/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz బిఆర్ఎస్ అంచనా తప్పిందా❓️ Yadagiri Goud
నిజంనిప్పులాంటిది

May 14 2023, 17:00

బిఆర్ఎస్ అంచనా తప్పిందా❓️

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రభావం తెలంగాణలో అధికార బీఆర్‌ఎ్‌సపై పడనుందా? సరిహద్దు ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎక్కువగా ఉండనుందా? జేడీఎస్‌ ఘోర వైఫల్యం బీఆర్‌ఎ్‌సకు ఇబ్బందికరంగా మారనుందా? అంటే.. రాజకీయ పరిశీలకులు అవుననే అంటున్నారు. త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికలపై కర్ణాటక ఫలితాల ప్రభావం తప్పకుండా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

భారత రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత సీఎం కేసీఆర్‌ కర్ణాటకతోనే ఎక్కువగా సంబంధ బాంధవ్యాలను నెరిపినందున.. ఆ ప్రభావం తప్పక ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ బలపడి బీఆర్‌ఎ్‌సకు కొరకరాని కొయ్యగా మారొచ్చని అంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించడం బీఆర్‌ఎ్‌సకు దెబ్బేనని పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌-కర్ణాటక రీజియన్‌లో కాంగ్రెస్‌ హవా!

కర్ణాటక ఫలితాలపై దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసింది. అధికార బీజేపీకి ఓటమి తప్పదని, కాంగ్రెస్‌ విజయం సాధించనుందంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ నెల 10న ఎన్నికలు జరిగిన తర్వాత చాలా ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా కాంగ్రె్‌సదే ఆధిక్యమంటూ వెల్లడించాయి. అన్నట్లుగానే కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. మొత్తం 224 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 136 స్థానాలు గెలుచుకుంది. తెలంగాణతో సరిహద్దును కలిగి ఉన్న హైదరాబాద్‌-కర్ణాటక రీజియన్‌లోని 41 సీట్లలో 26 సీట్లను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌ బొక్కబోర్లా పడింది. ఇది బీఆర్‌ఎ్‌సకు పెద్ద షాకేనని చెబుతున్నారు.

బీఆర్‌ఎ్‌సను ఏర్పాటు చేశాక కేసీఆర్‌ తొలుత కుమారస్వామినే కలిశారు. ఆయనకు కేసీఆర్‌ ఆర్థిక సాయం కూడా చేశారన్న ప్రచారం జరిగింది. దీంతో బీఆర్‌ఎస్‌, జేడీస్‌ కలిసే కర్ణాటకలో పోటీ చేస్తాయన్న వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ సరిహద్దులోని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దృష్టి పెడతారన్న ప్రచారమూ జరిగింది. కర్ణాటకలో జేడీఎస్‌ గెలిస్తే అక్కడ కుమారస్వామి ద్వారా చక్రం తిప్పవచ్చని కేసీఆర్‌ భావించారు. ఒకవేళ కాంగ్రెస్‌, బీజేపీకిపూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే జేడీఎస్‌ ద్వారా రాజకీయాన్ని నడపవచ్చనుకున్నారు. ఒకదశలో కర్ణాటకతో పాటే మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనీ యోచించారు. కాంగ్రెస్‌ గెలిస్తే.. ఆ ప్రభావం తెలంగాణలో ఉంటుందన్న భయాందోళనలు అప్పుడే వ్యక్తమయ్యాయి. ఇప్పుడదే జరగబోతోంది. కర్ణాటకలో, ముఖ్యంగా హైదరాబాద్‌-కర్ణాటక (కల్యాణ కర్ణాటక) రీజియన్‌లో కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లను గెలుచుకుంది. ఈ రీజియన్‌లోని బీదర్‌, యాద్గిర్‌, రాయ్‌చూర్‌, గుల్బర్గా, కొప్పల్‌ తదితర ప్రాంతాల్లోని ప్రజలకు తెలంగాణ ప్రజలకు మధ్య బంధుత్వాలు ఉన్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వీరు కీలకం కానున్నారు. సరిహద్దులోని ప్రజలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపడంతో, ఇటువైపు ప్రజలు కూడా కాంగ్రె్‌సకే ఓటేస్తారన్న చర్చ జరుగుతోంది. బంధువుల రాకపోకల వల్ల ఈ ప్రభావం పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దులోని సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాలతో పాటు బాన్సువాడ వంటి ప్రాంతాల్లో బీఆర్‌ఎ్‌సపై తీవ్ర ప్రభావం పడుతుందన్న అభిప్రాయాలున్నాయి. కేసీఆర్‌ నమ్మి దోస్తీ చేసిన జేడీఎ్‌సను కన్నడిగులు ఘోరంగా ఓడించారు. ఇక్కడ కూడా కేసీఆర్‌ సారథ్యంలోని బీఆర్‌ఎ్‌సకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. పైగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్న సానుభూతి, అభిమానం ఇక్కడి ప్రజల్లో కొంత మేరకు ఉంది. ఇది కాంగ్రె్‌సకు కలిసి వస్తుందన్న అభిప్రాయాలున్నాయి. కర్ణాటకలో గెలిచిన జోష్‌లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలోనూ స్పీడు పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు.

నిజంనిప్పులాంటిది

May 14 2023, 10:06

రేపు కర్ణాటక సీఎం ప్రమాణస్వీకారం..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇవాళ కర్ణాటక కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది.

ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు సీఎల్పీ సమావేశం జరుగనుంది. ఈ తరుణంలో బెంగుళూరు చేరుకుంటున్నారు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మల్లికార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్, సూర్జేవాల ల సమక్షం లో సీఎల్పీ సమావేశం జరుగనుంది. చెయ్యి ఎత్తే విధానం ద్వారా సీఎల్పీ నేత ఎంపిక ఓటింగ్ ఉంటుంది.

సీఎల్పీ నేత ఎంపిక తర్వాత రాజ్ భవన్ కి కలసికట్టుగా గవర్నర్ గెహ్లాట్ తో భేటి కానున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు కు సిద్దమంటూ లేఖ ఇవ్వనున్నారు సీఎల్పీ నేత. రేపు ప్రమాణ స్వీకారం కార్యక్రమం.. తర్వాత క్యాబినెట్ ఏర్పాటు జరుగనుంది. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు స్కీమ్ అమలుపై తొలి సంతకం చేయనుంది కాంగ్రెస్‌ కొత్త సర్కార్‌. అయితే. కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య హోం మంత్రి గా డీకే శివ కుమార్‌ ఉండనున్నట్లు సమాచారం.

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 13 2023, 18:43

కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ చేస్తాం

హైదరాబాద్ :

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు మేజిక్ ఫిగర్ సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్స్ మేరకు కాంగ్రెస్ 125 స్థానాల వరకు ఆధిక్యతలో కొనసాగుతోంది. బీజేపీ 70 స్థానాల్లోనే ప్రస్తుతం ఆధిక్యతలో ఉంది. ముఖ్యమంత్రి బొమ్మ పరోక్షంగా పరాజయం అంగీకరించారు.

ఈ సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ట్రెండ్స్ పైన టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పందించారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని ధీమా తో కనిపించారు. కేసీఆర్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేసారు.

తెలంగాణలో కర్ణాటక ఎఫెక్ట్: దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం చేజారింది. హస్తం వశం అవుతోంది. వెల్లడవుతన్న ట్రెండ్స్ కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యతను సూచిస్తున్నాయి. మేజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ సొంతగా చేరుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. జేడీఎస్ సహకారం లేకుండానే కాంగ్రెస్ అధికారం దక్కించుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ కు ఈ ఫలితాలు దేశ వ్యాప్తంగా జోష్ ను ఇచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల కు సిద్దం అవుతున్న వేళ ఈ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పందించారు. బజరంగ్ బలీ కాంగ్రెస్ ను గెలింపించారని వ్యాఖ్యానించారు. ఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ కు అనుకూల తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు..

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 13 2023, 18:40

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలే

•నెలాఖరు వరకు మద్యం ప్రియులకు పాత సరుకే

భూపాలపల్లి:

మద్యం ప్రియుల ఆశలు అడియాసలే అయ్యాయి. ప్రభుత్వం తగ్గించిన ధరలు ఇంకా అమలుకు నోచుకోలేదు. పాత స్టాకు ఉన్నంత వరకు బాటిల్‌పై ఉన్న ధరల లేబుల్‌ ప్రకారమే అమ్మకాలు చేస్తామని వ్యాపారులు చెబుతున్నారు.

వేసవి కావటంతో మద్యం వ్యాపారులు ఎక్కువ మొత్తం లో స్టాక్‌ తెచ్చి పెట్టుకున్నారు. అది అమ్ముడుపోతేనే కొత్త స్టాకు వచ్చేది. అప్పటి వరకు పాత స్టాకుపై ఉన్న ధరలకే కొనుగోలు చేయాల్సి వస్తోందని మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. దీంతో దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించినప్పటికీ షాపుల్లో పాత ధరలకే అమ్మకాలు జరుగుతున్నాయి. మరోవైపు వర్షాలతో బీర్లకు డిమాండ్‌ తగ్గటంతో మద్యం వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రభుత్వం మద్యం అమ్మకాల నుంచి వచ్చే ఆదాయం పైన ఆధార పడుతోంది. ఉమ్మడి భూపాలపల్లి ఎక్సైజ్‌ పరిధిలో 60 వైన్‌ షాపులు ఉన్నాయి. ఒక్క మంగపేట మండలంలో మినహా మిగతా అన్ని మండలాల్లో, జిల్లా కేంద్రాల్లో వైన్‌ షాపులు నడుస్తున్నాయి. ప్రభుత్వం గతంలో భారీగా మద్యం ధరలు పెంచటంతో అమ్మకాలు తగ్గాయి. ఆదాయం పడిపోతుండటంతో ప్రభుత్వం మే 5న మద్యం ధరలను తగ్గిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసింది.

ఫుల్‌ బాటిల్‌పె రూ.40, హాఫ్‌ బాటిల్‌పె రూ.20, క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 చొప్పున ధరలను తగ్గించారు. అన్నిరకాల బ్రాండ్లపై ఇదే పద్ధతిలో రేట్లు తగ్గాయి. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అయితే వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పాత ధరలకే షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో షాపుల వద్ద తగ్గిన ధరలకు అమ్మకాలు చేయటం లేదని మద్యం ప్రియులు వాగ్వావాదానికి దిగుతున్నారు. ప్రభుత్వం ధరలు తగ్గించినామద్యం వ్యాపారులు పాత ధరలే వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో భూపాలపల్లి, ములుగు జిల్లాలోని ఎక్సైజ్‌ శాఖ అధికారులకు ఫోన్లు కూడా వెళ్లుతున్నాయి. ధరలపై సర్దిచెప్పలేక మద్యం వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు.

స్టాక్‌ ఉన్నంత వరకు పాత ధరలే..

మద్యం వ్యాపారులు నెలకు సరిపడా సరుకుకు ఒకేసారి ఆర్డర్‌ ఇస్తారు. ఏప్రిల్‌ 30వ తేదీనే మే నెలకు కావాల్సిన మద్యం కోసం డీడీలు చెల్లించారు. అయితే ప్రభుత్వం మే 5న మద్యం ధరలు తగ్గించింది. అప్పటికే నెలకు కావాల్సిన మద్యం పాత ధరల లేబిల్‌తో ఆయా ప్రాంతాల్లోని గోదాంలోకి చేరింది. పాత ధర ప్రకారమే వ్యాపారులు ప్రభుత్వానికి డీడీలు చెల్లించారు. తమకు వచ్చిన మద్యం పూర్తిగా అమ్మిన తర్వాతే కొత్త మద్యం కోసం డీడీలు తీయనున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సుమారు రూ.10 కోట్ల మద్యం స్టాకు ఉన్నట్లు అంచనా. దీంతో దాదాపుగా ఈ నెలఖారు వరకు పాత స్టాకే విక్రయించనున్నారు. మద్యం సీసాలపై తగ్గిన ధరల కోసం రెండు వారాలు మద్యం ప్రియులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది..

నిజంనిప్పులాంటిది

May 13 2023, 18:37

ముఖ్యమంత్రి పీఠంపై కర్చీఫ్‌ వేసిన యతీంద్ర

బెంగళూరు :

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ముందంజలో ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. కర్ణాటకతో పాటు ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో టపాసులు కాల్చి సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో అప్పుడే సీఎం పీఠంపై అప్పుడే సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర కర్చీఫ్‌ వేసేశారు. కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ దక్కుతుందని.. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని యతీంద్ర సిద్ధరామయ్య తెలిపారు.

ఒక కొడుకుగా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. గతంలో ఆయన పాలనతో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ప్రజలకు సుపరిపాలన అందించారని గుర్తు చేశారు.

ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి అయితే బీజేపీ పాలనలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను సరిచేస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని.. ఆయన ముఖ్యమంత్రి అవుతారని నొక్కి చెప్పారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 13 2023, 18:36

అమ్మ లేని జీవితం నాకు వద్దు

హైదరాబాద్: అల్లారుముద్దుగా పెంచి విద్యాబుద్ధులు నేర్పిన అమ్మ మరణాన్ని తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్ళిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నేదులూరు మండలం ముక్కేశ్వరం గ్రామానికి చెందిన బొక్కా హరిక్ణృష్ణ(22) ఐటీఐ పూర్తి చేసి గత నాలుగు సంవత్సరాలుగా ఏసీ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు.

స్నేహితుడితో కలిసి శ్రీకృష్ణానగర్‌లో అద్దెకుంటున్నాడు. 2021లో హరికృష్ణ తల్లి సత్యవాణి గుండెపోటుతో మృతి చెందింది. అప్పటి నుంచే తల్లిలేని జీవితం వృథా అంటూ హరికృష్ణ డిప్రెషన్‌లోకి వెళ్ళాడు. తల్లి జ్ఞాపకాలతోనే గడిపేవాడు.

పనికి కూడా సరిగ్గా వెళ్ళకుండా ఆలోచనలతోనే ఇంట్లో గడిపేవాడు. ఈ నేపథ్యంలోనే స్నేహితుడు వెంకటేశ్వర్‌రావు డ్యూటీకి వెళ్ళిన కొద్దిసేపటికే శుక్రవారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక తన కొడుకు మానసికంగా బాధపడుతూ కరెంటు వైరుతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి అర్జున్‌రావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 13 2023, 18:33

Hyderabad : హైదరాబాద్ లో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు..

నకిలీ నోట్ల దందాకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు ఎన్ని రకాల కఠిన చర్యలు చేపట్టినా.. ఏదో కొత్త మార్గాన్ని ఎంచుకొని నిందితులు రెచ్చిపోతున్నారు..

తాజాగా ఇలాంటిదే ఓ భారీ ఫేక్ నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న అంతర్రాష్ట ముఠాను శంషాబాద్‌ పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.

ఈ ముఠా దగ్గర నుంచి మొత్తం రూ. 11 లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్నాట్లు శంషాబాద్‌ డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి చెందిన తోమండ్ర రంజిత్ సింగ్, కొవ్వూరుకి చెందిన మలస్ల మోహన్ రావుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 13 2023, 16:43

Karnataka Results: కన్నడ పోరులో.. కాంగ్రెస్‌ అఖండ విజయం

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly election Results) కాంగ్రెస్‌ (Congress) పార్టీ అఖండ విజయం సాధించింది. శనివారం వెలువడిన ఫలితాల్లో మొత్తం 224 స్థానాలకు గానూ హస్తం పార్టీ 135 స్థానాల్లో జయకేతనం ఎగురవేయగా.. మరో చోట ఆధిక్యంలో ఉంది. ఇక భాజపా (BJP) 64 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైంది. జేడీఎస్‌ (JDS) 20 చోట్ల గెలుపొందగా.. ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 13 2023, 13:40

అలిపిరిలో మాజీ సీజేఐ ఎన్వీ రమణ శ్రమదానం

చిత్తూరు జిల్లా:

తిరుపతి సామూహిక శ్రమదానంతో సుందర తిరుమల కార్యక్రమాన్ని అలిపిరి వద్ద సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శనివారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ కార్యక్రమాన్ని గత 13 రోజులుగా టీటీడీ నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. స్వచ్ఛంద సేవతో సుందర తిరుమలకు అందరూ పూనుకోవటం అభినందనీయమన్నారు. న్యాయమూర్తులకు స్వచ్ఛందసేవకు అవకాశం కల్పించాలని 2008లో అప్పుడు జాయింట్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా ఉన్న ధర్మారెడ్డిని కోరినట్లు తెలిపారు. అది గుర్తుపెట్టుకున్న ఆయన ఈ రోజు తనను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారన్నారు.

తిరుమల పవిత్రత తమ కర్తవ్యంగా భక్తులు భావించాలని ఎన్వీ రమణ అన్నారు. సుందర తిరుమల కార్యక్రమంలో పాల్గొనడం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నానన్నారు.

అనేక దేవతలు సంచరించిన సప్తగిరులకు ఎంతో పవిత్రత ఉందన్నారు. శ్రీవారి దర్శనార్ధం వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఈ ప్రాంతాన్ని పవిత్రంగా చూసుకోవాలని సూచించారు. భక్తులు కూడా శుద్ధ తిరుమల.. సుందర తిరుమల కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 13 2023, 13:39

కేసీఆర్ ఒక హంతకుడు : వైయస్ షర్మిల

హైదరాబాద్ :

సీఎం కేసీఆర్ ఒక హంతకుడని.. ఒకేరోజు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. డిగ్రీ చదివి నాలుగేళ్లయినా ఉద్యోగం రాక శివకుమార్ ఉరి వేసుకున్నాడన్నారు. 20 రోజులైనా వడ్లకు కాంటాలు వేయక రైతు యల్లయ్య గుండె ఆగిందన్నారు.

15రోజులుగా సమ్మె చేస్తున్నా.. సర్కారు స్పందించక జీపీ కార్యదర్శి సోనీ తనువు చాలించిందని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసుకుంటున్నా.. కేసీఆర్ దొరకు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందన్నారు. కొలువులు లేక పుట్టెడు దు:ఖంతో యువత ఉందన్నారు.

వడ్లు కొనక కన్నీటి వ్యధతో రైతులున్నారని షర్మిల పేర్కొన్నారు. ‘‘ఉద్యోగ భరోసా లేక మనస్తాపంతో కార్యదర్శులు.. చచ్చిపోతున్నా కనికరించవా కేసీఆర్? ఇంకెంతమంది ఉసురు తీసుకుంటావ్? నీ కుటుంబానికి పదవులు కావాలె! మా బిడ్డలకు ఉద్యోగాలు వద్దా? నీ కుటుంబం ఆస్తులు సంపాదించుకోవాలె!

మా రైతులు అప్పులు తీర్చుకోవద్దా? నీ కుటుంబం కోట్లకు పడగలెత్తాలె! మా బిడ్డలు పాడె ఎక్కాల్నా? ఇంకా నువ్ ఎందుకు బతికున్నట్టు కేసీఆర్? బంగారు తెలంగాణ పేరుతో ఆత్మహత్యల తెలంగాణగా మార్చావు కదా?’’ అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

SB NEWS