/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz బైక్ పై అసెంబ్లీ కి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ Yadagiri Goud
బైక్ పై అసెంబ్లీ కి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్
▪️ప్రభుత్వం తనకు కేటాయించిన బులెట్ ప్రూఫ్ కారు కు నిరసనగా బైక్ పై అసెంబ్లీ కి వచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్. ▪️గత కొద్ది రోజులుగా తన అధికారిక బులెట్ ప్రూఫ్ వాహనం మొరాయిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,నిన్న ప్రగతి భవన్ గెట్ కు వాహనం అడ్డం పెట్టిన రాజా సింగ్.
Venkaiah Naidu: అల్లూరి విగ్రహం మోదీ ఆవిష్కరించడం ఎంతో సంతోషం..

ప.గో. జిల్లా: మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) శనివారం పశ్చిమగోదావరి జిల్లా (West Godavari Dist., భీమవరం (Bhimavaram)లో పర్యటిస్తున్నారు.

వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) కాంస్య విగ్రహాన్ని (Bronze Statue) సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లూరి విగ్రహం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆవిష్కరించడం తన మనసుకి ఎంతో సంతోషం కలిగించిందన్నారు. స్వాతంత్య్రయం కోసం కృషి చేసిన అనేకమంది మహానుభావుల్లో మొట్టమొదటి వరుసలో ఉండే వ్యక్తి అల్లూరి సీతారామరాజుని కొనియాడారు. సీతారామరాజు స్ఫూర్తిని యువతరానికి తెలియజేయాలన్నారు..

రాష్ట్రంలో ఉండే యువత ఎప్పటికప్పుడు భీమవరం వచ్చి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని సందర్శించాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నానని వెంకయ్య నాయుడు అన్నారు. స్వార్థం, అవకాశవాదం, అవినీతి, అరాచకం, పెరిగిపోతున్న ఈ రోజుల్లో యువత ముందుకు వచ్చి నడుంబిగించవలసిన సమయం ఆసన్నమైందని, ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయన్నారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర పాఠ్యాంశాలలో భాగంగా ఉండాలని, అది చాలా అవసరం.. దీన్ని ప్రభుత్వాలు గుర్తించాలని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.

Nellore: నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం..

Nellore: నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం..

నెల్లూరు: నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు వాహనాలతో మంటలు ఆర్పుతున్నారు.

ఇవాళ రెండో శనివారం సెలవు కావడంతో సిబ్బంది ఎవరూ విధుల్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కలెక్టరేట్‌లో భద్రపరిచిన ఎన్నికల సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

బాధిత కుటుంబానికి శేపూరి రవీందర్ ఆర్థిక సాయం

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీలోని ఫస్ట్ వార్డ్ శివనేనిగూడెం లో 02.02. 2023న మరణించిన కాలేరు చంద్రమ్మ గారి దశదినకర్మ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారు నేడు కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినారు.

నకిరేకల్ నియోజకవర్గంలో పేదల పక్షాన ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా అనుక్షణం ప్రజాసేవలో ఉంటానన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు గుండాల నరేష్ గౌడ్, బూత్ అధ్యక్షులు నోముల లింగస్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి శివరాత్రి కొండల్, కార్యదర్శి అమరోజు సందీప్ తదితరులు పాల్గొన్నారు.

అట్టహాసంగా ఐపీఎస్ పాసింగ్ ఔట్ పారేడ్.. పాల్గొన్న అమిత్ షా

హైదరాబాద్‌: హైదబాద్‌లోని వల్లబాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో 74 వ బ్యాచ్‌ ఐపీఎస్‌ల అధికారుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ కార్యక్రమం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం శుక్రవారం రాత్రికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అమిత్‌ షా ఆ పరేడ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అక్కడ ట్రైనీ ఐపీఎస్‌ల నుంచి అమిత్‌ షా గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. "ట్రైనీ ఐపీఎస్‌లకు అభినందనలు. ఈ బ్యాచ్‌లో అధికం శాతం టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు. రానున్న కాలంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేగాదు టెక్నీలజీతో ​కూడిన పోలీస్‌ మేనేజ్‌మెంట్‌ ‍మరింతగా అందుబాటులోకి వస్తుంది కూడా.

అలాగే 2005లో ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానంలోకి నిలబెట్టాం. త్వరితగతి దాన్ని కూడా అధిగమించి మూడవ స్థానాన్ని చేరుకుంటుందని ఆశిస్తున్నా. ఐతే శాసన వ్యవస్థ ద్వారా ఒక నాయకుడుకి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పాలించే అధికారం ఉంటుంది. కానీ ఐపీఎస్‌లకు 30 సంవత్సరాల వరకు ఆ అధికారం ఉంటుంది. రాజ్యాంగం మీ భుజస్కంధాలపై చాలా బాధ్యత పెట్టింది. ప్రతీ ఐపీఎస్‌ తన బాధ్యతను గుర్తించుకోవాలి. ఎనిమిదేళ్ల క్రితం దేశ అంతర్గత భద్రత విషయంలో చాలా ఆందోళనగా ఉండేది. జమ్ము కాశ్మీర్ తీవ్రవాదము, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంతో సహా ఎన్నో సమాస్యలు ఉండేవి. అలాంటి సమస్యలన్నింటిని పూర్తిగా కట్టడి చేశాం. అలాగే శాంతి భద్రతల విషయంలో రాజీపడే ‍ ప్రసక్తే లేదు." అని అమిత్‌ షా నొక్కి చెప్పారు.

కాగా, ఈ 74వ బ్యాచ్‌లో దాదాపు 195 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. 105 వారాలపాటు ఇండోర్‌ ఔట్‌డోర్‌ కలిపి మొత్తం సుమారు 17 విభాగాల్లో ట్రైనింగ్‌ పొందారు. వీరిలో 166 మంది భారతీయులు, 29 మంది విదేశీయలు ఉన్నారు. అందులో 37 మంది మహిళా ఐపీఎస్‌లు కూడా ఉన్నారు. అంతేగాదు ప్రతి ఏడాది మహిళా ఐపీఎస్‌లు పెరుగుతుండటమే గాక ఈ బ్యాచ్‌లో ఇంజనీరింగ్‌, మెడికల్‌, సీఏ స్టూడెంట్స్‌ అధికంగా ఉండటం విశేషం. ఈ శిక్షణలో ప్రతిభ కనబర్చిన ప్రోబేషనరీ ఐపీఎస్‌లకు ట్రోఫీలు అందజేస్తారు. పరేడ్‌ అనంతరం 11 నుంచి 12 గంటల సమయంలో అధికారులతో అమిత్‌ షా భేటీ కానున్నారు.

మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు..

•మరి నా సంగతేంటి?.. తేజస్వీ యాదవ్‌కు నిరుద్యోగ యువతి లేఖ

బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు పింకీ అనే ఓ నిరుద్యోగ యువతి రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉద్యోగం రాని కారణంగా ప్రేమించిన వ్యక్తికి మనసులోని మాటను చెప్పలేకపోతున్నానని అందులో పేర్కొంది. ‘‘మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ నిరుద్యోగం నా పెళ్లికి అడ్డంకిగా మారింది’’ అంటూ అందులో ఆవేదన వ్యక్తం చేసింది. చాలా కాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఆ యువతి.. ఉద్యోగం రాలేదన్న బాధతో ఉపముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.

నాలుగేళ్లుగా తాను ప్రభాత్‌ అనే రచయితను ప్రేమిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఉద్యోగం వస్తే ప్రేమ విషయాన్ని చెప్పాలనుకున్నానని, కానీ ఇప్పటికీ తన కోరిక నెరవేరలేదని వాపోయింది. ఒక్కసారి కూడా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడలేదని.. ఒకవేళ వచ్చినా పేపర్‌ లీక్‌ అవుతోందని అసహనం వ్యక్తం చేసింది. దీనిపై ప్రభాత్‌ స్పందించారు. ‘‘నాకు పింకీ ఎవరో తెలియదు. నేను ఎవ్వరితోనూ ప్రేమలో లేను. నా భార్య నాపై కోపంగా ఉంది. ఈ లేఖలో నిరుద్యోగం అనే అంశం ప్రధానంగా ఉంది. ఇక్కడ నా పేరును ప్రచారానికే వాడుకున్నారు. పింకీకి కావల్సింది ప్రేమ కాదు, ఉద్యోగం మాత్రమే’’ అని ఆయన తెలిపారు.

చల్లని చంద్రుడినే ఆపలేకపోయారు.. ఇప్పుడు మండే సూర్యుడిని ఆపగలరా?

•కేటీఆర్‌, కేసీఆర్‌లపై మల్లారెడ్డి పొగడ్తలు

హైదరాబాద్‌: తెలంగాణలో రామచంద్రుల చల్లని పాలన నడుస్తోందని కేటీఆర్‌, కేసీఆర్‌లను ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి పొగడ్తలు గుప్పించారు. ‘రామరాజ్యం గురించి విన్నాం, రాముడిని ఫొటోల్లో చూశాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో సాక్షాత్తూ రాముడి రాజ్యం నడుస్తోంది. తారకరాముడు ఐటీ రాజ్యం తెచ్చారు’ అంటూ ప్రస్తుతించారు.

సభలో పద్దులపై చర్చ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతున్నంత సేపు సభలో నవ్వులు విరిశాయి. ‘తెలంగాణలో యాదాద్రి, సచివాలయం, అంబేడ్కర్‌ విగ్రహం, అమరవీరుల స్మారక కేంద్రం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, కాళేశ్వరం, మిషన్‌ భగీరథ రూపంలో ఏడు అద్భుతాల్ని చూస్తున్నాం. 28 రాష్ట్రాల్లో కేటీఆర్‌లాంటి ఐటీ మంత్రి ఎక్కడైనా ఉన్నారా..? మొన్న దావోస్‌ వెళ్లి రూ.21 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. కేటీఆర్‌ 110 ఏళ్లు దీర్ఘాయుష్షుతో జీవించాలి. కేంద్రం అసలు దొంగల్ని వదిలిపెట్టి మాపై ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు చేయిస్తోంది. మీ దోస్త్‌ అదానీకి అన్నీ అప్పగిస్తే పది దినాల్లోనే రూ.10 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. టీఆర్‌ఎస్‌ అంటే చంద్రుడు.. బీఆర్‌ఎస్‌ అంటే సూర్యుడు. అప్పటి చల్లని చంద్రుడినే ఆపలేకపోయారు ఇప్పుడు మండే సూర్యుడిని ఆపగలరా? ఆయన కోపాన్ని తట్టుకోగలరా? రామన్న సీఎం.. కేసీఆర్‌ పీఎం అవుతారు’ అన్నారు.

తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణ నూతన సచివాలయ (Telangana Secretariat) ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ (MLC Elections) అమల్లో ఉండడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరో తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. కాగా మొదట ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM Kcr) పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17న కొత్త సచివాలయం ప్రారంభించాల్సి ఉంది.

ఈ అంశంపై సీఈసీతో (CEC) సీఎస్‌ సంప్రదింపులు జరిపారు. కానీ సీఈసీ నుంచి ఆశాజనక స్పందన రాకపోవడంతో సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయానికి డా.బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. కొత్త సచివాలయాన్ని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections)కు నగారా మోగిన విషయం తెలిసిందే. త్వరలో ఖాళీ కానున్న స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) (ECI) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాలు (మొత్తం 13), తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది.

నేడే హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్..

నేడు హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్ జరగబోతోంది. హుస్సేన్‌సాగర్ తీరాన ఎలక్ట్రిక్ కార్లు రయ్ రయ్‌మని దూసుకెళ్లబోతున్నాయి. ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమిస్తోంది..

శనివారం హుస్సేన్‌సాగర్‌ తీరంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌ ఈ-కార్ల రేసుతో సందడిగా మారనుంది. భారత్‌లో జరగనున్న తొలి ఫార్ములా-ఈ రేసు ఇదే కావడం విశేషం.

హుస్సేన్‌సాగర్‌ తీరాన జరిగే అంతర్జాతీయ పోటీల కోసం 2.8 కిలోమీటర్ల స్ట్రీట్‌ సర్క్యూట్‌ను తీర్చిదిద్దారు. లుంబినిపార్కు నుంచి ప్రారంభమై సచివాలయం పక్క నుంచి మింట్‌ కాంపౌండ్‌, ఐమాక్స్‌ మీదుగా ఎన్టీఆర్ గార్డెన్‌ వరకు రేస్‌ సాగనుంది. మొత్తం 11 ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్లు పాల్గొనేపోటీలో. 22మంది రేసర్లు సత్తాచాటనున్నారు. రక్షణ చర్యల్లో భాగంగా స్ట్రీట్ సర్క్యూట్‌కి ఇరువైపులా పెద్ద ఎత్తున బారికేడ్లు, ప్రేక్షకుల గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

కనేకల్ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల లో PDSU కమిటీ ఎన్నిక

•అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు :మల్లె ప్రసాద్,

కణేకల్ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిడిఎస్ యు కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. PDSU వ్యవస్థాపకుడు : జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్.రంగవల్లి. చేరాల. ఇలాంటి మహునుభావులు ఆశయ సాధన కోసం నిరంతరం విద్యారంగ సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తామని

ప్రభుత్వ పాఠశాలలో గాని ప్రభుత్వ కళాశాలలో గానీ మరియు నూతన జాతీయ విద్యా,విధానం పేరుతో తెచ్చిన జోవును వెంటనే ఉపసంహరించుకోవాలని ఎందుకు అంటే పేద, మధ్య,తరగతి విద్యార్థులు చదువుకు దూరం పెట్టే విధంగా ఉంది కాబట్టి ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, లేనిపక్షంలో కేంద్ర,రాష్ట్ర, ప్రభుత్వాలను గద్దె దించుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.