వలిగొండ మండల కేంద్రంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
![]()
వలిగొండ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతినీ ఘనంగా నిర్వహించారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి కృష్ణాఫర్, సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎల్లంకి మహేష్,బి.ఎస్.పి మండల పార్టీ అధ్యక్షులు సుక్క శ్రీకాంత్, జయంతిని పురస్కరించుకొని ఈ సందర్భంగా సంయుక్తంగా మాట్లాడుతూ* జ్యోతీ రావు పూలే సత్యశోధక సమాజం ఏర్పాటు చేయడంతో మహారాష్ట్రలో బ్రాహ్మణేతర ఉద్యమం ఒక నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకున్నది.
పూలే మాలి కులానికి కూరగాయలు పండించి వ్యాపారం చేసే కులం చెందిన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. క్రైస్తవ మిషనరీ పాఠశాలలో చదువుకున్నాడు. స్వేచ్ఛా సమానత్వం వంటి పాశ్చ్యాత్య ఆదర్శాలతో ప్రత్యేకించి అమెరికాకు చెందిన టామ్ పెన్ రచనల చేత ఉత్తేజితుడై పూలే సాంఘిక సంస్కరణలు చేపట్టాడు.
పీష్వా పీడకల పాలనను అంతం చేసిన బ్రిటిష్ పాలకులు పెట్టుబడిదారీ అభివృద్ధిని పాశ్చ్యాత్య ఆలోచనను అన్ని కులాలకు అందించారు.పీడిత ప్రజలలో, బాంబే కార్మిక వర్గంలోనూ, రైతాంగంలోనూ, పూనాలో ఆ చుట్టుపక్కల ఉన్న అంటరానివారిలోనూ పూలే తన కృషిని కేంద్రీకరించాడు.
ఆర్య దురాక్రమణదారులు స్థానిక జాతిపరమైన కుల వ్యవస్థ పుట్టుక సిద్ధాంతాన్ని వ్యాఖ్యానించి, సత్యశోధక్ సమాజ్ రైతాంగంతో సంబంధాలు ఏర్పరుచుకుంది.
సత్యశోధక్ సమాజ్ బ్రాహ్మణ పురోహితులు చేసే పెళ్లి తంతును తిరస్కరించారు. స్త్రీల కోసం పాఠశాలలను,అనాథలైన స్త్రీలకు ఆశ్రమాన్ని కల్పించారు.అంటరాని వారి కోసం పాఠశాలలను ప్రారంభించింది. మంచి నీటి బావులను వారికి అందుబాటులోకి తెచ్చారు. కుల వ్యవస్థను , అంటరానితనం సమూలంగా నిర్మూలించడం కోసం అనేక ఉద్యమాలు చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గుండు కృష్ణమూర్తి, బొడిగ సుదర్శన్,వేముల నరేందర్,కొత్త వెంకటేష్, సారయ్య,ఎడవల్లి చందు, ఉదయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో బీఆరెస్ పార్టీని వీడి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన వలిగొండ మండలం సుంకిశాల గ్రామ నాయకులు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం అభివృద్ధి ప్రదాత, ప్రజాసేవ చేయాలని లక్ష్యంతో ముందడుగు వేసి ఇంద్రపాల నగరం గ్రామ సర్పంచిగా గత ఐదు సంవత్సరాలుగా పలు అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి, గ్రామాన్ని ప్రగతి పథంలో లో నడిపించి, రామన్నపేట ఎంపీపీ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రజా నాయకులు పూస బాల నరసింహ కి ఇంద్ర పాలనగరం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బందెల క్రిస్టఫర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఇంద్రపాల నగరం గ్రామానికి వీరి చేసిన సేవలు సేవలు మరువలేమని అన్నారు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని టేకుల సోమవారం గ్రామంలో సెక్యూరిటీ టీం మెంబెర్స్ తో కలిసి వలిగొండ ఎస్సై డి మహేందర్ మంగళవారం రాత్రి ఫూట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు జరుగుతున్న దొంగతనాలు , చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. అన్ని గ్రామాల్లో టీం సభ్యులు తమ తమ గ్రామాలలో గస్తీ నిర్వహించి ,దొంగతనాలు జరగకుండా చూడాలని అన్నారు .అనుమానం ఉన్న వ్యక్తులు తారాసపడితే వెంటనే సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు చేగూరి మోహన్, చేగూరి బాలకృష్ణ, టి గణేష్ రెడ్డి, చేగూరి మల్లేష్ ఆధ్వర్యంలో యువకులు,తదితరులు పాల్గొన్నారు.

Apr 11 2024, 14:58
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.1k