రుణమాఫీ కాలేదంటూ పురుగుల మందు డబ్బాలతో రైతుల ఆందోళన
కాంగ్రెస్(Congress) ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ( Loan waiver) చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
కాంగ్రెస్(Congress) ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ( Loan waiver) చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని దేవుడి మీద ఒట్టేసి మరీ చెప్పిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు కొర్రీలు విధించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో చేసిన మోసాన్ని ఎండగడుతూ ఊరూరా సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తాజాగా రుణమాఫీ కాలేదని ఆరోపిస్తూ వరంగల్ కెనరా బ్యాంకు ఎదుట రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు.బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రుణమాఫీ కాలేదంటూ పురుగుల మందు డబ్బాలతో వరంగల్ కెనరా బ్యాంకు ఎదుట రైతుల ఆందోళన
Sep 07 2024, 11:15