ప్రజల కొరకు నిలబడుతూ హక్కుల కోసం పోరాడే జహంగీర్ ను గెలిపించండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ
![]()
నిరంతరం ప్రజల తరఫున నిలబడుతూ హక్కుల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థి యండి.జహింగీర్ గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. శుక్రవారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ సమావేశం నిర్వహించిన అనంతరం జహంగీర్ ని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ మహోత్సవ తెలంగాణ రైతాంగ పోరాట వారసత్వాన్ని ఉనికి పుచ్చుకున్న సిపిఐ(ఎం) దేశ రాజకీయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నదని అన్నారు. పేదలు కష్టజీవుల తరపున నీతితో నిజాయితీతో పోరాడుతూ ప్రభుత్వ రంగాన్ని పాడు కాపాడుకోవడానికి సిపిఎం నిరంతరం ఉద్యమిస్తుందని నర్సింహ తెలియజేశారు. బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ లాంటి పార్టీలన్నీ ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా బడా కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతున్నాయని విమర్శించారు. మరోవైపు అంబానీ అదానీలకు ప్రభుత్వ సంస్థలను కట్టబెడుతూనే మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ బిజెపి ప్రజల మధ్యన చిచ్చు పెడుతుందని ఓట్లు రాబట్టుకునే పన్నాగం బీజేపీ పన్నుతుందని విమర్శించారు. డీజిల్ పెట్రోల్ విచ్చలవిడిగా పెంచుతూ మోయరాని భారాలతో పేదల నడుముడుతూ మతాన్ని దేవుడిని అడ్డం పెట్టుకొని ఓట్లు గుంజుకుంటుందని అన్నారు. ప్రజా వ్యతిరేక బిజెపి కాంగ్రెస్ టిఆర్ఎస్ లను ఓడించి ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి ఎండి జాహంగీర్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈనెల 19న భువనగిరి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్లమెంటు అభ్యర్థి ఎండి. జహంగీర్ నామినేషన్ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అభిమానులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ పిలుపునిచ్చారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండా అశోక్, శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ, సభ్యులు కాసారం మల్లయ్య, కొండా హైమావతి, కూకుట్ల చొక్కాకుమారి పాల్గొన్నారు.




భారతీయ జనతా పార్టీ యువ మోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులుగా వలిగొండ మండలం కు చెందిన దంతూరి అరుణ్ కుమార్ ను నియమిస్తూ గురువారం భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రాంతంలో జరుగుతున్న యువత ,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టడం ద్వారా పార్టీని సంస్థాగతంగా పటిష్ట పరిచి విస్తరించడానికి కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ నియామకానికి సహకరించిన వలిగొండ మండల జిల్లా రాష్ట్ర నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
.

గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ రోజు గూడూరు టోల్ గేట్ వద్ద చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి మాజి ఎంపీ & భువనగిరి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు.ఈ కార్యక్రమం లో వారితో పాటు భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గారు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేష్ గారు, బి జె పి రాష్ట్ర కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి గారు, గూడూరు నారోత్తం రెడ్డి గారు, బి జె పి బీబీనగర్ మండల అధ్యక్షులు ఇంజమూరి ప్రభాకర్ గారు మాజి అధ్యక్షులు జంగా రెడ్డి గారు మరియు జిల్లా బి జె పి నాయకులు, మండల నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Apr 12 2024, 18:30
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.8k