర వరద నీరు పెరగటంతో స్థానికులు మరోసారి ఆందోళన చెందారు.

విజయవాడను ముంచేసిన బుడమేరు గండ్ల పూడ్చివేత పై ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మూడు గండ్లు పడటంతో వాటిని పూడ్చేందుకు నాలుగు రోజులుగా ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోంది.

మంత్రి రామానాయుడు అక్కడే మకాం వేసారు. బుడమేరు మూడో గండి పుడ్చివేత 90 శాతం పూర్తి అయ్యిందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇంకో రెండు మూడు గంటల్లో గండ్లు పూడ్చివేత పనులు పూర్తి అవుతాయన్నారు. మిగిలిన 10శాతం ఇంకో రెండు గంటల్లో పూర్తి చేసి దిగువ ప్రాంతాలకు వెళ్లే వరద నీటిని అరికడతామని మంత్రి తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 07 2024, 11:15

బంగారం ధరలకు రెక్కలు

బంగారం కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్.. వినాయకచవితినాడు బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది. అయితే గత కొంత కాలంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి.

బంగారం కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్.. గత కొంత కాలంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తుండగా.. వినాయకచవితినాడు బంగారం ధరలు పెరిగాయి. ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా వేస్తున్నందున.. ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. గోల్డ్ కొనేవారికి ఇప్పుడే మంచి అవకాశం. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

కోల్‌కతాలో10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,320 వద్ద ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగార ధర రూ. 66,360కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,320 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,320 వద్ద కొనసాగుతోంది.

ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,210గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 73,320వద్ద ట్రేడవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,320గా ఉంది. విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,210, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,320గా ఉంది. విశాఖపట్నం సహా ఏపీలోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు...

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 87,100గా ఉండగా.. కోల్‌కతాలో రూ. 85 వేలు, బెంగళూరులో రూ. 82,900 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 92,100 గా ఉంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 07 2024, 11:06

రుణమాఫీ కాలేదంటూ పురుగుల మందు డబ్బాలతో రైతుల ఆందోళన

కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ( Loan waiver) చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ( Loan waiver) చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని దేవుడి మీద ఒట్టేసి మరీ చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కొర్రీలు విధించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో చేసిన మోసాన్ని ఎండగడుతూ ఊరూరా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేస్తూ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తాజాగా రుణమాఫీ కాలేదని ఆరోపిస్తూ వరంగల్ కెనరా బ్యాంకు ఎదుట రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు.బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

రుణమాఫీ కాలేదంటూ పురుగుల మందు డబ్బాలతో వరంగల్ కెనరా బ్యాంకు ఎదుట రైతుల ఆందోళన

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 07 2024, 11:02

విరాళాలు ప్రకటించడంలో ఎందుకీ తేడా.. ఏపీకి ఒక లెక్క.. తెలంగాణకు మరో లెక్కనా..!

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. దీంతో వారికి సహాయం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వస్తున్నారు. శుక్రవారం తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.6.50 కోట్ల విరాళం వచ్చింది. జీఎంఆర్ గ్రూప్ రూ.2 కోట్ల 50 లక్షలు విరాళం ప్రకటించింది. ఇక అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీత రెడ్డి రూ.కోటి విరాళంగా ఇచ్చారు. కెమిలాయిడ్స్ కంపెనీ చైర్మన్ రంగరాజు. రూ.కోటి విరాళం ప్రకటించారు.

విక్రో ఫార్మా రూ.1 కోటి విరాళం ఇచ్చారు. శ్రీచైతన్య విద్యాసంస్థల ప్రతినిధులు కూడా కోటి రూపాయలు విరాళంగా ప్రకటించాయి. అయితే ఇదే శ్రీచైతన్య విద్య సంస్థలు ఏపీకి రూ.2 కోట్లు ఇచ్చాయి. తెలంగాణ కంటే ఏపీకి రూ.కోటి ఎక్కువగా విరాళంగా ఇచ్చింది. హైదరాబాద్ పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కాలేజీలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయల్లో సంపాదిస్తున్న శ్రీచైతన్య విద్య సంస్థలు తెలంగాణకు మాత్రం తక్కువగా విరాళం ఇవ్వడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలో ఒక్కొక్క ఇంటర్ విద్యార్థి వద్ద రెండు సంవత్సరాల్లో రూ.3 లక్షలు నుంచి రూ.5 లక్షల వసూలు చేస్తున్న శ్రీచైతన్య విద్య సంస్థలు తెలంగాణకు మాత్రం ఏపీకి కంటే తక్కువ విరాళం ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. విజయంతి మూవీస్ అధినేత మొదటగా.. ఏపీకి మాత్రమే రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. అయితే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తెలంగాణకు కూడా రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. అయితే విరాళం ప్రకటించడంలో కూడా తెలంగాణను చిన్న చూపు చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

తెలంగాణలో ఉంటూ.. డబ్బులు సంపాదించుకునే వారు ఉన్న ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా శ్రీచైతన్య విద్య సంస్థలు పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నారు.