నిజంనిప్పులాంటిది

Jul 18 2024, 08:19

నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు‼️

- ఆగస్టు 5 వరకు పరీక్షలు

- మొత్తం పోస్టులు 11,062

- 2.70 లక్షల మంది అభ్యర్థులు

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్షలను గురువారం నుంచి నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆగస్టు 5 వరకు జరిగే ఈ పరీక్షలు కొనసాగనున్నాయి.

11,062 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. సుమారు 2.79 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.

వారిలో బుధవారం రాత్రి వరకు 2.48 లక్షల మంది తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 2.30 గంటల పాటు జరిగే పరీక్షలో 160 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 80 మార్కులు కేటాయించారు.

టెట్‌ ద్వారా మరో 20 మార్కులు వెయిటేజీలో భాగంగా కలపనున్నారు.

డీఎస్సీ పరీక్షలను రాష్ట్రం యూనిట్‌గా నిర్వహిస్తున్నారు. ఫలితాలు విడుదల చేసి, మెరిట్‌ జాబితాను మాత్రం జిల్లాల వారీగా ప్రకటిస్తారు.

నియామకాలు కూడా జిల్లా యూనిట్‌గా చేయనున్నారు. కాగా, ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఎస్‌జీటీ 6,508, భాషా పండితులు 272, పీఈటీ 182, స్పెషల్‌ క్యాటగిరీ స్కూల్‌ అసిస్టెంట్‌ 220, స్పెషల్‌ క్యాటగిరీ ఎస్‌జీటీ పోస్టులు 796 ఉన్నాయి.

నిజంనిప్పులాంటిది

Jul 14 2024, 08:53

మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులతో అమెరికా హైఅలర్ట్‌.

పెన్సిల్వేనియా బట్లర్‌లో ట్రంప్‌పై దాడి జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టిన సీక్రెట్‌ సర్వీస్. 

ఆ ప్రాంతంలోని బిల్డింగ్‌లను తమ ఆదీనంలోకి తీసుకున్న బలగాలు. 

కాల్పుల ఘటనలో ట్రంప్‌ కుడి చెవి భాగంలో గాయం. 

ట్రంప్‌పై దాడి జరిపిన దుండగుడిని కాల్చి చంపిన బలగాలు.

Streetbuzz News

SB NEWS

Real Time News Platform

నిజంనిప్పులాంటిది

Jul 11 2024, 11:49

సిద్ధరామయ్య సతీమణి పై కేసు ‼️

)

- ఫోర్జరీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్‌ చేశారని ఆరోపణలు

కర్ణాటక రాజకీయాల్లో మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ముడా) భూకుంభకోణం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

తాజాగా ఈ స్కామ్‌కు సంబంధించి సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున్‌, మరో వ్యక్తిపై స్నేహమయి కృష్ణ అనే సామాజిక కార్యకర్త మైసూర్‌లోని విజయనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సిద్ధరామయ్య, పార్వతి, ముడా అధికారులతోపాటు మైసూర్‌ జిల్లా కలెక్టర్‌, పలువురు ఇతర ప్రభుత్వ అధికారులకు భూ కేటాయింపు కుంభకోణంలో పాత్ర ఉన్నదని ఆరోపించారు. ఇందుకు రెవెన్యూ, ఇతర అధికారులు సహకరించారని ఆరోపించారు.

భూ కేటాయింపు వివాదంపై దర్యాప్తు చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ కార్యదర్శిలకు కూడా స్నేహమయి కృష్ణ లేఖ రాశారు.

అయితే ఈ భూ కేటాయింపులు బీజేపీ హయాంలోనే జరిగాయని సీఎం సిద్ధరామయ్య అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తున్నది.

నిజంనిప్పులాంటిది

Jul 11 2024, 11:46

ఉద్యోగుల బదిలీల్లో అవకతవకలు ‼️

ఖాళీలను సక్రమంగా చూపలేదు.. చూపినవాటిల్లోనూ తప్పులు.. ఇక రాత్రికి రాత్రే మారిన జోన్లు.. ఇదేంటని టీచర్లు అడిగితే బదిలీలు కావాలంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి అని హూంకారం!

ఆందోళనకు దిగితే పోలీసులతో బెదిరింపులు! ఇదీ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల్లో బదిలీల పరిస్థితి. గురుకుల బదిలీల ప్రక్రియ అంతా గందరగోళంగా కొనసాగుతున్నది.

ప్రణాళిక అంటూ లేకుండా సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా బదిలీలు నిర్వహిస్తున్నారంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బదిలీ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

సొసైటీ సాధారణ బదిలీల ప్రక్రియను ఇటీవలే ప్రారంభించగా.. మొదటి నుంచి 317 బాధితులకు న్యాయం చేస్తామని, స్పౌజ్‌, ఇతర మెడికల్‌ కేసులను పరిష్కరిస్తామని, అంతా కూడా ఆన్‌లైన్‌ ద్వారానే బదిలీలను చేపడతామని సొసైటీ అధికారులు ప్రకటించారు.

కానీ, ఆచరణలో పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషనలైజేషన్‌ నిబంధనల ప్రకారం అదనపు ఉపాధ్యాయులను బదిలీ చేయాల్సిన సందర్భంలో తొలుత సీనియర్ల అంగీకారం తీసుకోవాలి.

బలవంతంగా బదిలీ చేయాల్సివస్తే జూనియర్లను మాత్రమే బదిలీ చేయాలి. కానీ సొసైటీ మాత్రం అందుకుపూర్తి విరుద్ధంగా ఏకపక్షంగా రాత్రికిరాత్రే సీనియర్‌ టీచర్లతో లిస్ట్‌ విడుదల చేసి, మరుసటి రోజే కౌన్సెలింగ్‌కు రమ్మని పిలవటంపై టీచర్లు నిప్పులు చెరుగుతున్నారు.

317 జీవో, స్పౌజ్‌ కేసులను కూడా సొసైటీ పరిగణనలోకి తీసుకోవటం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పష్టత ఇచ్చాక, అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని అధికారులు దాటవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బదిలీల కోసం ముందుగా ప్రకటించిన మెరిట్‌ జాబితాలో పేర్లు ఉండగా, తాజాగా ప్రకటించిన మెరిట్‌ జాబితాలో లేవని మండిపడుతున్నారు. ఇప్పటికైనా పారదర్శకత పాటించాలని, సీనియర్‌ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Jul 11 2024, 11:43

ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి

జిల్లాలోని రామడుగు మండలం వేదిర గ్రామంలో విషాదం చోటు చేసుకుంది . కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి లోని గంగాధ మండలంలో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఫిట్స్ వచ్చింది .

వెంటనే బస్సులోని ప్రయాణికులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు . అంబులెన్స్ వేగంగా రాకపోవడంతో ప్రయాణికుడి బస్సులోని శ్వాశ విడిచాడు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు పై అరా తీస్తున్నారు .

నిజంనిప్పులాంటిది

Jul 11 2024, 11:07

బైక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మిస్టర్ తెలంగాణ మహ్మద్ సోహైల్

సిద్దిపేటకు చెందిన ప్రముఖ బాడీబిల్డర్ మహ్మద్ సోహైల్(23) బైక్‌ను అతి వేగంగా నడుపుతూ స్క్రాప్ ఆటోను ఢీకొట్టాడు.. 

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహ్మద్ సోహైల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సోహైల్ తన కెరీర్‌లో అనేక జిల్లా-స్థాయి, రాష్ట్ర-స్థాయి, దక్షిణ భారత-స్థాయి బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు.. 

మిస్టర్ తెలంగాణ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన మహ్మద్ సోహైల్ చిన్న వయసులో మరణించడంతో అందరూ కన్నీరుమున్నీరు అయ్యారు.

Streetbuzz News

Real time news platform

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jul 09 2024, 19:13

సిరాజ్ కు బంపర్ ఆఫర్ ...‼️

టీ20 వరల్డ్‌కప్ విన్నర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్ గెలిచినందుకు సిరాజ్‌కు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అంతేకాదు.. భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను సిరాజ్‌కు నగరంలో ఓ ఇంటిస్థలం ఇవ్వడంతో పాటు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అటు.. సిరాజ్ టీమిండియా జెర్సీని సీఎంకి బహూకరించాడు.

ఇదిలావుండగా.. టీ20 వరల్డ్‌కప్ సాధించిన భారత జట్టులో మహమ్మద్ సిరాజ్ ఉన్న విషయం తెలిసిందే. అమెరికా వేదికగా జరిగిన తొలి మూడు మ్యాచ్‌ల్లో అతడు తుది జట్టులో ఉన్నాడు. అయితే.. వెస్టిండీస్‌కు వేదిక షిఫ్ట్ అయ్యాక అతడిని బెంచ్‌కే పరిమితం చేశారు.

అక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో.. సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ని తీసుకోవడం జరిగింది. ఆ మూడు మ్యాచ్‌ల్లో సిరాజ్ ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అయితే.. స్పెల్ మాత్రం బాగా వేశాడు. భారీ పరుగులు ఇవ్వకుండా, కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి తన సత్తా చాటాడు.

మరోవైపు.. వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పుడు సిరాజ్‌కు ఘనస్వాగతం లభించింది. అభిమానులు అతనికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

అది చూసి ఉప్పొంగిపోయిన సిరాజ్.. తానూ వాహనంపై ఓపెన్ టాప్ తీసి పాట పాడారు. డ్యాన్స్ చేస్తూ.. ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం నింపారు. కాగా.. సీఎం రేవంత్‌ని సిరాజ్ కలిసిన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజహరుద్దీన్‌ కూడా పాల్గొన్నారు.

మరోవైపు.. వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పుడు సిరాజ్‌కు ఘనస్వాగతం లభించింది. అభిమానులు అతనికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అది చూసి ఉప్పొంగిపోయిన సిరాజ్.. తానూ వాహనంపై ఓపెన్ టాప్ తీసి పాట పాడారు. డ్యాన్స్ చేస్తూ.. ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం నింపారు. కాగా.. సీఎం రేవంత్‌ని సిరాజ్ కలిసిన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజహరుద్దీన్‌ కూడా పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jul 08 2024, 10:58

లక్ష్మీ నరసింహస్వామి నీ దర్శించుకున్న డిజిపి..

రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు మాట్లాడుతూ..

గుంటూరు లోనే పుట్టి చదువుకుని డీజీపీ స్థాయిలో ఇక్కడికి రావడం సంతోషం..

లక్ష్మీ నరసింహస్వామి గుడిని చిన్నప్పటి నుండి దర్శించుకునేవాడిని..

కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకోడం సంతోషంగా ఉంది..

పోలీసులు అందరూ జవాబుదారీ తనంగా ఉండేలా చేస్తాం..

పోలీస్ వ్యవస్థలో కొన్ని సదుపాయాలు లేక కొన్ని విభాగాలు మూతపడ్డాయి..

ఇప్పుడు వాటిని మళ్ళీ ప్రారంభించి నూతన విధానాన్ని అమలు చేస్తాం..

క్రింది స్థాయి పోలీసులకు ఉన్న సమస్యలు తీర్చాడనికి కృషి చేస్తాం..

నిజంనిప్పులాంటిది

Jul 06 2024, 13:07

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పోలీస్ కస్టడీకి అప్పగించిన కోర్టు

ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి

పోలింగ్ ఏజెంట్ పై హత్యాయత్నం కేసు కూడా నమోదు..

ప్రస్తుతం నెల్లూరు జైలులో పిన్నెల్లి

అదనపు విచారణ కోసం కస్టడీకి అప్పగించాలన్న పోలీసులు..

రెండ్రోజుల కస్టడీకి అనుమతినిచ్చిన మాచర్ల కోర్టు..

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈవీఎం పగులగొట్టడం, పోలింగ్ ఏజెంట్ పై హత్యాయత్నం కేసులను ఎదుర్కొంటున్న పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు.

అదనపు విచారణ కోసం పిన్నెల్లిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు మాచర్ల కోర్టును కోరారు. పోలీసుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... పిన్నెల్లిని రెండ్రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఏపీలో పోలింగ్ రోజున పాల్వాయిగేట్ పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి ఈవీఎం ధ్వంసం చేయడం వీడియోల ద్వారా వెల్లడైంది.

అదే పోలింగ్ బూత్ లో టీడీపీ ఏజెంట్ గా ఉన్న నంబూరి శేషగిరిరావు, తనను చంపేయాలంటూ పిన్నెల్లి వైసీపీ శ్రేణులను ఉసిగొల్పారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది..

నిజంనిప్పులాంటిది

Jul 05 2024, 13:32

హీరో రాజ్ తరుణ్ పై కేసు!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్‌ (Raj Tarun) పై అతని ప్రేయసి లావణ్య (lavanya)పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

రాజ్‌ తరుణ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

తాము విడిపోవడానికి కారణం ఓ సినీ నటి కారణమని.. రాజ్‌ తరుణ్‌ను వదిలేకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తున్నారని సినీ నటితోపాటు ఆమె సోదరుడిపై ఫిర్యాదు చేసింది లావణ్య.

పదకొండేళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నా. గుడిలో కూడా పెళ్లి చేసుకున్నాం. కానీ తన సినిమాలో నటిస్తోన్న హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడు.

3 నెలల క్రితం రాజ్ తరుణ్‌ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడు.

రాజ్‌ తరుణ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారు. రాజ్‌ తరుణ్‌ నా ప్రపంచం..రాజ్‌ తరుణ్‌ నాకు కావాలి. నాకు న్యాయం చేయాలి.

గతంలో తనను డ్రగ్స్‌ కేసులో కావాలనే ఇరికించారని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నానని.. ఆ సమయంలో రాజ్‌ తరుణ్‌ తనకెలాంటి సాయం చేయలేదని పేర్కొంది లావణ్య.