వ్యవస్థలో మార్పు తీసుకరావడానికి ప్రధాన పాత్రదారులు పట్టభద్రులు
•పాలకూరి రవి,నల్గొండ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి
![]()
వ్యవస్థలో మార్పు తీసుకరావడానికి పట్టభద్రులు ప్రధాన పాత్రదారులు కావాలని, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మీయొక్క సమస్యలపై అవగాహన కలిగి యుండి నిరంతరం పోరాడే అభ్యర్థికి మీ మొదటి ప్రాధాన్యత కలిగిన ఓటు వేసి ప్రజలందరికీ మీరు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాను అని నల్గొండ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవి గౌడ్ తెలిపారు.
![]()
సాధారణ ఎన్నికలలో నిరక్షరాస్యులైన కొంత మంది ఓటర్లు,అలాగే ఓటు విలువ తెలియని వాళ్ళు ఆయా ఎన్నికల సమయంలో డబ్బులకు లేదా ఇతర ప్రలోభాలకు లొంగి తమ ఓటును అసమర్థులకు వేస్తున్న విషయం మన అందరం గమనిస్తూనే ఉన్నాము.
![]()
అలాంటి వాళ్ళలో చైతన్యం రావాలి అంటే చదువుకొని విజ్ఞానవంతులైన మీరు మీ యొక్క ఓటును నిష్పక్షపాతంగా వేసి మీ విజ్ఞతను నిరూపించుకోవాలని కోరారు.
![]()
కొన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు అధికార,ధన బలంతో గెలుపు తమదే అని విర్రవీగుతున్న వారికి మీ ఓటుతో దిమ్మ తిరిగేలా సమాధానం ఇవ్వాలని మీ అందరినీ మరొక్కసారి కోరుతున్నాను అని నల్గొండ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవి అన్నారు.
May 26 2024, 19:31