సమాచార హక్కు చట్టం - 2005 సదస్సును విజయవంతం చేయాలి: కొడారి వెంకటేష్ సమన్వయ కమిటీ సభ్యులు
సమాచార హక్కు చట్టంపై భువనగిరి లోని రిటైర్ ఎంప్లాయిస్ భవన్ లో శనివారం ఉదయం 11గంటలకు జరిగే అవగాహన సదస్సును విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార హక్కు చట్టం సమన్వయ కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్ కోరారు. శుక్రవారం ఆయన భువనగిరి లో మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమాచార హక్కుచట్టం ప్రాధాన్యత గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాలనలో పారదర్శకత , జవాబుదారీ తనం ఆర్టీఐ తోనే సాధ్యమన్నారు. అవినీతి రహిత సమాజం కోసం సమాచార హక్కు చట్టం ను ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ అవగాహన సదస్సులో సభాద్యక్షులుగా సమాచార హక్కు వికాసం సమితి రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ ఖుర్షీద్ పాషా, ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డా. వర్రె వెంకటేశ్వర్లు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎం. ఏ.కరీం (హైకోర్టు అడ్వకేట్) , విశిష్ట అతిథులుగా ఆజాద్ హింద్ ఫౌజ్ జాతీయ అధ్యక్షులు ఎం. ఎ. ముజీబ్, ఆత్మీయ అతిథులుగా భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బబ్బూరి హరనాథ్ గౌడ్, సమాచార వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా.యర్రమాద కృష్ణారెడ్డి, మాజీ ప్రజాప్రతి నిధుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకవరం మోహనరావు, దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు భట్టు రామచంద్రయ్య, పీపుల్స్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సురుపంగ శివలింగం, హమీద్ పాషా, పోతుగంటి సంపత్ కుమార్ , చింతకింది వెంకటేశ్వర్లు, బాబు తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఆర్టీఐ ఆక్టివిటీ లు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.






భారతీయ జనతా పార్టీ యువ మోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులుగా వలిగొండ మండలం కు చెందిన దంతూరి అరుణ్ కుమార్ ను నియమిస్తూ గురువారం భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రాంతంలో జరుగుతున్న యువత ,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టడం ద్వారా పార్టీని సంస్థాగతంగా పటిష్ట పరిచి విస్తరించడానికి కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ నియామకానికి సహకరించిన వలిగొండ మండల జిల్లా రాష్ట్ర నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
.

గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ రోజు గూడూరు టోల్ గేట్ వద్ద చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి మాజి ఎంపీ & భువనగిరి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు.ఈ కార్యక్రమం లో వారితో పాటు భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గారు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేష్ గారు, బి జె పి రాష్ట్ర కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి గారు, గూడూరు నారోత్తం రెడ్డి గారు, బి జె పి బీబీనగర్ మండల అధ్యక్షులు ఇంజమూరి ప్రభాకర్ గారు మాజి అధ్యక్షులు జంగా రెడ్డి గారు మరియు జిల్లా బి జె పి నాయకులు, మండల నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Apr 13 2024, 15:10
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.4k