/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz విద్యుత్‌ డిమాండ్‌ 14,649 మెగావాట్లు.. తెలంగాణ చరిత్రలోనే అత్యధికమిదే Yadagiri Goud
విద్యుత్‌ డిమాండ్‌ 14,649 మెగావాట్లు.. తెలంగాణ చరిత్రలోనే అత్యధికమిదే

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో విద్యుత్‌ డిమాండ్‌ అత్యధికంగా రికార్డు స్థాయిలో శనివారం నమోదైంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు 14,649 మెగావాట్ల పీక్‌ డిమాండ్‌ నమోదైనట్టు విద్యుత్‌శాఖ వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతగా విద్యుత్‌ వినియోగం నమోదు కావడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. నిన్న 14,169 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం నమోదు కాగా, ఇవాళ అంతకు మించి 14,649 మెగావాట్ల అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు అయినట్టు వెల్లడించారు. విద్యుత్‌ వినియోగంలో దక్షిణ భారత దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని విద్యుత్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

వ్యవసాయ నాట్లు ముగింపు దశలో ఉండటం, మొదట్లో వేసిన పంటలు ఏపుగా పెరగడంతో నీటి వినియోగం భారీగా పెరిగింది. ఉద్యాన పంటలకు సైతం నీటి వినియోగం ఎక్కువగా పెరిగిపోయింది. రాష్ట్రంలో ఎక్కువ శాతం బోరుబావులపై ఆధారపడే వ్యవసాయం చేస్తున్నారు.

దీంతో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇంతకుముందు వ్యవసాయానికి 35శాతం మాత్రమే విద్యుత్‌ వినియోగించేవారు. ప్రస్తుతం ఆ వినియోగం 37శాతానికి పెరిగిందని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక విద్యుత్‌ వినియోగం 6,666 మెగావాట్లు మాత్రమే ఉండేదన్నారు. రానున్న రోజుల్లో 15వేల మెగావాట్ల విద్యుత్‌ వినియోగం నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎంత డిమాండ్‌ వచ్చినా నిరంతరం విద్యుత్‌ సరఫరా చేస్తామని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు.

ఫిబ్రవరి 18న భారత్‌కు 12 చిరుతలు

శ్యోపుర్‌: దక్షిణాఫ్రికాతో ఒప్పందంలో భాగంగా భారత్‌కు రావాల్సిన 12 చిరుతలు ఈ నెల 18న కునో నేషనల్‌ పార్కుకు చేరుకోనున్నాయని అటవీ ఉన్నతాధికారి ఒకరు శనివారం స్పష్టం చేశారు.

తొలుత ఇవి వాయుమార్గం ద్వారా గ్వాలియర్‌కు చేరుకుంటాయని, అక్కడి నుంచి కునోకు వస్తాయని తెలిపారు.

వాటిలో ఆడవి, మగవి ఎన్ని ఉన్నాయనే విషయం తనకు తెలియదని వెల్లడించారు. నిబంధనల ప్రకారం వాటిని ఒక నెల క్వారంటైన్‌లో ఉంచుతామని అధికారి తెలిపారు.

పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తాం: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: సింగరేణి కార్మికుల సమస్యలకు సీఎం కేసీఆర్‌ (CM KCR) కారణమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. పోడు భూములపై సీఎంకు గుబులు పుట్టిందని ఆయన విమర్శించారు.

అర్హులైన వారికి అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడుభూముల పట్టాలు ఇస్తామని 2014 నుంచి చెబుతున్నారు.. కానీ, 9ఏళ్లుగా పోడు భూములకు ఎందుకు పట్టాలివ్వలేదని ప్రశ్నించారు. హాథ్‌ సే హథ్‌ జోడో అభియాన్‌ పాదయాత్రలో భాగంగా భద్రాద్రి జిల్లా ఇల్లెందు సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

అసెంబ్లీని వేదికగా చేసుకుని సీఎం కేసీఆర్‌ పేద ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు ఆయన మాటలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్‌ సభకు వెళ్తే పోడు భూములకు పట్టాలు రావని భారాస నేతలు బెదిరిస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తామని హెచ్చరించారు. పట్టాలు ఇవ్వకుంటే ఓట్లు అడగడానికి వస్తే.. ప్రజలు తిరగబడటం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన అందరికీ పోడు భూముల పట్టాలు ఇస్తామని భరోసా ఇచ్చారు.

CM KCR: 14న కొండగట్టుకు సీఎం కేసీఆర్‌

•అంజన్న క్షేత్రం అభివృద్ధి, మాస్టర్‌ ప్లాన్‌పై చర్చ!

హైదరాబాద్‌-మల్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 14న జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల రూ.100 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించారు. సీఎం కేసీఆర్‌ 14న ఆలయానికి చేరుకుని అంజన్న క్షేత్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనపై అధికారులతో చర్చిస్తారు. అనంతరం పూర్తి వివరాలు ప్రకటిస్తారు.

మరోవైపు సీఎం ఆదేశాల మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి ఆదివారం కొండగట్టు వెళ్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ ప్రణాళికను ఈ సందర్భంగా ఆయన రూపొందించనున్నారు. సీఎం కేసీఆర్‌ సంకల్పంతో కొండగట్టు అంజన్న ఆలయం యాదాద్రితరహాలో అభివృద్ధి చెందుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ శాభావం వ్యక్తం చేశారు.

త్వరలో లాల్‌ దర్వాజ ఆలయ పనులు: తలసాని

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ పాతనగరంలోని ప్రసిద్ధ లాల్‌ దర్వాజ అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. గతేడాది అమ్మవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా ఆలయ అభివృద్ధి, విస్తరణ చేపడతామని కేసీఆర్‌ హామీ ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. ఈ మేరకు అక్కడ 10 రోజుల్లో భూమిపూజ చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం శాసనసభలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆలయ అభివృద్ధిపై మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే బలాలతో మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘‘లాల్‌ దర్వాజ ఆలయ విస్తరణకు 1100 గజాల స్థలం గుర్తించాం. ఆ భూముల యజమానులకు పరిహారం ఇచ్చేందుకు కేసీఆర్‌ రూ.8.95 కోట్లు మంజూరు చేశారు. కంచన్‌బాగ్‌, ఉప్పుగూడ, జంగంమెట్‌లలో మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాళ్ల నిర్మాణాలకు రూ.19 కోట్లు ఇచ్చారు’’ అని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన టిడిపి నేతల బృందం
నారా లోకేష్ పై పోలీసులు పెడుతున్న కేసులు ...లోకేష్ పాదయాత్రను అడ్డుకునే విధంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలు ....లోకేష్ ప్రచార రధాలు సీజ్ చేయడం.... లోకేష్ ప్రజలతో మాట్లాడకుండా మైకులు లాక్కోవడం అనేక అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లిన టిడిపి నేతలు నక్కా ఆనంద బాబు,వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర,బోండా ఉమ, ఇతర నేతలు పాల్గొన్నారు.
'కోడి గుడ్డును పెట్టగలదు.. కోడిని పెట్టలేదుగా?'.. మంత్రి అమర్నాథ్‌ కోడిగుడ్డు కథ విన్నారా?

హైదరాబాద్‌: నగరంలో ఫార్ములా ఈ కార్‌ రేస్‌ నిర్వహణ గర్వకారణమని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. తెలుగు ప్రజలంతా కలిసి నిర్మించిన హైదరాబాద్‌ నగరానికి ఫార్ములా ఈ రేస్‌ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు..

హైదరాబాద్‌ ఈ స్థాయికి చేరడానికి తెలంగాణతో పాటు తెలుగు ప్రజల కృషి కూడా ఉందన్నారు. ఈ రేస్‌ను మంత్రి అమర్నాథ్‌ తిలకించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి రేస్‌లు ఎప్పుడు నిర్వహిస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు..

మంత్రి విచిత్రమైన సమాధానమిచ్చారు. ''కోడి గుడ్డు పెట్టగలదు. కానీ, కోడి.. కోడిని పెట్టలేదుగా?

కోడి గుడ్డు పెట్టాలి, పొదగాలి, పిల్లలు పెట్టాలి, పెరిగి పెద్దవ్వాలి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో కోడి గుడ్డు పెట్టింది. పెట్ట కింద మార్చడానికి టైమ్‌ పడుతుంది'' అంటూ విచిత్రమైన పోలికతో జవాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ కూడా ఫార్ములా ఈ కార్‌ రేస్‌ నిర్వహించే స్థాయికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Formula-E Race: హైదరాబాద్‌లో ముగిసిన ఫార్ములా-ఈ రేసింగ్‌.. విజేత ఎవరంటే?

హైదరాబాద్‌: నెక్లెస్‌ రోడ్‌ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ రేసింగ్‌ చాంపియన్‌షిప్‌ ముగిసింది..

భారత్‌లో తొలిసారి హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న రేసింగ్‌లో ప్రపంచస్థాయి రేసర్లు అదరగొట్టారు. శనివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ప్రారంభమైన రేసు గంటన్నర పాటు కొనసాగింది. ఫార్ములా-ఈ రేస్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా జీన్‌ ఎరిక్‌ వెర్గ్‌నే(డీఎస్‌ పెన్‌స్కే రేసింగ్‌) నిలిచాడు.

ఆ తర్వాత రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ(ఎన్‌విజన్‌ రేసింగ్‌), మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమి(ఎన్‌విజన్‌ రేసింగ్‌) ఉన్నారు. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. కాగా జీన్‌ ఎరిక్‌ ఇప్పటికే రెండుసార్లు ఫార్ములా-ఈ ఛాంపియన్‌ కావడం విశేషం. తాజా విజయంతో అతను మూడోసారి ఛాంపియన్‌గా అవతరించడు..

Visakhapatnam: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. పేలిన లాడిల్‌

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగింది. ఎస్‌ఎంఎస్‌-2లో ద్రవ ఉక్కు తీసుకెళ్తున్న లాడిల్‌ ఒక్కసారిగా పేలిపోయింది..

ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు ఒప్పంద కార్మికులు, ఇద్దరు శాశ్వత ఉద్యోగులు, ఒక డీజీఎం స్థాయి అధికారి ఉన్నారు.

లాడిల్‌లో ద్రవ ఉక్కు తరలిస్తుండగా అకస్మాత్తుగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరిని తొలుత స్టీల్‌ ప్లాంట్‌లోని జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు..

బైక్ పై అసెంబ్లీ కి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్
▪️ప్రభుత్వం తనకు కేటాయించిన బులెట్ ప్రూఫ్ కారు కు నిరసనగా బైక్ పై అసెంబ్లీ కి వచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్. ▪️గత కొద్ది రోజులుగా తన అధికారిక బులెట్ ప్రూఫ్ వాహనం మొరాయిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,నిన్న ప్రగతి భవన్ గెట్ కు వాహనం అడ్డం పెట్టిన రాజా సింగ్.
Venkaiah Naidu: అల్లూరి విగ్రహం మోదీ ఆవిష్కరించడం ఎంతో సంతోషం..

ప.గో. జిల్లా: మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) శనివారం పశ్చిమగోదావరి జిల్లా (West Godavari Dist., భీమవరం (Bhimavaram)లో పర్యటిస్తున్నారు.

వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) కాంస్య విగ్రహాన్ని (Bronze Statue) సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లూరి విగ్రహం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆవిష్కరించడం తన మనసుకి ఎంతో సంతోషం కలిగించిందన్నారు. స్వాతంత్య్రయం కోసం కృషి చేసిన అనేకమంది మహానుభావుల్లో మొట్టమొదటి వరుసలో ఉండే వ్యక్తి అల్లూరి సీతారామరాజుని కొనియాడారు. సీతారామరాజు స్ఫూర్తిని యువతరానికి తెలియజేయాలన్నారు..

రాష్ట్రంలో ఉండే యువత ఎప్పటికప్పుడు భీమవరం వచ్చి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని సందర్శించాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నానని వెంకయ్య నాయుడు అన్నారు. స్వార్థం, అవకాశవాదం, అవినీతి, అరాచకం, పెరిగిపోతున్న ఈ రోజుల్లో యువత ముందుకు వచ్చి నడుంబిగించవలసిన సమయం ఆసన్నమైందని, ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయన్నారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర పాఠ్యాంశాలలో భాగంగా ఉండాలని, అది చాలా అవసరం.. దీన్ని ప్రభుత్వాలు గుర్తించాలని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.